• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేర్పిస్తే మనకే మంచిది!

బాగా చదివేవారిని ఇతర విద్యార్థులు తమకూ నేర్పించమనీ, సందేహాలు తీర్చమనీ అడుగుతుంటారు. వారు కూడా ఓపిగ్గా తమకు తెలిసిన విషయాలు చెబుతుంటారు. కానీ తెలుసా... ఇలా చెప్పడం వల్ల వారికి మరింతగా సబ్జెక్టుపై పట్టు వచ్చేస్తుంది. పక్కవాళ్లకు చెప్పడం వల్ల నేర్చుకునేవారి కంటే నేర్పించేవారికే ఎక్కువ లాభాలని పరిశోధనలు చెబుతున్నాయి!

దీన్ని శాస్త్రీయంగా ప్రొటెజె ఎఫెక్ట్‌ అంటున్నారు. మనకేదైనా అంశం బాగా తెలియాలి అనుకుంటే... ఒకసారి నేర్చుకున్నాక వేరే వాళ్లకు అర్థమయ్యేలా వివరించేందుకు ప్రయత్నించాలి. ఆ క్రమంలో మన మెదడు ఆ విషయాన్ని తెలుసుకోవడంలో పూర్తిగా నిమగ్నం కావడమే కాదు, అన్నికోణాల నుంచీ దాని గురించి ఆలోచిస్తుంది. కేవలం చదివి గుర్తుపెట్టుకునేదానికీ, ఇలా విశ్లేషణాత్మక ధోరణిలో సాధన చేసేదానికీ చాలా తేడా ఉంటుంది. దానివల్ల తెలియకుండానే ఆ అంశాలపై మనకు పట్టు లభిస్తుంది. 

ఇది కేవలం చదువు, పుస్తకాలకే పరిమితం కాదు, హాబీలు - పని... ఏదైనా సరే మనం బాగా నేర్చుకోవాలంటే ముందు అవతలివారికి బాగా చెప్పగలిగేలా సాధన చేయాలి. 

దీనివల్ల మెదడులో మెటాకాగ్నిటివ్‌ ప్రాసెసింగ్‌ వేగవంతమవుతుంది. మోటార్‌ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్‌ ఎక్కువవుతుంది. నేర్చుకోవడంలో వందశాతం నిమగ్నమవుతాం. ప్రభావవంతమైన లెర్నింగ్‌ స్ట్రాటజీలు అనుసరించడంతోపాటు తరిగిపోని ప్రేరణ, ఆసక్తి చూపగలుగుతాం. అంతేకాదు... ఇది ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందట. పరీక్షల్లో మెరుగ్గా జవాబులు రాసేందుకు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకునేందుకు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అలవడేందుకు సహకరిస్తుందట. అందుకే ఒక్కరే చదివేటప్పుడైనా సరే... వేరే వాళ్లకు ఎలా అయితే వివరిస్తారో అలా చదివేందుకు ప్రయత్నించాలి. కుదిరితే పక్కవారికి అర్థమయ్యేలా చెప్పాలి.

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

Posted Date : 11-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