ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థుల కోసం జియో టీవీలో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. జియో టీవీ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 8.30 గంటలవరకు విద్యార్థులు పాఠాలు వీక్షించవచ్చని, ఇవే పాఠ్యాంశాలను ఇంటర్ విద్యామండలికి చెందిన bieap virtual class అనే యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో మొదటి ఏడాది పాఠ్యాంశాలతో పాటు జేఈఈ, ఎంసెట్, నీట్ పాఠాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.