విదేశాల్లో ఉన్నత విద్య కోసం మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపకారవేతనాలు అందిస్తోంది. విద్యావంతులైన మైనారిటీలు మరింత ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాయమందిస్తోంది. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లోని విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణకు చెందిన క్రైస్తవ మైనారిటీ విద్యార్థులు పీజీ, పీహెచ్డీ కోర్సులు చదివేందుకు అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ గ్రాంట్ పొందాలనుకుంటున్న తెలంగాణ విద్యార్థులు ఆగస్టు 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య మార్గదర్శకాలు:
1. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
2. స్కాలర్షిప్ గ్రాంట్: రూ.20 లక్షల వరకు.
3. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు.
4. కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, జీఆర్ఈ/ జీమ్యాట్, ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ టెస్ట్ స్కోరు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 07-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
Inspire Manak 2025: ఇన్స్పైర్ మనక్ 2024-25
IDFC: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్షిప్ ప్రోగ్రామ్