* ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో లాసెట్, పీజీఎల్సెట్లను జూన్ 3న నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు మే 20వ తేదీ వరకు రూ.2,000 ఆలస్య రుసుంతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మే 20 నుంచి 25వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని కూడా ఆమె తెలియజేశారు.
పరీక్షల షెడ్యూల్
* ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు: మూడేళ్ల డిగ్రీ కోర్సు పరీక్షలు
* మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు: మూడేళ్ల డిగ్రీ కోర్సు పరీక్షలు
* సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, టీఎస్ పీజీఎల్సెట్ పరీక్షలు
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.