• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఆర్థికాభివృద్ధి

   ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది సంక్లిష్ట పునర్నిర్మాణ ప్రక్రియ. ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, సంస్థాగతంగా సంభవించే మార్పులను తెలియజేస్తుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, విభిన్న సామాజిక సాంస్కృతిక విలువలు కలిగి, అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధి.. అనేక సవాళ్లు, ఒడుదొడుకులతో నిత్యం అనిశ్చితిగా ఉంటుంది. అందుకే అభివృద్ధిని ఏ మేరకు సాధించామో తెలుసుకోవడానికి ఒక కొలమానం అవసరం. దానికి శాస్త్రీయమైన హేతుబద్ధత ఉండి లెక్కించడానికి వీలుగా ఉండాలి. 

అభివృద్ధి కొలమానాలు 
    అభివృద్ధితో పాటు దాని సమగ్ర కొలమానాలపై కూడా ఆర్థికవేత్తలు చర్చించారు. భారతదేశ ఆర్థిక పరిస్థితిపై పశ్చిమ దేశాలైన ఇంగ్లండ్, అమెరికా అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానాలు..

స్థూల జాతీయోత్పత్తి 
    సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల ద్వారా ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తమే స్థూల జాతీయోత్పత్తి. ఇది ఆర్థిక విలువలను తెలియజేస్తుంది. దీనిలో నాలుగు అంశాలు ఉంటాయి. అవి:
    1. ప్రజల వినియోగ వ్యయం (C) 
    2. సంస్థల పెట్టుబడి వ్యయం (I)
    3. ప్రభుత్వ వ్యయం (G) 
    4. విదేశాల నుంచి వచ్చే ఆదాయం(Net foreign income)
   GNP = C + I + G + Net foreign income
    ప్రపంచంలో మొదటిసారిగా జాతీయాదాయాన్ని సైమన్‌ కుజ్నెట్‌ అనే అమెరికా ఆర్థికవేత్త శాస్త్రీయంగా అంచనా వేశారు. ఈయన స్థూల ఉత్పత్తిలో పెరుగుదల వల్ల ఆర్థిక నిర్మాణం, జీవనంలో మార్పులు సంభవిస్తాయని తెలిపాడు. ‘ఇది భవిష్యత్‌ పురోగతికి అవసరం. కానీ జాతీయాదాయ లెక్కల నుంచి ప్రజా సంక్షేమాన్ని గ్రహించలేం’ అని స్పష్టం చేశారు.
* వాస్తవ జాతీయాదాయ అంచనాలు ధరల్లో మార్పులను తెలియజేయవు. ఆదాయ అసమానతలు, జనాభాలో వచ్చే మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల కలిగే నష్టాల గురించి పేర్కొనదు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అసంఘటిత రంగం, నిరక్షరాస్యత, బ్లాక్‌ మార్కెటింగ్‌ ఎక్కువ. కాబట్టి ఏ రంగానికి సంబంధించైనా కచ్చితమైన లెక్కలు లభించవు. 
* జాతీయాదాయ పరంగా భారతదేశం 2.7 ట్రిలియన్‌ డాలర్ల మొత్తంతో ప్రపంచంలో ఆరో స్థానాన్ని పొందింది. సామాజిక, సాంకేతిక, మానవ మూలధనం లాంటి అంశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉంది. కాబట్టి ఇది సమగ్రమైన అభివృద్ధి కొలమానం అని చెప్పలేం.

వాస్తవ తలసరి ఆదాయం 
    ఒక దేశంలో జాతీయాదాయ పెరుగుదలపై జనాభా ప్రభావాన్ని పరిశీలిస్తూ అభివృద్ధిని గణించడానికి వాస్తవ తలసరి ఆదాయం ఉపకరిస్తుంది. మొత్తం జాతీయాదాయాన్ని జనసంఖ్యకు పంచినప్పుడు సగటున వచ్చే మొత్తాన్ని తలసరి ఆదాయం అంటారు. 


      సాధారణంగా తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. తలసరి ఆదాయం పెరగకుండా జాతీయాదాయం మాత్రమే పెరగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఆర్థికాభివృద్ధిలో ప్రజల పాత్ర, వారి ఆదాయ స్థాయుల్లో మార్పులను తెలుపుతుంది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కూడా తలసరి ఆదాయం ఆధారంగా దేశాలను అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేస్తున్నాయి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నివేదిక ప్రకారం 2018 నాటికి ప్రపంచంలోని అయిదు అత్యధిక ధనవంత దేశాలు వరుసగా లక్సెంబర్గ్, మకావు, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్‌. ఈ దేశాలు 75000 డాలర్లకు పైగా తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. జాతీయాదాయ పరంగా అగ్ర దేశమైన అమెరికా 65000 డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే తలసరి ఆదాయం కూడా సరైన కొలమానం కాదని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.

విమర్శలు
* ఇది అసమగ్రమైన జాతీయాదాయ లెక్కలపై ఆధారపడి ఉందని, జనసంఖ్య పెరిగి తలసరి ఆదాయంలో మార్పు లేకపోయినా లేదా తగ్గినా అభివృద్ధి జరగలేదని చెప్పలేం. 
* ఇది ప్రజల సగటు ఆదాయం మాత్రమే. అందరి ఆదాయం కాదు. ఆదాయ అసమానతలు, పంపిణీ గురించి తెలపదు. 
* అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాల వల్ల భారతదేశం జాతీయాదాయపరంగా ఆరో పెద్ద దేశంగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో 119వ స్థానంలో ఉంది. దీని ఆధారంగా మనదేశం అభివృద్ధిని సాధించలేదని చెప్పలేం. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలతో పోల్చలేం. ఎందుకంటే అవి పరిమాణం, జనాభా పరంగా చిన్న దేశాలు. పరిశ్రమలు, వ్యాపారాలు, పర్యాటకం, బ్యాంకింగ్‌ లాంటి సేవల రంగాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే మనదేశం ఇప్పటికీ 60% మేర రుతుపవనాలపై ఆధారపడుతున్న వ్యవసాయాధారిత దేశం.
* 1951తో పోల్చినప్పుడు మనదేశ తలసరి ఆదాయం పెరిగింది కానీ ఆదాయ అసమానతలు తీవ్రతరం అయ్యాయని ప్రభుత్వ నివేెదికలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పెరిగిన తలసరి ఆదాయం తెలపదు.
* జాతీయాదాయం, తలసరి ఆదాయాలు అభివృద్ధిని కొలవడంలో సంతృప్తికరంగా లేకపోవడంతో కొలిన్‌ క్లార్క్, కిండెల్‌ బర్గర్, డి. బ్రైట్‌ సింగ్‌ లాంటి ఆర్థికవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.


ఆర్థిక సంక్షేమం: ప్రజల మధ్య ఆదాయ పంపిణీలో సమానత్వం, కొనుగోలు శక్తి పెరిగేలా ధరల స్థిర త్వాన్ని సాధించినప్పుడు ఆర్థిక సంక్షేమం ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. అధిక ఆర్థిక సంక్షేమాన్ని అధిక అభివృద్ధికి చిహ్నంగా భావించారు. అయితే ఆర్థిక సంక్షేమం అనేది మానసికమైంది. దాన్ని కొలవలేం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంక్షేమ భావన ఒకేవిధంగా ఉండదు. జాతీయాదాయ మార్పుల స్వభావాన్ని, ఉత్పత్తి సామాజిక వ్యయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఆర్థిక సంక్షేమం అభివృద్ధికి కొలమానంగా ఆచరణలో సాధ్యం కాదని విమర్శలను ఎదుర్కొంది.

భౌతిక జీవన ప్రమాణ సూచిక 

* మోరీస్‌ డి మోరీస్‌ అనే శాస్త్రవేత్త ప్రజల ప్రాథమిక అవసరాల దృష్ట్యా ఈ కొలమానాన్ని రూపొందించారు. శిశు మరణాల రేటు, ఆయుఃప్రమాణం, అక్షరాస్యత లాంటి మూడు అంశాల సమాన భారాల సగటు ఆధారంగా ఈ సూచికను లెక్కిస్తారు.

విమర్శలు
*  ఇది ప్రాథమిక అవసరాలను మాత్రమే లెక్కించే పరిమిత కొలమానం.
* దీనిలో చేర్చే అంశాల సంఖ్య పట్ల ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు.
* ఈ సూచిక ఆర్థికాభివృద్ధిని విస్మరించింది. ఇది లేకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడవు. 
* భద్రత, న్యాయం, మానవ హక్కుల లాంటి సామాజిక, మానసిక అంశాల గురించి ఈ సూచిక పేర్కొనలేదు.

మానవాభివృద్ధే అంతిమ లక్ష్యం 
    1990లో యూఎన్‌డీపీ (United nations development programme) వెలువరించిన మొదటి మానవాభివృద్ధి నివేదిక అభివృద్ధి ఆర్థికశాస్త్రం విధానాలు, కొలమానాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. దీంతో పాలకులు, పరిశోధకులు,  ప్రజల అభివృద్ధి ధోరణి మారిపోయింది. అప్పటివరకు అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి అని ప్రజల వస్తుసేవల పెరుగుదలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఉన్నత మానవ శ్రేయస్సు వైపు పురోగమించడమే మానవాభివృద్ధి అని, అదే నిజమైన అభివృద్ధి అని ఐక్యరాజ్యసమితి నివేదికలో నిర్వచించారు. అర్థశాస్త్ర చారిత్రక మేధోమథనం నుంచి అభివృద్ధి కొలమానాలకు ప్రత్యామ్నాయాల అన్వేషణ ఎప్పటి నుంచో జరుగుతోంది. 
* క్రీ.పూ.350లోనే అరిస్టాటిల్ '' well being as something generated by our actions and our belongings'' అని అభిప్రాయపడ్డారు.
* 18వ శతాబ్దంలో జెర్మి బెంథామ్‌ ప్రయోజనవాదం వ్యక్తుల ప్రయోజనాల కలయికే సామాజిక ప్రయోజనంగా గుర్తించి the greatest happiness for the greateast numberను సూచించింది.
* 19వ శతాబ్దంలో మార్షల్‌ లాంటి నూతన సంప్రదాయ ఆర్థికవేత్తలు ‘నెరవేర్చుకునే కోరికలు’ అనే భావనను ప్రవేశపెట్టారు. ‘‘అపరిమితమైన కోరికలను నెరవేర్చే పరిమిత వనరులను అదనంగా సమకూర్చుకునే కొద్దీ వాటి నుంచి పొందే అదనపు ప్రయోజనం (Marginal Utility) క్షీణిస్తుంది’’ అని నిరూపించారు. కాబట్టి మిగులు వనరులు ధనికుల నుంచి పేదలకు చేరితే సాంఘిక ప్రయోజనం పెరుగుతుందని తీర్మానించారు. వీరు ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనం పైనే దృష్టి సారించారు.
* 20వ శతాబ్దంలో జాన్‌ రాల్స్‌ అనే తత్వవేత్త ‘ఎ థియరీ ఆఫ్‌ జస్టిస్‌’ (1971) అనే పుస్తకం ద్వారా ప్రజల మధ్య సమానత్వం, న్యాయం గురించి చర్చించడంతో అభివృద్ధిలో మానవత్వ కోణాన్ని జోడించినట్లయింది. ఇతడి సిద్ధాంతం ఆధారంగా అమర్త్యసేన్, మార్థానస్‌బామ్ (Martha nussbaum)‌ మానవ శ్రేయస్సుకు మానవ సామర్థ్యాలు అవసరమని నిర్ధారించారు. మానవాభివృద్ధి అనేది మనిషి ఏమి కలిగి ఉన్నాడు అనేదానిపై కాకుండా ఏమి చేయగలడు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని, సామర్థ్యాలు మాత్రమే మనిషి సంపాదన, దాని వినియోగాన్ని నిర్ణయించి అతడి సాధికారతకు దారి తీస్తాయని వివరించారు. ఆదాయాభివృద్ధి కాదు మానవాభివృద్ధే అంతిమ లక్ష్యమని చెప్పారు.
    జాతి, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా సర్వకాల సార్వజనీన విలువల ఆలంబనగా మహబూబ్‌-ఉల్‌-హక్‌ అనే పాకిస్థాన్‌ ఆర్థికవేత్త చొరవతో పాల్‌ స్ట్రీటెన్, ఫ్రాన్సిస్‌ స్టీవార్ట్, సుధీర్‌ ఆనంద్, మేఘనాథ్‌ దేశాయ్‌ లాంటి శాస్త్రవేత్తలు, మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించారు. అమర్త్యసేన్‌ సిద్ధాంతం దీనికి ఆధారం. 1990 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
    మానవుల సామర్థ్యాన్ని పెంచే విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని మానవాభివృద్ధి సూచికను రూపొందించారు. అప్పటి నుంచి పరిపాలన అనేది ఆదాయ పెంపు కోసం కాకుండా ప్రజల శ్రేయస్సుకు కేంద్రీకృతంగా మారింది. ప్రపంచం దీన్ని జాతీయ, తలసరి ఆదాయాలకు ప్రత్యామ్నాయంగా గుర్తించింది.

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక వృద్ధి - సూచికలు

లోరెంజ్‌ వక్రరేఖ
    అమెరికన్‌ ఆర్థికవేత్త మాక్స్‌ లోరెంజ్‌ 1905లో ఈ వక్రరేఖ ద్వారా ఆదాయ అసమానతలు, సంపద పంపిణీలో అసమానతలను వివరించారు. జనాభా, ఆదాయం లేదా సంపద పంపిణీల మధ్య సంబంధాన్ని రేఖాత్మకంగా వివరించారు.
    45 సంపూర్ణ సమానత్వ రేఖ ఆదాయం, జనాభాల మధ్య సంపూర్ణ సమానత్వాన్ని తెలుపుతుంది. సంపూర్ణ సమానత్వ రేఖ దిగువనున్న లోరెంజ్‌ వక్రరేఖ సంపద లేదా ఆదాయ పంపిణీ అసమానత్వాన్ని తెలుపుతుంది. అంటే 45 సంపూర్ణ సమానత్వ రేఖ దాని దిగువనున్న లోరెంజ్‌ వక్రరేఖ మధ్య ప్రాంతం ఆదాయం, సంపద పంపిణీల్లోని అసమానత్వాన్ని సూచిస్తుంది. అయితే ఆదాయ అసమానతలు ఎంత మేరకు ఉన్నాయనేది ‘గిని గుణకం’ ద్వారా తెలుసుకోవచ్చు.

గిని గుణకం
    ఇటలీ దేశానికి చెందిన గణాంక, సామాజికవేత్త ‘కొరాడో గిని’. ఈయన ‘గిని గుణకాన్ని’ అభివృద్ధి చేశారు. ఈ గుణకం విలువ ‘0’ నుంచి ‘1’ మధ్య ఉంటుంది. దీనిలో ‘సున్నా’ అనేది సంపూర్ణ సమానత్వాన్ని తెలియజేస్తుంది. అంటే జనాభా, ఆదాయం మధ్య సంపూర్ణ సమానత్వం ఉందని అర్థం. దీని విలువ ‘ఒకటి’ అయితే జనాభా, ఆదాయం మధ్య సంపూర్ణ అసమానత్వం ఉందని అర్థం. అయితే ‘0’ నుంచి ‘1’ మధ్య విలువలు ఆయా దేశాల ఆదాయ, సంపద పంపిణీల్లో అసమానతలను తెలుపుతాయి. దీనికి అనుగుణంగా తి/త్ఘితీ అనే సమీకరణాన్ని తయారు చేశారు. దీనిలో ×తి× అనేది లోరెంజ్‌ పటంలో ఆదాయ సమానత్వ 45 రేఖకు, లోరెంజ్‌ వక్రరేఖకు మధ్య ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. ×తీ× అనేది లోరెంజ్‌ వక్రరేఖకు దిగువనున్న ప్రాంతాన్ని సూచిస్తుంది. దీన్ని కింది పటం ద్వారా మరింత విపులంగా అర్థం చేసుకోవచ్చు.

లోరెంజ్‌ వక్రరేఖ, గిని గుణకం 

ఫిలిప్స్‌ వక్రరేఖ
    ఎ.డబ్ల్యూ. ఫిలిప్స్‌ ప్రతిపాదించిన వక్రరేఖ ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత మధ్య విలోమ సంబంధం ఉంటుందని తెలియజేస్తుంది. ఆర్థికవృద్ధితో సంభవించిన ద్రవ్యోల్బణం  అధిక ధరలకు, లాభాలు అధిక ఉద్యోగాల కల్పనకు దారితీస్తాయని ప్రతిపాదించారు. అయితే 1970 దశాబ్దంలో స్టాగ్‌ ఫ్లేషన్‌ సంభవించడం వల్ల ద్రవ్యోల్బణంతో పాటు అధిక నిరుద్యోగిత సంభవించింది. 

వివిధ రంగాల వారీ వృద్ధిరేట్ల విశ్లేషణ
* వ్యవసాయం, అనుబంధ రంగాలు అంటే వివిధ పంటలు, లైవ్‌ స్టాక్‌ అంటే కోళ్ల పెంపకం, పశుగణాభివృద్ధి (మేకలు, గొర్రెలు, గేదెలు సహా), అడవులు, అటవీ వృత్తులు, చేపల పెంపకం, గుడ్ల పరిశ్రమ మొదలైనవి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% వరకు ఉంది.
* ప్రస్తుత గణాంకాల ప్రకారం 2017-18లో భారతదేశం సాధించిన జీడీపీ వృద్ధిరేటు 6.7%. 2018-19 జీడీపీ వృద్ధిరేటును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ 7.4%గా, ప్రపంచ బ్యాంక్‌ 7.3%గా అంచనా వేశాయి.

వ్యవసాయం, అనుబంధ రంగాలు
* జీవీఏలో (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2012-13లో 18.2% ఉంటే 2017-18 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 16.4 శాతానికి క్షీణించింది. 2011-12లో పంటల వాటా 65% ఉంటే 2015-16కి 60 శాతానికి క్షీణించింది. 2012-13లో 1.5% ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిరేటు 2016-17 నాటికి 4.9%గా నమోదైంది. స్థూల మూలధన సంచయనం GVA లో 2011-12లో 18.2% ఉంటే 2015-16లో 16.4% ఉంది.

పారిశ్రామిక రంగం
* జీవీఏలో పారిశ్రామిక రంగం వాటా 31.2% ఉంది. 2017-18 (ఏప్రిల్‌ - నవంబరు)లో పారిశ్రామికోత్పత్తి 3.2% వృద్ధి చెందింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో 40% వరకు భారత్వం ఉన్న ఎనిమిది కీలక రంగాలైన బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, తయారైన ఉక్కు, సిమెంట్, విద్యుచ్ఛక్తి వృద్ధిరేటు 2017-18లో 3.9% ఉంది. (ఏప్రిల్‌ - నవంబరు మధ్య) జీవీఏలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా 32% ఉంది. 

సేవల రంగం
* జీవీఏలో సేవల రంగం వాటా 55.2% గా ఉంది. సేవల రంగం వృద్ధిరేటు 2016-17లో 7.7%గా మొదటి ముందస్తు అంచనాల్లో 2017-18లో 8.3%గా పేర్కొన్నారు. సేవల రంగం జీవీఏ వాటాలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ, చండీగఢ్‌ 80% వాటా పొందగా, సిక్కిం 31.7% వాటాతో దిగువ స్థానంలో ఉంది. ఈ-కామర్స్‌ మార్కెట్‌ 19.1% వృద్ధితో 2016-17లో 33 బిలియన్‌ డాలర్ల విలువ నమోదు చేసుకుంది. 2015-16 జీవీఏలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నమోదైన వృద్ధి 7.7%. సాంఘిక సేవల రంగంలో 2015-16లో 5.8% వృద్ధి, 2017-18 బడ్జెట్‌ అంచనాల్లో 6.6% వృద్ధి నమోదయ్యాయి. జీడీపీలో మొత్తం వ్యయంలో సామాజిక సేవలపై వ్యయ శాతం కింది విధంగా ఉంది. 

     

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1991లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ

భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి రేటు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. దీనికి కారణం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన పాలనాకాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే. 1991 జులైలో పీవీ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి దేశ ఆర్థికాభివృద్ధికి వ్యూహాలు రచించారు. వీటినే రావు - మన్మోహన్‌ అభివృద్ధి నమూనాగా పిలుస్తారు. భారతదేశం తన అభివృద్ధి ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంది. 
      1991లో భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలోనే ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యాన్ని గుర్తించి, వాటిని ప్రవేశపెట్టారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను విపత్కర పరిస్థ్థితుల నుంచి బయటపడేయడానికి ఈ సంస్కరణలను అత్యవసర శస్త్రచికిత్సలాగా ఉపయోగించారా? లేక అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థల ఒత్తిడి, ఆదేశాల ఫలితమా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే 1991 ముందు భారత్‌తోపాటు ప్రపంచ స్థితిగతులు, పరిణామాలను పరిశీలించాలి.


1991 నాటి ఆర్థిక సంక్షోభం 
స్వాతంత్య్రానంతరం మన దేశం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా వాటిని ఆర్థిక సంక్షోభంగా ఎప్పుడూ పరిగణించలేదు. 199091లో మాత్రం పరిస్థితులు చేయిదాటి దేశ ఆర్థిక నిర్వహణ సంక్షోభంలో పడింది. ఇది ప్రపంచ వేదికలపై చర్చలకు దారితీసింది. మన ఆర్థిక భద్రత ప్రశ్నార్థకమైంది.


నిర్వచనం: దేశ అవసరాలు, దిగుమతులకు లేదా పాత అప్పులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద తగినన్ని సొంత నిధులు లేకపోవడం వల్ల వచ్చే సమస్యనే ఆర్థిక సంక్షోభం అంటారు. 1991 నాటి ఆర్థిక సంక్షోభం ప్రధానంగా రెండు రకాల లోటుల సంచిత (Cumulative) ఫలితంగా తలెత్తింది.
1) దేశీయ విత్త లోటు (Fiscal deficit) 
2) విదేశీ వ్యాపార లోటు (Current account deficit)


విదేశీ వ్యాపార లోటు   విత్త లోటు  ఆర్థిక సంక్షోభం


విత్త లోటు 
కేంద్ర ప్రభుత్వ సంవత్సర ఆదాయం కంటే వ్యయాలు ఎక్కువైనప్పుడు, ఆ లోటును దేశీయ రుణాలతో భర్తీచేయడాన్ని విత్తలోటు అంటారు. దీనివల్ల ప్రభుత్వంపై అప్పులు, వడ్డీల భారం పెరిగి క్రమంగా రుణ చెల్లింపు సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రుణ ఊబిలో కూరుకుపోవచ్చు.


విదేశీ వ్యాపార లోటు
ఒక దేశం ఇతర దేశాలకు వస్తుసేవల ఎగుమతుల ద్వారా ఆదాయం పొందుతుంది. దిగుమతుల ద్వారా వ్యయాలు చేస్తుంది. దీన్నే విదేశీ చెల్లింపుల శేషం అంటారు. ఎగుమతుల కంటే  దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయాలకంటే వ్యయాలు ఎక్కువవుతాయి. అప్పుడు దిగుమతులకు చెల్లించడానికి తగినంత విదేశీ కరెన్సీ లేక అప్పులు చేయాల్సి వస్తుంది. దీన్నే విదేశీ వర్తక లోటు అంటారు. ఈ రెండు లోటుల్లో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని చాలావరకు అధిగమించవచ్చు. ఇవి అనేక అంతర్గత, బహిర్గత అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. 1991లో ఈ రెండూ ఒకేసారి అధికస్థాయిలో మన దేశంలో సంభవించాయి. వాటి ప్రభావం అన్ని రంగాలపై పడి,  ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో సంస్కరణలు తప్పనిసరి అయ్యాయి.  


స్వదేశీ పరిస్థితులు
1980 దశాబ్దంలో దేశ స్థూల ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది. విత్తలోటు, విదేశీ వర్తకలోటు, అధిక ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. 198182 లో దేశ జీడీపీలో విత్తలోటు 5.1 శాతం ఉంది. 1991 నాటికి అది 7.8 శాతానికి పెరిగింది. 198589 మధ్య ఇది సగటున 10 శాతంగా ఉంది. దీనివల్ల స్వదేశీ అప్పులు దేశ ఆదాయంలో సుమారు 49.7 శాతానికి చేరాయి. ఇది భరించరాని భారంగా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వ రాబడిలో 39 శాతం నిధులు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం అపుల ఊబిలోకి జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. 
* 80వ దశాబ్దంలో దేశంలో ప్రభుత్వ వ్యయాలు గతంలో కంటే పెరిగాయి. ఇది మంచి పరిణామమే. అయితే ఆ పెరుగుదలకు కావాల్సిన నిధులు సొంత రాబడి లేదా పొదుపుల నుంచి సమకూరాలి. కానీ అలా జరగలేదు. అప్పు చేసి, ఖర్చు పెట్టారు.
* భారత్‌లో రెవెన్యూ ఖాతాలో అభివృద్ధియేతర వ్యయాలు విపరీతంగా పెరిగాయి. దీంతో విత్తలోటు అధికమైంది. దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రారంభమై సంక్షేమ పథకాలు, ఉచిత సబ్సిడీలకు కేటాయింపులు పెరిగాయి. పన్ను మినహాయింపులు ఎక్కువై వసూళ్లు తగినంతగా జరగలేదు.
* అనేక ప్రభుత్వ కంపెనీలు నిర్వహణ సామర్థ్యం కొరవడి, నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ భారం అంతా బడ్జెట్లపై పడింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయాలు ఏటేటా పెరుగుతూ వచ్చాయి.
* పెరుగుతున్న బడ్జెట్‌ లోటును పూడ్చటానికి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇతర వాణిజ్య సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. దేశీయంగా ప్రభుత్వ రుణాలు పెరగడంతో ఆమేరకు ప్రైవేటు రంగానికి నిధుల కొరత ఏర్పడింది. కొత్త కరెన్సీ ముద్రణ చేయడం వల్ల దేశంలో ద్రవ్య సప్లై, వస్తువుల డిమాండ్‌ పెరిగి, క్రమంగా ద్యవ్యోల్బణానికి దారితీసింది. వినియోగదారుల సూచిక ప్రకారం 1991లో ద్రవ్యోల్బణం 11.2 శాతానికి పెరిగింది. దీంతో ప్రజలకు జీవనభారం అధికమైంది.
* 80 దశాబ్దం మధ్య నుంచి దేశంలో ఇంతకాలం సాగిన నిర్బంధ  ప్రణాళిక వ్యవస్థపై  విమర్శలు ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు, వ్యాపారాలను సరళీకరిస్తూ రాజీవ్‌గాంధీ స్వల్ప మార్పులు తెచ్చారు. తర్వాత వచ్చిన ప్రధానులు వి.పి.సింగ్, చంద్రశేఖర్‌ వాటిని కొనసాగించారు.
* రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ నిర్వహించిన వి.పి.సింగ్‌ సరళీకృత పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టారు. తాను ప్రధాని అయ్యాక వాటిని ఇంకా పెంచారు. ఈయన హయాంలో పారిశ్రామిక మంత్రిగా ఉన్న అజిత్‌ సింగ్‌ (మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడు)ఈ విధానాలను ప్రోత్సహించారు. 1990 నాటికి ఆర్థిక సంస్కరణల వాదిగా గుర్తింపు పొందడానికి, పెట్టుబడుల ఆకర్షణకు వి.పి.సింగ్‌ ప్రయత్నించారు.
* క్రమంగా 1990 నాటికి గత ప్రభుత్వాలు చేపట్టిన విధానాలతో విభేదిస్తూ, తర్వాత వచ్చిన ప్రధానులందరూ సరళీకృత ప్రైవేటు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించారు. అప్పటికే అధికారులు, నాయకుల్లో ఈ మార్పులు, సంస్కరణలపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా భావించవచ్చు. దీన్నే నూతన పారిశ్రామిక విధానం-1990 అని పిలిచారు.
* ప్రధానిగా స్వల్పకాలం పనిచేసిన చంద్రశేఖర్‌ (నవంబరు 1990 - జూన్‌ 1991) దేశ చరిత్రలో మొదటిసారి పారిశ్రామిక శాఖను తనవద్దే ఉంచుకున్నారు. ఆ రంగంలోని సంస్కరణలను స్వయంగా పర్యవేక్షించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంప్రదాయాన్ని తర్వాతి ప్రధాని పీవీ నరసింహారావు కొనసాగించారు.
* రాజీవ్‌గాంధీ నుంచి పీవీ నరసింహారావు వరకు ఒకే ఆర్థిక నిపుణుల బృందం నూతన ఆర్థిక విధానాలకు రూపకల్పన చేసింది.  వీరిలో కొంతమందికి పశ్చిమ దేశాలతో అకడమిక్‌ సంబంధాలు ఉన్నాయి. కొందరు మంత్రులు రాజీవ్‌గాంధీ నుంచి పీవీ వరకు  కేబినెట్‌లో పనిచేశారు. ఈ పరిణామాలు సరళీకరణ ఆర్థిక విధానాల పట్ల ఒక ఉమ్మడి ఏకాభిప్రాయం, కార్యాచరణ ఏర్పడటానికి దోహదం చేశాయి.
* పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.  అంతకుముందు మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ వద్ద సీనియర్‌ ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనుభవంతో భారతదేశ ఆర్థిక పరిస్థితులపై మన్మోహన్‌సింగ్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడింది.
* రాజీవ్‌గాంధీ తర్వాత దేశంలో అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయి.  దీంతో రాజకీయ అనైక్యత, మండల్‌-మందిర్‌ సమస్య మొదలైన కారణాల వల్ల బలమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో విఫలమయ్యాయి. కానీ పీవీ నరసింహారావు వాటన్నింటినీ అధిగమించి సంస్కరణలను అమలు చేశారు.


విదేశీ పరిస్థితులు
విదేశాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు కూడా భారతదేశం ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపడానికి ప్రేరేపించాయి.
* నాటి సోవియట్‌ రష్యా అంతర్గత కారణాలతో విచ్ఛిన్నం కావడంతో, ఆర్థికంగా బలహీనపడింది. దీంతో మనదేశానికి అంతవరకు చేస్తున్న ఆర్థిక, రక్షణ సహాయాలు తగ్గాయి. ప్రత్యామ్నాయ దేశాల సహాయం కోసం అన్వేషణ ప్రారంభించాల్సి వచ్చింది. 
* ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్, సామ్యవాద విధానాలపై విశ్వాసం సన్నగిల్లింది. బలమైన కమ్యూనిస్ట్‌ దేశమైన చైనా 1978 నుంచే ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టి, మార్కెట్‌ ఆధారిత విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.
* అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ ప్రయివేటీకరణను, రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్‌ సోషల్‌ డెమోక్రసీ విధానాలను అవలంబించారు. ఇవి వ్యక్తి స్వేచ్ఛను, ప్రైవేటు రంగాన్ని బలపరిచాయి. అమెరికా పెట్టుబడిదారీ విధానాలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో మెజారిటీ వాటాను సాధించి ప్రాబల్యం పెంచుకుంది.
* మరోవైపు సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ దేశాలు అప్పటికే సరళీకృత ఆర్థిక విధానాలు అమలుచేసి పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి భారత్‌ సహా అభివృద్ధిచెందుతున్న దేశాల దృష్టిని ఆకర్షించాయి.
* 1970వ దశాబ్దం చివర్లో లాటిన్‌ అమెరికా దేశాలు రుణ చెల్లింపుల ఎగవేత సమస్యలు ఎదుర్కొని, చెడ్డపేరు తెచ్చుకున్నాయి. దీంతో విదేశీ రుణదాతలు అప్పులు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ దేశం కోసం వెతకసాగారు. ఈ అవకాశాన్ని మన ప్రభుత్వాలు, కంపెనీలు ఉపయోగించుకుని, విదేశీ రుణాలను పొందాయి. ముఖ్యంగా జపాన్‌ నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు సమకూరింది.
* దేశంలో 1976 నుంచే మాధ్యమిక మూలధన వస్తు దిగుమతులను సులభతరం చేశారు. కానీ మన ఎగుమతులు పెరగలేదు. అలాగే రాజకీయ కారణాల వల్ల విదేశీ సహాయాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా, విదేశీ రుణాలతో మన విత్త లోటును భర్తీ చేయడానికి ప్రయత్నాలు కొనసాగాయి. ఫలితంగా వడ్డీల భారం పెరిగింది. 
* 1990 నాటికి వడ్డీలకు చెల్లించే వ్యయం మన దేశ రక్షణ లేదా సబ్సిడీల వ్యయం కంటే ఎక్కువగా ఉంది.
* దేశ అభివృద్ధి కోసం 1980లోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund) నుంచి నిధుల రూపంలో సహాయం పొందాం. అప్పటి నుంచి మనం వారి ఆదేశాలు, సలహాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాటిస్తూ వస్తున్నాం.
* దేశంలో విదేశీ చెల్లింపుల సమస్య 80 దశాబ్దంలో పెరిగింది. దిగుమతులను సులభతరం చేయడం, ఎగుమతులు ఆశించినంతగా పెరగకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో ఆదాయం కంటే వ్యయాలు పెరిగి వ్యాపారలోటు ఏర్పడింది. 
* సంకీర్ణ ప్రభుత్వాల పాలనలో ఏర్పడిన అనిశ్చితి వల్ల ఎన్‌ఆర్‌ఐలకు దేశీయ మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా విదేశీమారక నిల్వలు తగ్గిపోతూ వచ్చాయి. ఈ లోటును భర్తీ చేయడానికి విదేశీ రుణాలు పెంచుకోవాల్సి వచ్చింది.
* 1991 నాటికి కరెంటు ఖాతాలో లోటు దేశీయ ఆదాయంలో 3.69 శాతానికి పెరిగింది. దీనివల్ల విదేశీ అప్పులు మన రాబడిలో 26 శాతానికి చేరాయి. ఇది నాటి భారతదేశ ఆర్థిక స్థితి ప్రకారం మోయలేని భారం. దీనిలో దాదాపు సగం అప్పులు ప్రభుత్వ రంగానివే.
* ముఖ్యంగా దేశంలో పెట్టుబడులు - పొదుపుల మధ్య సమతౌల్యం పాటించడంలో చోటుచేసుకున్న వైఫల్యం కారణంగా, ఆ లోటును భర్తీ చేయడానికి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సివచ్చింది. విదేశాల నుంచి దిగుమతులకు సమానంగా ఎగుమతులు పెరగకపోవడం విదేశీ చెల్లింపుల సమస్యకు బీజం వేసింది.
* మన కరెన్సీ విలువ అధికంగా ఉండటం, విలువ తగ్గించడానికి పాలకులు సమ్మతించకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో మన ఎగుమతులు, రాబడులు పెరగలేదు.
* మరోవైపు 1990 నాటి గల్ఫ్‌ సంక్షోభం వల్ల ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. భారతదేశం డాలర్ల రూపంలో అధికంగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో దిగుమతుల భారం పెరిగింది.
* ఇది ఇలాగే కొనసాగితే ఇకముందు చెల్లింపులకు విదేశీమారక నిల్వలు పూర్తిగా కరిగిపోతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరపతి రేటు పడిపోతుంది. అదే జరిగితే విదేశీ రుణాలు లభించవు. అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ పరిస్థితినే విదేశీ చెల్లింపుల సంక్షోభం అంటారు.
* ఈ స్థితి నుంచి బయటపడటానికి నాటి చంద్రశేఖర్‌ ప్రభుత్వం 1991 మేలో 20 టన్నుల బంగారాన్ని జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌) నగరంలో విక్రయించడం ద్వారా, 240 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. 
* 1991 జూన్‌ నాటికి విదేశీమారక నిల్వలు ఒక బిలియన్‌ డాలర్‌ లోపునకు పడిపోయాయి. 1991 జులైలో మరో 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ దగ్గర కుదువపెట్టి, చెల్లింపులు జరిపారు.
* అయితే, ఈ సంక్షోభం అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దాల స్వదేశీ, విదేశీ అంశాలు, రాజకీయ,  పాలనాపరమైన కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయి. 
* లాంటి విపత్కరమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కేంద్రంలో 1991 జులైలో పి.వి. నరసింహారావు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే స్వదేశీ, విదేశీ పరిస్థితుల ప్రభావంతో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ చేశారు. కొద్దికాలంలోనే ఆర్థిక సంక్షోభ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించడమే కాక భావి భారత ఆర్థిక ప్రగతికి కావలసిన సరికొత్త పునాదులు వేశారు. 

Posted Date : 09-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘం (2015 - 20)
డా.వై.వి.రెడ్డి అధ్యక్షులుగా, అజయ్‌ నారాయణ్‌ ఝా కార్యదర్శిగా 14వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీని సిఫార్సులు 2015 - 20 కాలానికి వర్తిస్తాయి.


i) కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా: 14వ ఆర్థిక సంఘం పన్ను రాబడుల్లో (డివిజిబుల్‌ పూల్‌) 42% వాటాను రాష్ట్రాలకు కేటాయించింది. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన 32%తో పోలిస్తే ఇది 10% అధికం. దీనివల్ల రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్లు పథకాలు రూపొందించుకొని, నిధులు కేటాయించుకునే స్వేచ్ఛ లభిస్తుందని అభిప్రాయపడింది.


ii) పన్నుల రాబడి పంపిణీలో వివిధ రాష్ట్రాల వాటాలు: 14వ విత్త సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి  అధిక పన్నుల వాటా పొందే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్‌ (17.959%), బిహార్ (9.665%), మధ్యప్రదేశ్ (7.548%). కేంద్రం నుంచి తక్కువ పన్నువాటా పొందే రాష్ట్రాలు: సిక్కిం  (0.37%), గోవా  (0.38%) 
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 6.74% పన్ను వాటాతో 5వ స్థానంలో ఉండేది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ 9, తెలంగాణ 15వ స్థానాల్లో ఉన్నాయి.


iii) రెవెన్యూ లోటు: దేశంలోని మొత్తం 11 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉంది. అవి: ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అసోం, కేరళ, మేఘాలయ, పశ్చిమ్‌బెంగాల్‌. 
* అయిదేళ్ల కాలంలో  (2015-20)  ఈ రాష్ట్రాలకు రూ.1,94,182 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 
* రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుంచి ఎక్కువ సాయం అందుకుంది జమ్మూ కశ్మీర్‌. 


iv) ప్రకృతి విపత్తుల నిర్వహణ: ప్రకృతి విపత్తుల సమయంలో పునరావాసం, భద్రతా చర్యల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అయినప్పటికీ కేంద్రం తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాలపై సెస్‌లు విధించడం ద్వారా జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కి నిధులు లభిస్తాయి. దీనికి మరిన్ని నిధులు సమకూర్చేందుకు  National Calamity Contingency Duty ని కూడా విధిస్తున్నారు. 
* రాష్ట్రవిపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)కి రాష్ట్రాలు 10%, కేంద్రం 90% నిధులు అందించాలని 14వ ఆర్థిక సంఘం  సూచించింది. ప్రకృతి విపత్తుల కోసం రూ. 55,097 కోట్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. 


v) స్థానిక సంస్థలు: 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్ర జనాభాకు 90%, ప్రాంతానికి 10% భారితం ఇచ్చి, స్థానిక సంస్థలకు నిధులు అందించాలని సిఫార్సు చేసింది. 2015 - 20 కాలానికి స్థానిక సంస్థలకు రూ. 2,87,436 కోట్లను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మొత్తంలో పంచాయతీలకు రూ.2,00,292 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 87,144 కోట్లు సిఫార్సు చేసింది. 


