• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్సీలకు శ్రేష్ఠమైన విద్య

సీబీఎస్‌ఈ స్కూళ్లలో అడ్మిషన్లకు ప్రకటన విడుదల

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం- సాధికార మంత్రిత్వశాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో.. నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ (ఎన్‌ఈటీఎస్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన ఎస్‌సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్‌ పాఠశాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

షెడ్యూల్డ్‌ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేయూతను అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. నాణ్యమైన విద్యను షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు అందించడం ద్వారా వారు విస్తృత విద్య, ఉద్యోగావకాశాలను అందుకునేలా చేస్తారు.

అర్హత: 2021-22 విద్యా సంవత్సరంలో ఎనిమిది, పదో తరగతి చదువుతోన్న షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన విద్యార్థులు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.

ఎంపిక విధానం: ఆఫ్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ (పెన్‌ అండ్‌ పేపర్‌) విధానంలో విద్యార్థులను ఎంపికచేస్తారు.

రాతపరీక్ష విధానం: ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో ఎనిమిదో తరగతి సిలబస్‌ చదవాలి. 11వ తరగతలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి సిలబస్‌ చదవాలి.

ఈ పరీక్షలో మ్యాథమేటిక్స్‌కు సంబంధించి 30 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. సైన్స్‌కు సంబంధించిన 20 ప్రశ్నలకు 80 మార్కులు, సోషల్‌సైన్స్‌కు సంబంధించిన 25 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/ నాలెడ్జ్‌కు సంబంధించిన 25 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేది: 12.04.2022

పరీక్ష తేది: 07.05.2022

వెబ్‌సైట్‌: https://shreshta.nta.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీటి సంరక్షణ తక్షణ కర్తవ్యం

‣ సిలబస్‌ అంతా చదవాలి.. ప్రశ్నలు సాధన చేయాలి!

‣ ఇంటర్మీడియట్‌తో నౌకాదళం కొలువులు

‣ విజయాన్ని నిర్ణయించే వ్యక్తిత్వ పరీక్ష!

‣ IIT Madras‌: ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌ బీఎస్సీ

‣ అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ అలా సాధించారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