* 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయంతోపాటు దాని పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో అయిదేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి ఆగస్టు 1 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానుంది. బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ఆధ్వర్యంలో సమావేశమైన ప్రవేశాల కమిటీ రెండు విడతల కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఖరారు చేసింది. ఒక వర్సిటీ, తొమ్మిది ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 765 సీట్లుండగా.. వాటిలో 550 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బీఆర్క్ సీట్లలో 85 శాతం కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. ఏపీ విద్యార్థులు 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా సీట్లకు పోటీపడొచ్చు. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) స్కోర్కు ఇంటర్ మార్కులను కలిపి రాష్ట్ర ర్యాంకులు కేటాయిస్తారు. వాటి ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 23న ముగుస్తుంది. రెండో విడత ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
జులై 26న: నోటిఫికేషన్ జారీ
ఆగస్టు 1-8 వరకు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్లోడ్
ఆగస్టు 16: రాష్ట్ర ర్యాంకుల కేటాయింపు
17, 18: వెబ్ ఆప్షన్ల నమోదు 21: సీట్ల కేటాయింపు
22, 23 తేదీలు: ట్యూషన్ ఫీజు చెల్లింపు.. కళాశాలల్లో ధ్రువపత్రాల సమర్పణ
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.