గ్రాంట్లు రెండు రకాలు అవి: బేసిక్‌ గ్రాంట్, పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్‌. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధుల్లో బేసిక్, పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్లను గ్రామ పంచాయతీలకు 90 : 10, పురపాలక సంఘాలకు 80 : 20 నిష్పత్తిలో అందించాలి. కేంద్రం నుంచి నిధులు విడుదలైన 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయాలి. అలా జరగకపోతే వడ్డీతో సహా మొత్తం జమ చేయాలి. గనులు తవ్వడం ద్వారా రాష్ట్రాలకు వచ్చిన రాయల్టీలో కొంత భాగాన్ని స్థానిక సంస్థలకు కేటాయించాలి. ఇవి ప్రజల ప్రాథమిక సౌకర్యాల కల్పనకు (తాగునీరు, పారిశుద్ధ్యం, సామాజిక ఆస్తులు, వీధి దీపాలు, రహదారుల నిర్వహణ) నిధులు ఖర్చు చేయాలి. స్థానిక సంస్థలు ప్రోత్సాహక నిధులను పొందాలంటే తప్పనిసరిగా ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిటింగ్‌ చేయాలి.


vi) కోశ క్రమశిక్షణ: 2019 - 20 నాటికి దేశ కోశ లోటును 3 శాతానికి తెచ్చి, రెవెన్యూ లోటును పూర్తిగా లేకుండా చేయాలనేది 14వ ఆర్థిక సంఘం లక్ష్యం. రాష్ట్రాల్లోనూ కోశ లోటు 3% (0.25% అటూఇటూగా) ఉంచాలని పేర్కొంది. రాష్ట్రాల అప్పులు వాటి  GSDP లో  25% మించకూడదు. ఈ అంశాలకు అనుగుణంగా  FRBM చట్టాన్ని సవరించి దాని స్థానంలో Debt Ceiling & Fiscal Responsibility Legislation ను తేవాలి. వాస్తవ రెవెన్యూ లోటును  (Effective Revenue Deficit) విడిచిపెట్టాలని సూచించింది.


vii) వస్తు సేవల పన్ను (జీఎస్టీ): జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి మూడేళ్లు రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 100%, నాలుగో ఏడాది 75%, అయిదో సంవత్సరం 50% కేంద్రమే భరించాలని 14వ ఆర్థిక సంఘం సూచించింది.


viii) కేంద్ర ప్రాయోజిత పథకాలు  (Central Sponsored Schemes): కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 30 స్కీంలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. పథకాల ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎనిమిదింటిని మాత్రమే ప్రభుత్వం బదిలీ చేసింది.


ix) విద్యుత్‌ రంగంపై సిఫార్సులు: రాష్ట్రాలు కొన్ని వర్గాల ప్రజలకు ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీలను ముందుగానే విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లించాలి. అలా చేయని రాష్ట్రాలకు జరిమానా విధించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలకు లాభాలు రావాలంటే వాటికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని, దానికోసం రాష్ట్ర స్థాయి విద్యుత్‌ నియంత్రణ మండలి నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యవసాయ పంపు సెట్లకు, ఇతర వర్గాలవారికి నీటిని అందించే మోటార్లకు తప్పనిసరిగా మీటర్లు పెట్టాలి. తద్వారా ప్రభుత్వం ఇచ్చే రాయితీల ధ్రువీకరణ, విద్యుత్‌ సాంకేతిక నష్టాలు, విద్యుత్‌ చౌర్యం లాంటి సమాచారం తెలుస్తుందని పేర్కొంది.


x) ప్రభుత్వ రంగ సంస్థలు: ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వ రంగ సంస్థలను నాలుగు వర్గాలుగా విభజించారు. అవి:
1) అత్యంత ముఖ్యమైనవి 
2) ముఖ్యమైనవి 
3) సాధారణమైనవి  
4) అవసరం లేనివి 
వీటిలో పెట్టుబడి పెట్టాలన్నా, ఉపసంహరించాలన్నా ఈ వర్గీకరణ ఆధారంగానే జరగాలి. అవసరం లేని సంస్థలను పారదర్శకంగా వేలం వేసి, విక్రయించాలని ఆర్థిక సంఘం సూచించింది.


xi) ఇతర అంశాలు: రైల్వే టికెట్‌ ధరలను నిర్ణయించడానికి స్వయంప్రతిపత్తి హోదా ఉన్న ధరల నిర్ణయాధికార సంస్థను వేగంగా ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి జీతభత్యాలు నిర్ణయించాలి.  Pay Revision Commission (PRC) పేరును  Pay and Productivity Commission (PPC) గా మార్చాలి. స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్ఠి కోసం వృత్తిపన్నును భారీగా పెంచి, నిధులు సమకూర్చాలని ఆర్థిక సంఘం సూచించింది.


xii) కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ   వాటాలు: 2015 - 20 మధ్య కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాలకు రూ. 39,48,187 కోట్లు కేటాయించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా రూ.1,69,970 కోట్లు (4.305%)  కేటాయించారు. సేవాపన్ను వాటా 4.398%. తెలంగాణకు రూ. 96,217 కోట్లు (2.437%) ఇచ్చారు. సేవాపన్ను వాటా 2.499%.


13వ విత్త సంఘం (2010-15)
* 13వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్లే గరిష్ఠ వనరులు (పన్నులు, గ్రాంట్లు) 39.5 శాతంగా, పన్ను రాబడుల వాటాను 32 శాతంగా నిర్ణయించింది. అయితే సర్‌ఛార్జి, సెస్‌లపై రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనే డిమాండ్‌ను ఆమోదించలేదు. 
* 11వ ఆర్థిక సంఘం మొదటిసారి కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్లే గరిష్ఠ వనరులు 37.5% వరకు ఉండొచ్చని, వాటిలో పన్ను రాబడుల వాటా 29.5 శాతంగా ఉండాలని సూచించింది. 
* 12వ ఆర్థిక సంఘం గరిష్ఠ వనరులను 38 శాతంగా, పన్ను రాబడుల వాటాను 30.5 శాతంగా నిర్ణయించింది. 


15వ ఆర్థిక సంఘం
రాష్ట్రపతి 2017, నవంబరు 27న ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్‌ అధ్యక్షులుగా, అరవింద్‌ మెహతా కార్యదర్శిగా 15వ ఆర్థిక సంఘాన్ని నియమించారు. 2020, అక్టోబరు 30 నాటికి ఇది తన నివేదికను సమర్పించాలని ఆదేశించారు.


ఆర్థిక సంఘం సభ్యులు: అజయ్‌ నారాయణ్‌ ఝా (కేంద్ర మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి), అశోక్‌ లహరి (కేంద్ర మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు), రమేష్‌ చంద్‌ (నీతి ఆయోగ్‌ సభ్యులు), అనూప్‌ సింగ్‌ (జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌)
* ఈ సంఘం 2 నివేదికలు సమర్పించింది. మొదటి దానిలో 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలు ఉండగా, రెండో దానిలో 2021 - 2026 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. 


టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌: కింద పేర్కొన్న   అంశాలను పరిశీలించి నివేదికను తయారుచేయాలని 15వ ఆర్థిక సంఘానికి సూచించారు.
* కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, వాటిలో రాష్ట్రాలకు వచ్చే వాటాలను నిర్ణయించడం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్ల పరిమాణాన్ని నిర్ణయించి, వీటిని పొందడానికి రాష్ట్రాలకు ఉండాల్సిన అర్హతలను ప్రకటించడం.
* మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధులు అందించేందుకు రాష్ట్ర సంఘటిత నిధిని బలోపేతం చేసే చర్యలు సూచించడం. 
* 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్ర కోశ స్థితిగతులపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో సమీక్షించడం. 
* కేంద్రం, రాష్ట్రాల రుణాల స్థితిగతులు, మంచి విత్త నిర్వహణకు తీసుకోవాల్సిన కోశపరమైన చర్యలు సూచించడం.
* ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావాన్ని అధ్యయనం చేయడం. 
* జనాభావృద్ధి రేటును తగ్గించేందుకు చేపట్టిన చర్యలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కృషి, మూలధన వ్యయాన్ని పెంచడంలో ప్రగతి, విద్యుత్‌ రంగంలో నష్టాలు తగ్గించడం, పన్ను-పన్నేతర రాబడిని పెంచడంలో ప్రగతి, ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్‌ ఎకానమీని ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యం  (Ease of Doing Business)లో ప్రగతి, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో సాధించిన ప్రగతి మొదలైన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలను సిఫార్సు చేయడం. 
* రక్షణ, అంతర్గత భద్రతలకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక యంత్రాంగం అవసరమా? ఒకవేళ అవసరమైతే దాన్ని ఎలా నిర్వహించాలి? అనే అంశంపై సలహా ఇవ్వడం. 
* 2011 జనాభా లెక్కల ఆధారంగానే సిఫార్సులు ఉండాలి.  

 

15వ ఆర్థిక సంఘం - నివేదికలు
* 15వ ఆర్థిక సంఘం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి రెండు నివేదికలను సమర్పించింది. మొదటి నివేదికలో 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలు ఉండగా, రెండో నివేదికలో 2021 - 26 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.

 

ఆదాయ వ్యత్యాసం: అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రంతో పోలిస్తే ఒక రాష్ట్రం ఎంత దూరంలో ఉందో ఈ ప్రమాణం తెలుపుతుంది. 2016 - 17 నుంచి 2018 - 19 వరకు ఉన్న మూడేళ్ల సగటు తలసరి జీఎస్‌డీపీ లెక్కించడం ద్వారా ఒక రాష్ట్ర  తలసరి ఆదాయం వస్తుంది. తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకు అధిక సాయం అందించే ఉద్దేశంతో ఆదాయ వ్యత్యాస ప్రమాణాన్ని చేర్చారు. రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని సాధించడం దీని లక్ష్యం. మొదటి నివేదిక తయారీకి సూచన కాలం (రిఫరెన్స్‌ పీరియడ్‌)గా  2015 - 18ని తీసుకున్నారు.


జనాభా సంబంధ ప్రగతి Demographic Performance): జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు బహుమతిగా ఈ ప్రమాణాన్ని చేర్చారు. దీని ప్రకారం ఫలదీకరణ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలు అధికంగా లబ్ది పొందుతాయి. 

అడవులు, ఆవరణ వ్యవస్థ: అన్ని రాష్ట్రాల్లోని మొత్తం దట్టమైన అడవుల్లో ఒక రాష్ట్రంలోని దట్టమైన అడవుల వాటా ఎంత ఉందో లెక్కించి ఈ ప్రమాణాన్ని పరిగణిస్తారు.

పన్నుల వసూల్లో కృషి (Tax Effort):  అధిక పన్ను వసూలు సామర్థ్యం ఉన్న రాష్ట్రాలకు బహుమతిగా ఈ ప్రమాణాన్ని చేర్చారు. 2016 - 17 నుంచి 2018 - 19 కాలానికి ఒక రాష్ట్రంలో సగటు తలసరి సొంత పన్ను రాబడికి, సగటు తలసరి జీఎస్‌డీపీకి మధ్య ఉన్న నిష్పత్తి ఆధారంగా దీన్ని లెక్కిస్తారు.
* 13వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను మాత్రమే ఆధారంగా తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి 2011 జనాభా లెక్కలను ప్రమాణంగా  తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు స్వాగతించగా, మరికొన్ని వ్యతిరేకించాయి. 

 

2011 జనాభా లెక్కలు - అనుకూల వాదనలు:
* 1971 జనాభా లెక్కలు 50 ఏళ్ల నాటి పాత సమాచారాన్ని పేర్కొంటాన్నాయి. ఇవి ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించవు. 
* 1971 జనాభా లెక్కలు వలసలను పరిగణనలోకి తీసుకోలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం సంవత్సరానికి 33 లక్షల మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.  ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. 
* పాత గణాంకాలతో సరైన కేటాయింపులు జరగకపోవచ్చు. వలసలు కూడా పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేస్తే జనాభా సంబంధ మార్పుల ద్వారా వచ్చే జనాభా సంబంధ లబ్ది (demographic dividend) చేకూరుతుంది.


ప్రతికూల వాదనలు:
* 1971 నుంచి 2011 నాటికి మొత్తం జనాభాలో దక్షిణ భారత రాష్ట్రాల వాటా 4% తగ్గగా, ఉత్తర భారత రాష్ట్రాల వాటా సాపేక్షంగా పెరిగింది. ఫలితంగా ఆ రాష్ట్రాలు ఎక్కువ లబ్ది పొందుతున్నాయి. 
* అధిక జనాభా వల్ల ఉత్తర భారత రాష్ట్రాల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కేటాయింపులు పెరగడానికి ఈ అంశం కూడా ఒక కారణం. 
* ధనిక రాష్ట్రాలు పేద రాష్ట్రాలకు సహాయం చేయాలి. అనేక సంవత్సరాల నుంచి ఉత్తర భారత రాష్ట్రాలకు సాయం అందిస్తున్నప్పటికీ అవి వెనుకబడే ఉన్నాయి. వెనుకబాటుతనం ఆధారంగా నిధుల కేటాయింపు జరగడం వల్ల ఆర్థిక సంఘం వెనుకబాటుతనాన్ని ప్రోత్సహించినట్లు అనిపిస్తోందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ఉదా: తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన దాని కంటే తక్కువమొత్తం పొందుతున్నాయి. ఈ రాష్ట్రాలు కేంద్రానికి రూ.100 చెల్లిస్తే, తిరిగి రూ. 30 మాత్రమే దక్కుతుంది. ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌ లాంటి రాష్ట్రాలు రూ.100 చెల్లిస్తే, రూ.200 పైనే పొందుతున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుంచి అధికంగా నిధులు లభిస్తున్నాయి.
* 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల 4 దక్షిణాది రాష్ట్రాలతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలూ నష్టపోతున్నాయి.

 

మొదటి నివేదిక
* 2020 - 21కి రూ.8,55,176 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సిఫార్సు చేసింది.  ఈ మొత్తం డివిజబుల్‌ పూల్‌లో 41 శాతంగా ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 42 శాతం కంటే ఇది 1 శాతం తక్కువ. 2020 ఫిబ్రవరిలో ఈ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 
* 2020 - 21కి ఉత్తర్‌ప్రదేశ్‌ అత్యధికంగా రూ.1,53,342 కోట్లు పొందింది. డివిజబుల్‌ పూల్‌లో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఈ రాష్ట్రం వాటా 17.93 శాతం. బిహార్‌ రూ.86,039 కోట్లతో రెండో స్థానంలో ఉంది. 
* 2020 - 21కి ఆంధ్రప్రదేశ్‌కు రూ.35,156 కోట్లు లభించాయి. 14వ ఆర్థిక సంఘం డివిజబుల్‌ పూల్‌లో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం 4.111 శాతం కేటాయించింది. 
* పన్నుల విభజన తర్వాత కూడా 14 రాష్ట్రాలు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. దీన్ని భర్తీ చేసేందకు ఆయా రాష్ట్రాలకు రూ.74,341 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు కింద సిఫార్సు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. 
* 2019 - 20తో పోలిస్తే 2020 - 21లో కర్ణాటక, మిజోరం, తెలంగాణలకు పన్నుల విభజన, రెవెన్యూ లోటు గ్రాంటు ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంది. దీనికోసం ఆ మూడు రాష్ట్రాలకు రూ.6,674 కోట్లు కేటాయించింది. 
* 2020 - 21లో స్థానిక సంస్థలకు రూ.90,000 కోట్ల గ్రాంటును సిఫార్సు చేసింది. డివిజబుల్‌ పూల్‌లో ఇది 4.31%. ఈ మొత్తంలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.60,750 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.29,250 కోట్లు కేటాయించింది. 
* జాతీయ, రాష్ట్ర డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌ ఫండ్‌లను ఏర్పాటుచేయాలని ఈ సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (State Disaster Risk Management Fund-SDRMF) కు రూ.28,983 కోట్లు, జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి  (National Disaster Risk Management Fund NDRMF) కు రూ.12,390 కోట్లు సిఫార్సు చేసింది. 
* 2020 - 21 లో పోషణ (Nutrition) రంగానికి రూ.7,375 కోట్ల గ్రాంటును సిఫార్సు చేసింది. 
* ప్రదర్శనాధారిత, రంగాల వారీ గ్రాంట్లను పూర్తిగా తొలగించారు.


రెండో నివేదిక
* 15వ ఆర్థిక సంఘం 2020 నవంబరులో తన నివేదికను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించింది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్‌తో పాటు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో 202126 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆర్థిక సంఘం కేంద్రం, రాష్ట్రాలకు కీలక సిఫార్సులు చేసింది.


కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా: 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సిఫార్సు చేసినట్లే 2021 - 26 కాలానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41 శాతంగా ప్రకటించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన దానికంటే ఇది 1 శాతం తక్కువ. ఈ ఒక్క శాతాన్ని కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ కోసం కేటాయించాలన్న కేంద్రప్రభుత్వ సూచనకు ఆర్థిక సంఘం అంగీకరించింది. 2021 - 22 నుంచి 2025 - 26 వరకు మొత్తం పన్ను వసూళ్లు రూ.135.2 లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వం అంచనా. సెస్సులు, సర్‌ఛార్జీలు లాంటివి మినహాయిస్తే ఈ మొత్తం రూ.103 లక్షల కోట్లకు తగ్గుతుంది. అందులో 42% అంటే రూ.42.2 లక్షల కోట్లు రాష్ట్రాలకు దక్కాలి.
 



రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు ప్రమాణాలు: దీనికోసం 15వ ఆర్థిక సంఘం 2020 - 21కి ఉపయోగించిన ప్రమాణాలనే 2021 - 26 కాలానికీ తీసుకుంది. వాటికి కేటాయించిన భారితాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. ‘పన్ను వసూల్లో కృషి’కి (Tax Effort) బదులు ‘పన్ను-కోశ కృషి’ (Tax and Fiscal Effort) అనే పేరును ఉపయోగించారు. అయితే ఆదాయ వ్యత్యాసం, పన్నుల వసూల్లో కృషి అనే రెండు ప్రమాణాల లెక్కింపునకు 2020 - 21కి రిఫరెన్స్‌ పీరియడ్‌గా 2015 - 18; 2021 - 26 కాలానికి 2016 - 19ను తీసుకున్నారు. 2020 - 21తో పోలిస్తే రాష్ట్రాల వాటాల్లో స్వల్పంగా మార్పులు జరిగాయి.
* ఈ విధానంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకల మొత్తం వాటా 13.955% నుంచి 11.721 శాతానికి తగ్గింది. ఈ రాష్ట్రాలు మొత్తంగా 2.234% వాటాను అంటే రూ.94,381.13 కోట్లను కోల్పోయాయి. ఒడిశా, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌లు కూడా వెయిటేజీని కోల్పోయాయి. ఈ ఏడు రాష్ట్రాలు అయిదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా నష్టపోనున్నాయి. తమిళనాడు వెయిటేజీ 4.023% నుంచి 4.079%కి పెరిగింది.


రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు ప్రమాణాలు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ణయించేందుకు 15వ ఆర్థిక సంఘం కింది ప్రమాణాలను అనుసరించి, భారితాలు ఇచ్చింది.

 

గ్రాంట్లు
* 2021 - 26 కాలానికి కేంద్ర వనరుల నుంచి  రాష్ట్రాలకు కింద పేర్కొన్న గ్రాంట్లు అందుతాయి.
 రెవెన్యూ లోటు గ్రాంట్లు: రెవెన్యూ లోటును అధిగమించేందుకు 17 రాష్ట్రాలకు రూ.2.9 లక్షల కోట్లు కేటాయించారు.


8 రంగాలకు ప్రత్యేక గ్రాంట్లు: కింది రంగాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేకంగా రూ.1.3 లక్షల కోట్లు ఇస్తారు. అవి:
1. ఆరోగ్యం      2. పాఠశాల విద్య        3. ఉన్నత విద్య 
4. వ్యవసాయ సంస్కరణల అమలు 
5. పీఎంజీఎస్‌వై రహదారుల నిర్వహణ 
6. న్యాయ వ్యవస్థ         7. గణాంకాలు 
8. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులు. 
* ఈ గ్రాంట్లలో కొంత భాగం పనితీరు  ఆధారంగా ఉంటాయి.


రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు: ఆర్థిక సంఘం రాష్ట్రాలకు రూ.49,599 కోట్ల ప్రత్యేక గ్రాంట్లను సిఫార్సు చేసింది. వీటిని కింది అవసరాలకు ఇస్తారు. 
* సాంఘిక అవసరాలు 
* పాలనా గవర్నెన్స్, మౌలిక వసతులు 
* తాగునీరు, పారిశుద్ధ్యం 
* సంస్కృతి, చారిత్రక కట్టడాల సంరక్షణ 
* అధిక వ్యయం ఉన్న భౌతిక అవస్థాపన 
* పర్యటకం 
రాష్ట్రాలు, రంగాల వారీగా ప్రత్యేక గ్రాంట్ల వినియోగాన్ని సమీక్షించి, పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. స్థానిక సంస్థలకు గ్రాంట్లు: స్థానిక సంస్థలకు మొత్తం రూ.4.36 లక్షల కోట్లు ఇస్తారు. ఈ గ్రాంట్లలో కొంత మొత్తం పనితీరు ఆధారంగా ఇస్తారు. వీటిలో గ్రామీణ స్థానిక సంస్థలకు  రూ.2.4 లక్షల కోట్లు; పట్టణ స్థానిక సంస్థలకు రూ.1.2 లక్షల కోట్లు; స్థానిక ప్రభుత్వాల ద్వారా ఆరోగ్య గ్రాంట్లు రూ.70,051 కోట్లు కేటాయించారు. స్థానిక సంస్థలకు అందించే గ్రాంట్లు 3 అంచెల (గ్రామం, బ్లాక్, జిల్లా) పంచాయతీరాజ్‌ సంస్థలకు అందుబాటులో ఉంటాయి.


ఆరోగ్య గ్రాంట్లు: ఈ నిధులను కింది విధంగా వెచ్చిస్తారు.
* గ్రామీణ ఆరోగ్య సబ్‌ సెంబర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీలు) ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలుగా మార్చడం.  
* ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలకు మద్దతుగా డయాగ్నోస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం.
* పట్టణ ఆరోగ్య-వెల్‌నెస్‌ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలకు, బ్లాక్‌స్థాయిలో ఉన్న ప్రజా ఆరోగ్య యూనిట్లకు మద్దతు అందించడం.
* ఆరోగ్య గ్రాంట్లు మినహా స్థానిక సంస్థలకు అందించే మిగిలిన గ్రాంట్లను జనాభా, విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. జనాభాకు 90%, విస్తీర్ణానికి 10% భారితం ఇస్తారు. ఈ గ్రాంట్లను (ఆరోగ్య గ్రాంట్లు మినహా) పొందడానికి ఆర్థిక సంఘం కొన్ని షరతులను విధించింది. అవి:
* ఆడిట్‌ చేసిన అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రచురించాలి. 
* ఆస్తి పన్నులకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస ఫ్లోర్‌ రేట్లను నిర్ణయించాలి. ఆస్తి పన్ను వసూళ్లలో ప్రగతిని చూపాలి. 
* ఒక రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోతే 2024, మార్చి తర్వాత స్థానిక సంస్థలకు ఎలాంటి గ్రాంట్లు విడుదల చేయకూడదు.

 

ప్రకృతి విపత్తుల నిర్వహణ గ్రాంట్లు: ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధులకు అయ్యే వ్యయాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర, రాష్ట్రాలు వాటాల రూపంలో నిధులను సమకూరుస్తాయి. 


కేంద్రం - రాష్ట్రాల మధ్య వ్యయాల పంపిణీ:
* ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90 : 10
* ఇతర రాష్ట్రాలకు 75 : 25.
రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధులకు రూ.1.6 లక్షల కోట్లు ఉండాలని నిర్ణయించింది. ఇందులో కేంద్రం వాటా రూ.1.2 లక్షల కోట్లుగా పేర్కొంది.


ఆర్థిక రోడ్‌ మ్యాప్‌ (Fiscal roadmap) 
కోశ లోటు, రుణ స్థాయి: కేంద్రప్రభుత్వం కోశలోటును 2021 - 22లో 6%, 2022 - 23లో 5.5%, 2023 - 24లో 5%, 2024 - 25లో 4.5%, 2025 - 26 నాటికి జీడీపీలో 4 శాతానికి తగ్గించాలి. 
* అన్ని రాష్ట్రాలు తమ కోశ లోటు పరిమితిని (జీఎస్‌డీపీ శాతాల్లో) 2021 - 22లో 4%, 2022 - 23లో 3.5%, 2023 - 26 మధ్య కాలంలో 3 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. 
* ఒక రాష్ట్రానికి మొదటి 4 సంవత్సరాలకు (2021 - 25) మంజూరైన రుణ పరిమితిని పూర్తిగా వినియోగించలేకపోతే, ఆ  రుణాన్ని తర్వాతి ఏడాదిలో ఉపయోగించుకోవచ్చు. 
* విద్యుత్తు రంగంలో సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలకు మొదటి నాలుగేళ్లు (2021 - 25) అదనంగా జీఎస్‌డీపీలో 0.5% రుణాన్ని సమీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సంస్కరణలు ప్రధానంగా 

1. నిర్వహణ వ్యయాలు తగ్గించడం.
2. రెవెన్యూ వ్యత్యాసాన్ని తగ్గించడం. 
3. సబ్సిడీ చెల్లింపుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ చేపట్టడం. 
4. రెవెన్యూలో టారిఫ్‌ సబ్సిడీ వాటా తగ్గించడం.
* తాము సిఫార్సు చేసిన కోశ లోటు మార్గసూచీ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణాలు తగ్గుతాయని ఆర్థిక సంఘం భావిస్తోంది. 2020 - 21లో జీడీపీలో 62.9%గా ఉన్న అప్పులు 2025 - 26 నాటికి 56.6%కి తగ్గుతాయని ఆర్థిక సంఘం పేర్కొంది. అన్ని రాష్ట్రాల మొత్తం రుణాలు జీడీపీలో 33.1% నుంచి 32.5 శాతానికి చేరతాయని తెలిపింది. 
* ఉన్నతస్థాయి అంతర మంత్రిత్వ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ద్రవ్య బాధ్యతా-బడ్జెట్‌ నిర్వహణ చట్టాన్ని (Fiscal Responsibility and Budget Management Act -FRBM) సమీక్షించాలని సిఫార్సు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నూతన FRBM ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని సూచించింది.


ఆదాయ సమీకరణ: ఆదాయం, ఆస్తి ఆధారిత పన్నులను బలోపేతం చేయాలి. వేతన ఉద్యోగుల ఆదాయపు పన్నుపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలి. దీనికోసం టీడీఎస్‌/టీసీఎస్‌ పన్ను మినహాయింపు, సేకరణకు చెందిన నిబంధనల కవరేజీని విస్తరించాలి. రాష్ట్ర స్థాయిలో పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడానికి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేయొచ్చు. ఇందుకోసం కంప్యూటరీకరించిన ఆస్తుల రికార్డులను, లావాదేవీల రిజిస్ట్రేషన్‌తో ఇంటిగ్రేట్‌ చేయాలి. ఆస్తుల మార్కెట్‌ విలువను కచ్చితంగా లెక్కించాలి. 


జీఎస్టీ: జీఎస్టీలో ఉన్న మధ్యంతర ఇన్‌పుట్, తుది అవుట్‌పుట్‌ల మధ్య విలోమ డ్యూటీ స్ట్రక్చర్‌ను పరిష్కరించాలి. జీఎస్టీ రేటు రెవెన్యూ తటస్థతను పునరుద్ధరించాలి. 12%, 18% రేట్లను విలీనం చేయడం ద్వారా రేటు నిర్మాణాన్ని హేతుబద్దీకరించాలి. జీఎస్టీ బేస్‌ను విస్తరించడానికి, సమ్మతిని ధ్రువీకరించడానికి రాష్ట్రాలు క్షేత్రస్థాయి ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. 


ఆర్థిక నిర్వహణ విధానాలు: 
* ప్రజల ఆర్థిక నిర్వహణ కోసం సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలి. 
* కేంద్రం, రాష్ట్రాల నుంచి రికార్డులను మదింపు చేసే అధికారాలతో ఒక స్వతంత్ర ఆర్థికమండలిని ఏర్పాటు చేయాలి. కౌన్సిల్‌కు కేవలం సలహా పాత్ర మాత్రమే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఖర్చుకు సంబంధించి ఆఫ్‌ బడ్జెట్‌ ఫైనాన్సింగ్‌ లేదా పారదర్శకం కాని ఫైనాన్సింగ్‌ మార్గాలను ఆశ్రయించకూడదు. 
* స్థూల ఆర్థిక, ఆర్థిక అంచనా కచ్చితత్వం, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి కేంద్రం, రాష్ట్రాలు కృషి చేయాలి. 
* కేంద్రం తన చట్టంలో తెచ్చిన రుణ నిర్వచనానికి అనుగుణంగా రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత చట్టాన్ని సవరించాలి. రాష్ట్రాలు స్వల్పకాలిక అప్పు కోసం రుణాలు, అడ్వాన్సులు, భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయం కాకుండా ఇతర మార్గాల నుంచి ఎక్కువగా తీసుకోవాలి.  రాష్ట్రాలు తమ రుణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఒక స్వతంత్ర రుణ నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేయొచ్చు.


ఇతర సిఫార్సులు
ఆరోగ్యం: 2022 నాటికి ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో 8% కంటే ఎక్కువగా కేటాయించాలి. అదే ఏడాది నాటికి మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయం 2/3 వంతు ఉండాలి. ఆరోగ్య రంగంలో ఉన్న కేంద్ర ప్రాయోజిక పథకాలు రాష్ట్రాలకు సౌలభ్యంగా ఉండాలి. అఖిల భారత వైద్య, ఆరోగ్య సేవలు ప్రారంభించాలని సిఫార్సు చేసింది.


రక్షణ, అంతర్గత భద్రత కోసం నిధులు:
రక్షణ, అంతర్గత భద్రతల బడ్జెట్‌ అవసరాలకు, వాస్తవ కేటాయింపులకు మధ్య  వ్యత్యాసాన్ని భర్తీ చేయాలని పేర్కొంది. దీనికోసం రక్షణ, అంతర్గత భద్రతా  ఆధునికీకరణ నిధిని (Modernisation Fund for Defence and Internal Security MFDIS) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* 2021 - 26 మధ్య ఉన్న 5 సంవత్సరాల కాలానికి రూ.2.4 లక్షల కోట్ల కార్పస్‌ను ఈ నిధి కలిగిఉంటుంది. ఇందులో రూ.1.5 లక్షల కోట్లు భారత సంఘటిత నిధి నుంచి బదిలీ అవుతాయి. మిగిలిన మొత్తం రక్షణ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూములను విక్రయించడం ద్వారా సమీకరించాలని సిఫార్సు చేసింది. 


కేంద్రప్రాయోజిత పథకాలు (CSS):
వీటికి కనీస వార్షిక కేటాయింపులను నిర్ణయించాలి. అంతకంటే తక్కువగా కేటాయించడాన్ని నిలిపివేయాలి. ఒక నిర్దిష్ట కాల పరిమితిలోపు CSSల థర్డ్‌పార్టీ మూల్యాంకనం పూర్తి చేయాలి. వీటికి కేంద్ర - రాష్ట్రాల నిధుల కేటాయింపు వాటాలను పారదర్శకంగా నిర్ణయించాలి. అవి స్థిరంగా ఉండాలి.


ఆంధ్రప్రదేశ్‌
14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 4.305 శాతం వాటాను సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 4.047 (-0.258%) శాతాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం తన మొదటి నివేదికలో 4.111 శాతాన్ని కేటాయించింది. 2021 - 26 మధ్య ఆంధ్రప్రదేశ్‌ రూ.10,900 కోట్లు నష్టపోనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2021 - 26 మధ్య రాష్ట్రానికి రూ. 2,34,013 కోట్లు వస్తాయి. వీటిలో 73% పన్నులు కాగా మిగిలినవి గ్రాంట్ల రూపంలో అందుతాయి. 


తెలంగాణ
* 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 2.43 శాతం వాటాను సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 2.102 (-0.328%) శాతాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం తన మొదటి నివేదికలో 2.133 శాతాన్ని కేటాయించింది. 202126 మధ్య తెలంగాణ రూ.9,621 కోట్లు నష్టపోనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 202 1- 26 మధ్య రాష్ట్రానికి రూ. 1,09,786 కోట్లు రానున్నాయి. వీటిలో 73% పన్నులు కాగా మిగిలినవి గ్రాంట్ల రూపంలో అందుతాయి.


15వ ఆర్థిక సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు అందనున్న వనరులు (రూ.కోట్లలో)

అంశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
పన్నుల్లో వాటా 1,70,976 88,806
రెవెన్యూ లోటు 30,497 0
స్థానిక సంస్థలు 18,063 13,111
ప్రకృతి వైపరీత్య నిర్వహణ 6,183 2,483
న్యాయ వ్యవస్థ 295 245
వైద్యం 877 624
PMGSY రహదారులు 344 255
గణాంకాలు 19 46
ఉన్నత విద్య 250 189
వ్యవసాయం 4,209 1,665
రాష్ట్రప్రత్యేకం 2,300 2,362
మొత్తం 2,34,013 1,09,786
Posted Date : 19-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

   భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు దాటింది. ఐఎంఎఫ్‌ నివేదిక - 2018 ప్రకారం నామినల్‌ జీడీపీలో ఆరో పెద్ద దేశంగా అవతరించింది. విదేశీ మూలధనంలోనూ ముందంజలో ఉంది. ఇంత అభివృద్ధి సాధించినా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తిస్తున్నారు. 

దేశాల వర్గీకరణ
    రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం పొందిన భారత్‌ లాంటి అనేక దేశాలు అభివృద్ధి కోసం ప్రణాళికలు ప్రారంభించిన నేపథ్యంలో పరిపాలకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ‘అభివృద్ధి’ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్ర]వ్యనిధి లాంటి సంస్థలు దేశాల ప్రగతికి సహాయం చేయడానికి వివిధ దేశాలను పోల్చుకునే అవసరం ఏర్పడింది. ఫలితంగా మొదట.. ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందిన, వెనుకబడిన దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేశారు. ఆ తర్వాత అభివృద్ధి కొనసాగిస్తున్న మూడో రకం దేశాలను అభివృద్ధి చెందుతున్న లేదా వర్ధమాన దేశాలుగా పేర్కొన్నారు. ఈ విభజన కోసం అనేక రకాల సూచికలను ఉపయోగించారు. 

ఆర్థికవ్యవస్థ నిర్మాణంలో మార్పులు
    ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా మూడు రంగాల (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ)పై ఆధారపడి ఉంటుందని మొదటిసారి అలెన్‌ ఫిషర్, కొలిన్‌ క్లార్క్, జీన్‌ ఫోర్‌స్టై అనే ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ఇదే విధానం ఇప్పటికీ అన్ని దేశాలలో అమల్లో ఉంది. వీరి ప్రతిపాదన ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయం, ఉపాధిలో ద్వితీయ, తృతీయ రంగాలు అధిక వాటాను కలిగి ఉంటాయి. దీనికి భిన్నంగా ప్రాథమిక లేదా వ్యవసాయ రంగం వెనుకబడిన దేశాల్లో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ సూచిక ఆధారంగా 1951 నాటికి మనదేశ జనాభాలో సుమారు 80% ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఈ రంగం నుంచే సగానికిపైగా ఆదాయం లభించేది కాబట్టి మన దేశాన్ని వెనుకబడిన దేశంగా పిలుస్తున్నారు. 
    2018 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పును పరిశీలిస్తే వ్యవసాయ రంగం శ్రామికుల్లో సగం మందికి ఉపాధి కల్పిస్తుంటే మన జాతీయాదాయంలో మాత్రం దాని వాటా గణనీయంగా తగ్గి 14.39%కి చేరింది. సేవల రంగం అతిపెద్ద రంగంగా మారి 54.15% ఆదాయాన్ని అందిస్తుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయేతర రంగాల వాటా పెరిగితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చు. కానీ మనదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే.  

తలసరి ఆదాయం
    ఐక్యరాజ్య సమితి నిపుణుల ప్రకారం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరప్‌ దేశాల వాస్తవ తలసరి ఆదాయం కంటే తక్కువ ఆదాయం కలిగినవన్నీ వెనుకబడిన దేశాలే. ప్రపంచ బ్యాంక్‌ కూడా తలసరి ఆదాయం (బిదీశి ్ప’౯ ‘్చ్పi్మ్చ) ప్రామాణికంగా 1978 నుంచి దేశాల వర్గీకరణను ప్రారంభించింది. ఆయా దేశాల ప్రజల సగటు ఆదాయమైన తలసరి ఆదాయం లెక్కింపులో శాస్త్రీయత, సారుప్యత లోపించి అనేక విమర్శలు రావడంతో ప్రపంచ బ్యాంక్‌ వెనుకబడిన, అభివృద్ధి చెందిన దేశాలు అనే పదాలను పక్కన పెట్టి దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది. 
1) అల్పాదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 995 డాలర్ల కంటే తక్కువ కలిగిన దేశాలు.
2) దిగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 996 నుంచి 3895 డాలర్ల మధ్య.
3) ఎగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 3896 నుంచి 12055 డాలర్ల మధ్య.
4) అధిక ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 12056 డాలర్ల కంటే ఎక్కువుగా ఉన్న దేశాలు. 
    ప్రపంచ బ్యాంక్‌ నివేదికల ప్రకారం 2001 తర్వాత వివిధ దేశాల అభివృద్ధి తీరుతెన్నుల్లో మార్పులు రావడం వల్ల క్రమంగా అల్పాదాయ దేశాల సంఖ్య తగ్గి అభివృద్ధి చెందుతున్న, అధిక ఆదాయ దేశాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం పది మందిలో ఒకరు మాత్రమే అల్పాదాయ దేశాల్లో జీవిస్తున్నారు. సుమారు 73 శాతం మంది ప్రజలు వర్ధమాన/మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు. 2017 నాటికి ప్రపంచ బ్యాంక్‌ అంచనా ప్రకారం భారత స్థూల జాతీయ తలసరి ఆదాయం (GNP per capita) 1,927  డాలర్లుగా ఉండటంతో మన దేశాన్ని దిగువ మధ్య ఆదాయ దేశంగా చెప్పవచ్చు.

అభివృద్ధి సామర్థ్యం
    జాకోబ్‌ వీనర్‌ లాంటి ఆర్థికవేత్తలు అభివృద్ధి సామర్థ్యం, అవకాశాల ఆధారంగా ఒక దేశ వెనుకబాటుతనాన్ని అంచనావేయడం సులభమని చెప్పారు. వీరి అభిప్రాయం ప్రకారం 1951లో ప్రణాళిక సంఘం ‘తక్కువ ఉపయోగించిన/అసలు ఉపయోగించని మానవ వనరులు, వినియోగించని సహజ వనరులను కలిగి ఉన్న దేశాన్ని వెనుకబడిన దేశం’గా నిర్వచించింది. అయితే ఇటీవల అనేక నూతన సూచికలు అందుబాటులోకి రావడంతో వివిధ దేశాల అభివృద్ధిలోని దశ దిశలను, నాణ్యతను వాటి ద్వారా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా మానవాభివృద్ధి సూచిక, లింగ సాధికారత సూచిక, బహుళ పేదరిక సూచిక, యూఎన్‌వో 17 అంశాల సుస్థిరాభివృద్ధి సూచికలను ఉపయోగిస్తున్నారు. గత 70 ఏళ్ల ప్రగతిలో భారత్, చైనా లాంటి దేశాలు అల్పాదాయ దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిణామం చెందాయి.

భారతదేశ ఆర్థికాభివృద్ధి లక్షణాలు
* మన దేశంలోని సుమారు 46 కోట్ల మంది శ్రామికుల్లో సగం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తూ తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. మనం ఈ రంగాల్లో ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం.
* 1951-1981 మధ్య 30 ఏళ్లపాటు జీడీపీ వృద్ధి రేటు 3.5% మాత్రమే ఉంది. 1981-2001 మధ్య 5.5%, 2001-2018 మధ్య సరాసరి 6.7% మాత్రమే సాధించగలిగాం. 
* జనాభా పెరగడం వల్ల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. పట్టణీకరణ, ఆధునికీకరణలో సేవలరంగం పాత్ర పెరుగుతుంది. 
* దేశంలో అక్షరాస్యత 2011 నాటికి 74%కి పెరిగినప్పటికీ విద్యలో నాణ్యత లోపించింది. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (GER) అమెరికా లాంటి దేశాల్లో 80% పైగా ఉండగా మన దేశంలో 25% మాత్రమే ఉంది. 
* ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ నిరుద్యోగిత రేటు అధికంగా ఉంది. కేవలం 3% విద్యార్థులు మాత్రమే వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాల్లో ఇది 50%పైగా ఉంది.

* విస్తారమైన అడవులు, ఖనిజాలు, నదులు, సముద్ర తీరప్రాంతం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ మన దేశంలో 60% సాగు రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది.
* భారత్‌ లాంటి దేశాల్లో మూలధన కల్పన తక్కువగా ఉండటం వల్ల అల్ప వృద్ధి రేటు, సహజవనరుల వినియోగం తక్కువగా ఉంటుంది. 1950-51లో దేశ జీడీపీలో పొదుపు 8.9% ఉండగా ఇటీవల 30%కి చేరింది. అయితే ఆ సమయంలో మూలధన నిష్పత్తి ఎక్కువగా ఉంది. మన దేశంలో 2012-13 నుంచి 2016-17 మధ్య 6.3 - 4.0 శాతానికి తగ్గింది. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల నాణ్యత పెరిగేకొద్దీ మూలధన నిష్పత్తి తగ్గుతుంది. అమెరికా, జపాన్‌ దేశాల్లో ఈ నిష్పత్తి ఇంకా తక్కువగా ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తున్నారు. 
* రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12 నాటికి భారత్‌లో 29.5% మంది పేదరిక గీత కింద ఉన్నారు అంటే పది మందిలో ముగ్గురు పేదవారే. 
* గ్రామాల్లో ప్రచ్చన్న నిరుద్యోగం ఉండగా పట్టణాల్లో చదువుకున్న యువతలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం 2014-2019 కాలానికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు 3.6%గా ఉంది. గతంలో కంటే నిరుద్యోగిత రేటు పెరగడం గమనార్హం.

* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్వంద్వ ఆర్థిక లక్షణాలు ఎక్కువ. పరస్పర విరుద్ధమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, డిమాండు స్థాయులు దేశంలో కనిపిస్తాయి. 
    ఉదా: భారీయంత్రాలు వాడే పరిశ్రమలు - మానవ శ్రమతో కూడిన కుటీర పరిశ్రమలు.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార లోటు సహజంగా ఉంటుంది. ఈ దేశాల్లో అవసరాలు ఎక్కువ. మన దేశం ప్రధానంగా ఆయిల్, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలు, బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ మనం వ్యవసాయ, వస్త్ర, ముడి ఖనిజాల ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల కంటే ఎగుమతుల విలువ తక్కువగా ఉండటం వల్ల విదేశీ వ్యాపారఖాతాలో లోటు ఉంటుంది. మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో మన దేశం మధ్య స్థాయి పనితీరును కనబరుస్తుంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వాభివృద్ధిలో భార‌త‌దేశం   

       ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం మానవాభివృద్ధి. యూఎన్‌డీపీ 1990 నుంచి మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా పేదల సాధికారత, సుస్థిర అభివృద్ధికి అనేక ప్రయత్నాలు జరిగాయి. భారతదేశం కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్‌ శాస్త్రవేత్త మహబూబ్‌ ఉల్‌హక్‌ సమగ్రమైన అభివృద్ధికి కొలమానంగా మానవాభివృద్ధిని సూచించారు. మన దేశ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ మానవాభివృద్ధి సూచికను సమర్థించి అభివృద్ధి పరిచారు.
                     మొదటి మానవాభివృద్ధి నివేదిక (Human development report)లో  తొలిమాటగా హక్‌ ‘ప్రజలే ఒక దేశానికి నిజమైన సంపద’ అని పేర్కొన్నారు. ప్రజలు సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడమే పాలన ప్రథమ ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. మానవాభివృద్ధి మనుషుల సుసంపన్న మనుగడను కోరుకుంటుంది. ఇది ప్రజల ఎదుగుదలకు అవకాశాలు కల్పించి వాటి ఎంపికలో తగిన స్వేచ్ఛను అందిస్తుంది. మానవాభివృద్ధి సూచిక అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ పాలకుల ఆలోచన, ప్రాధాన్యాల అమలుతీరులో మార్పు మొదలైంది. ప్రపంచ దేశాలను పరిశీలించి వాటికి ర్యాంకులు ప్రకటించడం వల్ల దేశాల మధ్య పోటీ ఏర్పడింది.   
* ప్రస్తుతం యూఎన్‌డీపీ మూడు అంశాల ఆధారంగా ప్రపంచ మానవాభివృద్ధి సూచికను లెక్కిస్తుంది.
    1) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక 
    2) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు + చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు) 
    3) GNP per capita (ppp US $)

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం   
    1990 నుంచి ఇప్పటి వరకు యూఎన్‌డీపీ ఏటా మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్‌లో 1965, నవంబరు 22న ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలందించే స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తుంది. దాదాపు 180 దేశాల ప్రభుత్వాలతో కలిసి స్థానిక అభివృద్ధి సమస్యల గురించి అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వాల సామర్థ్యాలను పెంచి పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ప్రపంచ మానవాభివృద్ధి నివేదికతో పాటు స్థానిక, ప్రాంతీయ, జాతీయ నివేదికలను తయారుచేసి అందజేస్తుంది.

మన దేశ ప్రయత్నాలు 
    యూఎన్‌డీపీ భారతదేశంలో మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 42 ప్రాజెక్టులు అమలు చేస్తూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వామిగా ఉంది. వీటిలో శక్తి, పర్యావరణం (25); పేదరిక నిర్మూలన (9), ప్రజాస్వామ్య పాలన (7), ప్రకృతి వైపరీత్యాలకు (1) సంబంధించిన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో అయిదు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రభుత్వాలు 1947 నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల ఆదాయవృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. 

భారతదేశ ప్రగతి
    ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 189 దేశాలను పరిశీలించి ఆయా దేశాల ప్రగతి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుంది. 2018 నివేదిక ప్రకారం నార్వే మొదటి స్థానం, నైజర్‌ 189వ స్థానంలో ఉన్నాయి. భారత్‌ 2017లో 131వ స్థానంలో ఉండగా 2018లో 130వ స్థానాన్ని పొందింది. 1990 నాటి మొదటి నివేదిక ప్రకారం భారత్‌ 114వ స్థానంలో ఉంది. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచిక విలువను 0  1 మధ్య లెక్కించి ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది.  

1) అత్యధిక మానవాభివృద్ధి దేశాలు: 0.80  - 1
    నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా  

2) అధిక మానవాభివృద్ధి దేశాలు: 0.7  - 0.8
    చైనా, బ్రెజిల్, ఇరాన్, మెక్సికో, థాయ్‌లాండ్, శ్రీలంక  

3) మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాలు: 0.55  - 0.7 
    బంగ్లాదేశ్, ఇండియా, భూటాన్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా  

4) తక్కువ మానవాభివృద్ధి దేశాలు: 0.55 కంటే తక్కువ
    అఫ్గానిస్థాన్, బురుండి, నైజీరియా, టాంజానియా, ఉగాండా  
    1990లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక విలువ 0.427 నుంచి 2000 సంవత్సరం నాటికి 0.493 కు పెరిగింది. అంటే తక్కువ మానవాభివృద్ధి దేశంగా దాదాపు దశాబ్ద కాలం కొనసాగింది. ఈ విలువ 2012లో 0.600 కు, 2018లో 0.640 కు వృద్ధి చెంది మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాల జాబితాలో చేరింది. చైనా, శ్రీలంక మినహా ఇతర పొరుగు దేశాలు ర్యాంకుల్లో తేడా ఉన్నప్పటికీ మధ్య స్థాయి జాబితాలోనే ఉన్నాయి. 1990 నుంచి మన దేశ సూచిక విలువ దాదాపు 50% పెరగడాన్ని పేదరికంపై విజయంగా పేర్కొనవచ్చు. 1990  2017 మధ్య మన దేశ తలసరి ఆదాయంలో అత్యధికంగా 266.6% వృద్ధి నమోదైంది. 1990 కంటే ప్రస్తుత సగటు జీవనకాలం 11 సంవత్సరాలు, సగటు పాఠశాలలో గడిపే కాలం 4.7 సంవత్సరాలు పెరిగింది. 
    మానవాభివృద్ధి సూచిక ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం అన్నింట్లో వెనుకబడి ఉంది. ఆర్థిక అసమానతలు అధికమవడం వల్ల 26.8% మానవాభివృద్ధిని కోల్పోయాం. శ్రామిక మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం కేవలం 27.2% ఉండగా పురుషులది 78.8%. అంటే లింగ సమానత్వంలో మన దేశం ఇంకా వెనుకబడి ఉంది. విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యత లోపించింది. మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఉన్నాయి. కేరళ అగ్రస్థానంలో, బిహార్‌ చివరి స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 27వ స్థానంలో ఉండి మధ్య స్థాయి మానవాభివృద్ధి రాష్ట్రంగా కొనసాగుతుంది. 

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వాభివృద్ధిలో భార‌త‌దేశం   

మాదిరి ప్రశ్నలు


1.  ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?
    1) 130     2) 131     3) 136     4) 140

2. మానవాభివృద్ధి సూచీలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
    1) బిహార్‌     2) కేరళ     3) తమిళనాడు     4) ఆంధ్రప్రదేశ్‌

3. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థానంలో ఉంది?
    1) 27     2) 28     3) 29     4) 30

4. యూఎన్‌డీపీ ప్రపంచ మానవాభివృద్ధి సూచికను ఏ అంశాల ఆధారంగా లెక్కిస్తుంది?
    ఎ) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక
    బి) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు ్ఘ చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు)
    సి) GNP per capita (ppp US $)
    1) ఎ, బి      2) బి, సి     3) సి, ఎ     4) అన్నీ 

5. యూఎన్‌డీపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (దీన్ని 1965 నవంబరు 22న స్థాపించారు)
   1) న్యూయార్క్‌     2) పారిస్‌     3) జెనీవా     4) దిహేగ్

జ‌వాబులు : 1-1, 2-2, 3-1, 4-4, 5-1

 

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భార‌త ఆర్థికవ్య‌వ‌స్థ ల‌క్ష‌ణాలు   

మాదిరి ప్రశ్నలు

1. 2018 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో భారతదేశ స్థానం?
    1) 3         2) 2         3) 4         4) 6                                            

2. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే?
    1) వెనుకబడిన దేశం         2) అభివృద్ధి చెందిన దేశం
    3) వర్ధమాన దేశం        4) అభివృద్ధి తిరోగమన దేశం       

3. ప్రపంచ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్‌ ఉపయోగించిన ప్రమాణం?
    1) GNP per capita     2) GDP per capita 
    3) NNP per capita     4) GAV per capita 

4. కిందివాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల్లో సరికానిది?
    ఎ) తక్కువ తలసరి ఆదాయం      బి) తక్కువ పారిశ్రామికాభివృద్ధి
    సి) తక్కువ పొదుపు          డి) తక్కువ ఎగుమతులు
    1) ఎ, బి      2) ఎ, సి      3) సి, డి      4) అన్నీ               

5. రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12 నాటికి భారత్‌లో ఎంత శాతం మంది పేదరిక గీత కింద జీవిస్తున్నారు?
    1) 29.5%    2) 27.5%     3) 30.5%    4) 39.5%

6. మన దేశంలో..... 
    1) జనసంఖ్య, మానవ వనరులు ఎక్కువ
    2) జనసంఖ్య, మానవ వనరులు తక్కువ
    3) జనసంఖ్య ఎక్కువ, మానవ వనరులు తక్కువ
    4) జనసంఖ్య తక్కువ, మానవ వనరులు ఎక్కువ

7. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార లోటుకు కారణం?
    1) ఎగుమతులు లేకపోవడం            2) ఎగుమతులు చేయకపోవడం
    3) ఎగుమతుల్లో నాణ్యత లోపించడం  4) ఎగుమతులు తక్కువగా ఉండటం

సమాధానాలు: 1 - 4; 2 - 3; 3 - 1; 4 - 4; 5 - 1; 6 - 3; 7 - 4.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయాదాయం

ఒక దేశంలో సంవత్సరం కాలంలో తయారైన మొత్తం వస్తుసేవల అంతిమ నికర విలువనే జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక కార్యకలాపాల వల్ల వస్తుసేవల ఉత్పత్తి పెరిగితే దేశ ఆదాయం పెరుగుతుంది. అంటే ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయానికి సంబంధం ఉంటుంది.

జాతీయాదాయ భావనలు

స్థూల దేశీయోత్పత్తి (GDP): ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే మొత్తం వస్తుసేవల విలువను స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఈ భావనలో పరిగణించే వస్తుసేవలను అంతిమ వస్తుసేవలుగా భావించాలి. జాతీయాదాయ అంచనాల్లో అంతిమ వస్తువులనే లెక్కిస్తారు. అంతిమ ఉత్పత్తిలో నాలుగు అంశాలు ఉంటాయి. 

    1) వినియోగం 2) పెట్టుబడి 3) ప్రభుత్వ కొనుగోళ్లు 4) నికర లాభాలు (ఎగుమతులు - దిగుమతులు)

నికర జాతీయోత్పత్తి (NNP): వస్తుసేవల ఉత్పత్తిలో యంత్ర పరికరాల ఉపయోగం వల్ల అరుగుదల, తరుగుదల ఉంటాయి. మొత్తం ఉత్పత్తిలో అరుగుదల, తరుగుదలను మినహాయిస్తే నికర జాతీయోత్పత్తి తెలుస్తుంది.

    నికర జాతీయోత్పత్తి  = స్థూల జాతీయోత్పత్తి - తరుగుదల 

జాతీయాదాయం (National Income): భూమి, శ్రామికులు, మూలధనం లాంటి ఉత్పత్తి కారకాలు సంపాదించిన ఆదాయాల మొత్తాన్ని జాతీయాదాయంగా చెప్పవచ్చు. నికర జాతీయోత్పత్తిలో పరోక్ష వ్యాపార పన్నులను (ఆస్తిపన్ను, అమ్మకం పన్ను) మినహాయిస్తే జాతీయాదాయం వస్తుంది.

    జాతీయాదాయం = నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు

వైయక్తిక/వ్యక్తిగత ఆదాయం (Personal Income): ఒక కుటుంబానికి వివిధ మార్గాల నుంచి లభించే మొత్తం ఆదాయాన్ని వైయక్తిక ఆదాయం అంటారు.

వ్యయార్హ ఆదాయం (Disposable Income): వైయక్తిక ఆదాయంలో వ్యక్తిగత పన్నులను మినహాయిస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యక్తి వినియోగానికి, పొదుపు చేయడానికి ఉపయోగపడే ఆదాయం వ్యయార్హ ఆదాయం.

కలపబడిన స్థూల విలువ (Gross Value Added): ఉత్పత్తి చేసిన అన్ని వస్తుసేవల స్థూల విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకాల విలువను తీసివేస్తే కలపబడిన స్థూల విలువ తెలుస్తుంది. దీన్నే జాతీయ ఉత్పత్తిగా పేర్కొంటారు.

కలపబడిన నికర విలువ (Net Value Added): కలపబడిన స్థూల విలువ నుంచి స్థిర మూలధన వినియోగ విలువ తీసివేస్తే కలపబడిన నికర విలువ తెలుస్తుంది.

తలసరి ఆదాయం లేదా తలసరి స్థూల జాతీయోత్పత్తి (PCI): సగటున ఒక వ్యక్తి పొందే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయాదాయాన్ని మొత్తం దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది

జాతీయాదాయ అంచనాలు

    స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో జాతీయాదాయాన్ని మొదటిసారి గణించినవారు దాదాభాయ్‌ నౌరోజీ.  ఈయన పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. సంపద దోపిడి (డ్రైన్‌ థియరీ) సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన 1868 సంవత్సరానికి సంబంధించిన జాతీయాదాయ అంచనాలు తయారుచేశారు. ఆ తర్వాత లెక్కించినవారు విలియం డిగ్బీ (1899), ఎఫ్‌.షిర్రాస్‌ (1911, 1922, 1931), షా (1921), కాంబట్టా (1925 - 29), ఆర్‌.సి.దేశాయ్‌ (1931 - 40).

    స్వాతంత్య్రానికి ముందు దేశంలో శాస్త్రీయ లేదా ఒక క్రమ పద్ధతిలో తొలిసారిగా జాతీయాదాయాన్ని 1931 - 32లో డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు (విజయేంద్ర కస్తూరిరంగా వరదరాజారావు) అంచనా వేశారు. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం 1949లో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి, దత్తాంశాల సేకరణకు ఒక సమగ్రమైన పద్ధతిని రూపొందించడానికి జాతీయాదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి పి.సి.మహలనోబిస్‌ అధ్యక్షత వహించగా డి.ఆర్‌.గాడ్గిల్, వి.కె.ఆర్‌.వి.రావు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 1948 - 49 నుంచి 1950 - 51 వరకు జాతీయాదాయానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ తన మొదటి నివేదికను 1954 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది.

జాతీయాదాయ అంచనా - సంస్థల ఏర్పాటు

    జాతీయాదాయాన్ని అంచనావేయడానికి 1951లో కేంద్ర గణాంక సంస్థను (Central Statistical Organisation) ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 1954 నుంచి 2019 వరకు సీఎస్‌వో జాతీయాదాయాన్ని అంచనావేసింది. జాతీయ నమూనా సర్వేక్షణ సంస్థ (National Sample Survey Organisation) ను 1950లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 2019లో ఎన్‌ఎస్‌ఎస్‌వో, సీఎస్‌వోలను విలీనం చేసి ‘జాతీయ గణాంక సంస్థ’ (National Statistical Office) గా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థ 2019 నుంచి మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది.

    జాతీయ గణాంక సంస్థ (NSO) వివిధ ఆధార సంవత్సరాల ప్రాతిపదికన జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది. 

    1) 1948 - 49

    2) 1960 - 61

    3) 1970 - 71

    4) 1980 - 81

    5) 1993 - 94

    6) 1999 - 2000

    7) 2004 - 05

    8) 2011 - 12 (ప్రస్తుతం)

    ప్రస్తుతం మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనావేయడానికి తీసుకుంటున్న ప్రాతిపదిక/ఆధార సంవత్సరం 2011 - 12 (8వది). 2011 - 12 ప్రాతిపదిక సంవత్సరాన్ని 2017 - 18 ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవాలని ప్రతిపాదన చేస్తున్నారు.

జాతీయాదాయ అంచనా - రంగాల విభజన

    ఎన్‌ఎస్‌వో ప్రస్తుత లేదా మార్కెట్ ధ‌ర‌లు, నిల‌క‌డ ధ‌ర‌ల్లో జాతీయాదాయాన్ని అంచనావేస్తుంది. జాతీయాదాయాన్ని అంచనావేయడానికి ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల విభజనను కింది విధంగా ఉపయోగిస్తుంది. 

1) ప్రాథమిక రంగం: వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు; అడవులు, చేపల పెంపకం, గనులు.

2) ద్వితీయ రంగం: వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం. 

3) తృతీయ రంగం/సేవా రంగం: బ్యాంకులు, బీమా, రవాణా, కమ్యూనికేషన్స్, వ్యాపారం, వర్తకం. 

జాతీయాదాయాన్ని కొలిచే పద్ధతులు

    జాతీయ గణాంక సంస్థ జాతీయాదాయాన్ని అంచనావేయడానికి కింది పద్ధతులను ఉపయోగిస్తుంది.  

1)     ఉత్పత్తి మదింపు పద్ధతి: దీన్ని ఇన్వెంటరీ పద్ధతి, వాల్యు యాడెడ్‌ మెథడ్‌ అంటారు. ఒక దేశంలోని వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తుసేవల ద్రవ్య విలువను జాతీయాదాయంగా చెప్పవచ్చు.

2)     ఆదాయ మదింపు పద్ధతి: ఇందులో ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఉత్పత్తి కారకాలు పొందే మొత్తం ఆదాయాలను కలపడం ద్వారా దేశ జాతీయాదాయాన్ని నిర్ణయిస్తారు. 

3)     వ్యయాల మదింపు పద్ధతి: ఇందులో అంతిమ వస్తుసేవలపై ఖర్చు చేసిన మొత్తాలను కలపడం ద్వారా జాతీయాదాయాన్ని లెక్కిస్తారు.

*  ముఖ్యంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతులను ఉపయోగించి జాతీయాదాయాన్ని అంచనావేస్తుంది. 

జాతీయదాయ అంచనాల వల్ల ఉపయోగాలు

*  ఆర్థిక వ్యవస్థ మొత్తం పనితీరును విశ్లేషిస్తుంది.

స్థూల జాతీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలు, వాటి ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.

*   దేశ ఆర్థిక ప్రగతిని తెలుసుకోవచ్చు.

*   పన్నుల విధానంలోని మార్పులు తెలుసుకోవచ్చు

*   ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు.

*   దేశంలోని వినియోగం, పొదుపు స్థాయిని తెలుసుకోవచ్చు. 

*    2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2021 నాటికి  జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా 18.8%, పరిశ్రమల రంగం వాటా 28.2%, సేవారంగం వాటా 53 శాతంగా ఉంది. దీనిలో సేవారంగం వాటా ఎక్కువగా, వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉంది. 

*    2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయాదాయం రూ.2,30,38,772 కోట్లు కాగా స్థిర ధరల్లో రూ.1,46,40,445 కోట్లుగా ఉంది. 

*    ప్రస్తుత ధరల్లో నికర జాతీయాదాయం రూ.2,05,73,371 కోట్లు ఉండగా స్థిర ధరల్లో రూ.1,28,61,032 కోట్లుగా ఉంది. 

*     ప్రస్తుత ధరల్లో తలసరి నికర జాతీయాదాయం రూ.15,03,326 ఉండగా స్థిర ధరల్లో రూ.93,973గా ఉంది. 


    రచయిత: బండారి ధనుంజయ

మరింత సమాచారం ... మీ కోసం!

ఆర్థిక సంఘం

వస్తు సేవల పన్ను

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

ఆర్థిక వృద్ధి - సూచికలు

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

* సెక్యూరిటీ కాంట్రాక్టుల (క్రమబద్ధ) చట్టం - 1956 ప్రకారం ‘సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘాన్ని ‘స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌’ (Stock Exchange) అంటారు. నమోదైన లేదా నమోదు కాని వ్యక్తులు ఈ సంఘంలో ఉంటారు.
* వ్యవస్థీకృత మూలధన మార్కెట్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ముఖ్యమైన భాగం. ఇందులో పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీల క్రయవిక్రయాలు జరుగుతాయి. దీన్నే స్టాక్‌ మార్కెట్‌ అని కూడా పిలుస్తారు. దేశంలోని ఆర్థిక వాతావరణానికి దీన్ని భారమితిగా పేర్కొంటారు.
* కంపెనీల చట్టం ప్రకారం కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అధికారిక జాబితాల్లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో చేర్చిన సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పరిధిలో జరుగుతాయి. జాబితాలో చేర్చని సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లను మధ్యవర్తులు (బ్రోకర్లు) ఎక్స్ఛేంజ్‌ వెలుపల నిర్వహిస్తారు. ప్రభుత్వ సెక్యూరిటీలకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి పొందిన ప్రభుత్వ బ్రోకర్లు ఉంటారు.
* స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో చేర్చిన సెక్యూరిటీలకు మార్కెట్‌లో న్యాయబద్ధమైన ధర లభిస్తుంది. పన్నుల విధింపులోనూ కొన్ని రాయితీలు లభిస్తాయి. ఈ సెక్యూరిటీలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. పరపతిని సులభంగా పొందొచ్చు. వాటాల బదిలీ కూడా తేలిగ్గా జరుగుతుంది. ఇలాంటి సెక్యూరిటీలు ఉన్న కంపెనీలకు మార్కెట్‌లో గౌరవం, నమ్మకం ఎక్కువగా ఉంటాయి.  

 

షేర్‌/ వాటా: షేర్‌ అంటే వాటా లేదా భాగం అని అర్థం. ఏదైనా కంపెనీ షేర్‌ను కొంటే అందులో మనకు భాగం ఉందని అర్థం. వ్యాపార విస్తరణకు, వస్తూత్పత్తికి, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలకు అవసరమయ్యే డబ్బును సమకూర్చుకునేందుకు కంపెనీలు వాటాలు లేదా షేర్లను విక్రయిస్తాయి. క్రయ, విక్రయాలు: ఒక కంపెనీకి మెరుగైన లాభాలు వస్తే, దాని షేర్లు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. నష్టాలు వస్తే అప్పటికే కొన్నవారు వాటిని విక్రయించాలనుకుంటారు. ఈ క్రయ, విక్రయాలను స్టాక్‌ మార్కెట్‌లో జరుపుతారు. ఇక్కడ వాటాలు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతాయి. అందుకే వీటిని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు అంటారు.


మార్కెట్‌ క్రాష్‌: షేర్ల ధరలు ఉన్నట్లుండి పడిపోతే దాన్ని మార్కెట్‌ క్రాష్‌ అంటారు.
ఉదా: 1992లో హర్షద్‌ మెహతా చేసిన సెక్యూరిటీస్‌ కుంభకోణం వల్ల షేర్‌ మార్కెట్‌  క్రాష్‌కు గురైంది. కేతన్‌ పరేఖ్‌ సెక్యూరిటీల విలువను కృత్రిమంగా సృష్టించాడు. దీంతో 2001లో మార్కెట్‌ మరోసారి పతనమైంది.


మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌: మొత్తం షేర్ల సంఖ్యను మార్కెట్‌ విలువతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అంటారు. దీని ఆధారంగానే కంపెనీల షేర్ల పరిస్థితి తెలుస్తుంది.


లిస్టెడ్‌ సెక్యూరిటీలు: వివిధ కంపెనీలు తమ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్, లిస్ట్‌ చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంటాయి. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సంవత్సరానికి కొంత మొత్తం ఫీజు చెల్లించాలి. ఇలా చేసే కంపెనీల షేర్లను లిస్టెడ్‌ సెక్యూరిటీస్‌ అంటారు.


పర్మిటెడ్‌ సెక్యూరిటీలు: కొన్ని సందర్భాల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి. ఈ మేరకు వాటి షేర్లను ట్రేడింగ్‌ చేయడానికి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బ్రోకర్లకు అనుమతి ఇస్తుంది. వీటిని పర్మిటెడ్‌ సెక్యూరిటీలు అంటారు.


స్పెసిఫైౖడ్‌ లేదా ‘ఎ’ గ్రూప్‌ షేర్లు: ఎక్కువ మంది షేర్‌ హోల్డర్లు అధిక పెట్టుబడి పెట్టిన పెద్ద కంపెనీల షేర్లను స్పెసిఫైడ్‌ షేర్లు లేదా ఎ గ్రూప్‌ షేర్లు అంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ విషయంలో  బ్రోకర్లకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది.


నాన్‌ స్పెసిఫైడ్‌ లేదా ‘బి’ గ్రూప్‌ షేర్లు: తక్కువ మంది షేర్‌ హోల్డర్లు, తక్కువ పెట్టుబడి కలిగి, అంతగా ప్రాముఖ్యత లేని, కొంత మేరకు మాత్రమే పరిమితమయ్యే కంపెనీల షేర్లను నాన్‌ స్పెసిఫైడ్‌ షేర్లు లేదా ‘బి’ గ్రూప్‌ షేర్లు అంటారు.


కెర్బ్‌ ట్రేడింగ్‌: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు పనిచేసేందుకు పరిమిత పని గంటలు ఉంటాయి. ఈ సమయంలోనే ట్రేడింగ్‌ జరగాలి. ఈ ట్రేడింగ్‌ అంతా నమోదవుతుంది. పని గంటలు అయ్యాక కూడా స్టాక్‌ బ్రోకర్లు కొంతసేపు షేర్లకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లను అనధికారికంగా కొనసాగిస్తారు. దీన్నే ‘కెర్బ్‌ ట్రేడింగ్‌’ అంటారు.


బుల్స్‌: షేర్‌ మార్కెట్‌లో వ్యాపారం చేసే వాళ్లలో బుల్స్‌ అనేది ఒక కేటగిరి. దేశ ఆర్థిక పరిస్థితి, కంపెనీల ఫలితాలు, డివిడెండ్లు, బోనస్‌లు, వివిధ కంపెనీల విస్తరణ, బడ్జెట్‌ లాంటి విషయాల కారణంగా మార్కెట్‌లో మార్పులు సంభవిస్తాయి. వీటి వల్ల వివిధ కంపెనీల షేర్ల ధరలు పెరుగుతాయని భావించి భవిష్యత్తులో లాభాలు స్వీకరించవచ్చనే ఉద్దేశంతో ట్రేడింగ్‌ చేసే వారిని బుల్స్‌ అంటారు. వీరు ఆశావాదులు. రానున్న కాలంలో ధరలు పెరుగుతాయని ఊహించి, ప్రస్తుత రేట్ల వద్ద సెక్యూరిటీలు కొని, విలువ పెరిగాక షేర్లను విక్రయిస్తారు.


బేర్‌లు: భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి, సెక్యూరిటీలను అమ్మేవారిని బేర్‌లు అంటారు. వీరు నిరాశావాదులు.


స్టాగ్‌లు: వీరు బుల్స్‌లాగానే భవిష్యత్తులో సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఊహిస్తారు. కొత్త కంపెనీ జారీ చేసిన సెక్యూరిటీలకు ఎక్కువ దరఖాస్తు రుసుం చెల్లించి, పెద్ద మొత్తంలో వాటికోసం నమోదు చేసుకునే వారే స్టాగ్‌లు. వీరి చర్యల వల్ల సెక్యూరిటీలకు కృత్రిమ డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరుగుతాయి. కానీ వీటి ధరలు త్వరలోనే తగ్గిపోతాయి.


లేమ్‌డక్‌లు: వీరి దగ్గర సెక్యూరిటీలు లేనప్పటికీ అమ్మడానికి కాంట్రాక్టులు రాసి, వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలు కొనడానికి అన్వేషిస్తుంటారు.


ఫండమెంటల్‌ ఎనాలసిస్‌: ఒక కంపెనీ పనితీరు, ఆర్థిక పరిస్థితి, లాభాలు, విస్తరణ, వాటాలు, డిబెంచర్లు లాంటి విషయాలకు సంబంధించిన విశ్లేషణను ఫండమెంటల్‌ ఎనాలసిస్‌ అంటారు. ఇందులో వివిధ పన్నులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు లాంటి అంశాలను విశ్లేషిస్తారు.


టెక్నికల్‌ ఎనాలసిస్‌: స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ జరుగుతున్న పలు కంపెనీల షేర్ల లభ్యత ఆధారంగా ఈ ఎనాలసిస్‌ ఉంటుంది. కంపెనీ షేర్ల డిమాండ్, సప్లయ్‌ అంశాల ఆధారంగా జరిగే ట్రేడింగ్‌ను ఇది విశ్లేషిస్తుంది. వివిధ కంపెనీల షేర్ల విలువలను వాటి కదలికలను గ్రాఫ్‌ల రూపంలో వివరిస్తుంది.


బుక్‌: ఇది నిర్దిష్ట షేర్లకు సంబంధించిన కొనుగోలు, విక్రయ ఆర్డర్ల పెండింగ్‌ జాబితాను నిర్వహించే ఎలక్ట్రానిక్‌ రికార్డు. ఇందులో ఏ షేర్ల కొనుగోళ్లకు బిడ్‌లు, విక్రయానికి ఆఫర్లు వచ్చాయనే వివరాలుంటాయి.


బుక్‌ వాల్యూ: ఒక కంపెనీ మూలధనాన్ని, రిజర్వ్‌ నిధులను అది జారీచేసిన వాటాలతో భాగిస్తే వచ్చేదాన్ని బుక్‌ వాల్యూ అంటారు. ఇది షేర్‌ అసలు ధరను ప్రతిబింబిస్తుంది.


రైట్స్‌ ఇష్యూ: వివిధ కంపెనీలు విస్తరణ, తదితర కారణాలతో మూలధనాన్ని తిరిగి వాటాదారుల వద్ద నుంచి సేకరించాలని నిర్ణయిస్తాయి. దీనికి ప్రతిఫలంగా వాటాదారులకు మరికొన్ని వాటాలను కేటాయిస్తారు. సాధారణంగా వాటాదారులకు రైట్స్‌ ఇష్యూ ద్వారా మార్కెట్‌ ధర కంటే తక్కువకు షేర్లు లభ్యమవుతాయి.


బోనస్‌ ఇష్యూ: గణనీయంగా లాభాలు సంపాదించేవి, రిజర్వులు అధికంగా ఉన్న కంపెనీలు తమ వాటాదారులకు రిజర్వుల నుంచి ఉచితంగా కొన్ని షేర్లను కేటాయిస్తాయి. ఈ విధంగా అవి వాటాదారుల నుంచి ఎలాంటి సొమ్ము వసూలు చేయకుండా వాటాలు కేటాయించడాన్ని బోనస్‌ షేర్లు లేదా బోనస్‌ ఇష్యూ ప్రకటించడం అంటారు.


ప్రాథమిక షేర్‌ మార్కెట్‌
ఒక కంపెనీ మూలధనం కోసం ప్రజల నుంచి వాటాల రూపంలో డబ్బును సేకరించే ప్రక్రియను షేర్‌ మార్కెట్‌లో ప్రాథమిక మార్కెట్‌గా వ్యవహరిస్తారు. ఇలా పెట్టుబడి సమీకరణకు కంపెనీలు జారీచేసే షేర్ల ప్రక్రియను పబ్లిక్‌ ఇష్యూ అని కూడా అంటారు. పబ్లిక్‌ ఇష్యూ జారీచేసే సమయంలో కంపెనీ ఉత్పత్తులు, ప్రమోటర్ల వివరాలు, ఉత్పత్తి ప్రారంభమయ్యే కాలం, సేకరిస్తున్న మూలధన వివరాలు లాంటి విషయాలను కంపెనీలు వివరంగా ప్రకటించాలి. సాధారణంగా ప్రాథమిక షేర్‌ మార్కెట్‌లో పొదుపు చేయడం శ్రేయస్కరమని పెట్టుబడిదారులు భావిస్తారు.


ద్వితీయ షేర్‌ మార్కెట్‌ 
పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ పూర్తి చేసిన కంపెనీల షేర్లు మార్కెట్‌లో ట్రేడ్‌ అవుతాయి. ఈ విధమైన షేర్లను కొనడం లేదా అమ్మడాన్ని ద్వితీయ మార్కెట్‌ (సెకండరీ షేర్‌ మార్కెట్‌) విధానంగా పేర్కొంటారు. వివిధ కంపెనీలు ప్రకటించే లాభాలు, బోనస్‌లు, డివిడెండ్‌లు, రైట్స్‌ లాంటి అనేక విషయాల ప్రాతిపదికన ద్వితీయ మార్కెట్‌లో షేర్లను కొంటారు. ఈ షేర్ల కొనుగోలుకు  మార్కెట్‌లో ఉన్న రేటును చెల్లించాలి.


ప్రాఫిట్‌ ఈక్విటీ రేషియో
వివిధ కంపెనీల షేర్ల విలువకు, ఆ కంపెనీ షేర్ల మీద వచ్చే రాబడికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రాఫిట్‌ ఈక్విటీ రేషియో అంటారు. ఒక షేర్‌ను ఎన్ని రెట్లు ఎక్కువ ధరకు కొంటున్నామో దీని ఆధారంగానే తెలుస్తుంది. కంపెనీ షేర్‌ ధరను ఆ కంపెనీ ఈక్విటీ ప్రాఫిట్‌ రేషియోతో భాగిస్తే ప్రాఫిట్‌ ఈక్విటీ తెలుస్తుంది.


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
ఒక కంపెనీకి సంబంధించిన రైట్స్, బోనస్, డివిడెండ్, విస్తరణ లాంటి విషయాలను ముందుగానే తెలుసుకొని వాటి ఆధారంగా ఆ కంపెనీ షేర్ల క్రయ, విక్రయాలను జరపడాన్ని ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ అంటారు. దీని వల్ల సామాన్య వాటాదారులు నష్టపోతారు. ఇలాంటి ట్రేడింగ్‌కు పాల్పడే వారిపై సెబీ చర్యలు తీసుకుంటుంది.


బ్లూచిప్‌ షేర్లు
బ్లూచిప్‌ అనే పదాన్ని పోకర్‌ ఆట నుంచి గ్రహించారు. ఆ ఆటలో తెలుపు, ఎరుపు, నీలం రంగుల్లో చిప్స్‌ ఉంటాయి. వాటిలో బ్లూ చిప్స్‌కు విలువ అధికం. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మంచి ఆర్థిక ఫలితాలను సాధిస్తూ, కొన్నేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తూ, డివిడెండ్లు, బోనస్‌లు, రైట్స్‌ ఇష్యూల లాంటివి పాటిస్తూ, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందిన కంపెనీల షేర్లను ‘బ్లూచిప్‌ షేర్లు’ అంటారు. లేదా ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలకు చెందిన షేర్లను బ్లూచిప్‌ షేర్లు అంటారు. 


కాల్‌మనీ
కొత్తగా ప్రజల నుంచి వాటాల రూపంలో సొమ్మును సేకరించే కంపెనీలు వాయిదాల రూపంలో షేర్లను అమ్ముతాయి. ఒక వాయిదా అనంతరం మిగతా వాయిదాకు సంబంధించిన సొమ్మును చెల్లించమని వాటాదారులను కోరతారు. దీన్నే కాల్‌మనీ అంటారు. వాయిదాలన్నీ చెల్లించిన వారినే కంపెనీ వాటాదారులుగా భావిస్తుంది.


స్పెక్యులేషన్‌/అంచనా 
వ్యాపారం/ సత్తా వ్యాపారం
స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్లు వివిధ కంపెనీల షేర్లను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనడం లేదా అమ్మడం చేస్తారు. మరికొందరు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు తమ పట్టులోకి వచ్చే స్థాయిలో లావాదేవీలు చేస్తుంటారు. తక్కువ ధర ఉన్న షేర్‌ను బ్రోకర్లు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొంటే, సామాన్య పెట్టుబడిదార్లు కూడా అదే కంపెనీ షేర్లు కొనేందుకు సిద్ధపడతారు. అదే సమయంలో అతడు తన వద్ద ఉన్న షేర్లను వెంటనే అమ్ముతాడు. దీని వల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయో పెట్టుబడిదారులకు అర్థంకాక నష్టపోతారు. షేర్‌ ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయని ఊహించి పెద్దమొత్తంలో లావాదేవీలు చేయడాన్ని స్పెక్యులేషన్‌ అంటారు.


బుక్‌ క్లోజర్‌
వివిధ కంపెనీలు బోనస్, రైట్స్, డివిడెండ్‌ ఇచ్చే సమయంలో కొంతకాలం కంపెనీ రిజిస్టర్లను నిలిపేస్తాయి. ఏ తేదీ వరకు క్లోజ్‌ చేస్తారనే విషయాన్ని కంపెనీ ముందుగానే వాటాదారులకు తెలుపుతుంది. బుక్‌ తేదీ తర్వాత కంపెనీ రిజిస్టర్లలో ఉన్నవారినే వాటాదారులుగా పరిగణిస్తారు. వారి షేర్‌తోనే డివిడెండ్, బోనస్, రైట్స్‌ లాంటివి జారీ చేస్తుంది.

 

భారత ఆర్థిక వ్యవస్థ - స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రభావం
వివిధ కంపెనీల షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి ఉన్న వేదికే స్టాక్‌ మార్కెట్‌. ఇది దేశ ఆర్థిక ప్రగతిలోనూ ముఖ్య భూమిక పోషిస్తోంది. షేర్లలో పెట్టుబడి పెడితే త్వరగా లాభాలు పొందొచ్చని సాధారణ ప్రజలు భావిస్తారు. షేర్‌ మార్కెట్‌ల ఏర్పాటు, క్రయవిక్రయాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం మొదలైన విషయాల గురించి పరీక్షార్థులకు అవగాహన అవసరం.  


కన్వర్టబుల్‌ సెక్యూరిటీలు: ఏదైనా సంస్థ లేదా ప్రభుత్వం జారీచేసిన  సెక్యూరిటీ (బాండ్లు, డిబెంచర్లు, ప్రిఫర్డ్‌ స్టాక్స్‌)లను అదే సంస్థకు లేదా ప్రభుత్వానికి చెందిన మరో సెక్యూరిటీగా మార్చొచ్చు. వీటినే‘కన్వర్టబుల్‌ సెక్యూరిటీస్‌’ అంటారు. ఒక్కోసారి ఈ సెక్యూరిటీలను తీసుకున్న వ్యక్తి ఎంపిక ద్వారా ఇలా జరుగుతుంది. లేదంటే సంస్థ లేదా ప్రభుత్వ ఎంపిక ద్వారా కూడా ఇలా అవ్వొచ్చు.


రక్షణాత్మక షేరు (డిఫెన్సివ్‌ స్టాక్‌): విపత్కర ఆర్థిక పరిస్థితుల్లోనూ స్థిరంగా డివిడెండ్లు, ఆదాయాలను అందించే షేర్‌ను రక్షణాత్మక షేర్‌ అంటారు. యాంటీ స్టాక్‌ మార్కెట్స్‌ (Anti - Stock Markets) తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సమయంలోనూ ఈ కంపెనీలు స్థిరమైన రేటు వద్ద డివిడెండ్లు ఇస్తాయి. మదుపర్లు సాధారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లను డిఫెన్సివ్‌ స్టాక్స్‌గా  భావిస్తారు.


కమోడిటీస్‌: ఇవి ప్రత్యేక, అధీకృత ప్లాట్‌ఫాంపై ట్రేడయ్యే వాణిజ్య ఉత్పత్తులు. వ్యవసాయ ఉత్పత్తులు, సహజ వనరులు ఇందులో ఉంటాయి. 
ఉదా: బంగారం, వెండి, చమురు, సహజ వాయువు, అల్యూమినియం, ధనియాలు, పసుపు తదితరాలన్నీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే కమోడిటీస్‌.


డెరివేటివ్స్‌: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంతర్లీన ఆస్తుల నుంచి ఏదైనా ఒక సెక్యూరిటీ ధరను నిర్ణయిస్తే దాన్ని డెరివేటివ్‌గా చెప్పొచ్చు. ఆ అంతర్లీన ఆస్తుల జాబితాలో షేర్లు, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీలు, వడ్డీరేట్లు, సూచీలుంటాయి. ఈ డెరివేటివ్స్‌గా ఫ్యూచర్స్, ఆప్షన్‌లను మళ్లీ పుట్‌ ఆప్షన్, కాల్‌ ఆప్షన్‌ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.


