భవ్యకి పరీక్షలు జరుగుతున్నాయి. శ్రద్ధగా చదువుతున్నా.. మధ్యమధ్యలో ఫోను పట్టుకోకుండా ఉండలేక పోతోంది. ఏదో డౌట్ ఉందనో, మెటీరియల్ కావాలనో ఫోన్ తీసుకోవడం.. అలా దానితోనే కాలక్షేపం అయిపోయి సమయం వృథా కావడం మామూలైపోయింది. మరి ఇలా అయితే మంచి మార్కులెలా వస్తాయి? ఈ సమయంలో ఫోన్ వాడకం తగ్గించడం ఎలా? అలా తగ్గిస్తే కలిగే లాభాలేంటి?
ప్రస్తుతం సోషల్ మీడియా వాడని విద్యార్థులు లేరనే చెప్పొచ్చు. నేటి జీవనశైలికి మొబైల్ను పూర్తిగా వాడకుండా ఉండటం సాధ్యం కాదు. అలాగని పరీక్షల వంటి ముఖ్యమైన సమయాల్లో గంటల తరబడి వాటిని ఉపయోగించడం సరికాదు. వివిధ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన టాపర్లు, గొప్ప గొప్ప ప్లేయర్లు... కీలకమైన సమయాల్లో ఫోనును అస్సలు ఉపయోగించరు. వారి ఫోకస్ మొత్తం పూర్తిగా ఆ టాస్క్పైనే పెడతారు. విద్యార్థులు కూడా ప్రస్తుతం పరీక్షలపైనే పూర్తిగా ఫోకస్ పెడితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
‣ చాలాసేపు చదువుకున్నాం కదా.. కాసేపు రిలాక్స్ అవుదాం అని ఫోన్ తీసే విద్యార్థులు చాలామంది ఉంటారు. అయితే అది సరైన పద్ధతి కాదు. అప్పటివరకూ కళ్లపై పడిన ఒత్తిడి చాలదా, మళ్లీ ఫోన్ ఎందుకు? ఇంట్లో వాళ్లతో సరదాగా మాట్లాడటం, కాసేపు అలా బయట నడవటం వల్ల శరీరం, మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. తిరిగి బాగా చదువుకునేందుకు ఉత్సాహం కలుగుతుంది.
‣ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్... ఇలా ఫోన్లో కొన్ని యాప్స్కు మనం బాగా అలవాటు పడిపోయాం. ఈ సమయంలో వాటిని అతి తక్కువగా మాత్రమే వినియోగించాలి. అవసరమైతే కొద్దిరోజులపాటు పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసేసినా, అకౌంట్స్ ఇన్యాక్టివ్ చేసినా ఇబ్బంది లేదు.
‣ కొందరు విద్యార్థులు పూర్తిగా ఫోన్ వాడను అని నిర్ణయించుకుని, అలా ఉండలేక ఒత్తిడికి గురవుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఫోన్ తీస్తే తిట్టడం వంటివి చేస్తూ ఉంటారు, అది సరికాదు. ఇన్నాళ్లుగా అలవాటు పడినదానికి హఠాత్తుగా దూరంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. పరీక్షల సమయంలో అలాంటి అదనపు ఒత్తిడి ఉండకూడదు. ఇప్పటికి పరిమితిలో వాడేలా సాధన చేయడమే ఉత్తమం.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ గ్రూప్-1 విజయానికి ఏ పుస్తకాలు చదవాలి?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.