మన దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలన్నది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. కానీ చదువుకునే సమయంలో కూడా చిన్న చిన్న విరామాలతో కూడిన వ్యాయామం అవసరమంటున్నారు నిపుణులు. దీనివల్ల మెదడు ఉత్తేజితం కావడమే కాకుండా, చదివింది బాగా గుర్తుంటుంది. ఎక్కువ సమయం చదువుకునేలా ఏకాగ్రత కుదురుతుంది. మరి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలో, పాటించాల్సిన టిప్స్ ఏంటో చూద్దామా!
‣ చదువుకోవడానికి కూర్చునే అరగంట ముందు తేలికపాటి వ్యాయామం చేయాలి. జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ఉపకరిస్తాయి. ఏరోబిక్ వ్యాయామం వల్ల మెదడుకు చేరే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. చదవాలనే ఉత్సాహం కలుగుతుంది.
‣ కష్టమైన కసరత్తుల జోలికి వెళ్లొద్దు. దీనివల్ల చదివింది తిరిగి గుర్తుచేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.
‣ చదువుకున్న తర్వాతా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెదడులో నిక్షిప్తం అవుతుంది.
‣ కూర్చున్నచోట నుంచి ఒకసారి లేచి చుట్టూ తిరగడం, కాసేపు వాకింగ్ చేయడం వల్ల అలసట తగ్గిపోయి తాజాగా అనిపిస్తుంది. ఇంకాసేపు ఎక్కువగా ఏకాగ్రత చూపగలుగుతాం.
‣ మధ్యలో లేచి స్క్వాట్స్ చేయడం, రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉపయోగించడం వల్ల చదవగలిగే సామర్థ్యం పెరుగుతుంది.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ నాయకత్వ లక్షణాలకు పదునుపెట్టేలా..
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.