హెడ్జింగ్‌: ఇదో ట్రేడింగ్‌ వ్యూహం. సెక్యూరిటీల ధరల్లో హెచ్చుతగ్గుల నుంచి నష్టాలను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నం. ఉదా: ఒక గోధుమ రైతు పంట చేతికి రాకముందే ఆ కమోడిటీ ఫ్యూచర్స్‌ (వీట్‌ ఫ్యూచర్స్‌)ను విక్రయించవచ్చు. ఒకవేళ నగదు మార్కెట్లో ధరలో క్షీణత కనిపించి, నష్టం వాటిల్లినా ఫ్యూచర్‌ పొజిషన్‌ ద్వారా వచ్చిన లాభాలతో దాన్ని తగ్గించుకోవచ్చు.


బాండ్లు: ఇవి కంపెనీలు లేదా ప్రభుత్వాలు కొనుగోలుదారులకు జారీచేసే హామీ పత్రాలు. వీటిని కొంటే నిర్దిష్ట సమయం వరకు నిర్దిష్ట మొత్తాన్ని ఆ బాండ్లలో కొనుగోలుదారు ఉంచినట్లు లెక్క. ఆ బాండ్‌కి ఇచ్చే కూపన్‌ రేటు (వడ్డీ రేటు)ను బట్టి మెచ్యూరిటీ సమయానికి నిర్దిష్ట సొమ్ముపై వడ్డీతో కూడిన మొత్తం అందుతుంది.


లావాదేవీలు: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో చిన్న మదుపుదార్ల (షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిపేవారు) నుంచి సంస్థాగత మదుపుదార్లు, పెన్షన్‌ ఫండ్, బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్, హెడ్జ్‌ఫండ్‌ ట్రేడర్లు లాంటి అనేక స్థాయుల వ్యక్తులు, సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తారు.


విదేశీ మూలధనం (Foreign Capital): ఒక దేశ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో విదేశీ మూలధనం అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టడం లేదా రుణాలు, గ్రాంట్ల రూపంలో నిధులు సమకూర్చడం చేయొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామీకరణ, ఆర్థికాభివృద్ధి వేగవంతమవ్వాలంటే తొలిదశల్లో యంత్రాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ముడి పదార్థాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకు విదేశీమారక ద్రవ్యం కావాలి.


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (Foreign Direct Investment - FDI): విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా ప్రవేశించి తమ పెట్టుబడులతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించవచ్చు. కొన్ని పెద్ద విదేశీ సంస్థలు వాటి శాఖ (బ్రాంచ్‌)లను ఏర్పాటు చేయొచ్చు.


విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా మదుపుదారులు (Foreign Portfolio investment - FPI): 
* మన దేశ స్టాక్‌ మార్కెట్లో భారీ హెచ్చు తగ్గులు ఏర్పడటానికి విదేశీ సంస్థాగత పెట్టుబడులే కారణమని  చెప్పొచ్చు. FPIలను కాళ్లు నిలవని పెట్టుబడులు (Footloose capital) అని అంటారు.
* ఎఫ్‌పీఐలను ‘సీతాకోకచిలుక పెట్టుబడులు’ (Butterfly Capital)  అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం సీతాకోకచిలుక వాలడం, ఎగిరిపోవడం లాగా ఉంటుంది. 
* స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని వాలడంగా, ఉపసంహరించడాన్ని ఎగిరిపోవడంగా పేర్కొంటారు. షేర్లు కొన్నప్పుడు స్టాక్‌మార్కెట్‌ ఒక్కసారిగా ఊపందుకోవడం, షేర్లను అమ్మినప్పుడు పతనమవ్వడం లాంటివి జరుగుతాయి. 
* కాబట్టి నీశిఖిలకు ప్రిడేటరీ క్యారెక్టర్‌ ఉంటుంది. వీటివల్ల విదేశీ పెట్టుబడుదారులు భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి వైదొలిగి షేర్లు అమ్ముకుంటారు. దీనికి కారణం ‘ప్రాఫిట్‌ బుకింగ్‌’. అంటే షేర్ల ధరలు భారీగా పెరిగినప్పుడు లాభాల కోసం అమ్ముకోవడం. 


డాలర్‌ విలువ పెరగడం (డాలర్‌ ఇండెక్స్‌):
* డాలర్‌ విలువను అంతర్జాతీయ కరెన్సీలతో పోల్చి దాని సగటు విలువను అంచనా వేస్తారు. దాన్నే డాలర్‌ ఇండెక్స్‌ అంటారు. అంటే అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌కు విలువ పెరగడం 
ఉదా: డాలర్‌ విలువ 0.43 శాతం పెరిగిందనుకుంటే, ఇండియా కరెన్సీ రూపాయితో పోల్చితే దాని విలువ ఒక్క రూపాయి నాలుగు పైసలు పెరుగుతుంది. 
* డాలర్‌ విలువ పెరిగినప్పుడు మనదేశంలోని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు తమ షేర్లను అమ్ముకొని డాలర్లను కొంటారు. వాటినే డాలర్‌ డినామినేటెడ్‌ అసెట్స్‌ అంటారు. అంటే డాలర్‌ రూపంలో ఉన్న ఫైనాన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌  కొనుగోలు చేస్తారు. ఉదా: బాండ్స్‌
* అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి సానుకూల అంశాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. దాంతో పాటు అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో వచ్చిన పరిణామాలు కూడా స్టాక్‌ మార్కెట్‌ పతనానికి కారణమవుతాయి.


విదేశీ పరోక్ష పెట్టుబడులు:
విదేశీ సంస్థలు మనదేశంలోకి ప్రవేశించి పరోక్షంగా బాండ్‌లు లేదా సెక్యూరిటీల రూపంలో పెట్టుబడులు పెడతాయి. వీటినే విదేశీ పరోక్ష పెట్టుబడులు అంటారు.


ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల (స్టాక్‌ మార్కెట్స్‌) ఏర్పాటు
* ప్రపంచంలో మొట్టమొదట స్థాపించిన స్టాక్‌మార్కెట్‌ లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. దీన్ని 18వ శతాబ్దంలో నెలకొల్పారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
* అమెరికాలోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నాస్‌డాక్‌  (NASDAQ - National Association of Securities Dealers Automated Quotation system). 
* ఇంగ్లండ్‌లోని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌.
* భారత్‌లో మొట్టమొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ను 1875లో ముంబయిలో స్థాపించారు. తర్వాత అహ్మదాబాద్‌ (గుజరాత్‌), చెన్నై (తమిళనాడు), దిల్లీ, ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), కాన్పూర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), బెంగళూరు (కర్ణాటక), లూథియానా (పంజాబ్‌) మొదలైన నగరాల్లో స్థాపించారు.
* భారతదేశంలో సెబీ గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఎనిమిది. వీటిలో అయిదు శాశ్వతమైనవి. అవి:
1. అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1894లో ఏర్పాటైంది.)
2. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
3. కోల్‌కతా స్టాక్‌ ఎక్చేంజ్‌ (1908లో  ఏర్పాటైంది.)
4. మగథ్‌ (పాట్నా) స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
5. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


 ప్రస్తుతం దేశంలో ఉన్న ఆపరేటింగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
1. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి)
2. కోల్‌కతా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
3. ఇండియా ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (India INX)
4. మెట్రో పాలిటన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి)
5. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) (ముంబయి)
6. ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌ఈ  - NSE IFSE


ప్రస్తుతం దేశంలో ఆపరేటింగ్‌ కమోడిటీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
1. ఇండియన్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ - ICX   (ముంబయి)
2. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా - MCX (ముంబయి) 
3. నేషనల్‌ కమోడిటీ, డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ - NCDX (ముంబయి)


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  (BSE)
* 1875లో బొంబాయిలో  ‘The Native Share and Stock Broker’s Association’ అనే సంస్థ ఏర్పడింది. అదే తర్వాత బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. 1957, ఆగస్టు 31న ఇది శాశ్వత ప్రాతిపదిక గుర్తింపు పొందింది. భారత్‌లో ఈ గుర్తింపు పొందిన తొలి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇదే. 
* దీని ప్రధాన కార్యాలయం ముంబయిలోని దలాల్‌ స్ట్రీట్‌లో ఉంది. ఇది ఆసియాలోని పురాతన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* 2021, ఫిబ్రవరి నాటికి మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.8 ట్రిలియన్‌ డాలర్లు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రపంచంలో ఏడో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* బీఎస్‌ఈలో జాబితాల సంఖ్య 5,439. సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎస్‌ అండ్‌ పి బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, ఎన్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ మిడ్కాప్, ఎన్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ లార్జ్‌ క్యాప్, బీఎస్‌ 500.
& హిందీలో దలాల్‌ స్ట్రీట్‌ అంటే బ్రోకర్‌ స్ట్రీట్‌ అని అర్థం.


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  (NSE)
* 1992, నవంబరులో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాను ముంబయిలో స్థాపించారు. 1994, జూన్‌ 30 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట రుణ మార్కెట్‌ విభాగం మాత్రమే పని చేయడం ప్రారంభించింది. ఈక్విటీ మార్కెట్‌ విభాగం 1994, నవంబరు 3 నుంచి లావాదేవీలను ప్రారంభించింది. అప్పటివరకు అతిపెద్దదైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కంటే ఎక్కువ వ్యాపారాన్ని సాధించింది. దేశంలో ఆధునిక, పూర్తి ఆటోమేటెడ్‌ స్క్రీన్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ వ్యవస్థను అందించిన తొలి ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ. ఇది పెట్టుబడిదారులకు సులభమైన వాణిజ్య సౌకర్యాలను అందించింది. ఎన్‌ఎస్‌ఈలో జాబితాల సంఖ్య 1,952. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.27 ట్రిలియన్‌ డాలర్లు (2018, ఏప్రిల్‌ నాటికి). సూచీలు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్‌ 50, నిఫ్టీ 500. ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 


అంచనా వ్యాపారం
సాధారణంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో అంచనా వ్యాపారం (Speculation Business) ఎక్కువగా జరుగుతుంది. భవిష్యత్తులో సెక్యూరిటీల ధరల్లో వచ్చే మార్పులను ముందుగా అంచనా వేసి, అధిక లాభాపేక్షతో కొనుగోలు, అమ్మకం చేసే వ్యాపారులను అంచనా వ్యాపారులు (Speculators) అంటారు.  ఫార్వర్డ్‌ డెలివరీ కాంట్రాక్ట్‌లలో ఈ వ్యాపారం జరుగుతుంది. దేశంలోని కొన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో మాత్రమే దీన్ని అనుమతించారు. అంచనా వ్యాపారం చేసే సభ్యులను నాలుగు రకాలుగా వర్గీకరించారు.
* బుల్స్‌ (Bulls)   
* బేర్స్‌  (Bears) 
* స్టాగ్స్‌ (Stags) 
* లేమ్‌ డక్‌ (Lame ducks)

 

భారతదేశంలో స్టాక్‌మార్కెట్‌ సూచికలు
ప్రపంచంలో ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ సూచికలు డో జోన్స్‌ (న్యూయార్క్‌); నిక్కీ (టోక్యో); హాంగ్‌కాంగ్‌ (హాంగ్‌ సెంగ్‌); డోలెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ-ఫిఫ్టీ (ఇండియా).  
* భారత్‌లో ప్రధాన స్టాక్‌ మార్కెట్‌ సూచికలు రెండు. అవి: 1. సెన్సెక్స్‌     2. నిఫ్టీ ఫిఫ్టీ 


సెన్సెక్స్‌: 1875లో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటైంది. తర్వాత 111 ఏళ్లకు 1986లో సెన్సెక్స్‌ ఏర్పడింది. తొలుత దీన్ని 100 పాయింట్లతో ప్రారంభించారు. ప్రాతిపదిక ఏడాదిగా 1978-79ను తీసుకున్నారు. సెన్సిటివ్, ఇండెక్స్‌ అనే పదాల నుంచి సెన్సెక్స్‌ ఏర్పడింది. ఈ పేరును సూచించింది దీపక్‌ మొహానీ అనే స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు. దీన్నే సెన్సిటివ్‌ ఇండెక్స్‌గా కూడా పిలుస్తారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన సూచిక. ఇందులోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 30.


నిఫ్టీ ఫిఫ్టీ - NSE 50:  ఈ సూచికను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ రూపొందిస్తుంది. ఇందులో 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలను చేర్చారు. దీనిపేరును S&P CNX  నిఫ్టీగా మార్చారు. నిఫ్టీ సూచిక 1996, ఏప్రిల్‌ 22న ప్రారంభమైంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో (2020, జూన్‌ 20 నాటికి) 14 రంగాలకు వర్తిస్తుంది.


నేషనల్‌ ఇండెక్స్‌: ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన మరో సూచిక. దీనిలోని ప్రాతినిధ్య సంస్థలు 100. ఆధార సంవత్సరం 1983-84.


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ): ఈ సూచికలో 200 ప్రాతినిధ్య సంస్థలు ఉన్నాయి. ఆధార సంవత్సరం 198990. దీనిలో 21 ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు ఉన్నాయి.
డోలెక్స్‌: బీఎస్‌ఈ200 డాలర్‌ విలువను డోలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 198990.
బ్యాంకెక్స్‌: దీన్ని 2003, జూన్‌ నుంచి రూపొందిస్తున్నారు. ఇందులో 12 బ్యాంకుల వాటాలను చేర్చారు. ఆధార సంవత్సరం జనవరి 2002.


కమోడిటీ ఫ్యూచర్‌ మార్కెట్‌
* భవిష్యత్తులో కొన్ని వస్తువుల ధరల్లో అధిక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ ప్రభావాన్ని తప్పించేందుకు కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఒక వస్తువును రానున్న కాలంలో  ఒక నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత తేదీన, నిర్ణీత ధర వద్ద కొనడం లేదా అమ్మడం గురించి ఒప్పందం కుదుర్చుకుంటారు. దీన్నే కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లు అంటారు.
* వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడిచమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు మొదలైన వస్తువులతో ఫ్యూచర్‌ వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్‌కు సంబంధించిన ఎక్స్ఛేంజ్‌లను కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు అంటారు. 


భారత్‌లో పనిచేస్తున్న కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు 
* నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (NMCE) 
* ఎంసీఎక్స్‌ (MCX) ముంబయి (2003)
* నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (NCDEX) 
* ఏసీఈ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ముంబయి 


క్రిసిల్‌
* క్రిసిల్‌ (CRISIL - Credit Rating Information Services of India Limited) భారతదేశ మొదటి రేటింగ్‌ ఏజెన్సీ. దీన్ని 1987లో నెలకొల్పారు. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కలిసి క్రిసిల్‌ - 500 సూచికను అభివృద్ధి చేసింది. దీనిపేరును S&P CNX-550 సూచికగా మార్చారు. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
* ఇది రేటింగ్స్, డేటా, పరిశోధన, విశ్లేషణ, సొల్యూషన్స్‌ లాంటి సేవలను అందిస్తుంది. సంస్థల వ్యాపార నష్ట భయం, నిర్వహణ నష్టభయం, ఆర్థిక నష్టభయం అనే మూడు అంశాలను మూల్యాంకనం చేసి వ్యాపార సంస్థలకు రేటింగ్‌ ఇస్తుంది. 2020, డిసెంబరు నాటికి క్రిసిల్‌ ఆదాయం 290 మిలియన్‌ డాలర్లు, నికర ఆదాయం 50 మిలియన్‌ డాలర్లు. దీని మాతృసంస్థ  S&P గ్లోబల్‌.


కొవిడ్‌ నేపథ్యంలో దేశ జీడీపీ - స్టాక్‌ మార్కెట్ల తీరు తెన్నులు
* ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను స్టాక్‌ మార్కెట్లు ప్రతిఫలిస్తాయి. పతనం, వృద్ధి ఏదైనా మార్కెట్లు ముందే స్పందిస్తాయి. భవిష్యత్తు ఆధారంగానే వీటి పనితీరు ఉంటుంది.
* 201920 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 4.2 శాతం (2020-21 సర్వే ప్రకారం) వృద్ధి రేటు సాధించింది. కొవిడ్‌ కారణంగా 2020-21లో జీడీపీ క్షీణత (-) 7.7 శాతంగా (2020-21 సర్వే ప్రకారం) నమోదైంది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష 2021, ఏప్రిల్‌ నివేదికలో 2021-22లో భారత్‌ జీడీపీ వృద్ధిరేటును 10.5 శాతంగా అంచనా వేసింది. ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ 2021, ఏప్రిల్‌ నివేదిక ప్రకారం 2021లో దేశ జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం, కాగా 2022లో 6.9 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.
* 2020, మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. అయితే 2020, నవంబరు నుంచి సూచీలు లాభపడుతూ వచ్చాయి.
* 2021, జనవరి 21న స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో తొలిసారి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 50,000 పాయింట్లను తాకింది. 
* బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 20 ఏళ్లలో 32 రెట్లు పెరిగింది. 
* 2001-02 ఆర్థిక సంవత్సరం చివర్లో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6.12 లక్షల కోట్లు కాగా, 2020-21, జనవరి 21 నాటికి దీని విలువ రూ.196.51 లక్షల కోట్లకు చేరింది. 
* 2021, జనవరి 12న జీవితకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆ రోజు నమోదైన రూ.197.46 లక్షల కోట్లు ఇప్పటి వరకు అత్యధికం.
* 2008, జనవరిలో సెన్సెక్స్‌ 21,000 పాయింట్ల వద్ద ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అదే ఏడాది అక్టోబరు చివరికి 8700 పాయింట్లకు చేరింది. 
* 2008-09 ఆర్థిక సంవత్సరం చివర్లో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.30 లక్షల కోట్లకు క్షిణించింది. 2007-08లో ఈ విలువ రూ.51 లక్షల కోట్లు. అయితే తర్వాతి ఏడాది పుంజుకుని రెట్టింపైంది. 
* 2020, మార్చిలో కొవిడ్‌ సంక్షోభంతో సెన్సెక్స్‌ 26000 పాయింట్లకు, కంపెనీల మార్కెట్‌ విలువ రూ.113 లక్షల కోట్లకు చేరింది. 2018-19 ఆఖరులో ఈ విలువ రూ.151 లక్షల కోట్లు.


స్టాక్‌ మార్కెట్లు - జీడీపీ వృద్ధి - ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు
* బ్యాంకులు స్థిరీకరణ, రుణాల రికవరీపై దృష్టి సారించడం వల్ల వాటి ఆర్థిక నిల్వలు బలోపేతమయ్యాయి. అవి వ్యాపార సంస్థల విస్తరణ అవసరాలకు రుణాలిచ్చేందుకు సిద్ధమయ్యాయి. కార్పొరేట్‌ సంస్థలు తమ అప్పులు తగ్గించుకున్నాయి. 
* గత కొన్నేళ్లలో జీఎస్టీ - ఐబీసీ (దివాలా స్మృతి) అమలుతో పాటు కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో బలహీన కార్పొరేట్‌ సంస్థలు మూతపడగా, తట్టుకున్న సంస్థలు బలోపేతమయ్యాయి. ఇలా నిలిచిన సంస్థల మార్కెట్‌ వాటా, ఆదాయాలు పెరుగుతున్నాయి. అందుకే వచ్చే ఆర్థిక సంవత్సరం, ఆపై ఏడాది కూడా భారత్‌ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే స్టాక్‌ మార్కెట్స్‌కు ఇంధనం. 
* ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా సమీప భవిష్యత్తులో కోలుకుంటుందని, కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేస్తాయనే అంచనాలతో షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ముందుకొస్తున్నారు. 
* కొత్త ఇన్వెస్టర్లకు అనుగుణంగా డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.


 

స్టాక్‌ మార్కెట్లు - డీమ్యాట్‌ ఖాతాలు 
స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. ఈ ఖాతాలు పెరుగుతున్నాయంటే, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికమవుతోందని అర్థం.
* 2018-19తో పోలిస్తే 2019-20లో 49 లక్షల నూతన డీమ్యాట్‌ ఖాతాలు పెరిగాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కొత్త ఖాతాలు మరింత పెరిగినట్లు సమాచారం.


 సంవత్సరం    డీమ్యాట్‌ ఖాతాలు (కోట్లలో)
 2010-11          1.90
 2011-12          1.99
 2012-13          2.09
 2013-14          2.18
 2014-15          2.33
 2015-16          2.52
 2016-17          2.79
 2017-18          3.19
 2018-19          3.59
 2019-20          4.08


మనదేశ జీడీపీ వృద్ధిరేట్లు (శాతంలో)
సంవత్సరం        జీడీపీ వృద్ధి
2010-11              9.3
2011-12              6.2
2012-13              5.6
2013-14              6.6
2014-15              7.2
2015-16               8
2016-17              8.2
2017-18               7
2018-19              6.1
2019-20              4.2
2020-21            (-) 7.7 
2021-22              11 

ఆధారం: భారత ఆర్థిక సర్వే: 2012-13, 2015-16, 2018-19, 2020-21

Posted Date : 25-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో భూసంస్కరణలు

సమ సమాజ నిర్మాణం... సకల జనుల సౌభాగ్యం!


ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో భూమి ప్రధానపాత్ర పోషిస్తోంది. అనాదిగా ఆ భూమి పంపిణీలో పాతుకుపోయిన అసమానతలు సమాజంలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమవుతున్నాయి. దీనికి సంబంధించి బ్రిటిష్‌ కాలంలో రకరకాల విధానాలను అమలు చేసి శిస్తుల రూపంలో దోపిడీలు చేశారు. అందుకోసం జమీందారులు, భూస్వాముల వంటి దళారులను సృష్టించారు. స్వాతంత్య్రానంతరం సమ సమాజాన్ని, అందరి సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని సామాజిక న్యాయాన్ని అందించేందుకు ప్రభుత్వం భూ సంస్కరణలు చేపట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి. 

 

భారతదేశంలో భూసంస్కరణలు 

గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలకు భూమే ప్రధాన జీవనాధారం. కానీ ఆ భూమి పంపిణీకి సంబంధించి అనేక అసమానతలు అమలవుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువ మొత్తం భూమి అతి తక్కువ సంఖ్యలో ఉన్న ధనవంతులైన భూస్వాముల అధీనంలో ఉంది. ఈ పరిస్థితి సామాజిక న్యాయం అందించాలనే ప్రణాళికా లక్ష్యానికి విరుద్ధంగా ఉంది. భూమి యాజమాన్యంలోని అసమానతలను తగ్గించి సామాజిక న్యాయాన్ని అందించడానికి భూసంస్కరణలు అమలుచేయాల్సిన అవసరం ఏర్పడింది. భూయాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్నే భూసంస్కరణలుగా చెప్పవచ్చు.

 

నిర్వచనాలు

* భూసంస్కరణలు అంటే భూమి పునఃపంపిణీ, కౌలు పరిమాణం నిర్ణయం, కౌలుదారులకు భద్రత, వ్యవసాయ కార్మికుల వేతనాల నిర్ణయం, వ్యవసాయ పరపతి ఆధారాల అభివృద్ధి, భూమి పన్నుల విధానంలో మార్పులు, సహకార వ్యవస్థ మెరుగుదల, వ్యవసాయ విద్య, సాంకేతిక మార్పులు.  - ఐక్యరాజ్య సమితి

* మధ్యవర్తుల తొలగింపు, భూహక్కుల పునఃపంపిణీ, కమతాల సమీకరణ, కౌలు సంస్కరణలు, సహకార, సామూహిక వ్యవస్థల నిర్మాణం భూసంస్కరణల లక్ష్యం.  - ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ

* రైతుల ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తిని దృఢపరచడమే భూసంస్కరణల లక్ష్యం. భూమిని దున్నేవాడికి యాజమాన్యపు హక్కుగా చేయడంతోనే భూసంస్కరణల లక్ష్యం పూర్తికాదు. అలాంటి హక్కును సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందగలిగే ఇతరత్రా మార్పులు కూడా భూసంస్కరణల పరిధిలోనివే.   - జవహర్‌లాల్‌ నెహ్రూ 

స్థూలంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో (అగ్రేరియన్‌ స్ట్రక్చర్‌) మార్పులు తీసుకురావడాన్ని భూసంస్కరణలు అంటారు.

భూసంస్కరణలను వ్యవసాయ సంబంధ సంస్కరణలని అంటారు. భూసేకరణ చట్టం - 1894 ప్రకారం ప్రైవేటు భూములు సేకరించే అధికారం  ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలకు భూసంబంధ చట్టాలు చేసే అధికారం ఉంది. దేశంలో భూసంస్కరణలు చేసిన మొదటి రాష్ట్రం కేరళ. తర్వాత పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు అమలుచేశాయి.

 

ఇతర దేశాల అనుభవాలు

చరిత్రాత్మకంగా ప్రపంచంలో భూసంస్కరణలు చాలా పురాతనమైనవి. ఆరో శతాబ్దంలో గ్రీకులోని (133 - 121 బి.సి) రోమ్‌లో భూసంస్కరణలు ప్రవేశపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం వరకు స్వీడన్‌ (1827), డెన్మార్క్‌ (1850), ఐర్లాండ్‌ (1930) దేశాల్లో భూసంస్కరణలు ప్రవేశపెట్టారు. తర్వాత ఫ్రాన్స్‌లో 1992లో అమలయ్యాయి.

బ్రిటిష్‌ ఇండియాలో భూమిశిస్తు విధానాలు:  బ్రిటిషర్ల పరిపాలనలో వ్యవసాయ భూముల శిస్తు వసూలుకు అనేక పద్ధతులు అనుసరించారు. వాటిలో మూడు విధానాలు ముఖ్యమైవి.అవి 1) జమీందారీ పద్ధతి (1793) 2) రైత్వారీ విధానం (1820)  3) మహల్వారీ విధానం (1833)

 

జమీందారీ పద్ధతి

శాశ్వత భూమిశిస్తు వసూలు విధానం: ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రభుత్వం 1793లో లార్డ్‌ కారన్‌వాలీస్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న సమయంలో శాశ్వత భూమి శిస్తు వసూలు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీన్నే జమీందారీ విధానం అంటారు. ఇది బెంగాల్, బిహార్, ఒడిశాల్లో అమల్లో ఉండేది. ఈ పద్ధతి ప్రకారం మొదట వ్యవసాయ భూముల నికర ఆదాయంలో 83% కౌలుగా వసూలు చేసేవారు. ఆ తర్వాత సాగుభూమిలో నికర ఆదాయంలో 40% శిస్తుగా వసూలు చేశారు. అయితే శాశ్వత భూమి శిస్తు నిర్ణయం ప్రకారం జమీందార్లు 10/11వ వంతు పంట దిగుబడిని ప్రభుత్వానికి చెల్లించాలి. దీంతో శిస్తు వసూలుకు జమీందార్లు రైతులను పీడించేవారు. చివరికి రైతులు భూమిపై వ్యవసాయం చేసే హక్కుకు వదులుకునేవారు. ఈ పద్ధతి వల్ల రైతులు, కూలీలుగా మారి వ్యవసాయ రంగ అభివృద్ధి క్షీణించింది.

తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం: భూమిశిస్తు వసూలు విధానాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి అవసరమైనప్పుడు భూమిశిస్తును సవరించే తాత్కాలిక నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 20 - 40 సంవత్సరాలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన శిస్తు నిర్ణయిస్తారు. దీంతో రైతులపై పన్ను భారం పెరిగి వ్యవసాయ రంగానికి హాని జరిగింది.

* 1952లో మొదటి ప్రణాళికా కాలంలో జమీందారీ విధానాన్ని రద్దు చేసి భూసంస్కరణలు అమలుచేశారు.

 

రైత్వారీ విధానం

రైతు అంటే భూమిని సాగుచేసేవాడు. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కును ఇవ్వడం. భూమిని సొంతంగా సాగుచేసే లేదా ఇతరులతో సాగు చేయించే భూమి వాస్తవ యజమానులు/సాగుదారుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేయాలని నిర్ణయించారు. మధ్యవర్తుల ద్వారా పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని తొలగించడానికి 1820లో థామస్‌ మన్రో రైత్వారీ విధానాన్ని అమలుచేశారు. దీన్నే రైత్వారీ శిస్తు నిర్ణాయక విధానం అంటారు. భూమిపై హక్కు ఉన్న రైతులందరినీ భాగస్వాములుగా ఏర్పాటుచేశారు. సంవత్సరానికి ఒకసారి ఈ పన్నును రైతులు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పద్ధతిలో పన్ను వసూలు చేయడంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. భూసారం, ఉత్పత్తి వ్యయం అంశాల ఆధారంగా ప్రభుత్వమే పన్ను నిర్ణయిస్తుంది. భూయజమానులే (కౌలుదారులు కాదు) ఈ పన్నును బ్రిటిష్‌ ప్రభుత్వానికి చెల్లించాలి. స్థూల ఉత్పత్తిలో 40% - 50% వరకు పన్నుగా నిర్ణయించారు. శిస్తును 20 నుంచి 40 సంవత్సరాలకు ఒకసారి సవరించే వీలు ఉంటుంది. రైత్వారీ విధానాన్ని ముందుగా (1817 - 18) బొంబాయి, మద్రాస్‌ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి తర్వాత ఈశాన్య, వాయవ్య రాష్ట్రాలకు విస్తరించారు. దేశంలోని 38% వ్యవసాయ భూమిలో మాత్రమే ఈ విధానం అమల్లో ఉండేది.

 

మహల్వారీ విధానం

బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక గ్రామంలోని వ్యవసాయ యోగ్యమైన మొత్తం భూమిని అంచనా వేసి దాన్ని ఆ గ్రామ సమష్టి ఆస్తిగా పరిగణించి మొత్తం భూమిపై శిస్తు విధించేది. ఈ పద్ధతిని మహల్వారీ పద్ధతి అంటారు. దీన్ని 1833లో విలియం బెంటింక్‌ ప్రవేశపెట్టాడు. గంగా మైదానంలో ఈ పద్ధతి అమల్లో ఉండేది. మహల్వారీ పద్ధతిని ఆగ్రా, అవధ్‌ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామపెద్దకు ఈ భూమిపై శిస్తు వసూలు చేసే అధికారం ఉంటుంది. ఈయన గ్రామంలోని రైతుల నుంచి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. తన సేవలకు ప్రతిఫలంగా వసూలు చేసిన భూమి శిస్తులో కొంత శాతం కమిషన్‌గా పొందుతాడు. దేశంలోని 5 శాతం వ్యవసాయ భూమిలో మాత్రమే మహల్వారీ పద్ధతి అమల్లో ఉండేది.

* అలీస్‌ థోర్నర్‌ చెప్పినట్లు జమీందారీ విధానం జమీందార్లను గ్రామ అధికారులుగా మారిస్తే, రైత్వారీ విధానం గ్రామ వ్యవస్థను ఛేదించి రైతులను, ప్రభుత్వాన్ని వేరుచేసింది.

 

లక్ష్యాలు

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు జోసెఫ్‌ చెల్లాదురై కార్నెలియస్‌ కుమారప్ప (జేసీ కుమారప్ప) అధ్యక్షతన 1948లో వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. 1949లో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ సిఫార్సులను అనుసరించి జమీందారీ లాంటి మధ్యవర్తుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దున్నేవాడికే భూయాజమాన్యాన్ని బదిలీ చేయాలని సూచించింది.

* వ్యవసాయ సంబంధాలను పునర్‌వ్యవస్థీకరించి సమసమాజ స్థాపన చేయడం. 

* భూసంబంధ వ్యవహారాల్లో దోపిడీ నిర్మూలన.  

* దున్నేవాడికే భూమి హక్కు కల్పించడం. 

* భూసంబంధ అసమానతలు తొలగించి గ్రామీణ ప్రాంతాల్లో పేదవర్గాల వారికి భూయాజమాన్య వసతి కల్పించడం. 

* భూమి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం. 

* ప్రభుత్వానికి, రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరిచి వివిధ వర్గాల రైతులకు సాంఘిక న్యాయం సమకూర్చడం. 

* స్థానిక సంస్థల ద్వారా సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి విధానపరమైన మార్పులు చేయడం.

 

8వ పంచవర్ష ప్రణాళిక (1992-97)లో పొందుపరిచిన భూసంస్కరణల లక్ష్యాలు: 

* సామాజిక సమానత్వాన్ని సాధించేలా భూవ్యవసాయ సంబంధాలను పునర్నిర్మించడం.

* భూవ్యవసాయ సంబంధాల దోపిడీని అరికట్టడం.

* దున్నేవాడికే భూమిని సమకూర్చడం.

* గ్రామీణ పేదలకు భూమి పంపిణీ చేసి వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం.

* వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం.

* గ్రామీణ వ్యవస్థలో అన్నిరకాలుగా సమానత్వాన్ని సాధించడం.


రచయిత: బండారి ధనుంజయ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

‣  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వస్తు సేవల పన్ను

జీఎస్టీ చరిత్ర

* 2000లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణల కోసం డా.సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటుచేసింది.
* ఈ కమిటీ జీఎస్టీ విధివిధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ్‌బెంగాల్‌ ఆర్థికమంత్రి అసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో మరో బృందాన్ని నియమించాలని సిఫార్సు చేసింది. 
* దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వ్యవస్థల ఏర్పాట్ల బాధ్యతనూ దీనికే అప్పగించారు. అందుకే గుప్తాను జీఎస్టీ రూపశిల్పిగా పేర్కొంటారు. 
* పన్ను సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో వాజ్‌పేయీ ప్రభుత్వం 2003లో ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
* 12వ ఆర్థికసంఘం సూచించిన విధంగా జీఎస్టీని తీసుకురావాలని కేల్కర్‌ కమిటీ 2005లో సిఫార్సు చేసింది.
* 2011లో డా.మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జీఎస్టీ అమలు కోసం లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

 

వస్తు సేవల పన్ను -  భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అన్ని వస్తు, సేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్షపన్నును వస్తు-సేవల పన్ను(Goods and Services Tax - GST) అంటారు. దీని అమలుతో మిగిలిన పరోక్ష పన్నులు ఏవీ ఉండవు. పన్నుల సరళీకరణ  జరిగి వ్యాపారం సులభతరం అవుతుంది.


ప్రాధాన్యం
* దేశంలో ఎక్కడికైనా వస్తు రవాణా సులభమవుతుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా ఆవిర్భవిస్తుంది.
* పన్నులపై పన్నులు ఉండవు.
* స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) 1 నుంచి 1.5 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది.
* అధికసంఖ్యలో వస్తువులకు పన్ను మినహాయింపు ఉంటుంది.
* సగటు ఆదాయం ఉన్న వ్యక్తులు గరిష్ఠ ప్రయోజనం పొందుతారు.
* నమోదు, సుంకం చెల్లింపు, రిటర్న్‌దాఖలు, పన్నుల వాపసు కోసం ఉమ్మడి విధానాలు.
* అధిక పన్నుల ప్రవాహాన్ని తొలగించడానికి తయారీదారు/ సరఫరాదారు నుంచి వినియోగదారు/ రిటైలర్‌కు నిరంతరాయంగా పన్ను క్రెడిట్‌ అవుతుంది.
* మన ఎగుమతులు అంతర్జాతీయంగా పోటీపడేలా ఉండేందుకు పన్నుల తటస్థీకరణ  ప్రభావవంతంగా జరుగుతుంది.
* తమ ఉత్పత్తులను చౌకగా తయారు చేయడానికి చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రాయితీలు లభిస్తాయి.
* ఏకీకృత ఉమ్మడి జాతీయ మార్కెట్‌ కల్పన.
* భారతదేశం తయారీ రంగ హబ్‌గా రూపొందుతుంది.
* పెట్టుబడులు, ఎగుమతులు పెరుగుతాయి.
* పెరిగిన ఆర్థిక కార్యకలాపాల వల్ల ప్రజలకు మరింత ఉపాధి దొరుకుతుంది.
* వస్తు, సేవలపై ప్రస్తుతం విధిస్తున్న అనేక పన్నులు తగ్గుతాయి. దాంతో సరళీకరణ సాధ్యమవుతుంది.
* దేశవ్యాప్తంగా పన్ను చట్టాలు, విధానాలు, ధరల సమన్వయం.
* పన్ను నిర్వహణలో కచ్చితత్వాన్ని పెంపొందించడానికి వస్తు, సేవల వర్గీకరణకు ఉమ్మడి విధానం.
* పెరిగిన పోటీ వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. 
* దేశవ్యాప్తంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులకు అనువైన ప్రదేశం.
* ప్రజల్లో ఐకమత్యం, జాతీయ భావాలు పటిష్ఠం అవుతాయి.


పరిణామక్రమం - అమలు తీరు

* 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ మౌలిక స్వరూపాన్ని ఆ ఏడాది బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొంది.
* 2010లో జీఎస్టీ మౌలికస్వరూపంపై ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చింది.
* 2011లో జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించడంతో దాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు.
* 2013లో జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసేందుకు అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం రూ.9000 కోట్ల నిధులను ప్రకటించారు.
* 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతో రాజ్యాంగ సవరణ బిల్లుకు కాలం చెల్లింది.
* 2016, ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని 2015, ఫిబ్రవరి 8న అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.
* 2016, మార్చిలో జీఎస్టీ రేట్లపై పరిమితి విధించాలనే ప్రతిపక్షాల ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం అంగీకరించింది.
* 2016, ఆగస్టు 3న జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది.
* 2016, ఆగస్టు 8న జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది.
* 2016, సెప్టెంబరులో ఈ బిల్లుకు 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి.
* 2016, నవంబరులో నాలుగు అంచెల పన్ను స్వరూపాన్ని జీఎస్టీ మండలి ఖరారు చేసింది.
* 2017, మార్చిలో జీఎస్టీ అమలుకు ఉద్దేశించిన నాలుగు బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించింది.
* జీఎస్టీని అమల్లోకి తెచ్చేందుకు 2017, జూన్‌ 30 అర్ధరాత్రి పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమైంది.
* మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానంలో ఎంతో వైవిధ్యం ఉంది.
* వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలై విక్రేతలు, చిల్లర వ్యాపారులు, వినియోగదారులకు చేరే వరకు అన్ని దశల్లోనూ పన్నులు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య ఈ పన్నులు మారుతూ ఉంటాయి. 
* పన్నుపై పన్ను విధించడంతో వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో వాటి ధరలు కొన్ని చోట్ల తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 
* దీనికోసమే భారత్‌ పన్ను వ్యవస్థలో మార్పులు చేసి ‘ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌’  (One Nation - One Tax One Market) భావనను అమలుచేసింది. 
* పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం  భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. 
* 2016, సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జీఎస్టీ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది.
* 17 రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో 2017, జులై 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీని అమలు చేశారు (జమ్మూ కశ్మీర్‌ మినహా).
* మనదేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం - అసోం (2016, ఆగస్టు 12).
* దాదాపు 130 కోట్ల జనాభా, 2.3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో దేశం ఏకీకృత మార్కెట్‌గా రూపొందింది.


పన్ను విధానం

ఒక వస్తువు విలువ పన్నుతో కలిసి రూ.100 అనుకుంటే 10 శాతం జీఎస్టీ ప్రకారం అది చివరకు ఎంత అవుతుందో పరిశీలిద్దాం. 
* పత్తి నూలు విలువ రూ.100 అనుకుందాం. దాన్ని నేతన్న చీరగా తయారు చేశాడు. దాని తయారీ ఖర్చుగా రూ.30 తీసుకున్నాడు. ఆ చీర విలువ రూ.130 అవుతుంది. 
* జీఎస్టీ ప్రకారం ఇక్కడ మొత్తం విలువపై పన్ను ఉండదు. నేతన్న తీసుకున్న రూ.30 కే పన్ను విధిస్తారు. (అంటే రూ.3 మాత్రమే). అప్పుడు చీర విలువ రూ.133 అవుతుంది. 
* నేతన్న నుంచి రూ.133కి కొన్న చీరను టోకు వ్యాపారి రూ.20 లాభంతో రూ.153కి దుకాణదారుడికి  అమ్మాడని అనుకుందాం. ఇక్కడ జీఎస్టీ ప్రకారం వ్యాపారి లాభం రూ.20పై మాత్రమే పన్ను (రూ.2 మాత్రమే) ఉంటుంది. ఇప్పుడు చీర విలువ రూ.155 అవుతుంది. హోల్‌సేలర్‌ నుంచి రూ.155కి కొన్న చీరను దుకాణదారుడు రూ.10 లాభంతో రూ.165కి అమ్మాడు అనుకుందాం. అప్పుడు లాభం రూ.10పై మాత్రమే పన్ను వేస్తారు. 
* అంటే ఇక్కడ పన్ను రూ.1 మాత్రమే. అంటే మొత్తం చీర విలువ రూ.166 అవుతుంది. 
* మొత్తం పన్ను 10 + 3 + 2 + 1 = రూ.16 అవుతుంది.


