ఈనాడు, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ జాప్యమయ్యేలా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన 550 సవరణ జీవో ఆలస్యం అవడమే దీనికి కారణం. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీ ఆధ్వర్యంలో వైద్య విద్య ప్రవేశాల నోటిఫికేషన్ నవంబరు 6న విడుదలవుతుందని అంతా ఎదురుచూశారు. అయితే ఓపెన్ కేటగిరీలో సీటు తీసుకున్న రిజర్వేషన్ విద్యార్థులకు సంబంధించిన కీలకమైన 550 సవరణ జీవోను ప్రభుత్వం విడుదల చేయలేదు. మూడు రోజులుగా ఈ జీవో కోసం ఎదురుచూస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.