• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

జూన్‌ 17 దరఖాస్తుకు గడువు




బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) పారా మెడికల్‌ స్టాఫ్‌ గ్రూప్‌-బీ, సీ (నాన్‌-గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

మొత్తం ఉద్యోగాల్లో 14 ఎస్‌ఐ (స్టాఫ్‌ నర్స్‌) గ్రూప్‌-బి పోస్టులు. అన్‌ రిజర్వుడ్‌కు 4, ఈడబ్ల్యూఎస్‌కు 3, ఓబీసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 కేటాయించారు. గ్రూప్‌- సి పోస్టులైన ఏఎస్‌ఐ ఖాళీలు 85. 

అన్‌ రిజర్వుడ్‌కు 31, ఈడబ్ల్యూఎస్‌కు 9, ఓబీసీలకు 24, ఎస్సీలకు 13, ఎస్టీలకు 8 కేటాయించారు. 


   అర్హతలు  


1. ఎస్‌ఐ (స్టాఫ్‌నర్స్‌)-14: 10+2/ తత్సమాన పరీక్ష, జనరల్‌ నర్సింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా పాసవ్వాలి. సెంట్రల్‌ లేదా స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో జనరల్‌ నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్‌ కావాలి. 

ట్యూబర్‌క్యూలోసిస్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, సిస్టర్‌ ట్యూటర్, పబ్లిక్‌ హెల్త్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. 

వయసు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.  


2. ఏఎస్సై (ల్యాబ్‌ టెక్నీషియన్‌)-38: సైన్స్‌ సబ్జెక్టుతో 10+2/ తత్సమాన పరీక్ష, మెడికల్‌ ల్యాబొరెటరీ టెక్నాలజీలో డిప్లొమా పాసవ్వాలి.

వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 

3. ఏఎస్సై/ ఫిజియోథెరపిస్ట్‌-47: సైన్స్‌ సబ్జెక్టుతో 10+2/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఫిజియోథెరపీలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేయాలి. 

వయసు 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

పరీక్షలు రాయబోయేవాళ్లు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు దరఖాస్తుకు అనర్హులు.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. అన్‌రిజర్వుడ్‌ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థుల గరిష్ఠ వయసు 40, ఎస్సీ/ఎస్టీలకు 45 ఏళ్లు. 

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


   రాత పరీక్ష ఎలా?  

ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో వంద ప్రశ్నలకు ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. వ్యవధి రెండు గంటలు. వివిధ పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహిస్తారు. సమాధానాలను ఓఎంఆర్‌ షీట్‌పై గుర్తించాలి. 


1. ఎస్సై (స్టాఫ్‌నర్స్‌): పార్ట్‌-1 జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ - 25 మార్కులు 

పార్ట్‌-2 హ్యూమన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ - 25 మార్కులు

పార్ట్‌-3 ప్రొఫెషనల్‌ మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ నర్సింగ్, హెల్త్‌ అండ్‌ ఇల్‌నెస్, నర్సింగ్‌ కేర్‌ ఆఫ్‌ పర్సన్స్, పెగ్నెన్సీ అండ్‌ లేబర్‌ మిడ్‌వైఫరీ - 50 మార్కులు 

2. ఏఎస్సై (ల్యాబ్‌ టెక్నీషియన్‌): ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. పార్ట్‌-1 జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ - 25 మార్కులు

పార్ట్‌-2 హ్యూమన్‌ అనాటమీ అండ్‌ 


    ఫిజియోలజీ - 25 మార్కులు  

పార్ట్‌-3 బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ ఇన్‌క్లూడింగ్‌ ఇమ్యునోలజీ, హెమటాలజీ అండ్‌ బ్లడ్‌ బ్యాంకింగ్, హిస్టోపాథాలజీ ఇన్‌క్లూడింగ్‌ క్లినికల్‌ పాథాలజీ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ, లాబొరేటరీ మేనేజ్‌మెంట్, పారాసిటాలజీ, సెరోలజీ అండ్‌ వైరాలజీ - 50 మార్కులు 

3. ఏఎస్సై (ఫిజియోథెరపిస్ట్‌): పార్ట్‌-1 జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ - 25 మార్కులు 

పార్ట్‌-2 హ్యూమన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ - 25 మార్కులు 

పార్ట్‌-3 ఫండమెంటల్‌ ఆఫ్‌ బయోకెమిక్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ థెరపీ, ఫిజికల్‌ అండ్‌ ఎలక్ట్రో థెరపీ, ఫిజియోథెరపీ - ఆర్థోపెడిక్స్‌ / స్పోర్ట్‌ న్యూట్రాలజీ, కార్డియో రెస్పిరేటరీ/ రిహాబిలిటేషన్‌ అండ్‌ జెరియాట్రిక్స్‌ - 50 మార్కులు.

రాత పరీక్షలో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ కేటగిరీలకు చెందినవాళ్లు 45 శాతం, ఎస్సీ/ఎస్టీలు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 

రెండో దశలో భాగంగా ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించినవారికి ధువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: ఎస్సై/ స్టాఫ్‌ నర్స్‌కు రూ.200, మిగిలిన వాటికి రూ.100.


    ఇన్‌స్పెక్టర్‌ (లైబ్రేరియన్‌)   

ఇవి రెండు పోస్టులు. దరఖాస్తు చేయాలంటే.. లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ పాసవ్వాలి.

కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ/ ప్రభుత్వ రంగసంస్థల్లో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. 

లైబ్రరీ సైన్స్‌/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో పీజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమా చేసినవారికి ప్రాధాన్యమిస్తారు. 

వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఈ రెండు ఉద్యోగాలు అన్‌రిజర్వుడ్‌ కేటగిరీ కిందికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌. ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. రాత పరీక్షలో 45 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 

రెండో దశలో ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి.. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 17.06.2024

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

Posted Date : 05-06-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.