ప్రపంచ దేశాల్లో జీఎస్టీ 

* 1954లో ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్‌ జీఎస్టీని అమలు చేసింది. ప్రస్తుతం 160 దేశాల్లో జీఎస్టీ/ వ్యాట్‌ అమల్లో ఉంది. 
* జీఎస్టీ అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అమెరికా. అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రం ఉంది.
* ఆస్ట్రేలియా 2000లో జీఎస్టీని ప్రవేశపెట్టింది.
* న్యూజిలాండ్‌ 1986లో 10% పన్ను రేటుతో జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఈ రేటును 1989లో 12.5%; 2010లో 15 శాతానికి పెంచింది.
* 1989లో జపాన్‌లో వినియోగ పన్నును (3%) ప్రవేశపెట్టారు. దాన్ని 1997లో 5%; 2012లో 10 శాతానికి పెంచారు. 
* కెనడాలో 1991లో జీఎస్టీని ప్రవేశపెట్టారు. మన దేశంలో ఉన్నట్లే అక్కడా ద్వంద్వ విధానం (రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ) అమలవుతోంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రావిన్స్‌లకు ఉంది. జీఎస్టీని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై మూడు ప్రావిన్స్‌లు దావా వేశాయి. 
* కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ జీఎస్టీని ప్రవేశపెట్టింది. అమల్లో సవాళ్లు ఏర్పడటంతో రెండేళ్లలోనే తిరిగి పాత పన్ను విధానానికే మారింది.
* 1994లో సింగపూర్‌లో జీఎస్టీని ప్రవేశపెట్టారు. దీంతో అక్కడ ద్రవ్యోల్బణం పెరిగింది. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక హక్కుల సంస్థలు జీఎస్టీని వ్యతిరేకించాయి. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. కార్పొరేట్‌-ఐటీ పన్ను తర్వాత జీఎస్టీ ద్వారానే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. 
* 2015లో మలేసియాలో జీఎస్టీని అమలు చేశారు.
* 2016లో చైనా వ్యాట్‌ సంస్కరణలను పూర్తిచేసింది. సంక్లిష్టంగా ఉన్న వ్యాపార పన్ను వ్యవస్థ స్థానంలో వాటిని ప్రవేశపెట్టింది. వ్యాపార, ఇతర పన్నులను తొలగించడంతో అక్కడ స్థిరాస్తి రంగం మెరుగుపడింది. చైనాలో కొన్ని సరకులపై పాక్షిక జీఎస్టీ ఉంది.
* బ్రెజిల్‌లో జీఎస్టీ స్థానంలో వ్యాట్‌ అమల్లో ఉంది. అయితే ప్రాంతాల మధ్య పన్ను రేట్లలో వ్యత్యాసాలు ఎక్కువ. ఈ రేటు సావోపౌలో 17% ఉంటే, రియో డిజెనీరోలో 18% పన్ను రేటు ఉంది. దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరఫరా పన్ను రేట్లు వేర్వేరుగా (4 నుంచి 25 శాతం వరకు) ఉన్నాయి.
* సీషెల్స్, కాంగో, గాంబియా, మలేసియా దేశాల్లో గత అయిదేళ్ల నుంచే జీఎస్టీ అమల్లో ఉంది.


వివిధ దేశాల్లో పన్ను (శాతాల్లో)

దేశం పన్ను శాతం
బ్రెజిల్‌ 4 - 25
బ్రిటన్, ఫ్రాన్స్‌ 20
భారత్, రష్యా 18
చైనా 17
మెక్సికో 16
దక్షిణాఫ్రికా 14
ఆస్ట్రేలియా 10
జపాన్, స్విట్జర్లాండ్‌ 8
థాయ్‌లాండ్‌ 7
మలేసియా 6
కెనడా 5
Posted Date : 30-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు

భూహక్కులకు భరోసా!

సమ సమాజ నిర్మాణంలో భాగంగా భూములపై అందరికీ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూసంస్కరణలను చేపట్టింది. ఆ హక్కులకు భరోసానిచ్చేందుకు కొన్ని చట్టాలు చేసింది. భూగరిష్ఠ పరిమితినీ విధించింది. ఈ అంశాలపై పరీక్షల కోణంలో అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

 

భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు

ఏ దేశంలోనైనా భూమి ముఖ్యంగా వ్యవసాయ యోగ్యమైన భూమిపై అందరికీ హక్కు కల్పించడం సమానత్వ సూత్రానికి ప్రాతిపదిక అవుతుంది. భూ యాజమాన్యం కొంత మందికి మాత్రమే పరిమితమైతే భూమి లేనివారు (పేదలు, కూలీలు, ఇతర బలహీన వర్గాలు) భూస్వామ్య వర్గాలపై తిరుగుబాటు చేసినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సామాజిక సమానత్వం పాటించే ఎక్కువ మందికి కనిష్ఠ స్థాయి కమతాలపై హక్కులు కల్పించడానికి భూసంస్కరణలు అవసరం. 

 

             పంటల పండించే రైతుకు భూమిపై హక్కు కల్పించాలి. అంతేకాకుండా రైతులు పరపతి సౌకర్యాలను పొందడానికి వారికి భూమిపై హక్కు అవసరం. చిన్నకారు, సన్నకారు రైతులకు భూమి హక్కు తగిన భద్రతను కల్పించి ఉత్పాదకతను సాధించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పెద్దకమతాల కంటే చిన్నకమతాలను సమర్థంగా సాగు చేయవచ్చు.      

 

భారత ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేయడానికి అనేక చట్టాలను రూపొందించింది. వాటిలో ముఖ్యమైనవి...

* మధ్యవర్తుల తొలగింపు చట్టం

* కౌలుదారీ చట్టాలు

* భూగరిష్ఠ పరిమితి చట్టం

* కమతాల సమీకరణ లేదా ఏకీకరణ

 

మధ్యవర్తుల తొలగింపు చట్టం: మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా 1948లో మద్రాస్‌ రాష్ట్రంలో అమలుచేశారు. ఈ చట్టాన్ని మధ్యవర్తుల దోపిడీ ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 1954 - 55లో అమలుచేశారు. 1960 నాటికి దేశమంతా మధ్యవర్తుల తొలగింపు పూర్తయింది.

 

కౌలుదారీ చట్టాలు: భూస్వాముల నుంచి చిన్నరైతులు, వ్యవసాయ శ్రామికులు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు. పండించిన దానిలో నిర్ణీత భాగం వీరు భూస్వాములకు కౌలుగా చెల్లిస్తారు. బ్రిటిష్‌ కాలంలో మూడు రకాల కౌలుదార్లు ఉండేవారు

1) శాశ్వత కౌలుదార్లు: వీరికి భూమి యాజమాన్యంపై శాశ్వత హక్కు ఉంటుంది. నిర్ణీత శాతం కౌలుగా చెల్లిస్తారు. వారసత్వపు కౌలు హక్కు కలిగిన వీరికి భద్రత ఉండేది.

2) ఏ హక్కులు లేని కౌలుదార్లు: వీరికి భూయాజమాన్యంపై ఎలాంటి అధికారం లేకుండా భూస్వాముల దయాదాక్షిణ్యాలపై జీవిస్తూ వారు నిర్ణయించిన కౌలు మొత్తాన్ని చెల్లిస్తుంటారు. వీరికి భద్రత లేకపోగా దోపిడీకి గురయ్యేవారు.

3) ఉప కౌలుదార్లు: వీరు కౌలుదార్ల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు. వీరిని ఎలాంటి షరతులు లేకుండా తొలగించవచ్చు. ఉప కౌలుదార్లు కూడా ఎలాంటి భద్రత లేకుండా భూస్వాముల దోపిడీకి గురయ్యేవారు.

పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కౌలు సంస్కరణల చట్టాలు సత్ఫలితాలు చూపాయి. కౌలు సంస్కరణలు అంటే కౌలుదారుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు.

* కౌలు సంస్కరణల్లో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి.

 

ఎ) కౌలు పరిమాణ నిర్ణయం: భారత ప్రభుత్వం చట్టం ద్వారా కౌలు మొత్తాన్ని నిర్ణయించింది. మొదటి ప్రణాళిక (1951 - 56), రెండో ప్రణాళికల్లో (1956 - 61) ఈ కౌలు మొత్తం పంట ఉత్పత్తిలో నాలుగు లేదా అయిదు వంతుల కంటే ఎక్కువ ఉండకూడదని సూచించింది. అంతేకాకుండా ఈ కౌలు మొత్తాన్ని ద్రవ్యరూపంలో చెల్లించాలని నాలుగో ప్రణాళికలో (1969 - 74) సూచించింది. కౌలు పరిమాణం వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా  నిర్ణయించారు. 

* పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో 33.3%

* తమిళనాడులో 33.3% - 40% వరకు

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల భూమికి 25%, మిగిలిన భూములకు 20% 

* కేరళలో 25% - 50% వరకు కౌలు మొత్తంగా చెల్లించాలని నిర్ణయించారు.

 

బి) కౌలుదారులకు భద్రత కల్పించడం: కౌలుదారులను తరచూ తొలగించకుండా వారికి భూమిపై శాశ్వత హక్కులను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వీటి ముఖ్య ఉద్దేశం .....

* చట్టంలోని నిబంధనల ప్రకారం మాత్రమే కౌలుదారుల తొలగింపు జరిగేలా చూడటం.

* యజమాని సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నప్పుడే కౌలుకు ఇచ్చిన భూమి నుంచి కౌలుదారును తొలగించేందుకు వీలు కల్పించడం.

* సొంతంగా వ్యవసాయం చేయాలనుకొని కౌలుదారును భూమి నుంచి తొలగించేటప్పుడు కొంత పరిమాణంలో భూమిని కౌలుదారులకు తప్పనిసరిగా ఉంచడం.

ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కౌలు పరిమితి 6 సంవత్సరాలుగా నిర్ణయించారు.

 

సి) కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు: కౌలుదారులకు వారు సేద్యం చేస్తున్న భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రణాళిక ముసాయిదా పత్రాల్లో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. భూస్వాముల నుంచి భూములు తీసుకున్న కౌలుదారులు నష్టపరిహారాన్ని సులభమైన వాయిదాల్లో చెల్లించాలని, ఈ వాయిదాల పరిమాణం మొత్తం ఉత్పత్తిలో నాలుగో భాగానికి మించకూడదని ప్రణాళికా సంఘం సూచించింది.

* యాజమాన్య హక్కును చట్టబద్ధం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1993 అక్టోబరు 31న ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీని ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాలున్న వారికి మాత్రమే యాజమాన్య హక్కు ఉంటుంది.

 

భూగరిష్ఠ పరిమితి చట్టం

ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తమ అధీనంలో లేదా యాజమాన్యంలో ఉంచుకోవచ్చు అనేది భూగరిష్ఠ పరిమితి చట్టం. దీనికి సంబంధించి యూనిట్‌ అంటే కుటుంబం అని అర్థం. ఒక కుటుంబం అంటే 5 మంది వ్యక్తులు (భర్త, భార్య, ముగ్గురు పిల్లలు). 1950 దశాబ్దం చివరలో, 1960 దశాబ్దం ప్రారంభంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూగరిష్ఠ పరిమితి చట్టాలను ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లో, 1961లో మహారాష్ట్రలో తీసుకొచ్చారు.

 

1972 జులైలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో భూగరిష్ఠ పరిమితులకు సంబంధించి కింది నిర్ణయాలు తీసుకున్నారు.

* నీటిపారుదల వసతి ఉండి సంవత్సరానికి రెండు పంటలు పండే భూమి ఒక కుటుంబానికి 10 - 18 ఎకరాల వరకు ఉండవచ్చు.

* సంవత్సరానికి ఒకే పంట పండే భూమి అయితే 18 - 27 ఎకరాల వరకు ఉండవచ్చు.

* భూసారం ఒకేవిధంగా ఉండని భూమి అయితే 54 ఎకరాలు ఉండవచ్చు.

* కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య అయిదు మంది కంటే ఎక్కువ ఉంటే భూగరిష్ఠ పరిమితిని మించి అదనంగా భూమి కలిగి ఉండే వీలు కల్పించారు.

మినహాయింపులు:  టీ, కాఫీ తోటలు, ఇతర పండ్ల తోటలు, వ్యవసాయేతర అవసరాల కోసం పారిశ్రామిక, వాణిజ్య సంస్థల అధీనంలో ఉన్న భూములకు భూగరిష్ఠ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. చక్కెర కర్మాగారాలు 100 ఎకరాల వరకు భూమిని అధీనంలో ఉంచుకునేందుకు అనుమతించారు.

మిగులు భూమి పరిమాణం: భూగరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం 1961 - 71 మధ్య కాలంలో దేశంలో కేవలం 23 లక్షల ఎకరాల భూమిని మిగులు భూమిగా ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన మొత్తం విస్తీర్ణంలో ఇది కేవలం 2 శాతం. బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మిగులు భూమి లేదని పేర్కొన్నారు. 1972 జాతీయ నిబంధనల సూచిక ప్రకారం రెండు పంటలు పండే సాగు నేలకు 4.05 నుంచి 7.28 హెక్టార్లుగా, ఒక పంట పండే సాగు భూమికి 10.93 హెక్టార్లుగా మెట్ట భూముల గరిష్ఠ పరిమితి విధించారు.

 

కమతాల సమీకరణ చట్టం

భూకమతాల పరిమాణం తక్కువైతే వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కమతాల సమీకరణ చట్టాన్ని అమలు చేసింది. కమతాల సమీకరణ అంటే ఒక గ్రామంలోని భూములన్నింటినీ ఒక క్షేత్రంగా మార్చి లాభసాటి కమతాలుగా విభజిస్తారు. విఘటన జరిగిన కమతాలను ఒకేచోట ఉండేలా ఏర్పాటుచేసే పద్ధతిని కమతాల ఏకీకరణ లేదా కమతాల సమీకరణ అంటారు.

 

* కమతాల సమీకరణను రెండు విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు.

1) ఒక గ్రామంలోని కమతాలన్నీ ఒక బ్లాకుగా ఏర్పాటుచేసి ఒక్కో వ్యక్తికి అతడి భూమి విలువకు సమానంగా ఉండేలా ఒకేచోట ఇస్తారు.

2) ఒకరికొకరు స్వచ్ఛందంగా తమ భూములను మార్పు చేసుకొని భూమి అంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

 

     కమతాల సమీకరణ చట్టాన్ని మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమలుచేశారు. ఈ విధానంలో భాగంగా సహకార వ్యవసాయాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రణాళికలో చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చట్టాలు అమలుచేయలేదు. బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని నిలిపివేశారు.

* భూకమతాల విభజన అంటే కుటుంబంలోని సంతానం మధ్య మొత్తం భూమి ఆస్తుల విభజన.

* భూకమతాల విఘటన అంటే ప్రతి స్థలంలో ఉన్న భూమిని కుటుంబంలోని సంతానం మధ్య పంపిణీ చేయడం.

* ‘ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో భూపునఃవిభజన తప్పనిసరి అయింది’ అని డి.ఆర్‌.గాడ్గిల్‌ భూసంస్కరణల కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.

 

భూగరిష్ఠ పరిమితి విధానం ఆశయాలు: 

* భూమి లేని వారి అవసరాలు తీర్చడం.

* భూయాజమాన్యంలో ఉన్న అసమానతలు తగ్గించి, గ్రామీణ ప్రాంతాల్లో సహకార పద్ధతిని అభివృద్ధి పరచడం.

* భూయాజమాన్యం ద్వారా స్వయం ఉపాధిని విస్తరించడం.

 

భూమి రెవెన్యూ రికార్డు - అడంగల్‌/పహాణి: భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డును అడంగల్‌ లేదా పహాణి అంటారు. ప్రతి గ్రామానికి ఒక అడంగల్‌  ఉంటుంది. దీన్ని  గ్రామాధికారులు నిర్వహిస్తారు. భూమికి సంబంధించిన సర్వే సంఖ్య, సబ్‌ డివిజన్‌ సంఖ్య, భూమి విస్తీర్ణం, సాగుకు పనికి వచ్చే విస్తీర్ణం, పనికిరాని విస్తీర్ణం, భూమి స్వభావం, శిస్తు భూమి వివరణ, జలాధారం, ఆయకట్టు విస్తీర్ణం, ఖాతా సంఖ్య, పట్టాదారు పేరు, అనుభవదారు పేరు, అనుభవ విస్తీర్ణం, అనుభవ స్వభావం లాంటి వివరాలు ఇందులో ఉంటాయి. ఈ వివరాలన్నీ కంప్యూటరీకరించినప్పుడు నకలు పొందడానికి వీలవుతుంది.

రచయిత: బండారి ధనుంజయ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

‣  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూసంస్కరణ చట్టాల అమలు-లోపాలు

అడుగడుగునా అడ్డుగోడలు!

 

సమాజంలో అసమానతలను తొలగించేందుకు రూపొందించిన భూసంస్కరణలు అనేక కారణాల వల్ల సమగ్ర అమలుకు నోచుకోలేదు. బలహీన వర్గాలకు సాంఘిక న్యాయాన్ని అందించేందుకు చేసిన భూచట్టాలు, ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఆశించిన ఫలితాలను అందించలేదు. అవినీతి, అక్రమాలు, రాజకీయ జోక్యం అడుగడుగునా అడ్డుగోడలుగా మారాయి. ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

పేదరికం, నిరుద్యోగితను నిర్మూలించి బలహీన వర్గాలను ఆదుకోవడాన్ని సాంఘిక న్యాయం అంటారు. ఆదాయం, సంపద వినియోగాల్లో ఉండే అసమానతలను తగ్గించడమూ అందులో భాగమే. భూ సంస్కరణల వల్ల సాంఘిక న్యాయం జరుగుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. వివిధ రాష్ట్రాలు భూ సంస్కరణ చట్టాలను వివిధ స్థాయుల్లో అమలు పరిచాయి. కానీ అవన్నీ ఒకే రకంగా లేవు. ఏకీకృతం చేయడానికి  జాతీయ భూ సంస్కరణల మండలిని (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ల్యాండ్‌ రిఫార్మ్స్‌) 2008లో స్థాపించినప్పటికీ ఆశించిన ఫలితం అందలేదు. 

1991 నుంచి అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగా భూ సంస్కరణల అంశం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. సరళీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదు. 9వ పంచవర్ష ప్రణాళిక (1997-2002) ముగిసే నాటికి కూడా భూ గరిష్ఠ పరిమితి చట్టంలో ఎలాంటి మార్పు లేదు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో కౌలు సంస్కరణలు కొత్త సమస్యలను సృష్టించాయి. అప్రకటిత/రాతపూర్వకం కాని విధానం పెరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక (2002-07) వ్యవసాయ వాణిజ్యీకరణ, వ్యవసాయ భూముల లీజు, భాటకాన్ని మార్కెట్‌ నిర్ణయించే ప్రస్థానాన్ని వేగవంతం చేసింది. ఈ ప్రణాళికా కాలంలో పూర్వపు భూసంస్కరణలు, వాటి లక్ష్యాలకు ప్రాధాన్యం తగ్గింది. నోబెల్‌ బహుమతి గ్రహీత ఆచార్య అమర్త్యసేన్‌ ప్రకారం ఆర్థిక సంస్కరణల ఫలితాలు అందరికీ అందాలంటే భూ సంస్కరణలు అమలు జరగాలి. 

భూసంస్కరణలు పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో విజయవంతమయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో అమలులో జాప్యానికి, వైఫల్యాలకు కింది అంశాలను కారణాలుగా పేర్కొనవచ్చు.  

* రాష్ట్రాల్లో చట్టాలు రూపొందించడంలో విపరీతమైన ఆలస్యం చేయడంతో భూముల బదలాయింపులు జరిగిపోయాయి. దీనివల్ల న్యాయంగా ఆశించినంత మిగులు భూమి సమకూరలేదు.

* చట్టాలు లోపభూయిష్టంగా ఉండటంతో న్యాయస్థానాల్లో కేసులు వేశారు. దాంతో జాప్యం జరిగింది.

* చట్టాలను సమర్థంగా అమలుచేయడానికి అవసరమైన యంత్రాంగం లేకపోవడం మరో లోపం. 

* మధ్యవర్తులైన జమీందార్లను తొలగించడంతో వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారంపై న్యాయస్థానాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో భూసంస్కరణల వల్ల ఆశించిన ఫలితాలు అందలేదు.

* భూగరిష్ఠ పరిమితి చట్టంలో అనేక మినహాయింపులు ఇవ్వడంతో మిగులు భూమి తగ్గిపోయింది.

* చట్టాల అమలుకు అవసరమైన దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రభుత్వాలు భూసంస్కరణల పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించాయి.

* ఉద్యోగస్వామ్య దృక్పథం, అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడం, అవినీతి, అసమర్థత, రాజకీయ జోక్యం, లోపాయికారీ అక్రమాలు అడ్డుగోడలుగా మారాయి.

* సమాచార లోపం, రికార్డుల్లో లోపాలతో సంస్కరణల అమలు ఆలస్యమైంది.

* భూమి యజమానితో కౌలుదార్లు నిర్దిష్టమైన రాతపూర్వక ఒప్పందాలు చేసుకోకపోవడం వల్ల వారికి ప్రభుత్వం విధానాల కారణంగా రావాల్సిన కొన్ని రాయితీలు, పరపతి, బీమా లాంటి ప్రయోజనాలు అందలేదు.

* జమీందారీ వ్యవస్థ అంతరించి అనుపస్థిత భూస్వాములు పెరిగారు. వారి వల్ల చాలా భూమి నిరుపయోగంగా ఉండిపోయింది.

* కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం లాంటి విధానాలు విజయవంతం కాలేదు. దీనివల్ల వ్యవసాయాభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించేందుకు దోహదపడే భారీస్థాయి వ్యవసాయం అమలుకు వీలు కాలేదు.

* ప్రభుత్వం వివిధ ప్రణాళికల్లో అమలుచేసిన గ్రామీణాభివృద్ధి పథకాలు, పేదరిక నిర్మూలన, ఉపాధి పథకాల వల్ల ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికులు లబ్ధి పొందారు. దాంతో వారి నుంచి భూసంస్కరణల అమలు కోసం ప్రభుత్వంపై తగినంత ఒత్తిడి రాలేదు.

* కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల అమలును నిర్లక్ష్యం చేయడం వల్ల షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీ విస్తరణ చట్టం (పెసా) పరిధిలోని అనేక అంశాలు వెలుగుచూడలేదు. సామాజిక ఆస్తులు, వనరుల సర్వే చేపట్టడానికి శిక్షణ ద్వారా సమర్థ  నిర్మాణం చేయాల్సిన భూవినియోగ బోర్డుకు వనరులు లేక సాధికారతను పొందలేదు. గ్రామసభల సాధికారత జరగలేదు. భూసంబంధ విధానాలు కొరవడి మహిళల భూయాజమాన్య హక్కులు కూడా సాకారం కాలేదు.

       నీతి ఆయోగ్‌ 2016లో మోడల్‌ అగ్రికల్చరల్‌ లాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌ను రూపొందించింది. వివిధ రాష్ట్రాల్లో కౌలు చట్టాలను సమీక్షించడానికి నీతి ఆయోగ్‌ టి.హఖ్‌ అధ్యక్షతన ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఆన్‌ లాండ్‌ లీజింగ్‌ను ఏర్పాటు చేసింది. భూమి లేని ఉపాంత రైతులకు వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వడానికి ఉన్న అవకాశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఉపాంత రైతులకు సంస్థాగత పరపతి సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తుంది.

భూసేకరణ చట్టం - 2013 (Right to fair compensation and transparency in land acquisition and resettlement act - 2013)ను 2014 నుంచి అమలుచేశారు. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారమే భూసేకరణ జరుగుతోంది. భూరికార్డుల డిజిటలైజేషన్‌ కింద కర్ణాటకలో చేపట్టిన భూమి ప్రాజెక్టు ముఖ్యమైంది. రాజస్థాన్‌ ప్రభుత్వం 2016లో అర్బన్‌ లాండ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది.

 

భూ సంస్కరణల చట్టం ముసాయిదా-2013

కేంద్ర ప్రభుత్వం 2013, ఆగస్టు 12న కొత్త భూసంస్కరణ చట్టం ముసాయిదాను తయారుచేసింది. 

ఈ చట్టంలోని అంశాలు: * గ్రామాల్లో భూమి లేని పేదలందరికీ భూపంపిణీ చేయడం.

* దళితులు, గిరిజన వర్గాల నుంచి అన్యాయంగా తీసుకున్న భూములను తిరిగి ఇప్పించడం.

* లీజు చట్టం విధానాలను సడలించడం.

* భూమిపై మహిళల హక్కులను పెంచడం.

2015 డిసెంబరు నాటికి దేశంలో 6.7 మిలియన్‌ ఎకరాల భూమిని ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించింది. ఇందులో 6.1 మిలియన్‌ ఎకరాలను స్వాధీనం చేసుకొని దానిలో 5.1 మిలియన్‌ ఎకరాలను 5.78 మిలియన్ల ప్రజలకు పంపిణీ చేసింది.

తెలంగాణ - ధరణి పోర్టల్‌:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020, అక్టోబరు 29న ప్రారంభించిన సంఘటిత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ ధరణి. ఇది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించినది. 2020, నవంబరు 23న వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ కూడా మొదలైంది. మా భూమి (ధరణి) ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ప్రజలు, పట్టాదారులు తమ భూముల వివరాలను నేరుగా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. పహాణి (అడంగల్‌) ఆర్‌ఓఆర్‌. (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) డాక్యుమెంట్లను దీని ద్వారా పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ - భూధార్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015, జూన్‌ 13న ‘మీ భూమి’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది భూయజమానులు, పౌరులు తమ భూముల వివరాలు తెలుసుకునే ఎలక్ట్రానిక్‌ సౌకర్యం. అయితే 8 ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారాన్ని ఒకే చోట నుంచి తెలుసుకోవడానికి భూసేవ ప్రాధికార సంస్థను నెలకొల్పి దాని ద్వారా 2015 నవంబరులో ‘భూధార్‌ కార్యక్రమం’ను ప్రారంభించింది. ఆధార్‌లో ఉన్నట్లు  భూధార్‌ కూడా 11 అంకెలతో ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. అన్ని పత్రాల్లో భూధార్‌ను చట్టపరంగా ఉపయోగించడానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 2019, ఫిబ్రవరి 18న ఆమోదం తెలిపింది. ఈ తరహా ఏర్పాటు దేశంలోనే తొలిసారి జరిగింది. రెవెన్యూ పరిధిలోని 99.15% భూములకు శాశ్వత భూధార్‌ సంఖ్యలను కేటాయించారు.

 

భూ కమతాలు

వ్యవసాయ కమతం: రైతు సేద్యం చేసే భూమిని వ్యవసాయ కమతం అంటారు. ఒక ప్రాంతంలో సేద్యం చేసే భూ విస్తీర్ణాన్ని వ్యవసాయ కమతం అని, ఆ కమతంలో సాగయ్యే విస్తీర్ణాన్ని సాగు కమతం అంటారు. భూ కమతం అంటే ఒక రైతుకు సాగు చేసుకోవడానికి ఉన్న భూమి విస్తీర్ణం. కమతం అంటే భూమి, పొలం, చేను.

కమతం పరిమాణాన్ని అయిదు రకాలుగా వర్గీకరించారు.

1) ఉపాంత కమతం/ఉపాంత రైతు: ఒక హెక్టారు (సుమారు 2.5 ఎకరాలు) కంటే తక్కువ పరిమాణం ఉన్న వ్యవసాయ భూమిని ఉపాంత కమతం అంటారు. అలాంటి కమతాన్ని సాగు చేసే రైతులను ఉపాంత రైతులు అంటారు.

2) చిన్న కమతం: 1 నుంచి 2 హెక్టార్ల (2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు) మధ్య ఉన్న సాగు భూమిని చిన్న కమతం అంటారు. దీన్ని సాగు చేసే రైతులను చిన్నకారు రైతులు అంటారు.

3) చిన్న మధ్యస్థ కమతం: 2 నుంచి 4 హెక్టార్ల పరిమాణం ఉన్న కమతాన్ని చిన్న మధ్యస్థ కమతం అంటారు. వీటిని సాగు చేసే వారిని చిన్న మధ్యస్థ రైతులు అంటారు.

4) మధ్యస్థ కమతం: 4 నుంచి 10 హెక్టార్ల పరిమాణం ఉన్న కమతాన్ని మధ్యస్థ కమతం అంటారు. వాటిని సాగు చేసే రైతులను మధ్యస్థ రైతులు అంటారు.

5) పెద్దకమతం/భూస్వామి/పెద్ద రైతు: 10 హెక్టార్లు (25 ఎకరాలు), అంతకంటే ఎక్కువ ఉన్న రైతును భూస్వామి అంటారు.

మన దేశంలో సగటు భూకమత పరిమాణం 2015 - 16 వాటికి 1.08 హెక్టార్లుగా ఉంది.

 

మాదిరి ప్రశ్నలు


1. జమీందారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు?

1) కారన్‌ వాలీస్‌    2) థామస్‌ మన్రో  3) విలియం బెంటింక్‌   4) జె.సి.కూమారప్ప


2. జమీందారీ పద్ధతిని ఏమని పిలుస్తారు?

1) తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం     2) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి

3) సామాజిక వ్యవసాయక విధానం     4) రైతు శిస్తు నిర్ణయ విధానం


3. రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) జె.సి.కుమారప్ప    2) థామస్‌ మన్రో     3) కారన్‌ వాలీస్‌      4) విలియం బెంటింక్‌ 


4. మహల్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) థామస్‌ మన్రో     2) విలియం బెంటింక్‌     3) కారన్‌ వాలీస్‌     4) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ


5. కిందివాటిని జతపరచండి. 

i) 1793                a) రైత్వారీ పద్ధతి

ii) 1820               b) జమీందారీ పద్ధతి

iii) 1948              c) మహల్వారీ పద్ధతి 

iv) 1833              d) వ్యవసాయ సంస్కరణల కమిటీ               

1) i-b, ii-a, iii-d, iv-c             2) i-b, ii-a, iii-c, iv-d
3) i-a, ii-b, iii-c, iv-d             4) i-b, ii-c, iii-a, iv-d


6. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఎప్పుడు చేశారు? 

1) 1946      2) 1947      3) 1948      4) 1949


7. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు ఎవరి అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది?

1) జె.సి.కుమారప్ప      2) డి.ఆర్‌.గాడ్గిల్‌     3) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ   4) జవహర్‌లాల్‌ నెహ్రూ


8. భూ గరిష్ఠ పరిమితికి సంబంధించి యూనిట్‌ అంటే?

1) కుటుంబం (భర్త, భార్య, ముగ్గురు మైనర్‌ పిల్లలు)     2) ఉమ్మడి కుటుంబం

3) వారసత్వ కుటుంబం        4) అన్నీ 


9. ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తన యాజమాన్యంలో ఉంచుకోవచ్చని తెలిపే చట్టం?

1) భూ సంస్కరణల చట్టం    2) భూ గరిష్ఠ పరిమితి చట్టం

3) కౌలుదారీ చట్టం          4) కౌలు భద్రత చట్టం


10. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం?

1) మద్రాస్‌      2) పశ్చిమ బెంగాల్‌       3) ఆగ్రా       4) అవధ్‌

 

సమాధానాలు 

1-1, 2-2, 3-2, 4-2, 5-1, 6-3, 7-1, 8-1, 9-2, 10-1.

రచయిత: బండారి ధనుంజయ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

‣  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు

మాదిరి ప్రశ్నలు


1. జమీందారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు?

1) కారన్‌ వాలీస్‌    2) థామస్‌ మన్రో  3) విలియం బెంటింక్‌   4) జె.సి.కూమారప్ప


2. జమీందారీ పద్ధతిని ఏమని పిలుస్తారు?

1) తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం     2) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి

3) సామాజిక వ్యవసాయక విధానం     4) రైతు శిస్తు నిర్ణయ విధానం


3. రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) జె.సి.కుమారప్ప    2) థామస్‌ మన్రో     3) కారన్‌ వాలీస్‌      4) విలియం బెంటింక్‌ 


4. మహల్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) థామస్‌ మన్రో     2) విలియం బెంటింక్‌     3) కారన్‌ వాలీస్‌     4) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ


5. కిందివాటిని జతపరచండి. 

i) 1793                a) రైత్వారీ పద్ధతి

ii) 1820               b) జమీందారీ పద్ధతి

iii) 1948              c) మహల్వారీ పద్ధతి 

iv) 1833              d) వ్యవసాయ సంస్కరణల కమిటీ               

1) i-b, ii-a, iii-d, iv-c             2) i-b, ii-a, iii-c, iv-d
3) i-a, ii-b, iii-c, iv-d             4) i-b, ii-c, iii-a, iv-d


6. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఎప్పుడు చేశారు? 

1) 1946      2) 1947      3) 1948      4) 1949


7. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు ఎవరి అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది?

1) జె.సి.కుమారప్ప      2) డి.ఆర్‌.గాడ్గిల్‌     3) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ   4) జవహర్‌లాల్‌ నెహ్రూ


8. భూ గరిష్ఠ పరిమితికి సంబంధించి యూనిట్‌ అంటే?

1) కుటుంబం (భర్త, భార్య, ముగ్గురు మైనర్‌ పిల్లలు)    

2) ఉమ్మడి కుటుంబం

3) వారసత్వ కుటుంబం        4) అన్నీ 


9. ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తన యాజమాన్యంలో ఉంచుకోవచ్చని తెలిపే చట్టం?

1) భూ సంస్కరణల చట్టం    2) భూ గరిష్ఠ పరిమితి చట్టం

3) కౌలుదారీ చట్టం          4) కౌలు భద్రత చట్టం

 

10. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం?

1) మద్రాస్‌      2) పశ్చిమ బెంగాల్‌       3) ఆగ్రా       4) అవధ్‌

 

సమాధానాలు 

1-1, 2-2, 3-2, 4-2, 5-1, 6-3, 7-1, 8-1, 9-2, 10-1.

Posted Date : 07-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పన్నుల సంస్కరణలు - రాబడి మార్పులు

విధిస్తే విధిగా చెల్లించాల్సిందే!

 

  ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని సమకూర్చుకోడానికి రకరకాల పన్నులు విధిస్తుంది. ఒకసారి నిర్ణయించి, విధిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధిగా చెల్లించాల్సిందే. ప్రత్యక్ష లేదా పరోక్ష మార్గాల్లో పన్ను వసూళ్లు జరుగుతాయి. మన దేశంలో అమలవుతున్న ఈ పన్నుల వ్యవస్థ, అందులో వచ్చిన సంస్కరణలు, ఇతర మార్పుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని 268, 300వ అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించారు.  

1) కేంద్ర జాబితా 

2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా

వీటిని అనుసరించే పన్నులు విధించే అధికారాన్ని స్పష్టం చేశారు. 

  భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడిని ఇచ్చే పన్నులు కేంద్ర పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులు విధించి రాబడిని సమకూర్చుకుంటాయి. కేంద్ర పన్నుల రాబడితో పోలిస్తే రాష్ట్ర పన్నుల నుంచి తక్కువ ఆదాయం లభిస్తుంది.

పన్నుల విధింపు, వసూలు రాబడి వినియోగాన్ని బట్టి పన్నులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) కేంద్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా తానే వినియోగించుకునే పన్నులు.

2) రాష్ట్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా రాష్ట్రాలే వినియోగించుకునే పన్నులు.

3) కేంద్రం విధించి, వసూలు చేసి నికర రాబడిని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నులు.

 

స్థానిక సంస్థల పన్నులు

భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బదలాయింపు ఒకేరకంగా లేదు. అయినా భూమి, భవనాలు, వాహనాలు, వినోదం, ప్రకటనలపై పన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను, టెర్మినల్‌ పన్ను, వృత్తులు, వ్యాపారాలు, ప్రయాణికులు, సరకులు, వస్తువులు, ఆస్తి బదిలీపై పన్ను లాంటివి స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. 

 

ప్రభుత్వ రాబడి 

ప్రభుత్వానికి ప్రధానంగా రెండు మార్గాల నుంచి రాబడి లభిస్తుంది. 

1) సొంత పన్నుల రాబడి      

2) పన్నేతర రాబడి 

 

పన్నుల వర్గీకరణ 

పన్నులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ప్రత్యక్ష పన్నులు (Direct Tax): ఆదాయం, ఆస్తులపై విధించే పన్నులు. 

పరోక్ష పన్నులు (Indirect Tax): వస్తుసేవల ఉత్పత్తిపై విధించే పన్నులు.

 

పంపిణీ న్యాయం ఆధారంగా విధించే పన్నులు

అనుపాత పన్ను (Proportional Tax):  పన్ను విధింపునకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్నురేటును వర్తింపజేస్తే, అది అనుపాత పన్ను అవుతుంది.

పురోగామి పన్ను (Progressive Tax): పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ పన్నురేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు.

తిరోగామి పన్ను (Regressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గితే తిరోగామి పన్ను.

డిగ్రెసివ్‌ పన్ను (Degressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరుగుతూ ఉన్నప్పటికీ పురోగామిత్వం క్షీణిస్తూ ఆదాయం పెరిగినంత వేగంగా త్యాగం పెరగకపోతే అది డిగ్రెసివ్‌ పన్ను అవుతుంది.

 

వస్తువు విలువ లేదా పరిమాణం ఆధారంగా విధించే పన్నులు  

మూల్యానుగత పన్ను (ad valorem tax): ఇది వస్తువు విలువను బట్టి విధించే పన్ను. కొన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈ పద్ధతిలోనే విధిస్తారు.

నిర్దిష్టమైన పన్ను (Specific Tax): ఒక వస్తువు బరువు లేదా పరిమాణాన్ని బట్టి పన్ను విధిస్తే అది నిర్దిష్టమైన పన్ను.

 

కేంద్ర ప్రభత్వ సొంత పన్నుల రాబడి

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు: 

* వ్యక్తిగత ఆదాయపు పన్ను (1860) 

* కార్పొరేషన్‌ పన్ను (1965 - 66) 

* వడ్డీపై పన్ను (1974) 

* వ్యయ పన్ను (1957) 

* సంపద పన్ను (1957) (ప్రస్తుతం రద్దు) 

* ఎస్టేట్‌ డ్యూటీ (1953) 

* కానుక/బహుమతి పన్ను (1958)

వస్తుసేవలపై పన్నులు : కేంద్ర ప్రభుత్వానికి వస్తుసేవల పన్ను ద్వారా అధిక రాబడి వస్తుంది. అందువల్ల ఇవి ప్రధానమైన పన్నులు. 

1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం: ఇది ఉత్పత్తిపై విధించే పన్ను. మద్యం, మత్తుపదార్థాలు తప్ప అన్ని ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంది. ఎక్సైజ్‌ సుంకం పరోక్ష పన్ను, అనుపాత పన్ను అని రెండు రకాలు.

2) కస్టమ్స్‌ సుంకాలు: ఎగుమతి, దిగుమతుల మీద విధించే పన్నులు కస్టమ్స్‌ సుంకాలు. 

3) సేవలపై పన్ను: తొలిసారిగా ఈ పన్నును 1994 - 95లో విధించారు. 1994 జులై 1 నుంచి టెలిఫోన్, స్టాక్‌ బ్రోకర్, జనరల్‌ బీమా లాంటి సేవల మీద సేవాపన్ను విధిస్తున్నారు.

 

కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా రాబడి వస్తుంది. ముఖ్యంగా రైల్వేలు, పోలీసు, అడవులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నుంచి రాబడి వస్తుంది. దీన్ని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడి ప్రధానంగా మూడు మార్గాల నుంచి లభిస్తుంది.  

1) పరిపాలన సేవలు: పోలీసులు, జైళ్లు, కోర్టులు 

2) సాంఘిక సేవలు: విద్య, వైద్యం 

3) ఆర్థిక సేవలు: నీటిపారుదల పన్ను, విద్యుచ్ఛక్తి పన్ను

 

కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడికి సంబంధించి రెండు రెవెన్యూ అధికార సంస్థలు ఉన్నాయి.

1) ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ ్బదితీదీగ్శి: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఒక భాగమే ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానం, ప్రణాళికలు నిర్ణయించడమే ఈ సంస్థ ముఖ్యమైన విధి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను తయారు చేయడం దీని బాధ్యత.

2) ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ ్బదితీనిద్శి: ఆర్థిక మంత్రిత్వ శాఖలో గల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మరొక భాగమే ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ. ఇది ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్నులు, పరిపాలన సంబంధిత నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. వస్తుసేవల పన్నులను అమలు చేయడం వల్ల ఈ సంస్థ పేరును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ ్బదితీఖిద్శి గా మార్చారు. ఇది వస్తుసేవల పన్ను విధానాల రూపకల్పన అమలు, వసూలుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తుంది.

