• facebook
  • whatsapp
  • telegram

23 నుంచి ఆయుష్‌ సీట్లకు ధ్రువపత్రాల పరిశీలన

ఆయుష్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌లో సీట్ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైసీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకున్న వారి అర్హుల ప్రాథమిక జాబితాను కాళోజీ ఆరోగ్య వర్సిటీ జ‌న‌వ‌రి 22న‌ విడుదల చేసింది. వీరికి ధ్రువపత్రాల పరిశీలనను జ‌న‌వ‌రి 23 నుంచి 27 వరకు ఉస్మానియా క్యాంపస్‌లోని ఆచార్య రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను విడుదల చేస్తామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.