ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్టుడే: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ- 2020 ధ్రువపత్రాల పరిశీలన గడువును జనవరి 27 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కిషన్ జనవరి 24న ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు తమ ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాలని, వివరాలకుwww.tscpget.com, www.osmania.ac.in వెబ్సైట్లను చూడాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.