మనలోని నాయకత్వ లక్షణాలకూ, వ్యాపార మెలకువలకూ మరింత పదునుపెట్టేలా ప్రఖ్యాత అడెకో సంస్థ ‘సీఈవో ఫర్ వన్ మంత్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడేళ్లుగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కు ఈసారీ ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి ఎంపికైన అభ్యర్థులు దేశవిదేశాల నుంచి వచ్చే అభ్యర్థులతో కలిసి నెల రోజులపాటు మెంటర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు.
‣ ఏటా దాదాపు 40 దేశాల నుంచి 2 లక్షల మంది దీనికి దరఖాస్తు చేస్తున్నారని అంచనా. ఎంపికైన అభ్యర్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారిలో పది మందిని తుది ఎంపిక చేస్తారు. తరువాత ప్రపంచ బూట్ క్యాంప్ నిర్వహించి, సీఈవో పేరిట ఎంపిక చేస్తారు. ఎంపికైన సీఈవో నెల రోజులపాటు బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ప్రోగ్రామ్ పూర్తయ్యేకాలంలో అభ్యర్థికి పారితోషికం అందుతుంది. ఇప్పటికే 300 మంది ఈ కార్యక్రమం ద్వారా అవగాహన పొందారు.
ఎవరు అర్హులు: 18-24 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేయొచ్చు.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేదీ: 15 ఏప్రిల్.
ఇతర వివరాలకు వెబ్సైట్: https://www.adeccogroup.com/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫీజులు తక్కువ నాణ్యత ఎక్కువ!
‣ టెన్త్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
‣ నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించడం ఎలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.