 

దేశంలో పన్నుల సంస్కరణలు - కమిటీలు  

* 1953  - జాన్‌ మతాయ్‌ సంఘం

* 1956 - నికోలస్‌ కాల్డార్‌ సంఘం (వ్యయంపై పన్ను)

* 1959 - మహవీర్‌ త్యాగి సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన)

* 1967 - భూతలింగం సంఘం (పన్ను విధానాల ఆధునికీకరణ)

* 1970 - కె.ఎస్‌.వాంఛూ సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన, పన్నుల ఎగవేత, నల్లధనం)

* 1972 - కె.ఎస్‌.రాజ్‌ సంఘం (వ్యవసాయం, వ్యవసాయ సంపదపై పన్ను)

* 1977 - సి.సి.చోక్సీ సంఘం (ప్రత్యక్ష పన్నుల రేషనలైజేషన్‌) 

* 1981 - ఎల్‌.కె.ఝా సంఘం (పరోక్ష పన్నుల పరిశీలన)

* 1991 - ఆర్‌.చెల్లయ్య సంఘం (పన్నుల సంస్కరణలు)

* 2002 - ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ సంఘం (ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు)

* 2012 - పార్థసారథి షోమ్‌ సంఘం (యాంటీ ఆవాయిడెన్స్‌ టాక్స్‌)  

 

కలపబడిన విలువ పన్ను (VAT - Value Added Tax)

అమ్మకం పన్ను చట్టం స్థానంలో వ్యాట్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. వ్యాట్‌ అనేది పరోక్ష పన్ను. మన దేశంలో మొదటిసారి 2003 ఏప్రిల్‌లో వ్యాట్‌ను అమలు చేసిన రాష్ట్రం హరియాణా. 2005 ఏప్రిల్‌ 1న దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 2012 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 

* సవరించిన కలపబడిన విలువ పన్ను(Modified Value Added Tax - MODVAT)ను1986లో ఎల్‌.కె.ఝా నేతృత్వంలో ప్రవేశపెట్టారు.

* కేంద్ర కలపబడిన విలువ పన్ను(CENVAT - Central Value Added Tax)ను 2004లో ప్రవేశపెట్టారు. మాడ్‌ వ్యాట్‌ను సెన్‌ వ్యాట్‌ పథకంగా మార్చారు. ప్రపంచంలో తొలిసారిగా వ్యాట్‌ను ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్‌ (1954). టర్నోవర్‌ ట్యాక్స్‌కు బదులుగా వ్యాట్‌ను ప్రవేశపెట్టింది.  

 

వస్తుసేవల పన్ను (Goods and Service Tax)

దేశంలో వ్యాట్‌ స్థానంలో జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌)ని ప్రవేశపెట్టారు. జీఎస్టీ పరోక్ష పన్ను. ప్రపంచంలో తొలిసారిగా జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్‌ (1954). మన దేశంలో తొలిసారిగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది. అదే సంవత్సరంలో అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణ కోసం డాక్టర్‌ సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ల నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీఎస్టీ విధి విధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి ఆసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. 

* జీఎస్టీ రూపశిల్పి ఆసిమ్‌దాస్‌ గుప్తా. దీని నినాదం ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌.

* జీఎస్టీ అంటే అన్ని వస్తుసేవలపై దేశమంతటా ఒకేలా విధించే పరోక్ష పన్ను.

* మన దేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అసోం (2016 ఆగస్టు 12).

  పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. జీఎస్టీ బిల్లు 2016 ఆగస్టు 3న రాజ్యసభ, ఆగస్టు 8న లోక్‌సభలో ఆమోదం పొందింది. 2016 సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 

జీఎస్టీ మండలి: జీఎస్టీ కౌన్సిల్‌ను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలో సవరించిన ఆర్టికల్‌ 279్బత్శ్బి1్శ ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన జీఎస్టీ మండలిని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి వేదిక అంటారు.

 

జీఎస్టీ నాలుగు రకాలు 

1) కేంద్ర జీఎస్టీ

2) స్టేట్‌ జీఎస్టీ

3) ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ

4) యూజీఎస్టీ

జీఎస్టీ కౌన్సిల్‌ నాలుగు రకాల పన్నురేట్లను నిర్ణయించింది. దీని ప్రకారం 5%, 12%, 18%, 28% పన్నురేట్లను ప్రతిపాదించింది. మొత్తం 1211 వస్తువులపై పన్నురేట్లను నిర్ణయించారు. మరో 500 రకాల సేవలపై జీఎస్టీని ప్రకటించింది.

 

భారత ఆర్థిక సంఘం (విత్తసంఘం)

  భారత రాజ్యాంగంలోని అధికరణం 280 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకు లేదా అంతకంటే ముందుగా విత్తసంఘాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికేతర విత్తవనరుల బదిలీ, పంపిణీ సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధమైన సంస్థ. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు బదిలీ చేయడానికి ప్రాతిపదికను సూచించడం విత్తసంఘం విధి. 1951 నుంచి 2017 వరకు 15 విత్తసంఘాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సంఘం ప్రధాన కార్యాలయమైన జవహర్‌ వ్యాపార్‌ భవన్‌ న్యూదిల్లీలో ఉంది. మొదటి ఆర్థిక సంఘాన్ని 1951 నవంబరు 22న, 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరు 27న ఏర్పాటు చేశారు. 

  15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ (నందకిషోర్‌ సింగ్‌). ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఉంటారు. ప్రస్తుత కార్యనిర్వహణాధికారి అరవింద్‌ మెహతా. 15వ ఆర్థికసంఘం ప్రస్తుత సభ్యులు అజయ్‌ నారాయణ్‌ ఝూ, ప్రొఫెసర్‌ అనూప్‌సింగ్, అశోక్‌ లాహిరి, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌. ఈ ఆర్థిక సంఘం సిఫారసులు 2020 - 26 వరకు అమల్లో ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1) వస్తుసేవల పన్నును (జీఎస్టీ) మన దేశంలో ఎప్పుడు అమలు చేశారు?

1) 2017 జులై 1           2) 2016 జులై 1 

2) 2017 జులై 4            3) 2017 జులై 2 

 

2. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పన్నుల విధింపు వసూలు అంశాలను తెలియజేస్తుంది?

1) 268వ అధికరణ            2) 300వ అధికరణ               3) 1, 2          4) 280వ అధికరణ

 

3. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు? 

1) 5వ షెడ్యూల్‌            2) 6వ షెడ్యూల్‌ 

3) 7వ షెడ్యూల్‌            4) 8వ షెడ్యూల్‌

 

4. ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరిగితే అది 

1) పురోగామి పన్ను            2) తిరోగామి పన్ను            3) వ్యాట్‌         4) జీఎస్టీ

 

5. తిరోగామి పన్ను అంటే?

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గడం.

2) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరగడం.

3) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

4) పైవన్నీ 

 

6. అనుపాతపు పన్ను అంటే? 

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

2) పన్నురేటు స్థిరంగా లేకపోవడం. 

3) ఆదాయం పెరుగుతున్నప్పటికీ పురోగామిత్వం క్షీణించడం. 

4) పైవన్నీ

 

7. వస్తువు విలువను బట్టి విధించే పన్ను?  

1) మూల్యానుగత పన్ను        2) నిర్దిష్ట పన్ను 

3) వ్యాట్‌                        4) జీఎస్టీ 

 

8. కలపబడిన విలువపన్ను (వ్యాట్‌) ను తొలిసారిగా దేశంలో ఏ రాష్ట్రం, ఎప్పుడు అమలు చేసింది? 

1) హరియాణా, 2003            2) ఒడిశా, 2004 

3) అసోం, 2005                 4) గుజరాత్, 2006 

 

9. వ్యాట్‌ను దేని స్థానంలో ప్రవేశపెట్టారు? 

1) టర్నోవర్‌ పన్ను             2) అమ్మకం పన్ను 

3) ఆక్ట్రాయ్‌ పన్ను               4) ఎక్సైజ్‌ సుంకం 

 

10. వ్యాట్‌ ఒక 

1) పరోక్ష పన్ను             2) ప్రత్యక్ష పన్ను 

3) పురోగామి పన్ను         4) తిరోగామి పన్ను 

 

సమాధానాలు

1-1     2-3     3-3     4-1     5-1     6-1     7-1     8-1     9-2     10-1.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పన్నుల సంస్కరణలు - రాబడి మార్పులు

విధిస్తే విధిగా చెల్లించాల్సిందే!

 

  ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని సమకూర్చుకోడానికి రకరకాల పన్నులు విధిస్తుంది. ఒకసారి నిర్ణయించి, విధిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధిగా చెల్లించాల్సిందే. ప్రత్యక్ష లేదా పరోక్ష మార్గాల్లో పన్ను వసూళ్లు జరుగుతాయి. మన దేశంలో అమలవుతున్న ఈ పన్నుల వ్యవస్థ, అందులో వచ్చిన సంస్కరణలు, ఇతర మార్పుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని 268, 300వ అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించారు.  

1) కేంద్ర జాబితా 

2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా

వీటిని అనుసరించే పన్నులు విధించే అధికారాన్ని స్పష్టం చేశారు. 

  భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడిని ఇచ్చే పన్నులు కేంద్ర పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులు విధించి రాబడిని సమకూర్చుకుంటాయి. కేంద్ర పన్నుల రాబడితో పోలిస్తే రాష్ట్ర పన్నుల నుంచి తక్కువ ఆదాయం లభిస్తుంది.

పన్నుల విధింపు, వసూలు రాబడి వినియోగాన్ని బట్టి పన్నులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) కేంద్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా తానే వినియోగించుకునే పన్నులు.

2) రాష్ట్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా రాష్ట్రాలే వినియోగించుకునే పన్నులు.

3) కేంద్రం విధించి, వసూలు చేసి నికర రాబడిని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నులు.

 

స్థానిక సంస్థల పన్నులు

భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బదలాయింపు ఒకేరకంగా లేదు. అయినా భూమి, భవనాలు, వాహనాలు, వినోదం, ప్రకటనలపై పన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను, టెర్మినల్‌ పన్ను, వృత్తులు, వ్యాపారాలు, ప్రయాణికులు, సరకులు, వస్తువులు, ఆస్తి బదిలీపై పన్ను లాంటివి స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. 

 

ప్రభుత్వ రాబడి 

ప్రభుత్వానికి ప్రధానంగా రెండు మార్గాల నుంచి రాబడి లభిస్తుంది. 

1) సొంత పన్నుల రాబడి      

2) పన్నేతర రాబడి 

 

పన్నుల వర్గీకరణ 

పన్నులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ప్రత్యక్ష పన్నులు (Direct Tax): ఆదాయం, ఆస్తులపై విధించే పన్నులు. 

పరోక్ష పన్నులు (Indirect Tax): వస్తుసేవల ఉత్పత్తిపై విధించే పన్నులు.

 

పంపిణీ న్యాయం ఆధారంగా విధించే పన్నులు

అనుపాత పన్ను (Proportional Tax):  పన్ను విధింపునకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్నురేటును వర్తింపజేస్తే, అది అనుపాత పన్ను అవుతుంది.

పురోగామి పన్ను (Progressive Tax): పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ పన్నురేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు.

తిరోగామి పన్ను (Regressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గితే తిరోగామి పన్ను.

డిగ్రెసివ్‌ పన్ను (Degressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరుగుతూ ఉన్నప్పటికీ పురోగామిత్వం క్షీణిస్తూ ఆదాయం పెరిగినంత వేగంగా త్యాగం పెరగకపోతే అది డిగ్రెసివ్‌ పన్ను అవుతుంది.

 

వస్తువు విలువ లేదా పరిమాణం ఆధారంగా విధించే పన్నులు  

మూల్యానుగత పన్ను (ad valorem tax): ఇది వస్తువు విలువను బట్టి విధించే పన్ను. కొన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈ పద్ధతిలోనే విధిస్తారు.

నిర్దిష్టమైన పన్ను (Specific Tax): ఒక వస్తువు బరువు లేదా పరిమాణాన్ని బట్టి పన్ను విధిస్తే అది నిర్దిష్టమైన పన్ను.

 

కేంద్ర ప్రభుత్వ సొంత పన్నుల రాబడి

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు: 

* వ్యక్తిగత ఆదాయపు పన్ను (1860) 

* కార్పొరేషన్‌ పన్ను (1965 - 66) 

* వడ్డీపై పన్ను (1974) 

* వ్యయ పన్ను (1957) 

* సంపద పన్ను (1957) (ప్రస్తుతం రద్దు) 

* ఎస్టేట్‌ డ్యూటీ (1953) 

* కానుక/బహుమతి పన్ను (1958)

వస్తుసేవలపై పన్నులు : కేంద్ర ప్రభుత్వానికి వస్తుసేవల పన్ను ద్వారా అధిక రాబడి వస్తుంది. అందువల్ల ఇవి ప్రధానమైన పన్నులు. 

1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం: ఇది ఉత్పత్తిపై విధించే పన్ను. మద్యం, మత్తుపదార్థాలు తప్ప అన్ని ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంది. ఎక్సైజ్‌ సుంకం పరోక్ష పన్ను, అనుపాత పన్ను అని రెండు రకాలు.

2) కస్టమ్స్‌ సుంకాలు: ఎగుమతి, దిగుమతుల మీద విధించే పన్నులు కస్టమ్స్‌ సుంకాలు. 

3) సేవలపై పన్ను: తొలిసారిగా ఈ పన్నును 1994 - 95లో విధించారు. 1994 జులై 1 నుంచి టెలిఫోన్, స్టాక్‌ బ్రోకర్, జనరల్‌ బీమా లాంటి సేవల మీద సేవాపన్ను విధిస్తున్నారు.

 

కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా రాబడి వస్తుంది. ముఖ్యంగా రైల్వేలు, పోలీసు, అడవులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నుంచి రాబడి వస్తుంది. దీన్ని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడి ప్రధానంగా మూడు మార్గాల నుంచి లభిస్తుంది.  

1) పరిపాలన సేవలు: పోలీసులు, జైళ్లు, కోర్టులు 

2) సాంఘిక సేవలు: విద్య, వైద్యం 

3) ఆర్థిక సేవలు: నీటిపారుదల పన్ను, విద్యుచ్ఛక్తి పన్ను

 

కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడికి సంబంధించి రెండు రెవెన్యూ అధికార సంస్థలు ఉన్నాయి.

1) ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ (CBDT): ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఒక భాగమే ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానం, ప్రణాళికలు నిర్ణయించడమే ఈ సంస్థ ముఖ్యమైన విధి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను తయారు చేయడం దీని బాధ్యత.

2) ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ (CBEC): ఆర్థిక మంత్రిత్వ శాఖలో గల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మరొక భాగమే ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ. ఇది ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్నులు, పరిపాలన సంబంధిత నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. వస్తుసేవల పన్నులను అమలు చేయడం వల్ల ఈ సంస్థ పేరును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (CBIC) గా మార్చారు. ఇది వస్తుసేవల పన్ను విధానాల రూపకల్పన అమలు, వసూలుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తుంది.

 

దేశంలో పన్నుల సంస్కరణలు - కమిటీలు  

* 1953  - జాన్‌ మతాయ్‌ సంఘం

* 1956 - నికోలస్‌ కాల్డార్‌ సంఘం (వ్యయంపై పన్ను)

* 1959 - మహవీర్‌ త్యాగి సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన)

* 1967 - భూతలింగం సంఘం (పన్ను విధానాల ఆధునికీకరణ)

* 1970 - కె.ఎస్‌.వాంఛూ సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన, పన్నుల ఎగవేత, నల్లధనం)

* 1972 - కె.ఎస్‌.రాజ్‌ సంఘం (వ్యవసాయం, వ్యవసాయ సంపదపై పన్ను)

* 1977 - సి.సి.చోక్సీ సంఘం (ప్రత్యక్ష పన్నుల రేషనలైజేషన్‌) 

* 1981 - ఎల్‌.కె.ఝా సంఘం (పరోక్ష పన్నుల పరిశీలన)

* 1991 - ఆర్‌.చెల్లయ్య సంఘం (పన్నుల సంస్కరణలు)

* 2002 - ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ సంఘం (ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు)

* 2012 - పార్థసారథి షోమ్‌ సంఘం (యాంటీ ఆవాయిడెన్స్‌ టాక్స్‌)  

 

కలపబడిన విలువ పన్ను (VAT - Value Added Tax)

అమ్మకం పన్ను చట్టం స్థానంలో వ్యాట్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. వ్యాట్‌ అనేది పరోక్ష పన్ను. మన దేశంలో మొదటిసారి 2003 ఏప్రిల్‌లో వ్యాట్‌ను అమలు చేసిన రాష్ట్రం హరియాణా. 2005 ఏప్రిల్‌ 1న దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 2012 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 

* సవరించిన కలపబడిన విలువ పన్ను(Modified Value Added Tax - MODVAT)ను1986లో ఎల్‌.కె.ఝా నేతృత్వంలో ప్రవేశపెట్టారు.

* కేంద్ర కలపబడిన విలువ పన్ను(CENVAT - Central Value Added Tax)ను 2004లో ప్రవేశపెట్టారు. మాడ్‌ వ్యాట్‌ను సెన్‌ వ్యాట్‌ పథకంగా మార్చారు. ప్రపంచంలో తొలిసారిగా వ్యాట్‌ను ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్‌ (1954). టర్నోవర్‌ ట్యాక్స్‌కు బదులుగా వ్యాట్‌ను ప్రవేశపెట్టింది.  

 

వస్తుసేవల పన్ను (Goods and Service Tax)

దేశంలో వ్యాట్‌ స్థానంలో జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌)ని ప్రవేశపెట్టారు. జీఎస్టీ పరోక్ష పన్ను. ప్రపంచంలో తొలిసారిగా జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్‌ (1954). మన దేశంలో తొలిసారిగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది. అదే సంవత్సరంలో అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణ కోసం డాక్టర్‌ సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ల నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీఎస్టీ విధి విధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి ఆసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. 

* జీఎస్టీ రూపశిల్పి ఆసిమ్‌దాస్‌ గుప్తా. దీని నినాదం ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌.

* జీఎస్టీ అంటే అన్ని వస్తుసేవలపై దేశమంతటా ఒకేలా విధించే పరోక్ష పన్ను.

* మన దేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అసోం (2016 ఆగస్టు 12).

  పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. జీఎస్టీ బిల్లు 2016 ఆగస్టు 3న రాజ్యసభ, ఆగస్టు 8న లోక్‌సభలో ఆమోదం పొందింది. 2016 సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 

జీఎస్టీ మండలి: జీఎస్టీ కౌన్సిల్‌ను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలో సవరించిన ఆర్టికల్‌ 279్(A)(1) ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన జీఎస్టీ మండలిని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి వేదిక అంటారు.

 

జీఎస్టీ నాలుగు రకాలు 

1) కేంద్ర జీఎస్టీ

2) స్టేట్‌ జీఎస్టీ

3) ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ

4) యూజీఎస్టీ

జీఎస్టీ కౌన్సిల్‌ నాలుగు రకాల పన్నురేట్లను నిర్ణయించింది. దీని ప్రకారం 5%, 12%, 18%, 28% పన్నురేట్లను ప్రతిపాదించింది. మొత్తం 1211 వస్తువులపై పన్నురేట్లను నిర్ణయించారు. మరో 500 రకాల సేవలపై జీఎస్టీని ప్రకటించింది.

 

భారత ఆర్థిక సంఘం (విత్తసంఘం)

  భారత రాజ్యాంగంలోని అధికరణం 280 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకు లేదా అంతకంటే ముందుగా విత్తసంఘాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికేతర విత్తవనరుల బదిలీ, పంపిణీ సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధమైన సంస్థ. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు బదిలీ చేయడానికి ప్రాతిపదికను సూచించడం విత్తసంఘం విధి. 1951 నుంచి 2017 వరకు 15 విత్తసంఘాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సంఘం ప్రధాన కార్యాలయమైన జవహర్‌ వ్యాపార్‌ భవన్‌ న్యూదిల్లీలో ఉంది. మొదటి ఆర్థిక సంఘాన్ని 1951 నవంబరు 22న, 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరు 27న ఏర్పాటు చేశారు. 

  15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ (నందకిషోర్‌ సింగ్‌). ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఉంటారు. ప్రస్తుత కార్యనిర్వహణాధికారి అరవింద్‌ మెహతా. 15వ ఆర్థికసంఘం ప్రస్తుత సభ్యులు అజయ్‌ నారాయణ్‌ ఝూ, ప్రొఫెసర్‌ అనూప్‌సింగ్, అశోక్‌ లాహిరి, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌. ఈ ఆర్థిక సంఘం సిఫారసులు 2020 - 26 వరకు అమల్లో ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1) వస్తుసేవల పన్నును (జీఎస్టీ) మన దేశంలో ఎప్పుడు అమలు చేశారు?

1) 2017 జులై 1           2) 2016 జులై 1 

2) 2017 జులై 4            3) 2017 జులై 2 

 

2. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పన్నుల విధింపు వసూలు అంశాలను తెలియజేస్తుంది?

1) 268వ అధికరణ            2) 300వ అధికరణ               3) 1, 2          4) 280వ అధికరణ

 

3. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు? 

1) 5వ షెడ్యూల్‌            2) 6వ షెడ్యూల్‌ 

3) 7వ షెడ్యూల్‌            4) 8వ షెడ్యూల్‌

 

4. ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరిగితే అది 

1) పురోగామి పన్ను            2) తిరోగామి పన్ను            3) వ్యాట్‌         4) జీఎస్టీ

 

5. తిరోగామి పన్ను అంటే?

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గడం.

2) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరగడం.

3) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

4) పైవన్నీ 

 

6. అనుపాత పన్ను అంటే? 

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

2) పన్నురేటు స్థిరంగా లేకపోవడం. 

3) ఆదాయం పెరుగుతున్నప్పటికీ పురోగామిత్వం క్షీణించడం. 

4) పైవన్నీ

 

7. వస్తువు విలువను బట్టి విధించే పన్ను?  

1) మూల్యానుగత పన్ను        2) నిర్దిష్ట పన్ను 

3) వ్యాట్‌                        4) జీఎస్టీ 

 

8. కలపబడిన విలువ పన్ను (వ్యాట్‌) ను తొలిసారిగా దేశంలో ఏ రాష్ట్రం, ఎప్పుడు అమలు చేసింది? 

1) హరియాణా, 2003            2) ఒడిశా, 2004 

3) అసోం, 2005                 4) గుజరాత్, 2006 

 

9. వ్యాట్‌ను దేని స్థానంలో ప్రవేశపెట్టారు? 

1) టర్నోవర్‌ పన్ను             2) అమ్మకం పన్ను 

3) ఆక్ట్రాయ్‌ పన్ను               4) ఎక్సైజ్‌ సుంకం 

 

10. వ్యాట్‌ ఒక 

1) పరోక్ష పన్ను             2) ప్రత్యక్ష పన్ను 

3) పురోగామి పన్ను         4) తిరోగామి పన్ను 

 

సమాధానాలు

1-1     2-3     3-3     4-1     5-1     6-1     7-1     8-1     9-2     10-1.

 

రచయిత: బండారి ధనుంజయ

 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 భార‌త‌దేశ ఆర్థికాభివృద్ధి

 జాతీయాదాయం

 వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యోల్బణం

పాకుతూ... పరిగెడుతూ... నడుస్తూ... దూకుతూ!

  అప్పట్లో అయిదువేలు జీతం. అవసరమైనవన్నీ కొనుకున్నా... ఇంకా నెలకు అయిదు వందలు దాచుకునేవాళ్లం. ఇప్పుడు యాభైవేల వేతనమైనా ఏ మూలకు సరిపోవడం లేదు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగింది. అంతకంటే వేగంగా వస్తుసేవల డిమాండ్, వాటి ధరలూ పెరిగాయి. డబ్బు విలువ పడిపోయింది. దీంతో వినియోగదారుల కొలుగోలుశక్తి తగ్గిపోయింది. ఇదే ద్రవ్యోల్బణం. ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న అంతర్జాతీయ సమస్య. ఇది పాకుతుంది, నడుస్తుంది, పరిగెడుతుంది, దూకుతుంది. అందుకే దీన్ని నియంత్రించడానికి నిపుణులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, వాటి భావనలు, రకాలు, అంచనా పద్ధతులు, కారణాలు, ఫలితాలు తదితరాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది వివిధ వర్గాల ప్రజలపై వేర్వేరు ప్రభావాలను చూపుతుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశ, స్థాయులను ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రభుత్వం తగిన నివారణ చర్యలను చేపట్టాలి. లేకపోతే హెచ్చుస్థాయి ద్రవ్యోల్బణం ఆర్థిక అస్థిరతను కలిగిస్తుంది. సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. కానీ వాస్తవానికి వస్తుసేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటారు.

 

అయిదు భావనలు 

1) సాధారణంగా ధరల తగ్గుదలను ప్రతిద్రవ్యోల్బణం అంటారు.

2) ద్రవ్యోల్బణం రేటులో తగ్గుదలను ద్రవ్యోల్బణ పంథా అంటారు.

3) నియంత్రించడానికి వీలుకాని ద్రవ్యోల్బణ విస్ఫోటాన్ని అతి తీవ్రమైన ద్రవ్యోల్బణం అంటారు.

4) ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థిక వృద్ధిరేటు మిశ్రమ స్థితిని స్తబ్ధత ద్రవ్యోల్బణం అంటారు.

5) ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలను పెంచే ప్రయత్నాన్నే పరిమిత ద్రవ్యోల్బణం అంటారు.

 

ద్రవ్యోల్బణ రకాలు 

పాకుతున్న ద్రవ్యోల్బణం (Creepimg Inflation): ఒక సంవత్సరంలో ధరల పెరుగుదల 3 శాతానికి మించకుండా ఉంటే దాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం అని కెంట్‌ అనే అర్థశాస్త్రవేత్త వివరించారు.

 

నడుస్తున్న ద్రవ్యోల్బణం (Walking Inflation): ఒక సంవత్సరంలో ధరల పెరుగుదల 3 - 4 శాతం మధ్యలో ఉంటే దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు.

 

పరిగెత్తే ద్రవ్యోల్బణం (Running Inflation): సంవత్సరంలో ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు.

 

దూకుతున్న ద్రవ్యోల్బణం (Gallop[ing Inflation): చాలా ఎక్కువ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల 100 శాతం కూడా ఉండవచ్చు. దీన్ని అతి తీవ్ర ద్రవ్యోల్బణం అంటారు. 

* రాబర్ట్‌ జె.గార్డన్‌ ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా వివరించారు. ఈ వివరణను త్రికోణ నమూనా (Triangle Model) అంటారు.

1) డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం ((Demand Plan Inflation): ఇది ప్రభుత్వ, ప్రైవేటు వ్యయాల వల్ల సమష్టి డిమాండ్‌లో కలిగే పెరుగుదల కారణంగా ఏర్పడే ద్రవ్యోల్బణం.

 

2) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం (Cost Push Inflation): ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల సమష్టి సప్లయ్‌ తగ్గినప్పుడు ఈ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

 

3) అంతర్లీన ద్రవ్యోల్బణం (Built-in Inflation): వేతనాలు పెరగాలనే కార్మికులు, ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్బణానికి ప్రేరణ కల్పిస్తాయి. దీన్ని ధర/వేతన విస్ఫోటం అంటారు. ఈ విధమైన వేతన పెరుగుదల వ్యయం వినియోగదారుడి పైకి మారుతుంది. అంతర్లీన ద్రవ్యోల్బణం గత కాలపు పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అందువల్ల దీన్ని అంతర్లీన ద్రవ్యోల్బణం (హ్యాంగోవర్‌ ద్రవ్యోల్బణం) అంటారు.

 

గుణాత్మక ద్రవ్యోల్బణం (Quality Inflation): అమ్మకందారుడు వస్తువుల అమ్మకం ద్వారా సేకరించిన కరెన్సీని భావికాలంలో మార్పు చేసుకోవాలనే అంచనాపై ఆధారపడిన ధరల పెరుగుదలను గుణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.

 

పరిమాణాత్మక ద్రవ్యోల్బణం (Quality Theory of Inflation): ద్రవ్య సప్లయ్, చెలామణీ, ద్రవ్య మారకాల సమీకరణంపై ఆధారపడిన ధరల పెరుగుదలను పరిమాణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.

 

రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం (Sectoral Inflation): ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు. ముడిచమురు ధర పెరిగితే దాన్ని ఉపయోగించే ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.

 

ధర - శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం (Pricing Power Inflation): పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడాన్ని ధర - శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అంటారు.

 

కోశ సంబంధ ద్రవ్యోల్బణం (Fiscal Inflation): ఇది ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. ప్రభుత్వ బడ్జెట్‌ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదలను కోశ సంబంధ ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు.

 

ద్రవ్యోల్బణాన్ని అంచనావేసే పద్ధతులు 

కొంతరేటులో ధరల పెరుగుదల కొంత కాలం కొనసాగితే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయవచ్చు. 

1) వినియోగదారుల ధరల సూచిక (Consumer PriceIndex): ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు వాడే వస్తుసేవల ధరలను ప్రతిబింబిస్తూ తయారు చేసిన ధరల సూచిక ద్వారా దీన్ని అంచనా వేయవచ్చు.

 

2) ఉత్పత్తిదారుల ధరల సూచిక (Producer Price Index): దీన్ని టోకు ధరల సూచిక అంటారు. వినియోగదారుడి ధరల సూచిక మాదిరిగానే ఉత్పత్తిదారుడి ధరల సూచికను కూడా నిర్మించవచ్చు.

 

3) స్థూల జాతీయోత్పత్తి అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక (GNP Implicit Price Deflator): ఇది ప్రతిద్రవ్యోల్బణానికి సంబంధించిన సూచిక. ఎందుకంటే ప్రస్తుత రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి, ప్రాతిపదిక సంవత్సర రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుపుతుంది.

 

4) వినియోగదారుడి వ్యయ అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక (Consumer Implicit Price Deflator): ఇది వినియోగదారుడి ధరల సూచికకు ప్రత్యామ్నాయ సూచిక. వినియోగదారుడు వ్యయం చేసే వస్తువుల ధరల్లోని మార్పును ఈ సూచిక తెలియజేస్తుంది.

 

5) జీవన ప్రమాణ వ్యయ సూచీ (Cost of Living Index): వినియోగదారుడి సూచీ లాంటిదే జీవన ప్రమాణ వ్యయ సూచీ. దీనిలో  స్థిర ఆదాయాలు, కాంట్రాక్టు ఆదాయాలు, వాటి వాస్తవిక విలువను నిలకడగా ఉంచడానికి తగిన సవరణలు చేసే వీలుంటుంది.

 

6) మూలధన వస్తువుల ధరల సూచీ (Capital Goods Price Index): వాస్తవానికి ద్రవ్య సప్లయ్‌ పెరుగుదల వినియోగదారుడి వస్తువుల ద్రవ్యోల్బణంతో పాటు మూలధన వస్తువుల ద్రవ్యోల్బణాన్ని కూడా కలిగిస్తుంది.

 

ప్రతిద్రవ్యోల్బణ సూచీ: కొన్ని సంవత్సరాల ధరల గణాంకాలను ఆధార సంవత్సర ధరల్లో తెలియజేయడానికి ఉపయోగపడే విలువను ప్రతిద్రవ్యోల్బణ సూచీ (Price Deflator)  అంటారు.

 

ద్రవ్యోల్బణానికి కారణాలు 

డిమాండ్, సప్లయ్‌ మధ్య సమతౌల్యం ఏర్పడటం చాలా కష్టం. అందువల్ల ధరల్లో స్థిరత్వాన్ని సాధించడానికి వీలు కాదు. ఏదైనా ఒక కాలంలో డిమాండ్, సప్లయ్‌ మధ్య సమతౌల్యం ఏర్పడినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదు. అందువల్ల ధరల స్థాయిని సవరిస్తుండాలి. ఇది నిరంతర ప్రక్రియ. లేకపోతే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వానికి ధరలను నియంత్రించే శక్తి తగ్గిందని చెప్పవచ్చు. అందువల్ల మార్కెట్‌ శక్తులైన డిమాండ్, సప్లయ్‌  అంశాల్లో ఇమిడి ఉన్న అనిశ్చితి వల్ల ధరలు నిలకడగా లేక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణానికి డిమాండ్‌ ప్రేరిత, వ్యయ ప్రేరిత అంశాలు కారణాలుగా చెప్పవచ్చు.

 

డిమాండ్‌ ప్రేరిత అంశాలు: 

* జనాభా పెరుగుదల వల్ల వస్తుసేవల డిమాండ్‌ పెరుగుతుంది. 

* దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజల ఆదాయాలు పెరిగి వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. 

* సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన పథకాలపై బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువ చేసి ఉపాధి కల్పించడం వల్ల వస్తుసేవల డిమాండ్‌ పెరుగుతుంది. 

* ఉత్పాదక ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడి రేటు తక్కువగా ఉండి ఉత్పత్తి కుంటుపడుతుంది. 

* ద్రవ్య సప్లయ్‌ పెరిగి ద్రవ్య చెలామణి ఎక్కువై వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. 

* ఎంఆర్‌టీపీ చట్టం నీరుకారిపోవడం వల్ల వస్తుసేవలకు కృత్రిమ కొరత ఏర్పడి డిమాండ్‌ పెరుగుతుంది. 

* ప్రభుత్వ రుణ సేకరణ పెరిగి అనుత్పాదక అంశాలపై వ్యయం చేయడం వల్ల దేశంలో కొనుగోలుశక్తి పెరిగి డిమాండ్‌ పెరుగుతుంది. 

* బడ్జెట్‌లో కోశలోటు నియంత్రణలో ప్రభుత్వం సఫలీకృతం కాలేకపోవడం వల్ల వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.

* విచక్షణా రహిత, హేతుబద్ధం కాని సబ్సిడీల వల్ల కూడా వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.

వ్యయ ప్రేరిత అంశాలు:

* ఉత్పత్తి కారకాలపై వ్యయం పెరుగుతుంది. భూమి రేటు, బాటకం, మూలధనంపై వడ్డీరేటు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. 

* శ్రామికుల వేతనాల పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కొన్ని శ్రామిక సంఘాల డిమాండ్‌లు విపరీతంగా ఉంటున్నాయి. 

* పాతవైన పెద్ద పరిశ్రమల్లో ఆధునికీకరణ రేటు తక్కువగా ఉండి వ్యయం పెరుగుతుంది. పరిశ్రమల ఆధునికీకరణకు అవసరమైన యంత్ర భాగాలు దిగుమతి చేసుకోవడం వ్యయంతో కూడుకున్నది. కాబట్టి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. 

* ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యం సమర్థంగా లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.


ద్రవ్య సంబంధ అంశాలు: 

  సప్లయ్‌ వైపు ఆర్థిక అంశాలను వివరించినట్లు ద్రవ్య సప్లయ్‌ పెరుగుదల లేదా ద్రవ్య మిగులుకు ఉన్న డిమాండ్‌ తగ్గుదలను ద్రవ్యోల్బణ పరిస్థితిగా చెప్పవచ్చు.

* ఆస్ట్రిషన్‌ అనే అర్థశాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం అదనపు ద్రవ్యం కలిగి ఉన్నవారి కొనుగోలుశక్తి పెరుగుతుంది. దాంతో వారి కొనుగోలు లక్షణాలు మారి సాధారణంగా వస్తుసేవల డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులకు కారణమవుతాయి. 

* కార్ల్‌మార్క్స్‌ వాదన ప్రకారం శ్రామికశక్తిలో కొలిచిన ఉత్పత్తి వ్యయం వాస్తవిక ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణం.

* జె.ఎం.కీన్స్‌ అనే అర్థశాస్త్రవేత్త విశ్లేషణ ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని వాస్తవిక అంశాలను ద్రవ్య పారదర్శకత తెలియజేస్తుంది. ధరల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థలోని ఒత్తిడి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

  రాబోయే కాలంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి ఉత్పత్తి స్థాయిని విధాన నిర్ణాయక పాలకులు కచ్చితంగా అంచనా వేయడం ఒక సమస్య. అందుకే ద్రవ్యోల్బణం అసమానంగా తగ్గడం కంటే పెరగుతుంది. అంటే విధాన నిర్ణాయక అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.ఇతర అంశాలు: భారతదేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక అంశాలు కారణమవుతాయి.  

1) మూలధన కొరత  2) వ్యవస్థాపక నైపుణ్యత లేమి 3) శ్రామిక నైపుణ్యత కొరత 4) శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన లభ్యత లేమి  5) అవస్థాపక సౌకర్యాల కొరత 6) విదేశీ మారక ద్రవ్య కొరత, ఆహార భద్రత లేమి

 

ద్రవ్యోల్బణ ప్రభావాలు

ద్రవ్యోల్బణ ప్రభావం ముఖ్యంగా ఉత్పత్తి, పంపిణీ, విదేశీ చెల్లింపులపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దేశంలోని పారిశ్రామికవేత్తలు, రుణదాతలు, రుణగ్రహీతలు, వేతనాలు, జీతాలు పొందేవారు; షేర్లు, బాండ్లు లాంటివి ఉన్న వివిధ వర్గాల ప్రజలపై కూడా ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుంది. 

 

వివిధ వర్గాలపై ద్రవ్యోల్బణ ప్రభావం: 

* ధరల పెరుగుదల దేశంలోని వివిధ వర్గాలపై అనేక రకాల ప్రభావాలు చూపుతుంది. దీనివల్ల కొన్ని వర్గాల వారికి ప్రయోజనం, మరికొన్ని వర్గాల వారికి నష్టం కలుగుతుంది. గతంలో రుణాలు స్వీకరించిన వారు (రుణ గ్రహీతలు) ద్రవ్యోల్బణంలో అప్పులు తీర్చడం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే వారు అప్పు తీసుకున్నప్పుడు దాన్ని ద్రవ్య విలువ ఎక్కువ, తీర్చేటప్పుడు దాని ద్రవ్య విలువ తక్కువ. ఈ కారణంగా రుణదాతలు కొంతవరకు నష్టపోతారు. 

* స్థిరమైన ఆదాయ వర్గాల ప్రజలు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు. వారి ఆదాయం స్థిరంగా ఉండి వస్తుసేవల ధరలు పెరిగితే గతంలో మాదిరి  అదే పరిమాణంలో వస్తుసేవలను కొని వినియోగించలేరు. అందువల్ల జీవన ప్రమాణ స్థాయి తగ్గవచ్చు. 

* వేతన కార్మికులు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోవచ్చు. కానీ అది ధరల పెరుగుదల రేటుకు సమానంగా, వేతనాల పెరుగుదలను వేగంగా సాధించే శ్రామిక సంఘాల శక్తి, సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. 

* నిర్ణీత వడ్డీరేటు కంటే డిబెంచర్లను కలిగి ఉన్నవారు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు. 

* వ్యవసాయ రంగంలో భూములను నిర్ణీత మొత్తాలకు కౌలుకు ఇచ్చినవారు నష్టపోతారు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరిగితే కౌలుదారులు లాభపడతారు. 

* నిర్ణీత వేతనాలకు పనిచేసే వ్యవసాయ కార్మికులు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోతారు. 

అందువల్ల ద్రవ్యోల్బణం వివిధ వర్గాల ప్రజలపై మిశ్రమ ప్రభావాలను చూపుతుంది.  

 

రచయిత: బండారి ధనుంజయ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 భార‌త ఆర్థికవ్య‌వ‌స్థ ల‌క్ష‌ణాలు

 స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

  ఆర్థిక సంఘం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 07-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు

మాదిరి ప్రశ్నలు


1. దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయంలో వృద్ధి అంటే?    

1) ఆర్థిక వృద్ధి              2) ఆర్థికాభివృద్ధి       3)  తలసరి ఆదాయ వృద్ధి       4) అన్నీ 

 

2. ఆర్థికవృద్ధి ఏవిధమైనది?

1) గుణాత్మకమైంది       2) పరిమాణాత్మకమైంది    3)  1, 2                       4) స్థిరమైంది

 

3. ఆర్థికాభివృద్ధి లక్షణం ఏమిటి? 

1) స్థిరమైంది           2) గుణాత్మకమైంది    3)  పరిమాణాత్మకమైంది        4) అన్నీ 

 

4. దీర్ఘకాలంలో వ్యవస్థాపూర్వక మార్పులు, వనరుల కేటాయింపులో మార్పులతో కూడిన వాస్తవిక తలసరి ఆదాయ పెరుగుదలను ఏమంటారు?     

1) జీడీపీ రేటు       2) ఆర్థిÄకాభివృద్ధి      3)  ఆర్థికవృద్ధి     4) అన్నీ 

 

5. భారతదేశం ఏ ఆదాయ వర్గానికి చెందుతుంది? 

1) నిమ్న మధ్యస్థ ఆదాయ దేశం            2) ఉన్నత ఆదాయ దేశం

3)  అత్యధిక ఆదాయ దేశం            4) అన్నీ 

 

6. రాజ్యాంగ పరంగా భారత ఆర్థిక వ్యవస్థ?

1) ఫెడరల్‌ ఆర్థిక వ్యవస్థ             2) మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ

3)  గిగ్‌ ఎకనామీ                 4) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ


7. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక నియంత్రణ అధికారాల విభజన ఉన్న రాజ్యాంగ వ్యవస్థ? 

1) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ             2) ఫెడరల్‌ ఆర్థిక వ్యవస్థ

3)  ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ               4) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ

 

8.  ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం దృష్ట్యా భారత ఆర్థిక వ్యవస్థ?    

1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ          2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

3)  ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ              4) మార్కెట్‌ వ్యవస్థ 

 

9. భారతదేశం ఎలాంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది?

1) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ              2) మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ

3)  గిగ్‌ ఆర్థిక వ్యవస్థ                 4) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ

 

10. ఐక్యరాజ్య సమితి వర్తకం అభివృద్ధి సమావేశం (UNCTAD)  అంతర్జాతీయ ద్రవ్యనిధి వర్గీకరణ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటిది? 

1) అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ                   2) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ     3)  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ           4) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

 

11. భౌతిక జీవన నాణ్యత సూచీని (PQLI) అభివృద్ధి చేసినవారు ఎవరు?

1) డేవిడ్‌ మోరిస్‌                       2) మహబూబ్‌-ఉల్‌-హక్‌

3)  సి.రంగరాజన్‌                    4) మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా

 

12. భౌతిక జీవన నాణ్యత సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1970           2) 1971              3)  1972            4) 1974

 

13. భౌతిక జీవన నాణ్యత సూచీలో గణన చేసే అంశాలు? 

1) ఆయుఃప్రమాణం                2) శిశు మరణాల రేటు

3) మౌలిక అక్షరాస్యత               4) అన్నీ           

 

14. మానవాభివృద్ధి సూచికను ప్రచురించే సంస్థ? 

1) ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (గీవిదీశి)    2) యునిసెఫ్‌      

3) ఎన్‌ఎస్‌వో         4) నీతి ఆయోగ్‌ 

 

15. మానవాభివృద్ధి సూచికను ్బబీదీఖ్శి తొలిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1990             2) 1991              3) 1992              4) 1993

 

16. మానవాభివృద్ధి సూచిక భావనను ప్రతిపాదించిన ఆర్థికవేత్త? 

1) మహబూబ్‌-ఉల్‌-హక్‌       2) అమర్త్యసేన్‌    3) డేవిడ్‌ మోరిస్‌            4) ఎవరూ కాదు

 

17. మానవాభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో పాల్గొన్న భారత ఆర్థికవేత్త? 

1) అమర్త్యసేన్‌             2) జాన్‌ డ్రేజ్‌            3) డేవిడ్‌ మోరిస్‌            4) అందరూ  

 

18. బహుళ కోణ పేదరిక సూచీని (MPI) ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 2009              2) 2010               3) 2011             4) 2012

 

19. మానవ పేదరిక సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 

1) 1995              2) 1996               3) 1997               4) 1998

 

20. భారత ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం?

1) సేవారంగం             2) వ్యవసాయ రంగం     3) పరిశ్రమల రంగం          4) అన్నీ 

 

21. మానవ పేదరిక సూచీని ప్రవేశపెట్టిన సంస్థ? 

1) UNCTAD       2) UNDP      3) IMF     4) ప్రపంచ బ్యాంకు

 

22. అభివృద్ధి కృషికి సామర్థ్యాల అప్రోచ్‌ను ప్రతిపాదించిన ఆర్థిక వేత్త? 

1) అమర్త్యసేన్‌    2) డేవిడ్‌ మారిస్‌    3) మహబూబ్‌-ఉల్‌-హక్‌     4) ఎవరూ కాదు

 

23. జాతీయాదాయ వృద్ధిరేటు కంటే తలసరి ఆదాయ వృద్ధిరేటు తక్కువగా ఉండటానికి కారణం?

1) తక్కువ జనాభా వృద్ధిరేటు        2) అధిక జనాభా వృద్ధిరేటు

3) తలసరి వృద్ధిరేటు        4) జీడీపీ వృద్ధిరేటు

 

24. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కొనసాగుతున్న రంగం?

1) వ్యవసాయ రంగం       2) పరిశ్రమల రంగం    3) సేవారంగం             4) ఏదీకాదు

 

25. 2020లో ప్రపంచ ఆర్థిక అవలోకనం ప్రకారం అత్యధిక స్థూల జాతీయోత్పత్తి గల దేశాల్లో భారత్‌ స్థానం?

1) నామినల్‌ జీడీపీ ప్రకారం అయిదో స్థానం    2) పీపీపీ ప్రకారం మూడో స్థానం

3) 1, 2         4) పీపీపీ ప్రకారం ఆరోస్థానం

 

26. లింగ అభివృద్ధి సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1995      2) 1996      3) 1997      4) 1998

 

27. లింగ అసమానత సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1992      2) 1993      3) 1994      4) 1995

 

28. బహుళ కోణ పేదరిక సూచీలో ఎన్ని అంశాలు, సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు?

1) 3 అంశాలు, 12 సూచీలు        2) 3 అంశాలు, 10 సూచీలు

3) 3 అంశాలు, 13 సూచీలు        4) 4 అంశాలు, 12 సూచీలు

 

29. నీతి ఆయోగ్‌ 2021 నవంబరులో తెలిపిన నివేదిక ప్రకారం బహుళ కోణ పేదరిక సూచీ ప్రకారం మన దేశంలో అతి తక్కువ పేదరికం గల రాష్ట్రం?

1) కేరళ        2) గుజరాత్‌    3) సిక్కిం        4) మహారాష్ట్ర

 

30. ఆర్థికాభివృద్ధి ఏ రకమైంది? 

1) విశాలమైంది       2) ఏకముఖమైంది    3) 1, 2            4) పరిమితమైంది

 

31. కిందివాటిలో అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలకు సంబంధించి సరైంది?

ఎ) ఫెడరల్‌ వ్యవస్థ        బి) వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ఆర్థిక వ్యవస్థ

సి) మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ    డి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

1) ఎ సరైంది      2) బి సరైంది       3) సి సరైంది      4) అన్నీ 

 

32. 2024 - 25 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు?

1) 4 ట్రిలియన్‌ డాలర్లు          2) 5 ట్రిలియన్‌ డాలర్లు

3) 6 ట్రిలియన్‌ డాలర్లు          4) 7 ట్రిలియన్‌ డాలర్లు

 

33. 2022లో భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని దేశాన్ని ఎన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడానికి నీతి ఆయోగ్‌ న్యూ ఇండియా జీ75 వ్యూహాన్ని తయారు చేసింది? 

1) 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ    2) 6 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

3) 4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ    4) 7 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

 

34. ప్రపంచ బ్యాంకు 2021, జులై 1న 2020లో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాను ప్రకటించింది. వాటిలో మొదటి, రెండో స్థానాల్లో ఉన్న దేశాలు వరుసగా?

1) చైనా, అమెరికా         2) బ్రిటన్, అమెరికా      3) ఇటలీ, కెనడా       4) అమెరికా, చైనా 

 

35. ప్రపంచ బ్యాంకు 2021, జులై 1న 2020లో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశ స్థానం?

1) 3వ       2) 4వ      3) 5వ      4) 6వ 

 

36. ప్రపంచంలో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?

1) ప్రథమ స్థానం      2) ద్వితీయ స్థానం      3) మూడో స్థానం      4) నాలుగో స్థానం

 

37. భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల ఎన్నో దేశంగా రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు?

1) మొదటి స్థానం         2) రెండో స్థానం        3) మూడో స్థానం        4) నాలుగో స్థానం

 

38. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ ్బదినితీళ్శి - వరల్డ్‌ ఎకనామిక్‌ లీగ్‌ టేబుల్‌ - 2022 13వ ఎడిషన్‌ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలో మొదటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల పది దేశాల జాబితాలో భారత దేశ స్థానం?

1) ఆరో స్థానం      2) అయిదో స్థానం       3) మూడో స్థానం      4) రెండో స్థానం

 

39. యుఎన్‌డీపీ - మానవ అభివృద్ధి సూచీ నివేదిక - 2020 ప్రకారం 189 దేశాల జాబితాలో భారతదేశ స్థానం?

1) 130         2) 131        3) 132         4) 133

 

40. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ - వరల్డ్‌ ఎకనామిక్‌ లీగ్‌ టేబుల్‌ - 2022 13వ ఎడిషన్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో మొదటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల పది దేశాల్లో 2036 నాటికి భారత్‌ ఎన్నో స్థానంలో ఉంటుందని తెలిపింది? 

1) మొదటి స్థానం    2) రెండో స్థానం    3) మూడో స్థానం    4) నాలుగో స్థానం

 

సమాధానాలు

1-1, 2-2, 3-2, 4-2, 5-1, 6-1, 7-2, 8-2, 9-1, 10-3, 11-1, 12-1, 13-4, 14-1, 15-1, 16-1, 17-1, 18-2, 19-3, 20-1, 21-2, 22-1, 23-2, 24-1, 25-3, 26-1, 27-4, 28-1, 29-1, 30-1, 31-4, 32-2, 33-3, 34-4, 35-4, 36-3, 37-3, 38-1, 39-2, 40-3.

Posted Date : 27-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు

నిలకడ వృద్ధి... నిర్మాణాత్మక మార్పు!

  ఒక దేశంలో వస్తుసేవల ఉత్పత్తి ఎలా ఉంది? వాటి అమ్మకాలు, కొనుగోళ్లు ఏవిధంగా జరుగుతున్నాయి? తదితర అంశాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేస్తారు. అందుబాటులో ఉన్న వనరులు, వాటి కేటాయింపులు, వినియోగాలనూ పరిగణలోకి తీసుకుంటారు. ఇందుకోసం కొన్ని సూచీలను ఏర్పాటుచేశారు. ఆ కొలమానాల ప్రకారం మనదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. 

 

  తక్కువ తలసరి ఆదాయం, పేదరికం, ఎక్కువ జనాభా వృద్ధి రేటు, వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల కొరత, పెట్టుబడుల లేమి వంటివి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. భారతదేశం ఈ రకంలోకే వస్తుంది. 

 

ఆర్థిక వృద్ధి: దీర్ఘకాలంలో వస్తుసేవల ఉత్పత్తి నిలకడగా పెరిగినప్పుడే దాన్ని వృద్ధిగా పేర్కొంటారు. అందుకే వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలోని దీర్ఘకాల వస్తుసేవల పెరుగుదలను ఆర్థికవృద్ధిగా నిర్వచిస్తారు. ఇది పరిమాణాత్మకమైంది, ఏకముఖమైంది. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన.  

ఉదా: అమెరికా

  స్థూల వస్తుసేవల కంటే దేశ జనాభా మరింత పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. అధిక జనాభా కంటే జీడీపీ పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి జరుగుతుంది.

ఆర్థికాభివృద్ధి: ఆర్థికాభివృద్ధి చాలా విశాలమైంది, గుణాత్మకమైంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన.  ఉదా: భారత్‌ 

 

  ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు. వీటిని ప్రధానంగా కింది విధంగా పేర్కొంటారు. 

* నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గించడం.

* అక్షరాస్యతను పెంచి, ప్రజల ఆరోగ్యస్థితిని మెరుగుపరచడం. 

* జీడీపీలో వ్యవసాయ రంగం, పరిశ్రమలు, సేవారంగం వాటా పెరగడం.

* సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను వదిలి ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఎంచుకోవడం.

* రవాణా, విద్యుత్, సమాచారం లాంటి అవస్థాపన రంగాలను అభివృద్ధి చేయడం.

* పట్టణీకరణ 

* శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి

 

ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచికలు

 

* తలసరి వినియోగ స్థాయి

 

* ఐక్యరాజ్య సమితి పరిశోధన సంస్థ సాంఘిక ఆర్థిక సూచీ (UNRISD), 1963

 

* భౌతిక జీవన నాణ్యత సూచీ (PQLI), (1970)

 

* మానవాభివృద్ధి సూచీ (HDI), 1990

 

* లింగ అసమానత సూచీ (GII), 1995

 

* లింగ అభివృద్ధి సూచీ (GDI), 1995 

 

* లింగ సాధికారత కొలమానం (GEM), 1995 

 

* మానవ పేదరిక సూచీ (HPI), 1997

 

* అమర్త్య కుమార్‌ సేన్‌ ప్రతిపాదించిన సామర్థ్యాల అప్రోచ్, 1999 

 

* బహుళ కోణ పేదరిక సూచీ (MPI), 2010

 

* ప్రపంచ హరిత ఆర్థిక వ్యవస్థ సూచీ (GGEI)

 

* సామాజిక ప్రగతి సూచీ (SPI)

 

భౌతిక జీవన నాణ్యత సూచీ (PQLI):     దీన్ని 1970వ దశకం మధ్యలో డేవిడ్‌ మోరిస్‌ అనే ఆర్థిక వేత్త అభివృద్ధి చేశారు. దీనిలో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని అంచనా వేస్తారు. 1) అక్షరాస్యత రేటు 2) శిశు మరణాల రేటు 3) ఆయుర్ధాయం

 

మానవాభివృద్ధి సూచీ (HDI): యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (గీవిదీశి) మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. మానవాభివృద్ధి సూచికను 1990లో పాకిస్థాన్‌ ఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ రూపొందించారు. అమర్త్యసేన్‌ కూడా ఈయనతో కలిసి పని చేశారు. దీనిలో ఆయుర్ధాయం, విద్యార్హత, తలసరి స్థూల జాతీయోత్పత్తి అనే మూడు అంశాలను తీసుకుంటారు. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక - 2020ని 2020, డిసెంబరు 15న విడుదల చేసింది. మొత్తం 189 దేశాల ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నార్వే మొదటి స్థానంలో ఉండగా నైగర్‌కు చివరి స్థానం లభించింది. భారత్‌ 131వ స్థానంలో నిలిచింది.

 

ప్రపంచ దేశాలు - అంతర్జాతీయ సంస్థల వర్గీకరణ 

 

2020లో ప్రపంచ బ్యాంకు అట్లాస్‌ పద్ధతి ద్వారా 2019 తలసరి స్థూల జాతీయాదాయం ఆధారంగా దేశాలను కింది విధంగా వర్గీకరించింది.

 

అల్ప ఆదాయ దేశాలు: 1036 డాలర్ల కంటే తక్కువ తలసరి స్థూల జాతీయాదాయం ఉన్న దేశాలు.

 

మధ్యమ ఆదాయ దేశాలు (నిమ్న మధ్య ఆదాయ దేశాలు): 1036 - 4045 డాలర్ల మధ్య ఆదాయ దేశాలు.

 

ఉన్నత మధ్య ఆదాయ దేశాలు: 4046 - 12,535 డాలర్లు డాలర్ల మధ్య ఆదాయం ఉన్న దేశాలు.

 

అధిక ఆదాయ దేశాలు: 12,535 డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు. 

* ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని మధ్యమ ఆదాయ దేశాల జాబితాలో చేర్చింది. 

 

భారత్‌- మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 

భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా (Mixed Economy) గా పేర్కొంటారు. 1948లో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం వల్ల మన దేశంలో తొలిసారిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది పడింది. 

 

లక్షణాలు: 

 

* సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్‌ వ్యవస్థ) 

 

* మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

 

* వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ఆర్థిక వ్యవస్థ

 

* ప్రజా పంపిణీ వ్యవస్థ - ఆహార భద్రత

 

* సముచిత స్థాయిలో పారిశ్రామికీకరణ 

 

* మూలధనకల్పన - విస్తరణ 

 

* వేగంగా వృద్ధి చెందుతున్న సేవారంగం

 

* పెరుగుతున్న ఎగుమతులు - రాబడి

 

* పెద్ద మార్కెట్‌గా రూపొందుతున్న వ్యవస్థ

 

* మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

 

* నిలకడగా వృద్ధి చెందే స్థూల ఆర్థిక వ్యవస్థ

 

* స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల 

 

* ద్రవ్యోల్బణ నియంత్రణ 

 

* ఆదాయ అసమానతలు తగ్గించడం 

 

* ఉపాధి కల్పన, అవకాశాల విస్తరణ 

 

* అవస్థాపన సౌకర్యాల కల్పన - విస్తృతి

 

* పెరుగుతున్న పట్టణీకరణ రేటు 

 

* సాంఘిక సేవల విస్తరణ - మానవ వనరుల అభివృద్ధి

 

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..!

  ప్రపంచ బ్యాంకు 2021, జలై 1న ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితా-2020 ప్రకటిచింది. వాటిలో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాలు 1) అమెరికా  2) చైనా  3) జపాన్‌  4) జర్మనీ  5) బ్రిటన్‌ 6) భారత్‌ 7) ఫ్రాన్స్‌  8) ఇటలీ  9) కెనడా  10) దక్షిణ కొరియా.

  సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ ్బదినితీళ్శి - వరల్డ్‌ ఎకనామిక్‌ లీగ్‌ టేబుల్‌ - 2022 (13వ ఎడిషన్‌) 191 దేశాలకు సంబంధించిన నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల జాబితాలో 2022లో అమెరికా మొదటి స్థానం, చైనా రెండో స్థానంలో ఉండగా తువాలు చివరి స్థానంలో ఉంది. భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. 2031 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రకటించింది. 

* 2024 - 25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

* నీతి ఆయోగ్‌ - న్యూ ఇండియాజీ75 డ్రాఫ్ట్‌ నివేదిక ప్రకారం 2022 సంవత్సరానికి భారతదేశాన్ని నాలుగు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం.

 

రచయిత: బండారి ధనుంజయ్‌ 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 28-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యం (ద్రవ్యం-బ్యాంకింగ్‌-ప్రభుత్వ విత్తం)

అందరూ అంగీకరించే కల్పితం!

  తళ తళ మెరుస్తూ, పెళ పెళలాడే నోటును చూడగానే ఎవరి కళ్లయినా కాస్త పెద్దవి కావాల్సిందే. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పనికీ మనీ ఉండాల్సిందే. అందరి ఆనందాలు, అవసరాలు అన్నీ ఆ డబ్బుతో అంటే ఆర్థిక పరిభాషలో ద్రవ్యంతోనే ముడిపడి ఉంటాయి. చేసే శ్రమకు, తయారయ్యే వస్తువుకు, అందించే సేవకు విలువ కట్టే విశిష్ట కొలమానం ద్రవ్యం. ప్రాచీన కాలం నుంచి అనేక రూపాలు మార్చి ఇప్పటికీ చలామణిలో చెలరేగి పోతోంది. నిజానికి దాని విలువ కల్పితం, కానీ అందరికీ ఆమోదనీయం. కనిపెట్టిన మనిషినే కట్టి పడేసే కనికట్టుగా నిలిచిన ఆ ద్రవ్యం పుట్టుక, పరిణామక్రమం, ప్రస్తుత రూపాలు, విధుల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

 

  ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఆధునిక సమాజంలో ద్రవ్యం ప్రవేశపెట్టక పూర్వం వస్తుసేవల కొనుగోలు, అమ్మకాలకు నిర్దిష్ట మాధ్యమం లేదు. వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దీనిలోని లోపాల వల్ల ద్రవ్యం ఒక వినిమయ మాధ్యమంగా అమల్లోకి వచ్చింది.

 

వస్తుమార్పిడి పద్ధతి: వస్తువును ఇచ్చి దానికి బదులుగా కావాల్సిన మరో వస్తువును పొందటాన్ని వస్తుమార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అంటారు. గతంలో మనిషి కోర్కెలు, ఆర్థిక కార్యకలాపాలు రెండూ పరిమితంగా ఉండటం వల్ల ఈ పద్ధతి సాధ్యమైంది. ఇందులో వినిమయ మాధ్యమం ఉండదు. అందువల్ల దీన్ని వస్తువు నుంచి వస్తువు ఆర్థిక వ్యవస్థ అనేవారు.

 

వస్తుమార్పిడి పద్ధతిలో లోపాలు: 1) కోరికల సమన్వయం లేకపోవడం 2) కాల సమన్వయం లేకపోవడం 3) విలువలను కొలిచే కొలమానం లేకపోవడం 4) వస్తువును విభజించే వీలు లేకపోవడం 5) సంపదను నిల్వ చేయలేకపోవడం

 

ద్రవ్య ఆవిర్భావం-నిర్వచనం-పరిణామ క్రమం: ‘మనీ’ అనే ఆంగ్ల పదం లాటిన్‌ పదమైన ‘మానెటా’ నుంచి పుట్టింది. రోమన్‌ దేవత అయిన మానెటా ఆలయంలో మొదటిసారి నాణేలను ముద్రించడం వల్ల ‘మనీ’ పేరు స్థిరపడిందనేది చరిత్రకారుల అభిప్రాయం. అతిముఖ్యమైన మానవ కల్పనల్లో ద్రవ్యం ఒకటి. ప్రతి శాస్త్రంలో ముఖ్యమైన కల్పన ఒకటి ఉంటుంది. 

ఉదా: యాంత్రిక శాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అర్థశాస్త్రంలో ద్రవ్యం ప్రధాన కల్పనలని క్రౌధర్‌ అనే ఆర్థికవేత్త అభిప్రాయం.

 

ద్రవ్య నిర్వచనాలు: * ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం - వాకర్‌ 

* సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం - సెలిగ్‌మన్‌ 

* వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం - క్రౌధర్‌  

* ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం - మిల్టన్‌ ప్రీడ్‌మన్‌ 

* రుణ ఒప్పందాలు ఉండి వివాదాల పరిష్కార శక్తి కలిగిందే ద్రవ్యం - జె.ఎం.కీన్స్‌

 

ద్రవ్య పరిణామ క్రమం 

 

వస్తురూప ద్రవ్యం: ప్రారంభంలో వస్తువులనే ద్రవ్యంగా ఉపయోగించారు.

ఉదా: స్విట్జర్లాండ్‌లో గవ్వలు, భారత్‌లో పశువులు, ఆఫ్రికాలో ఏనుగు దంతాలు, ఉత్తర అమెరికాలో పొగాకు

 

లోహద్రవ్యం: వస్తురూప ద్రవ్యంలోని కొన్ని సమస్యల వల్ల, నాగరికత అభివృద్ధి చెందడంతో లోహద్రవ్యం వాడుకలోకి వచ్చింది.

ఉదా: బంగారం, వెండి, రాగి, ఇత్తడి మొదలైనవి. ప్రారంభంలో లోహాన్ని ముద్దలుగా, కడ్డీలుగాను ఉపయోగించేవారు. తర్వాత కాలంలో లోహాలతో నాణేలు తయారుచేశారు.క్రీ.పూ.700 సంవత్సరంలో లిధియా దేశంలో మొదటగా నాణేలు జారీ చేశారు. రోమన్ల కాలంలో బిసాంత్‌ అనే బంగారు నాణెం, మౌర్యుల కాలంలో ఫణ అనే వెండి నాణేలు ఉండేవి.

 

కాగితపు ద్రవ్యం: క్రీ.శ.600 సంవత్సరంలో చైనాను పాలించిన సోంగ్‌ రాజవంశీయులు మొదటిసారిగా కాగితపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌లో మౌర్యుల కాలం నుంచి ‘హుండీ’ అనే కాగితపు ద్రవ్య వ్యవస్థ ఉండేది. కాగితపు కరెన్సీ మొదటి రూపం హుండీ అని భావిస్తారు.

 

పరపతి ద్రవ్యం: కరెన్సీని నిల్వగా దాచి పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యాన్ని సృష్టిస్తారు.

ఉదా: బ్యాంక్‌ చెక్‌లు, క్రెడిట్‌ కార్డులు, వాణిజ్య బిల్లులు, ట్రెజరీ బిల్లులు మొదలైనవి. పరపతి ద్రవ్యం రుణ లావాదేవీలకు సహకరిస్తుంది. క్రెడిట్‌ కార్డ్‌ను స్మార్ట్‌మనీగా పిలుస్తారు. మొదటి క్రెడిట్‌ కార్డును 1950లో అమెరికాకు చెందిన ‘డిన్నర్స్‌ క్లబ్‌’ ప్రవేశపెట్టింది.

 

సమీప ద్రవ్యం: ద్రవ్యానికి ఉండే లక్షణాలు ఉన్నదాన్ని సమీప ద్రవ్యం అంటారు.

ఉదా: హుండీలు, బాండ్‌లు, డిమాండ్‌ డ్రాఫ్టులు, పే ఆర్డర్లు మొదలైనవి.

 

ప్లాస్టిక్‌ ద్రవ్యం: ప్రపంచంలో మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్లాస్టిక్‌ ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు.

 

పాలిమర్‌ ద్రవ్యం: కరెన్సీ ముద్రణలో ప్లాస్టిక్‌ను ఉపయోగించేదే పాలిమర్‌ ద్రవ్యం. దీనికి ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.

ఉదా: ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంకు ముద్రించే కరెన్సీ నోట్లు.

 

ద్రవ్యం రకాలు

విలువ, ఉపయోగం ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. 

1) ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువు 

2) ఆమోద యోగ్యత 

3) ద్రవ్యత్వం 

4) ఇతర రకాలు

1) పూర్తి ప్రమాణ ద్రవ్యం: ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత, బహిర్గత విలువ సమానంగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటారు. 

ఉదా: 1835-93 మధ్య మన దేశంలో పూర్తి ప్రమాణం ఉన్న వెండి నాణేలు చలామణిలో ఉండేవి.

 

2) తక్కువ ప్రమాణ ద్రవ్యం: నాణేల బహిర్గత విలువ, నాణేల అంతర్గత విలువ కంటే ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటారు. దీన్నే టోకెన్‌ మనీ అంటారు.

ఉదా: ప్రస్తుతం మన దేశంలో ముద్రించే అన్నిరకాల కరెన్సీ నాణేలు

 

3) ప్రాతినిధ్యపు ద్రవ్యం: తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి వాడితే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటారు. 

ఉదా: ప్రస్తుతం ఆర్‌బీఐ ముద్రించే కరెన్సీ నోట్లు, నాణేలు.

 

4) ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం: నూటికి నూరు శాతం లోహాన్ని నిల్వగా ఉంచి ద్రవ్యాన్ని జారీ చేస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటారు.ఉదా: మన దేశంలో జారీ చేసిన బంగారం, బులియన్‌ సర్టిఫికెట్లు.

 

5) పరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వెండిలోకి మార్చుకునే వీలున్న ద్రవ్యం.

ఉదా: 19వ శతాబ్దంలో వాడుకలో ఉన్న స్వర్ణ ప్రమాణంలో ఈ సౌకర్యం ఉండేది.

 

6) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు ద్రవ్యం బంగారం లేదా వెండిలోకి మార్చుకోవడానికి వీలులేని ద్రవ్యం.

 

7) చట్టబద్ధ ద్రవ్యం: ఆర్‌బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. దీనికి చట్టం సమ్మతి ఉంటుంది. ఇది రెండు రకాలు.

ఎ) అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: వ్యాపార వ్యవహారాల నిర్వహణకు, రుణాల పరిష్కారానికి ఎంత పరిమాణంలో అయినా తప్పనిసరిగా ఆమోదించాల్సిన ద్రవ్యం ఇది. 

ఉదా: మన దేశంలో 50 పైసలకు మించి ఉన్న నాణేలు, రూపాయి నుంచి రూ.2 వేల వరకు నోట్లు భారత్‌లో కాగితపు కరెన్సీని ఫియట్‌ మనీ అని, నాణేలను లీగల్‌ టెండర్‌ అంటారు.

 

బి) పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ద్రవ్యాన్ని కొంత పరిమితికి లోబడి మాత్రమే ఆమోదించే ద్రవ్యం.

ఉదా: * 5, 10, 20, 25 పైసల నాణేలు. వీటిని 25 వరకే ఆమోదిస్తారు.

* 2011, జూన్‌ 30 నుంచి 25 పైసల నాణేన్ని ఆర్‌బీఐ రద్దు చేసింది.

 

8) చట్టబద్ధం కాని ద్రవ్యం: చట్ట ప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి కొన్నింటిని ద్రవ్యంగా అంగీకరిస్తే అలాంటి వాటిని చట్టబద్ధం కాని ద్రవ్యం అంటారు. దీన్నే ఐచ్ఛిక ద్రవ్యంగా పిలుస్తారు.

ఉదా: బ్యాంకులు ఇచ్చే చెక్కులు, డ్రాఫ్టు, హుండీలు

 

9) సామాన్య ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లను సామాన్య ద్రవ్యం అంటారు. దీన్నే సంకుచిత ద్రవ్యం అని కూడా అంటారు. దీనికి వంద శాతం ద్రవ్యత్వం ఉంటుంది.

 

సమీప ద్రవ్యం: సామాన్య ద్రవ్యంతో పోల్చినప్పుడు తక్కువ ద్రవ్యత్వం కలిగి ఉంటుంది. అవసరమైనప్పుడు వీటిని తక్కువ ఖర్చుతో ద్రవ్యంగా మార్చుకోవచ్చు. అందుకే వీటిని సమీప ద్రవ్యం అంటారు.

ఉదా: జాతీయ పొదుపు డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, ట్రెజరీ బిల్లులు, ప్రామిసరీ నోట్లు.

 

ఇతర రకాల ద్రవ్యాలు

 

1) ఆవర్జా ద్రవ్యం: జమా ఖర్చుల లెక్కలను ఏ ద్రవ్య యూనిట్‌ రూపంలో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ఆవర్జా ద్రవ్యం అంటారు.

ఉదా: ఇండియాలో రూపాయి, అమెరికాలో డాలర్‌.

 

2) వ్యవహారిక ద్రవ్యం: ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని వ్యవహారిక ద్రవ్యం అంటారు. అన్నిరకాల వ్యవహారాలు దీనితోనే జరుగుతాయి.

 

3) విశ్వాసాశ్రిత ద్రవ్యం: వ్యవస్థపై లేదా ప్రభుత్వంపై లేదా కేంద్ర బ్యాంకుపై విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని ద్రవ్యాన్ని ముద్రిస్తే అలాంటి ద్రవ్యాన్ని విశ్వాసాశ్రిత ద్రవ్యం అంటారు. మన దేశంలో ద్రవ్యాన్ని కనీస నిల్వలను ఆధారంగా చేసుకొని, విశ్వాసాశ్రిత పద్ధతిలో ముద్రిస్తారు.

 

4) పరపతి ద్రవ్యం: దీన్నే బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటారు. 

ఉదా: బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డ్రాఫ్టులు, వినిమయ బిల్లులు మొదలైనవి.

 

5) ఫియట్‌ మనీ: ప్రభుత్వ అధికారం వల్ల కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే దాన్ని ఫియట్‌ మనీ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది. ఈ ద్రవ్యం వెనుక రిజర్వులు ఉండవు.

 

6) హాట్‌ మనీ: విదేశీ సంస్థాగత పెట్టుబడులను హాట్‌ మనీ అంటారు. ఈ పెట్టుబడులను ఒక దేశం నుంచి మరొక దేశానికి వేగంగా తరలిస్తారు.

 

7) డియర్‌ మనీ: అధిక వడ్డీ రేటు ఉండి, రుణాలు సులభంగా లభించని వ్యవస్థను డియర్‌ మనీ అంటారు.

 

8) నియర్‌ మనీ: బ్యాంకుల డిమాండ్‌ డ్రాప్టులు, పే ఆర్డర్లను నియర్‌ మనీ అంటారు.

 

9) కాల్‌ మనీ: ఒక బ్యాంకు అడిగిన వెంటనే మరో బ్యాంకు రుణాలు అందించటాన్ని కాల్‌ మనీ అంటారు. 

ఒక్క రోజుకు బ్యాంకులు ఇచ్చే రుణం కాల్‌ మనీ, రెండు నుంచి 14 రోజులకు ఇచ్చే రుణాన్ని నోటీస్‌ మనీ, 14 రోజులకు మించితే టర్మ్‌ మనీ అంటారు.

 

ద్రవ్యం విధులు: ప్రాథమిక, గౌణ విధులు అని ఇవి రెండు రకాలు.

 

1) ప్రాథమిక విధులు: ద్రవ్యం ప్రాథమికంగా నిర్వర్తించే విధులు. అవి..

ఎ) వినిమయ మాధ్యమం: వస్తువుకి, వస్తువుకి మధ్య మధ్యవర్తిగా అమ్మకాలు, కొనుగోళ్లు చేయడంలో ద్రవ్యం ఉపయోగపడుతుంది.

బి) విలువ కొలమానం: అన్ని రకాల వస్తుసేవలను ద్రవ్యంతో కొలుస్తారు. దీనినే విలువ కొలమానం అంటారు.

 

2) గౌణ విధులు: ఇవి ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉంటాయి. వీటిని ఉత్పన్న విధులు అని కూడా అంటారు.

ఎ) విలువ నిధి: దీన్ని ప్రతిపాదించింది జె.ఎం.కీన్స్‌. సంపదను ప్రస్తుత ఉపయోగానికే కాకుండా భవిష్యత్తుకూ ఉపయోగపడే విధంగా నిల్వ చేయడానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.

బి) వాయిదాల చెల్లింపుల ప్రమాణం: వ్యాపార వ్యవహారాల అరువు పద్ధతిలోనూ నిర్వర్తించడానికి ద్రవ్యం ఉపయోగపడటాన్ని వాయిదాల చెల్లింపుల ప్రమాణం అని అంటారు.

సి) విలువ బదిలీ: ద్రవ్యం విలువను బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది.

 

* ఆచార్య కిన్లే ప్రకారం ద్రవ్యానికి ప్రాథమిక, గౌణ విధులతో పాటు అనుషంగిక విధులు కూడా ఉ ంటాయి. అంటే 

1) జాతీయ ఆదాయాన్ని మదించడం  

2) ఆదాయ సంపద పంపిణీ 

3) ద్రవ్యత్యాన్ని ఆపాదించడం మొదలైనవి.

 

* పాల్‌ ఎన్‌.జింగ్‌ ప్రకారం ద్రవ్యం విధులు రెండు రకాలు.

1) నిశ్చల విధులు: అంటే ప్రాథమిక, ద్వితీయ అనుషంగిక విధులు.

2) చలన విధులు: ధరల స్థాయిని, ఉత్పత్తిని, వినియోగాన్ని, పంపిణీని ప్రభావితం చేసే విధులు.

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 05-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యసప్లై కొలమానాలు

నగదు చెలామణి లెక్క పక్కా!

 

  అవసరాలను అనుసరించి నిర్దేశిత సమయాల్లో ఆర్‌బీఐ కరెన్సీని అంటే ఆర్థిక పరిభాషలో ద్రవ్యాన్ని లేదా నగదును ముద్రించి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అది రకరకాల ఆర్థిక కార్యకలాపాల మధ్య దేశంలో తిరుగుతుంటుంది. అయితే ఎంత ద్రవ్యం సరఫరా జరిగి, ఏవిధంగా చెల్లుబాటు అవుతోందనే విషయాలను అత్యున్నత బ్యాంకు నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. అందుకోసం కొన్ని రకాల కొలమానాలను రూపొందించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావాలను నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధిని, స్థిరత్వాన్ని సాధించడానికి, నగదు చెలామణి లెక్కలను పక్కాగా తేల్చడానికి ఆ కొలమానాలు ఉపయోగపడతాయి. వాటికి సంబంధించిన నిర్వచనాలను, సిద్ధాంతాలను, ఇతర అంశాలను పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  ద్రవ్య సప్లైకి సంబంధించి రెండు నిర్వచనాలు ఉన్నాయి. 

 

1) సంప్రదాయ నిర్వచనం: ఈ నిర్వచనంలో ప్రజల దగ్గర కరెన్సీ, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్‌ డిపాజిట్లను కలిపి ద్రవ్య సప్లైగా పేర్కొన్నారు.  

ద్రవ్యసప్లై = ప్రజల దగ్గర కరెన్సీ + బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లు.

 

2) చికాగో అర్థశాస్త్రవేత్త నిర్వచనం: చికాగో   ఆర్థికవేత్త మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ టైమ్‌ డిపాజిట్లను కూడా ద్రవ్యసప్లైలో చేర్చాడు. 

ద్రవ్యసప్లై = ప్రజల దగ్గర కరెన్సీ + బ్యాంకుల్లో ఉండే డిమాండు డిపాజిట్లు + టైమ్‌ డిపాజిట్లు 

  సంప్రదాయ ఆర్థికవేత్తలు ద్రవ్య నిర్వచనానికి సంకుచిత అర్థాన్ని ఇస్తే చికాగో ఆర్థికవేత్త ద్రవ్య నిర్వచనానికి విస్తృత అర్థాన్ని ఇచ్చాడు.

 

భారతదేశంలో ద్రవ్య సప్లై: 1967-68 వరకు భారత దేశంలో సంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనాన్ని అమలు చేశారు. 1968 తర్వాత ఆర్‌బీఐ చికాగో ఆర్థికవేత్తల నిర్వచనాన్ని ప్రకటించింది. 1977లో ఆర్‌బీఐ నాలుగు రకాల ద్రవ్య సప్లై  కొలమానాలను ప్రకటించింది. అవి ఎమ్‌-1, ఎమ్‌-2, ఎమ్‌-3, ఎమ్‌-4.

 

నూతన ద్రవ్యం - ద్రవ్యత్వ వనరులు: 1997లో డాక్టర్‌ వై.వి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్‌ గ్రూపు ద్రవ్య సప్లైపై అధ్యయనం చేసి 1998లో నివేదికను సమర్పించింది. ఇది మూడేసి చొప్పున నూతన ద్రవ్య కొలమానాలను, ద్రవ్యత్వ కొలమానాలను ప్రకటించింది. దాని ప్రకారం పోస్టాఫీసులోని పొదుపు డిపాజిట్లను, మొత్తం డిపాజిట్లను ద్రవ్య సప్లై  పరిధి నుంచి తొలగించారు. 

 

నూతన ద్రవ్యకొలమానాలు మూడు రకాలు:  అవి ఎమ్‌-1, ఎమ్‌-2, ఎమ్‌-3.

 

ద్రవ్యత్వ వనరులు: ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ కొత్తగా మూడు రకాల ద్రవ్యత్వ వనరులను  ప్రవేశపెట్టింది. అవి ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3.

 

రిజర్వు ద్రవ్యం: ద్రవ్య సప్లైని నిర్ణయించే 

అంశాల్లో ముఖ్యమైంది రిజర్వు ద్రవ్యం. రిజర్వు బ్యాంకు జారీ చేసి, ప్రజలు, ఇతర బ్యాంకుల వద్ద నిల్వ ఉంచే ద్రవ్యాన్ని రిజర్వు ద్రవ్యం అంటారు. దీన్ని ప్రభుత్వ ద్రవ్యం, మూలాధార ద్రవ్యం, హైపర్‌ ద్రవ్యం, ప్రాథమిక ద్రవ్యం అని వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. 

  1991, మార్చి నాటికి ప్రజల వద్ద ఉన్న కరెన్సీ 63 శాతం కాగా 2021, ఆగస్టు నాటికి అది           79.46 శాతంకి పెరిగింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న రిజర్వులు, బ్యాంకుల్లో ఇదే కాలంలో 36.2 శాతం నుంచి 19.03 శాతానికి తగ్గాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు 2021 నాటికి 1.2 శాతం మాత్రమే. సాధారణ ద్రవ్యానికి రిజర్వు ద్రవ్యానికి మధ్య ఉన్న తేడా సాధారణ ద్రవ్యంలో డిమాండ్‌ డిపాజిట్లు ఉంటాయి. రిజర్వు ద్రవ్యంలో బ్యాంకుల వద్ద నిల్వలు ఉంటాయి.


సాధారణ ద్రవ్యం (ఎమ్‌-1) = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లు + రిజర్వు బ్యాంకు ఇతర డిపాజిట్లు 


రిజర్వు ద్రవ్యం (హెచ్‌) = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు + వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు 


ద్రవ్య ప్రసార వేగం: ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్‌ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తుసేవలు కొనుగోలు చేయడానికి చేతులు మారుతుందో తెలియజేసేదే ద్రవ్య ప్రసార వేగం. అది పలు అంశాలపై ఆధారపడుతుంది. అవి 1) పరపతి సంస్థలు 2) నగదు వ్యవహారాలు 3) వినియోగ ప్రవృత్తి 4) ఆదాయ పంపిణీ 5) ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 6) వేతన విధానం 7) రెగ్యులర్‌ ఆదాయం 8) పారిశ్రామిక అభివృద్ధి 9) రవాణా అభివృద్ధి 10) ప్రసార సాధనాల అభివృద్ధి


భారతీయ కరెన్సీ: భారతదేశ ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్‌ రూపాయి. ఇది కాగితాలు, నాణేల రూపంలో ఉంటుంది. 1957కు పూర్వం రూపాయి, అణాలు, పైసలుగా కరెన్సీ వ్యవస్థ అమలులో ఉండేది. 1957, ఏప్రిల్‌ నుంచి దశాంశ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 


కాగితపు కరెన్సీ: భారతదేశంలో కాగితపు కరెన్సీ జారీ 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1861 పేపర్‌ కరెన్సీ చట్టం భారత ప్రభుత్వానికి కాగితపు కరెన్సీ జారీ చేసే అధికారాన్ని కట్టబెట్టింది. అప్పటి నుంచి 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లను జారీ చేసేది. 1938 నుంచి రిజర్వు బ్యాంకు కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. ఒక రూపాయి నోటును ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు రూ.10, రూ.20, రూ.50, రూ.100,   రూ.200, రూ.500, రూ.2000 విలువైన కాగితపు కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది.

