‣ 481 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ‘మహారత్న’ సంస్థ.. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్). కోల్కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ 481 మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ/పీజీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ పూర్తిచేసుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు!
ప్రకటించిన మొత్తం 481 మేనేజ్మెంట్ ట్రెయినీ ఖాళీల్లో జనరల్కు-213, ఈడ బ్ల్యూఎస్లకు-47, ఎస్సీలకు-65, ఎస్టీలకు-34, ఓబీసీలకు (ఎన్సీఎల్)-122 కేటాయించారు.
‣ పర్సనల్ అండ్ హెచ్ఆర్ విభాగంలో 138 పోస్టులున్నాయి. (జనరల్-60, ఈడబ్ల్యూఎస్-14, ఎస్సీ-20, ఎస్టీ-8, ఓబీసీ (ఎన్సీఎల్)-36) .
‣ ఎన్విరాన్మెంట్ విభాగంలో 68 ఖాళీలున్నాయి. (జనరల్-30, ఈడబ్ల్యూఎస్-7, ఎస్సీ-10, ఎస్టీ-5, ఓబీసీ (ఎన్సీఎల్)-16)
‣ మెటీరియల్స్ మేనేజ్మెంట్ విభాగంలో 115 ఖాళీలున్నాయి. (జనరల్-53, ఈడబ్ల్యూఎస్-11, ఎస్సీ-14, ఎస్టీ-8, ఓబీసీ (ఎన్సీఎల్)-29)
‣ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగంలో 17 పోస్టులు ఉన్నాయి. (జనరల్-10, ఈడబ్ల్యూఎస్-2, ఎస్సీ-2, ఓబీసీ (ఎన్సీఎల్)-3)
‣ కమ్యూనిటీ డెవలప్మెంట్లో 79 ఖాళీలున్నాయి. (జనరల్-33, ఈడబ్ల్యూఎస్-8, ఎస్సీ-11, ఎస్టీ-6, ఓబీసీ (ఎన్సీఎల్)-21)
‣ లీగల్ విభాగంలో 54 పోస్టులు ఉన్నాయి. (జనరల్-21, ఈడబ్ల్యూఎస్-5, ఎస్సీ-8, ఎస్టీ-6, ఓబీసీ (ఎన్సీఎల్)-14) .
‣ పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో 6 ఖాళీలున్నాయి. (జనరల్-3, ఎస్టీ-1, ఓబీసీ (ఎన్సీఎల్)-2)
‣ కంపెనీ సెక్రటరీ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. జనరల్-3, ఓబీసీ (ఎన్సీఎల్)-01).
దరఖాస్తు ఫీజు: రూ.1180 ఫీజును ఆన్లైన్ విధానంలోనే చెల్లించాలి. జనరల్ (యుఆర్)/ ఓబీసీ (క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్)/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈఎస్ఎం/కోల్ ఇండియా ఉద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
గరిష్ఠ వయఃపరిమితి: మే 31, 2022 నాటికి జనరల్ (యుఆర్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు.
‣ ఓబీసీ (నాన్-క్రీమీలేయర్) అభ్యర్థులకు 3, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
‣ పీడబ్ల్యూడీ (జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఎంపిక: అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఉంటుంది. ఈ పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. పేపర్-1, పేపర్-2.. ఒక్కో దానికి 100 మార్కుల చొప్పున ఉంటాయి. పేపర్-1లో జనరల్ నాలెడ్జ్/అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉంటాయి. పేపర్-2 ప్రొఫెషనల్ నాలెడ్జ్ (సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన) ప్రశ్నలుంటాయి. రెండు పేపర్లలోనూ 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు లేవు
అర్హత మార్కులు: జనరల్ (యూఆర్)/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రతి పేపర్లోనూ 40 మార్కులు సాధించాలి. ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులు ప్రతి పేపర్లోనూ 35 మార్కులు పొందాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రతి పేపర్లోనూ 30 మార్కులు రావాలి. సీబీటీని ఏ తేదీన నిర్వహించేదీ ఈ మెయిల్ ద్వారా పంపే అడ్మిట్ కార్డ్లో తెలియజేస్తారు.
‣ సీబీటీలో ప్రతిభ చూపిన విద్యార్థుల పేర్ల లిస్టును వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఆన్లైన్ దరఖాస్తులో తెలియజేసిన నగరాల్లో పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో మూడు నగరాలను ఎంపికచేసుకోవాలి. ఒకసారి దరఖాస్తును సమర్పించిన తర్వాత ఎలాంటి మార్పులకూ అవకాశం ఉండదు.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08.07.2022
దరఖాస్తులకు చివరి తేదీ: 07.08.2022
వెబ్సైట్: https://www.coalindia.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ 294 ఖాళీలతో హెచ్పీసీఎల్ ఆహ్వానం
‣ దూరవిద్యలో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు