1. ఆంధ్రప్రదేశ్ పోలింగ్లో రికార్డులు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవం
డయాబెటిక్ రెటీనోపతి.. కంటిచూపును శాశ్వతంగా దెబ్బతీసే వ్యాధి. మధుమేహుల్లో సుమారు 8-10 శాతం మంది దీని బారిన పడుతున్నారు. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సత్తాచాటిన నందిని
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. మహిళల హెప్టథ్లాన్లో ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. డిజిటల్ బాటలో పయనిస్తున్నాం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...