తాండూరు పట్టణం: దోస్త్ ద్వారా డిగ్రీలో చేరటానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని తాండూరులోని డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రవీందర్ తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబరు 27 నుంచి డిసెంబరు 2 వరకు అంతర్జాలం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిసెంబరు 4న సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. సీటు పొందిన విద్యార్థులు డిసెంబరు 7లోపు కళాశాలలో చేరాలని చెప్పారు. సందేహాలు ఉంటే కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.