• facebook
  • whatsapp
  • telegram

ఏపీఐసెట్‌ కౌన్సెలింగ్ ప్రారంభం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడేః ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం చేపట్టిన ఐసెట్‌ కౌన్సెలింగ్ జ‌న‌వ‌రి ౨౫న‌ ప్రారంభమైంది. నగరంలోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్‌ ఎన్‌.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. తొలి రోజున‌ సుమారు ౪౦ మంది పత్రాల పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. ప్రాసెసింగ్‌ ఫీజుగా ఓసీ, బీసీలు రూ.౧౨౦౦, ఎస్సీ, ఎస్టీలు రూ.౬౦౦ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలన్నారు. జ‌న‌వ‌రి ౨౫న ౧వ ర్యాంకు నుంచి ౭,౦౦౦ ర్యాంకు వరకు, ౨౭వ తేదీన‌ ౭౦౦౧ నుంచి ౧౭,౦౦౦ వరకు, ౨౮వ‌ తేదీన ౧౭,౦౦౧ నుంచి ౨౯,౦౦౦, ౨౯న ౨౯౦౦౧ నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. స్పెషల్‌ కేటగిరీ వారికి విజయవాడ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ జరుగుతుందని చెప్పారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.