నిర్వచనం: వృత్త సరణి అంటే వృత్తాల సమూహం.
మూలాక్షం: రెండు వృత్తాల మధ్య ఉండే రేఖ.
మూలకేంద్రం: మూలాక్షాల ఖండన బిందువు
సహాక్ష వృత్తసరణి : వృత్తం, సరళరేఖ (లేదా వృత్తం) ఖండించుకుంటే వాటి ఖండన బిందువుల ద్వారా వెళ్లే వృత్తాలను సహాక్ష వృత్తసరణులు అంటారు.
అవధి బిందువులు: వ్యాసార్ధం సున్నా అయ్యేలా సహాక్ష వృత్తసరణి యొక్క కేంద్రాన్ని అవధి బిందువులు అంటారు.
భావనాత్మక సిద్ధాంతాలు
1) S = 0 మరియు S' = 0 పరస్పరం ఖండించుకునే రెండు వృత్తాలు, r1, r2 లు వరుసగా వాటి వ్యాసార్ధాలు మరియు 'd' వాటి కేంద్రాల మధ్యదూరం, మరియు ఆ వృత్తాల మధ్యకోణం θ అయితే
నిరూపణ:
C1 మరియు C2 లు కేంద్రాలు అనుకుందాం.
దత్తాంశం: C1C2 = d
ఇచ్చిన వ్యాసార్ధాలు: r1 మరియు r2
పటము నుంచి: C1P = r1; C2P = r2
కొసైన్ నియమం నుంచి:
2) S = 0 మరియు S' = 0 అనే రెండు వృత్తాలు పరస్పరం లంబచ్ఛేదకం చేసుకోవడానికి నియమం
2gg' + 2ff ' = c + c' అని చూపండి.
నిరూపణ:
3) సహాక్ష వృత్తసరణి సమీకరణం లఘురూపంలో x2 + y2 + 2λx + c = 0 అని చూపండి.
నిరూపణ: g, f మరియు c యొక్క విభిన్న విలువలకు సహాక్ష వృత్తసరణిలో x2 + y2 + 2gx + 2fy + c = 0 అనేది వృత్తాలను సూచిస్తుంది అనుకుందాం. సహాక్ష వృత్తసరణికి, కేంద్రాలను కలిపే రేఖను x- అక్షం అని, మూలాక్షాన్ని
y-అక్షం అని అనుకుందాం.
సహాక్ష వృత్తసరణిలోని వృత్తాల అన్ని కేంద్రాలు x- అక్షం మీద ఉంటున్నాయి. కాబట్టి వాటి y- నిరూపకాలు సున్నాలు అవుతాయి.
సహాక్ష వృత్తసరణిలోని రెండు వృత్తాలను
x2 + y2 + 2g1x + c1 = 0 ............. (1) x2 + y2 + 2g2x + c2 = 0 ............... (2)
(1) మరియు (2) వృత్తాల మూలాక్షం
2 (g1 - g2) x + (c1 - c2) = 0
మూలాక్షం y- అక్షం అవుతుంది. కాబట్టి x = 0
అప్పుడు (1) మరియు (2) వృత్తాలు
x2 + y2 + 2g1x + c = 0 ................ (3)
x2 + y2 + 2g2x + c = 0 ................ (4) గా మారతాయి.
ఇదే విధంగా, x2 + y2 + 2g3x + c = 0 అనేది (3) మరియు (4) వృత్తాలతో సహాక్ష వృత్తసరణి అవుతుంది. అందువల్ల, x2 + y2 + 2λx + c = 0 అనేది లఘురూపంలో సహాక్ష వృత్తసరణి అవుతుంది. ఇక్కడ ' λ' అనేది పరామితి మరియు 'c' ఒక స్థిరరాశి.