కంటి ఆరోగ్యం ఎవరికైనా ముఖ్యమే. కానీ విద్యార్థులకు ఇది మరింత ప్రధానం. రోజంతా పుస్తకాలతోనూ, ఆన్లైన్ క్లాసుల వల్ల కంప్యూటర్ తెరలతోనూ గడిపే విద్యార్థుల కళ్లపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరి నేత్రాల ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ పెట్టాలో చూద్దామా...
‣ డిజిటల్ తెరలను చూస్తున్నప్పుడు కనురెప్పలు ఆర్పడం మనకు తెలియకుండానే తక్కువైపోతుంది. దీనివల్ల కళ్లు పొడిబారడం, మంట పుట్టడం జరుగుతుంది. అందుకే ఫోన్, కంప్యూటర్ వంటివి వాడుతున్నప్పుడు 20 నిమిషాలకోసారి బ్రేక్ ఇవ్వడం తప్పనిసరి.
‣ సరిగ్గా నిద్రపోనప్పుడు కళ్లు వాచినట్లు కనిపిస్తుంటాయి. ఇలా తరచూ జరిగితే మీరు మీ కళ్లను ఇబ్బంది పెడుతున్నట్టే లెక్క. అందుకే తగినంత సమయం నిద్రపోవాలి.
‣ కొందరికి సరిగ్గా కనిపించకపోయినట్లు తెలుస్తున్నా గుర్తించలేకపోతుంటారు. ఎక్కువకాలం అలాగే వదిలేయడం వల్ల కంటిచూపు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్ష చేయించుకోవాలి.
‣ విటమిన్ ఎ, ఒమేగా-3 ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పండ్లు తినాలి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మార్కులు తెచ్చే విపత్తు నిర్వహణ
‣ విద్యార్థులకు విప్రో ఉద్యోగాలు సిద్ధం!
‣ ఇంటర్ విద్యార్థులకు ఐఐఎస్సీ ఆహ్వానం
‣ ఉద్యోగం సాధించాలనే తపన మీలో ఉందా?
‣ ఎస్ఐ ప్రిలిమ్స్కు సన్నద్ధత ఇలా!
‣ కళ్లకు కట్టినట్టు.. కళతో కనికట్టు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.