![]() |
ఈనాడు, అమరావతి : సీబీఎస్ఈ, టోఫెల్ మంచి చెడులపై అధ్యయనం చేసి.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘గత ప్రభుత్వం సీబీఎస్ఈ, టోఫెల్ విధానాలను హడావుడిగా తెచ్చి అమలు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు దానికి సన్నద్ధం కాలేదు’ అని గురువారం తనను కలిసిన విలేకరులతో చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి మంచి చెడులపై అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తామని చెప్పారు.