‣ భర్తీకి సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: సాగునీటి పారుదలశాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఇటీవలే దిగువస్థాయి నుంచి ముఖ్య ఇంజినీరు స్థాయి వరకు పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 212 మందికి పదోన్నతి కల్పించగా, ఆ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో 10 పర్యవేక్షక ఇంజినీర్లు, 27 కార్యనిర్వాహక ఇంజినీర్లు, 75 ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, 100 సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ల పోస్టులున్నాయి. ఆ స్థానాలను ఆయా విభాగాల్లో అర్హులైన వారికి పదోన్నతులివ్వడం ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. మూడు నెలల్లో 17 మంది ఇంజినీర్లు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈఈ నుంచి ఆపై స్థాయిలో 53 ఖాళీలు ఏర్పడనున్నాయి. వీటినీ వెంటనే భర్తీ చేయాలని నిర్ణయించారు.
దిగువస్థాయి సిబ్బంది నియామకాలపై సందిగ్ధం: ఆయకట్టు, ప్రాజెక్టు స్థాయిలో అవసరమైన వర్క్ఇన్స్పెక్టర్లు, లష్కర్లు, గేట్ ఆపరేటర్లు తదితర సిబ్బంది నియామకాలపై ఇంకా సందిగ్ధం వీడలేదు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బంది సంఖ్యను గుర్తించారు. నియామక అధికారాలను ముఖ్య ఇంజినీర్లకు(సీఈ) అప్పగించారు. నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. రెవెన్యూశాఖలోని వీఆర్ఏలను అవసరమైన మేరకు నీటిపారుదల శాఖకు బదలాయించాలన్న ఆలోచన ఉండటంతో వీటికి సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ కావాల్సి ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.