• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చదువుకూ.. వ్యాయామం అవసరమే!

మన దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలన్నది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. కానీ చదువుకునే సమయంలో కూడా చిన్న చిన్న విరామాలతో కూడిన వ్యాయామం అవసరమంటున్నారు నిపుణులు. దీనివల్ల మెదడు ఉత్తేజితం కావడమే కాకుండా, చదివింది బాగా గుర్తుంటుంది. ఎక్కువ సమయం చదువుకునేలా ఏకాగ్రత కుదురుతుంది. మరి ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయాలో, పాటించాల్సిన టిప్స్‌ ఏంటో చూద్దామా!

చదువుకోవడానికి కూర్చునే అరగంట ముందు తేలికపాటి వ్యాయామం చేయాలి. జాగింగ్, స్విమ్మింగ్‌ వంటివి ఉపకరిస్తాయి. ఏరోబిక్‌ వ్యాయామం వల్ల మెదడుకు చేరే ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. చదవాలనే ఉత్సాహం కలుగుతుంది. 

కష్టమైన కసరత్తుల జోలికి వెళ్లొద్దు. దీనివల్ల చదివింది తిరిగి గుర్తుచేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.

చదువుకున్న తర్వాతా ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల మెదడులో నిక్షిప్తం అవుతుంది.

కూర్చున్నచోట నుంచి ఒకసారి లేచి చుట్టూ తిరగడం, కాసేపు వాకింగ్‌ చేయడం వల్ల అలసట తగ్గిపోయి తాజాగా అనిపిస్తుంది. ఇంకాసేపు ఎక్కువగా ఏకాగ్రత చూపగలుగుతాం. 

‣ మధ్యలో లేచి స్క్వాట్స్‌ చేయడం, రెసిస్టెంట్‌ బ్యాండ్స్‌ ఉపయోగించడం వల్ల చదవగలిగే సామర్థ్యం పెరుగుతుంది.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆడుకుంటూ... నేర్చుకుంటూ!

‣ నాయకత్వ లక్షణాలకు పదునుపెట్టేలా..

‣ మెటా.. ఇక దీనిదే ఆట

‣ గణిత బోధనలో ఘనమైన సంస్థ!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