 

నాణేలు: ప్రాచీన కాలంలో ప్రపంచ ద్రవ్యవ్యవస్థలో నాణేలు జారీ చేసిన దేశాల్లో భారత దేశం ఒకటి. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో సిర్కా చెలామణిలో ఉండేది. జనపదాలు, మౌర్యుల కాలం నుంచి నాణేలు వినియోగంలో ఉన్నాయి. క్రీ.పూ. 7 నుంచి 1వ శతాబ్దం మధ్యకాలం వరకు ముందువైపు చిత్రాలు ముద్రించిన వెండి నాణేలు చెలామణిలో ఉండేవి. వాటిని పంచ్‌ మార్క్‌డ్‌ నాణేలు అనేవారు. దేశవ్యాప్తంగా ఒకే విధంగా నాణేల వ్యవస్థ రూపొందడం మొగల్‌ చక్రవర్తుల పాలనలో జరిగింది. షేర్షా కాలం రూపియా పేరుతో వెండినాణెం ఉండేది. అది 178 గ్రాముల బరువు ఉండేది. ‘మొహర్‌’ అనే బంగారు నాణెం, ‘డామ్‌’ అనే రాగి నాణెం ఉండేవి. ఆధునిక భారతీయ రిపబ్లిక్‌ రూపాయి నాణేలు 1950లో మొదటిసారిగా ముద్రితమయ్యాయి. ప్రస్తుతం 1, 2, 5, 10 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. 

 

రూపాయి చిహ్నం: భారతీయ రూపాయి చిహ్నం  2010, జులై నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు పూర్వం Rs గుర్తు వాడుకలో ఉండేది. బాంబే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థి డి.ఉదయ్‌ కుమార్‌ దీని రూపకల్పన చేశారు. ఈ చిహ్నం దేవనాగరి  లిపి అక్షరం లాటిన్‌ కాపిటల్‌ అక్షరం  సమ్మేళనం.


కరెన్సీ నోట్ల రద్దు: 2016, నవôబరు 8న రిజర్వు బ్యాంకు రూ.1000 రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. ఆ రోజుకు 15.41 లక్షల కోట్ల విలువైన ఈ రెండు పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నాయి. రద్దు తర్వాత 15.13 లక్షల కోట్ల చెలామణి నుంచి బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 2016లో నవంబరు 10 నుంచి కొత్త రూ.2000 రూ.500 నోట్లను విడుదల చేశారు. 


రూపాయి నోటు ముద్రణ పునరుద్ధరణ:  1991 నవంబరులో రూపాయి నోటు ముద్రణను   నిలిపివేశారు. దీనికి ముద్రణ వ్యయం      పెరగడమే ప్రధాన కారణం. 1995లో రూ.2, రూ.5 నోట్ల ముద్రణ నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత 2015, మార్చి 5 నుంచి రూపాయి నోటు ముద్రణను పునరుద్ధరించారు.  


డిజిటల్‌ చెల్లింపులు: దేశంలో ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపులకు బదులుగా డిజిటల్‌ చెల్లింపును ప్రోత్సహించడానికి తగిన సూచనలివ్వడం కోసం కేంద్రప్రభుత్వం 2017, జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం జనవరి 24న నివేదికను సమర్పించింది. 

 

ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు 

 

సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనిలో ఫిషర్‌ సిద్ధాంతం ముఖ్యమైంది. ఇతడి ప్రకారం ద్రవ్యం, వినిమయ మాధ్యమంగా పనిచేయడంతో వస్తు సేవలు కొనేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు. 

 

నవ్య సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీన్ని కేంబ్రిడ్జి ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ద్రవ్యం విలువల నిధిగా పనిచేయడం వల్ల భవిష్యత్తు ఖర్చు కోసం ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు. 

 

కీన్స్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: జె.ఎమ్‌. కీన్స్‌ ప్రకారం ద్రవ్యాన్ని వినిమయ సాధనంగా మాత్రమే కాకుండా విలువల నిధిగా కూడా ఉపయోగిస్తారు. కీన్స్‌ను అనుసరించి ద్రవ్య డిమాండ్‌ను ద్రవ్యత్వాభిరుచి నిర్ణయిస్తుంది.  కీన్స్‌ తర్వాత ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు మూడు రకాలున్నాయి. 

 

బౌమల్‌ సిద్ధాంతం: బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌ కూడా వడ్డీ రేటుతో వ్యాకోచత్వ సంబంధాన్ని కలిగి ఉంటుంది. వ్యక్తులు, సంస్థలు వ్యాపార వ్యవహారాలపై ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకుంటే వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. మార్కెట్‌లో వడ్డీరేటు ఎక్కువగా ఉంటే తమవద్ద తక్కువ ద్రవ్యం ఉంచుకోగలుగుతారు. అంటే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు వడ్డీ రేటుకు విలోమ సంబంధం ఉంటుంది. ఆదాయం పెరిగితే వ్యాపార వ్యవహారాల కోసం ఉంచుకునే ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం, వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు అనులోమ సంబంధం ఉంటుంది. బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి 1) వడ్డీ రేటు 2) ఆదాయం.

 

టోబిన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: కీన్స్‌ ప్రకారం వ్యక్తులు తమ ఆస్తిని ఎల్లప్పుడూ బాండ్లు లేదా నగదు రూపంలో నిల్వ చేస్తారు. టోబిన్‌ దీన్ని వ్యతిరేకించారు. సాధారణంగా వ్యక్తులు తమ ఆస్తి మొత్తాన్ని ఒకే రూపంలో కాకుండా కొంత భాగాన్ని బాండ్లు, మరికొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుతారు. తమ సంపదలో కొంత భాగాన్ని బాండ్ల రూపంలోకి మారిస్తే దానిపై ప్రతిఫలం వస్తుంది. ఒక్కోసారి వడ్డీరేటు తగ్గితే మూలధనం నష్టం కూడా సంభవించవచ్చు. 

 

ఫ్రీడ్‌మన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీన్నే ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతం అని కూడా అంటారు.‘ద్రవ్యం సంపన్నుల సంపదను పెంచే ఒక సాధనం’ అని ఫ్రీడ్‌మన్‌ పేర్కొన్నారు. 

ద్రవ్య డిమాండ్‌ను నిర్ణయించే అంశాలు నాలుగు. అవి 1) ధరల స్థాయి 2) ఆదాయ స్థాయి 3) ప్రస్తుత వడ్డీ రేటు 4) సాధారణ ధరల స్థాయిలోని మార్పు రేటు.

 

డిజిటల్‌ వ్యవహారాల అంబుడ్స్‌మన్‌ పథకం:  2019 జనవరిలో రిజర్వు బ్యాంకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొబైల్‌ వ్యాలెట్లు, యూపీఏ మొదలైన బ్యాంకేతర విధానాల ద్వారా జరిగే డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి ఫిర్యాదులను ఉచితంగా పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. 

 

క్రిప్టో కరెన్సీ:  ఇది ఒక రకమైన డిజిటల్‌ కరెన్సీ. దీనినే ప్రత్యామ్నాయ కరెన్సీ లేదా వర్చువల్‌ కరెన్సీ అంటారు. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కరెన్సీని చెలామణీ చేశారు. భారత దేశంలో రిజర్వు బ్యాంకు ఈ కరెన్సీని నిషేధించింది. 2009లో వచ్చిన బిట్‌కాయిన్‌ కూడా ఒక రకమైన క్రిప్టో కరెన్సీ.

 

హవాలా: చట్ట వ్యతిరేక పద్ధతుల్లో ఆర్జించిన సంపాదన దాచుకోవడానికి వ్యక్తులు లేదా సంస్థలు అక్రమ నిధులను సక్రమ సంపాదనగా చూపడాన్ని మనీ లాండరింగ్‌ అంటారు. 1998, జులైలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 2002లో చట్టరూపం దాల్చింది. 

 

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ డిపాజిట్‌ పథకం: దీనిని ఏప్రిల్‌ 2015లో ప్రారంభించారు. బ్యాంకులు/  పోస్టాఫీసులు డిపాజిట్లుగా ఉన్న లెక్క చూపని ద్రవ్యాన్ని ప్రకటించడం కోసం ఉద్దేశించారు.  

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

Posted Date : 14-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యోల్బణం


అదుపు తప్పితే అంతా అస్థిరం!

 

ఒకప్పుడు పాతిక రూపాయలుండే లీటరు పాల ధర ఇప్పుడు వంద వరకు వచ్చేసింది. అదేమంటే రవాణా వ్యయాలు పెరిగాయంటారు. అవి ఎందుకు ఎక్కువయ్యాయంటే, డీజిల్‌ - పెట్రోల్‌ ధరలు పెరిగిపోయాయని చెబుతారు. వాటి పెరుగుదలకు కారణాలు అడిగితే అంతర్జాతీయంగా చమురు బ్యారెల్‌ ధరలు పెరిగాయంటారు. అక్కడెక్కడో బ్యారెల్‌ రేటు పెరిగితే, ఇక్కడ ఇంటికి వచ్చే పాల ధర దాకా ఆ ప్రభావం పడుతుంది. ఈ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం, ఇంకా జీతాలు పెంచమని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తుంటారు. ఇదే ద్రవ్యోల్బణం.  దాని వల్ల చేతిలోని డబ్బు విలువ, వినియోగదారుల కొనుగోలు శక్తి రెండూ తగ్గిపోతాయి. ద్రవ్యోల్బణం పాకుతుంది, నడుస్తుంది, పరిగెత్తుతుంది, ఏకంగా దూకుతుంది. ఆర్థిక అసమానతలను పెంచుతుంది. అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. అదుపు తప్పితే ఆర్థిక వ్యవస్థలను అస్థిరం చేస్తుంది. ఈ విధంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణం రకాలు, కారణాలు, నియంత్రణ చర్యలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

 

ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది వివిధ వర్గాల ప్రజలపై పలు రకాల ప్రభావాలను చూపి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశ స్థాయులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల తగిన నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టకపోతే హెచ్చు స్థాయి ద్రవ్యోల్బణం ఆర్థిక అస్థిరతను కలిగిస్తుంది. సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. కానీ, వాస్తవానికి వస్తుసేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణంగా పేర్కొంటారు.

 

బాక్స్‌ నిర్వచనాలు:

‘అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం’ - హాట్రే

‘తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యం తరమడమే ద్రవ్యోల్బణం’ - డాల్టన్‌ 

‘ధరల స్థాయి పెరిగి ద్రవ్య విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం’ - క్రౌథర్‌

‘నిలకడగా, నిరంతరంగా ధరల స్థాయిలో వచ్చే పెరుగుదలే ద్రవ్యోల్బణం’ - షాపిరో

 

ద్రవ్యోల్బణ సంబంధిత భావనలు: ద్రవ్యోల్బణ సంబంధిత భావనలు అయిదు రకాలుగా ఉన్నాయి. అవి

1) సాధారణంగా ధరల తగ్గుదల - ప్రతి ద్రవ్యోల్బణం

2) ద్రవ్యోల్బణ రేటులో తగ్గుదల - డిజ్‌ఇన్‌ఫ్లేషన్‌

3) నియంత్రించడానికి వీలుకాని ద్రవ్యోల్బణ విస్ఫోటం - హైపర్‌ ఇన్‌ఫ్లేషన్‌

4) ద్రవ్యోల్బణం పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థికవృద్ధి రేటు మిశ్రమ స్థితి - స్టాగ్‌ఫ్లేషన్‌

5) ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలు పెంచే ప్రయత్నం - రిఫ్లేషన్‌

 

ద్రవ్యోల్బణ స్థాయి: కొందరు ఆర్థిక శాస్త్రవేత్తలు 1.5 శాతం రేటు ధరల పెరుగుదల స్వల్పమని, అది సంపూర్ణ ఉద్యోగిత, ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవసరమని భావించారు. అందువల్ల 1.5 శాతం రేటు కంటే ఎక్కువ రేటును ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంగా నిర్ణయించారు. దాన్ని నిర్ణయిండంలో కాలం ఒక ముఖ్య అంశం. పరిస్థితులను అనుసరించి ఆ కాలాన్ని 3 నుంచి 12 నెలల వరకు పరిగణించాలి.

 

ద్రవ్యోల్బణ రకాలు

ఆర్థికవేత్తలు ద్రవ్యోల్బణాన్ని స్థూలంగా 6 రకాలుగా వర్గీకరించారు. అవి 

1) ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణ రకాలు. 

2) ద్రవ్యం, ద్రవ్య ప్రసారవేగం బట్టి ద్రవ్యోల్బణ రకాలు.

3) కీన్స్‌ ఆర్థికవేత్త ప్రకారం ద్రవ్యోల్బణ రకాలు. 

4) ధరల నియంత్రణ స్థాయిని బట్టి ద్రవ్యోల్బణ రకాలు. 

5) రాబర్ట్‌ జె.గార్డెన్‌ ప్రకారం ద్రవ్యోల్బణ రకాలు.

6) ఇతర రకాలు.

 

 

పాకే ద్రవ్యోల్బణం: ఏటా ధరల స్థాయిలో పెరుగుదల అతి తక్కువ మోతాదులో ఉంటే దాన్ని పాకే ద్రవ్యోల్బణం అంటారు. అంటే సంవత్సరానికి 3% కంటే తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని కెంట్‌ అనే అర్థ శాస్త్రవేత్త వివరించారు.

నడిచే ద్రవ్యోల్బణం: ఏడాదిలో ధరల పెరుగుదల 3% నుంచి 4% మధ్యలో ఉండటాన్ని నడిచే ద్రవ్యోల్బణం అంటారు.

పరిగెత్తే ద్రవ్యోల్బణం: సంవత్సరంలో ధరల పెరుగుదల 10% వరకు ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు.

దూకుతున్న ద్రవ్యోల్బణం: చాలా ఎక్కువ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల 100% కూడా ఉండొచ్చు. దీన్నే హైపర్‌ ద్రవ్యోల్బణం అంటారు.

 

అంతర్జాతీయంగా పెట్రోల్‌ ధరలు పెరగడం వల్ల 1973లో భారత్‌లో ద్రవ్యోల్బణం రెండు అంకెలకు చేరింది. అప్పటి ప్రభుత్వం ప్రజల వ్యయార్హ ఆదాయంపై ఆంక్షలు విధించడంతో 1975 నాటికి ద్రవ్యోల్బణం తగ్గింది. అప్పటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ద్రవ్యపరమైన చర్యలు చేపడుతోంది.

 

ద్రవ్యోల్బణ రేటుపై అభిప్రాయాలు

చక్రవర్తి కమిటీ: 4% ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఆమోదయోగ్యమైంది.

భారత ప్రభుత్వం: 4% - 6% మధ్య ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యమైంది.

సి.రంగరాజన్‌: ద్రవ్యోల్బణం ప్రారంభంలో 6.7%, తర్వాత 5 - 6% మధ్య ఉండాలి.

ఎ.తారాపుర్‌ కమిటీ: 3% - 5% మధ్యలో ద్రవ్యోల్బణం అనుకూలం.

ఉర్జిత్‌ పటేల్‌: ద్రవ్యోల్బణ లక్ష్యం 4% అయితే +/-2 ఉండవచ్చు.

 

ద్రవ్య ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా పెరగడంతో డిమాండ్‌ పెరిగి, ధరలు పెరిగితే దాన్ని ద్రవ్య ద్రవ్యోల్బణం అంటారు.

 

ధరల ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగినప్పుడు, అవి ఇంకా పెరగవచ్చని ప్రజలు భయపడి, వచ్చిన ద్రవ్యాన్ని వచ్చినట్లే ఖర్చు పెట్టడంతో ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల మళ్లీ ధరలు పెరిగితే దాన్ని ధరల ద్రవ్యోల్బణం అంటారు.

 

పాక్షిక ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేరడానికి ముందు కొన్ని ఉత్పత్తి కారకాల కొరత వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, ధరలు కూడా పెరిగితే దాన్ని పాక్షిక లేదా సెమీ ద్రవ్యోల్బణం అంటారు.

 

వాస్తవిక ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరిన తర్వాత సమష్టి డిమాండ్‌తో పాటు ధరలు కూడా పెరుగుతాయి. దీన్ని వాస్తవిక లేదా నిజ ద్రవ్యోల్బణం అంటారు.

 

హైపర్‌ ద్రవ్యోల్బణం: ద్రవ్య ప్రసార వేగం పెరగడం వల్ల ధరలు అధికంగా పెరగడాన్ని హైపర్‌ ద్రవ్యోల్బణం అంటారు.

 

బహిరంగ ద్రవ్యోల్బణం: ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల బహిర్గతంగా ధరలు పెరిగితే దాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటారు.

 

అణచివేసిన ద్రవ్యోల్బణం: రేషనింగ్, ధరల నియంత్రణ లాంటి ప్రభుత్వ విధానాల వల్ల ధరల పెరుగుదలను అణచి ఉంచుతారు. ప్రభుత్వం నియంత్రణలను ఎత్తివేస్తే ధరలు మళ్లీ పెరుగుతాయి. దీన్నే అణచివేసిన ద్రవ్యోల్బణం అంటారు.

 

డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం: సమష్టి సప్లయి కంటే సమష్టి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగితే దాన్ని డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. దీనికి కారణం వినియోగ, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాల పెరుగుదల కావచ్చు.

 

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి వ్యయాలు పెరిగితే ధరలూ పెరుగుతాయి. దీన్నే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.

 

ఉదా: శ్రామికుల వేతనాలు పెరగడం వల్ల ధరలు పెరిగితే దాన్ని వేతన ద్రవ్యోల్బణమని, లాభాలు పెరగడం వల్ల ధరలు పెరిగితే అది లాభప్రేరిత ద్రవ్యోల్బణం లేదా మార్క్‌ అప్‌ ద్రవ్యోల్బణమని; ముడి పదార్థాల కొరత వల్ల ధరలు పెరిగితే దాన్ని ముడిపదార్థాల ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఒకేసారి సంభవిస్తే అది మిశ్రమ ద్రవ్యోల్బణం అని చార్లెస్‌ షుల్జ్‌ పేర్కొన్నారు.

 

అంతర్లీన ద్రవ్యోల్బణం: వేతనాలు పెరగాలని కార్మికులు, ఉద్యోగులు చేసే డిమాండ్లే ద్రవ్యోల్బణానికి ప్రేరణ కల్పిస్తాయి. దీనివల్ల వ్యయం పెరిగి మళ్లీ ధరలు పెరిగితే అంతర్లీన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీన్నే హ్యాంగోవర్‌ ఇన్‌ఫ్లేషన్‌ అంటారు.

 

రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు.

 

ఉదా: ముడిచమురు ధర పెరిగితే దాన్ని ఉపయోగించే ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.

 

ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం: పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలు పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడాన్నే ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అంటారు.

 

ఉదా: పరిమితస్వామ్య మార్కెట్‌లో లాభాలు పెంచుకోవాలనే ఆసక్తితో ధరలు పెంచొచ్చు. అందువల్ల దీన్ని పరిమితస్వామ్య లేదా పాలిత ద్రవ్యోల్బణం అంటారు.

 

కోశ సంబంధిత ద్రవ్యోల్బణం: ప్రభుత్వం రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. ప్రభుత్వ బడ్జెట్‌ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదలను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

 

ద్రవ్యోల్బణ విరామం 

జె.ఎం.కీన్స్‌ ‘హౌ టు పే ఫర్‌ ది వార్‌’ అనే గ్రంథంలో దీన్ని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి విలువ కంటే చేసే వ్యయం ఎక్కువగా ఉంటే, వాటి మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యోల్బణ విరామం అంటారు. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఉన్న జాతీయ ఆదాయ స్థాయి కంటే వినియోగ పెట్టుబడి కలిపి ఎక్కువగా ఉంటే ఇది ఏర్పడుతుంది. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఉన్న జాతీయ ఆదాయ స్థాయి కంటే సమష్టి డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణ విరామం ఏర్పడుతుంది. దీన్ని పొదుపు పెంచడం ద్వారా కానీ, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం ద్వారా కానీ, పన్నులు పెంచడం ద్వారా కానీ తొలగించవచ్చు. దీర్ఘకాలంలో ఉత్పత్తిని పెంచడం ద్వారా తగ్గించవచ్చు.

 

ద్రవ్యోల్బణానికి కారణాలు: ద్రవ్యోల్బణానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి అవి 

1) డిమాండ్‌ 

2) సప్లయి

 

డిమాండ్‌: సమష్టి డిమాండ్‌ పెరగడంతో ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. లోటు విత్తాన్ని అవలంబించడం వల్ల ధరలూ పెరుగుతాయి.

 

కారణాలు: 

1) ప్రభుత్వ వ్యయం పెరగడం 

2) లోటు విత్తం 

3) జనాభా పెరుగుదల  

4) ప్రజల వినియోగం పెరుగుదల 

5) సులభ ద్రవ్య విధానం  

6) ఎగుమతులు పెరగడం 

7) ద్రవ్య సరఫరా పెరగడం

 

సప్లయి: ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ఆశించిన స్థాయిలో ఉత్పత్తి పెరగకపోతే, సప్లయి తగ్గి ధరలు పెరుగుతాయి.

 

కారణాలు: 

1) వ్యవసాయ రంగంలో అస్థిర వృద్ధి 

2) నిత్యావసర వస్తువుల దాచివేత 

3) ప్రభుత్వ వ్యవసాయ ధరల విధానం 

4) పాలిత ధరలు పెరగడం 

5) ఉత్పత్తి కారకాల సప్లయి కొరత 

6) అధిక వేతన రేట్లు 

7) అధిక పన్ను రేట్లు 

 

ద్రవ్యోల్బణ కాలంలో లాభాలు పొందేవారు: 

1) రుణగ్రహీతలు 

2) వ్యాపారస్థులు 

3) ఉత్పత్తిదారులు 

4) వాటాదారులు 

5) అంచనా వ్యాపారం చేసేవారు 

6) బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసేవారు.

 

ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోయేవారు:  

1) రుణదాతలు 

2) వినియోగదారులు 

3) స్థిర ఆదాయం పొందేవారు 

4) వేతనాలు పొందేవారు, పింఛన్‌దారులు 

5) స్థిరమైన భాటకాన్ని పొందే భూస్వాములు.

 

ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం: 

1) ఉత్పత్తిపై ప్రభావం 

2) పంపిణీపై ప్రభావం 

3) ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభావం 

4) విదేశీ చెల్లింపుల శేషంపై ప్రభావం 

5) ఆర్థిక అసమానతలు పెరుగుతాయి 

6) ఆర్థికాభివృద్ధికి ఆటంకం 

7) సాపేక్ష ధరల మార్పులు

 

ద్రవ్యోల్బణ నివారణ చర్యలు: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటాయి. రిజర్వు బ్యాంకు తీసుకునే వాటిని ద్రవ్యపరమైన చర్యలు, ప్రభుత్వం తీసుకునే వాటని కోశపరమైన చర్యలు అంటారు.

 

ద్రవ్యపరమైన చర్యలు: 

1) పరిమాణాత్మక చర్యలు 

2) గుణాత్మక చర్యలు.

 

పరిమాణాత్మక పరపతి నియంత్రణ చర్యలు: 

1) బ్యాంకు రేటు పెంపు. 

2) నగదు నిల్వల నిష్పత్తి (సి.ఆర్‌.ఆర్‌.) పెంపు. 

3) చట్టబద్ధ ద్రవ్యత్వ నగదు నిల్వల నిష్పత్తి (ఎస్‌.ఎల్‌.ఆర్‌.) పెంపు. 

4) రెపో రేటు పెంపు. 

5) రివర్స్‌ రెపో రేటు పెంపు. 

6) బహిరంగ మార్కెట్‌ చర్యల్లో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం.

 

ఏప్రిల్‌ 6, 2023న ఆర్‌బీఐ ప్రకటించిన పరిమాణాత్మక ద్రవ్యవిధాన అంశాలు:  

1) బ్యాంకు రేటు - 6.75 శాతం 

2) నగదు నిల్వల నిష్పత్తి - 4.50 శాతం 

3) చట్టబద్ధ ద్రవ్యత్వ నిల్వల నిష్పత్తి - 18.0 శాతం 

4) స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ - 6.25 శాతం 

5) మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ - 6.75 శాతం 

6) రెపో రేటు - 6.50 శాతం 

7) రివర్స్‌ రెపో రేటు - 3.35 శాతం

 

గుణాత్మక పరపతి నియంత్రణ చర్యలు: 

1) మార్జిన్‌లు పెంచడం 

2) డౌన్‌ పేమెంట్‌ పెంచడం  

3) వాయిదాల సంఖ్యను పెంచడం  

4) వినియోగదారుడికి పరపతిపై గరిష్ఠ పరిమితి విధించడం.

 

కోశ చర్యలు: వీటిని ప్రభుత్వం అమలు చేస్తుంది. అవి  

1) ప్రభుత్వ అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించడం  

2) ప్రైవేటు పెట్టుబడిదారులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడం 

3) లోటు విత్తాన్ని విడిచిపెట్టి మిగులు బడ్జెట్‌ను అనుసరించడం 

4) ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందించి ధరల నియంత్రణ 

5) సప్లయి పెంచేందుకు దిగుమతులు అనుమతించడం 

6) ధరల విధానం ద్వారా వాటిపై గరిష్ఠ పరిమితి విధించడం 

7) ఆదాయ విధానం ద్వారా హేతుబద్ధమైన వేతనాలు, జీతాలు, పింఛన్లు నిర్ణయించడం

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌
 

Posted Date : 22-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్యాంకింగ్‌

పొదుపు.. పెట్టుబడి.. ప్రగతి!

 

 

 

వ్యక్తులు, వ్యాపారాలు, వర్తక, వాణిజ్య వ్యవహారాలకు, సమాజ సంక్షేమానికి, ఆర్థిక ప్రగతికి అసమాన సేవలు అందించే రంగం బ్యాంకింగ్‌. పొదుపులు సేకరించి, పెట్టుబడులకు సహకరించి, అభివృద్ధిని ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో బ్యాంకింగ్‌ చరిత్రను, వివిధ రకాల బ్యాంకులు, ఇతర వివరాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

 

బ్యాంకు అనే పదానికి ఆధారం బ్యాంకో, బాంక్వీ. ఈ పదాలకు అర్థం బల్ల. Banca అనే ప్రాచీన ఇటాలియన్, Banc అనే జర్మన్‌ పదాల నుంచి Bank అనే ఆంగ్ల పదం ఆవిర్భవించింది. క్రీ.పూ.600లో బాబిలోన్‌ దేశంలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని రెవిల్‌ పౌట్‌ అనే ఫ్రెంచి రచయిత పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ అంటే ద్రవ్యాన్ని మారకం చేయడం. క్రౌధర్‌ ప్రకారం బ్యాంకులకు పూర్వీకులు ముగ్గురు ఉన్నారు. 1) వర్తక వ్యాపారి 2) వడ్డీ వ్యాపారి 3) స్వర్ణకారుడు

బ్యాంకు నిర్వచనం: భారత బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం 1949, సెక్షన్‌-5 ప్రకారం కోరిన వెంటనే లేదా మరో సమయంలో చెక్కు, డ్రాఫ్టు, ఆర్డర్ల ద్వారా లేదా మరో విధంగా తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లు స్వీకరించి, ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి, పెట్టుబడి కోసం ఉపయోగించే సంస్థ బ్యాంకు.

 


షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూల్‌లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.

అర్హతలు: 

* బ్యాంకింగ్‌ వ్యాపారం చేస్తూ ఉండాలి. 

* వాటా మూలధనం నిధులు రూ.అయిదు లక్షల నికర విలువకు తక్కువ కాకుండా ఉండాలి. 

* జాయింట్‌ స్టాక్‌ కంపెనీగా రిజిస్టర్‌ కావాలి.

* డిపాజిటర్ల క్షేమానికి భంగం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.


నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూల్‌లో నమోదు కాని బ్యాంకులను నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.

భారత దేశంలో బ్యాంకింగ్‌ చరిత్ర: 1770లో అలెగ్జాండర్‌ అండ్‌ కో అనే ఆంగ్ల ఏజెన్సీ హౌస్, బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ను స్థాపించింది. ఇది భారత దేశంలో స్థాపించిన మొదటి బ్యాంకు. తర్వాత ఏజెన్సీలతో సంబంధం లేకుండా ప్రెసిడెన్సీ బ్యాంకులను నెలకొల్పారు. అవి- బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ (1806), బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే (1840), బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1843). ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల వాటా మూలధనంలో అధిక భాగం ఐరోపా వాటాదారులది. పూర్తి భారతీయ యాజమాన్యంలో నెలకొల్పిన మొదటి బ్యాంకు ఔధ్‌ వాణిజ్య బ్యాంకు. దీన్ని 1881లో స్థాపించారు. ఆ తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (1894), పీపుల్స్‌ బ్యాంకు (1901)లను ప్రారంభించారు. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి భారతీయ ఇంపీరియల్‌ బ్యాంకుగా పేరు మార్చారు. ఆర్‌బీఐ ఏర్పడక ముందు ఇంపీరియల్‌ బ్యాంకు కేంద్ర బ్యాంకు విధుల్లో కొన్నింటిని నిర్వహించేది. 1955, జులై 1న గోర్వాలా కమిటీ సిఫార్సు మేరకు ఇంపీరియల్‌ బ్యాంకును స్టేట్‌ బ్యాంకుగా పేరు మార్చారు. 1959లో భారతీయ స్టేట్‌ బ్యాంకు చట్టం చేశారు. ఈ చట్టం కింద ఎనిమిది ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేసి భారతీయ స్టేట్‌ బ్యాంకుకు అనుబంధ బ్యాంకులుగా చేశారు.  అవి 1) బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ 2) బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌ 3) బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ 4) బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ 5) బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా 6) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ 7) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర 8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌. 1963లో బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్, బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌ విలీనమై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపుర్‌గా రూపొందింది. 2008లో ఎస్‌బీఐ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర, 2010లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ (2010)లను విలీనం చేసుకుంది. ఆ తర్వాత 2017లో ఏప్రిల్‌లో మిగిలిన అయిదు అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. 

జాతీయం చేసిన బ్యాంకులు: 1967లో హజారీ కమిటీ ప్రకారం కుటీర పరిశ్రమలు, ప్రాథమిక రంగాలకు రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులపై సామాజిక నియంత్రణను విధించారు. కానీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 1969, జులై 19న రూ.50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. 

అవి:

1. అలహాబాద్‌ బ్యాంకు  2. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  3. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర   4. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   5.సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6. ఇండియన్‌ బ్యాంకు  7. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు  8. దేనా బ్యాంకు  9. కెనరా బ్యాంకు  10. సిండికేట్‌ బ్యాంకు  11. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 12. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   13. యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు  14. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు, ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు 1980, ఏప్రిల్‌ 15న రూ.200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న ఆరు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అవి 1) ఆంధ్రా బ్యాంకు2) కార్పోరేషన్‌ బ్యాంకు 3) పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు 4) న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5) విజయ బ్యాంకు 6) ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌

న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాల్లో ఉండటంతో దాన్ని 1993లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో కలిపేశారు. 2019, ఏప్రిల్‌లో దేనా బ్యాంకు, విజయ బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. 2020, ఏప్రిల్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. ఇదే సంవత్సరంలో సిండికేట్ బ్యాంకు- కెనరా బ్యాంకులో, అలహాబాద్‌ బ్యాంకు- ఇండియన్‌ బ్యాంకులో, ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్‌ బ్యాంకులు.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కలిసిపోయాయి. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకులు 11. ఎస్‌బీఐతో కలిపి ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12. 

భారతీయ మహిళా బ్యాంకు: 2013, నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మొదటి భారతీయ మహిళా బ్యాంకును దిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని తొలి సీఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ఈ బ్యాంకు లక్ష్యం మహిళలకు సహాయం అందించి విత్త సమ్మిళితానికి దోహదపడటం. డిపాజిట్లను ప్రజలందరి నుంచి స్వీకరిస్తుంది. రుణాలు మాత్రం మహిళలకే అందిస్తుంది. 2017 ఏప్రిల్‌లో ఇది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైంది. ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకులను ఏర్పాటు చేసిన మూడో దేశం ఇండియా. మొదటిది పాకిస్థాన్, రెండోది టాంజానియా. 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: బ్యాంకులను జాతీయం చేసినప్పటికీ గ్రామాల్లో రుణగ్రస్తత తగ్గలేదు. వడ్డీ వ్యాపారుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఎం.నరసింహన్‌ కమిటీ సిఫార్సు మేరకు 20 సూత్రాల పథకంలో భాగంగా 1975, అక్టోబరు 2న అయిదు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అవి- 1) మోరాబాద్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) 2) గోరఖ్‌పుర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) 3) బివానీ (హరియాణా) 4) జైపుర్‌ (రాజస్థాన్‌) 5) మాల్టా (పశ్చిమ బెంగాల్‌).

తర్వాత ఈ బ్యాంకులను వాటికి స్పాన్సర్‌ చేసిన బ్యాంకుల్లో విలీనం చేశారు. 1987 నుంచి కొత్త ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించలేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, కేంద్ర ప్రభుత్వం 50 శాతం, స్పాన్సర్‌ చేసిన బ్యాంకు 35 శాతం వాటాలను కలిగి ఉంటాయి. 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్‌ చేసే బ్యాంకులు

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 

* ఇండియన్‌ బ్యాంకు 

* ఆంధ్రా బ్యాంకు

* యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు     స్పాన్సర్‌ చేసిన బ్యాంకు

1. మోలాబాద్‌                              సిండికేట్‌ బ్యాంకు

2. గోరఖ్‌పుర్‌                                సిండికేట్‌ బ్యాంకు 

3. బీవానీ                                    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

4. జైపుర్‌                                   యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు

5. మాల్టా                                  యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు నాగార్జున జాతీయ గ్రామీణ బ్యాంకు. దీన్ని 1976లో, ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేని రాష్ట్రాలు సిక్కిం, గోవా. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ బ్యాంకులు           స్పాన్సర్‌ చేసిన బ్యాంకు

1. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణా వికాస్‌ బ్యాంకు - వరంగల్‌          స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

2. దక్కన్‌ గ్రామీణా బ్యాంకు - హైదరాబాద్‌                        స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌

3. ఆంధ్రప్రగతి గ్రామీణా బ్యాంకు - కడప                          సిండికేట్‌ బ్యాంకు

4. సప్తగిరి గ్రామీణా బ్యాంకు - చిత్తూరు                             ఇండియన్‌ బ్యాంకు

5. చైతన్య గోదావరి గ్రామీణా బ్యాంకు - గుంటూరు            ఆంధ్రా బ్యాంకు

ప్రాంతీయ గ్రామీణా బ్యాంకులు లేని రాష్ట్రాలు సిక్కిం, గోవా. 1997 నుంచి ప్రాధాన్య రంగానికి రుణాలు ఇవ్వడమనే భావన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తింపజేశారు. అవి ఇచ్చే రుణాల్లో 75% ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలని చక్రవర్తి కమిటీ సూచించింది.


ముద్రా బ్యాంకు: మైక్రో యూనిట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీ-ఫైనాన్స్‌ ఏజెన్సీ ్బలీగీదీళిత్శి అనేది ఒక ప్రభుత్వ రంగ విత్త సంస్థ. ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద దీన్ని నెలకొల్పారు. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు అనుబంధ సంస్థగా దీన్ని 2015, ఏప్రిల్‌ 8న ప్రారంభించారు. తక్కువ వడ్డీ రేట్లకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. సూక్ష్మ విత్త సంస్థలకు, బ్యాంకేతర విత్త సంస్థలకు కూడా రుణ సహాయం అందిస్తుంది. ఈ సంస్థకు లక్ష కోట్ల రూపాయల పరపతి హామీ నిధిని కేటాయించారు. చిన్న తయారీ సంస్థలు, దుకాణదారులు, పండ్లు కూరగాయలు అమ్మేవారు, చేతి వృత్తులవారికి ఈ సంస్థ రుణాలను అందిస్తుంది. రుణగ్రహీతలకు ముద్రా కార్డు పేరుతో ఒక రూపే డెబిట్‌ కార్డు ఇస్తారు.


పేమెంట్‌ బ్యాంకులు:  ఇవి కొత్త తరహా బ్యాంకులు. 2014, జనవరిలో నచికేత్‌ మోర్‌ కమిటీ ఈ బ్యాంకుల స్థాపనను సిఫార్సు చేసింది. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది. 2015, ఆగస్టు 19న ఆర్‌బీఐ 11 పేమెంటు బ్యాంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులు వ్యక్తి నుంచి లక్ష రూపాయల వరకు డిమాండ్‌ డిపాజిట్లు స్వీకరించవచ్చు. చెల్లింపు సేవలు అందించవచ్చు. మొబైల్‌ ద్వారా చెల్లింపు బదిలీలు చేయవచ్చు. అల్ప ఆదాయ వర్గాల వారు, చిన్న వ్యాపారస్థులు, వలస కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి విత్తసేవలు అందుబాటులో ఉంచడమే వీటి లక్ష్యం. ఈ బ్యాంకులు రుణాలు అందించడానికి, క్రెడిట్‌ కార్డులు జారీ చేయడానికి వీలు లేదు. డెబిట్‌ కార్డులు జారీ చేయవచ్చు.


చిన్న విత్త బ్యాంకులు: బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని జనాభా సౌకర్యార్థం ఏర్పాటు చేసినవి చిన్న విత్త బ్యాంకులు. వీటి లక్ష్యం సమ్మిళిత విత్తసేవ. రూ.100 కోట్ల కనీస ఈక్విటీ మూలధనంతో వీటిని స్థాపించవచ్చు. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు ఈ తరహా బ్యాంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2015, సెప్టెంబరు 17న బ్యాంకేతర విత్త సంస్థలకు లైసెన్సు జారీ చేసింది. ఈ బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి. సన్నకారు, ఉపాంత రైతులకు, చిన్న వ్యాపార సంస్థలకు అసంఘటిత రంగాల్లోని వారికి రుణాలు అందిస్తాయి. 


బంధన్‌ బ్యాంకు: ఆర్థిక మంత్రి అరుణ్‌ జైెట్లీ 2015లో కోల్‌కతాలో ఈ బ్యాంకును ప్రారంభించారు. ఇది దేశంలో మైక్రో ఫైనాన్స్‌ కంపెనీగా ఉండి పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి బ్యాంకు. స్వాతంత్య్రం తర్వాత తూర్పు భారతదేశంలో ప్రారంభించిన మొదటి బ్యాంకు. ఇది ప్రైవేటు సంస్థ.


ఐడీఎఫ్‌సీ బ్యాంకు: 2015, అక్టోబరు 19న ప్రధాని న్యూదిల్లీలో ప్రారంభించారు. దీని ప్రధాన కేంద్రం ముంబయి. మొదట ఇది అవస్థాపన సదుపాయాల  కల్పనకు విత్త సంస్థగా ఉండేది. దీన్ని వాణిజ్య బ్యాంకుగా మార్చారు.. ఇది ఒక ప్రైవేటు సంస్థ.


ప్రైవేటు బ్యాంకులు: ప్రస్తుతం భారతదేశంలో 22 ప్రైవేటు బ్యాంకులున్నాయి. 


విదేశీ బ్యాంకులు: 2022 నాటికి 46 విదేశీ బ్యాంకులున్నాయి. వీటిలో స్టాండర్డ్‌ చార్టర్‌ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులకు ఎక్కువగా శాఖలున్నాయి. విదేశీ బ్యాంకును ఏర్పాటు చేయాలంటే 2013 ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.500 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేయాలి.


స్టేట్‌బ్యాంకు ఇన్‌క్యూబ్‌: భారత దేశంలో ప్రత్యేకంగా అంకుర సంస్థల (స్టార్టప్‌) కోసం ఏర్పడిన వాణిజ్య బ్యాంకు శాఖ. దీన్ని బెంగళూరులో 2016, జనవరి 14న భారతీయ స్టేట్‌ బ్యాంకు ప్రారంభించింది. 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 06-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మూలధన మార్కెట్‌

పెద్ద పెట్టుబడులు అందించే విశ్వసనీయ వ్యవస్థ!

 


  దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధిలో కీలకమైన వ్యాపార సంస్థలకు, కంపెనీలకు పెట్టుబడులు పెద్దమొత్తంలో కావాలి. అలాగే ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు ఎప్పటికప్పుడు భారీగా నిధులు అవసరమవుతుంటాయి. వీటికి వ్యవస్థాగతంగా దీర్ఘకాలిక విత్తాన్ని అందించే వనరే మూలధన మార్కెట్‌. ప్రజల వద్ద ఉన్న పొదుపును; బ్యాంకులు, బీమా సంస్థల్లో పోగుపడిన నిధులను, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి సంపదను సేకరించి ఉత్పాదక కార్యకలాపాలకు తరలిస్తున్న వ్యవస్థ ఇది. ఇందులో భాగమే స్టాక్‌ మార్కెట్‌. దేశంలోని మిగులు ధనాన్ని అనుత్పాదక వనరుల నుంచి ఉత్పాదక రంగాలకు తరలిస్తున్న ఈ చట్రంపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. ఆధునిక కాలంలో పెట్టుబడుల సేకరణకు సృష్టించిన అద్భుత మార్గమైన స్టాక్‌ మార్కెట్‌ గురించి, దాని పూర్వాపరాలు, పనితీరు, ప్రభావం, అనుబంధ సంస్థల గురించి తెలుసుకోవాలి.

 


 
  దీర్ఘకాలిక విత్తాన్ని కొన్ని సంస్థలు, ఏర్పాట్లు, సౌకర్యాలు సమకూరుస్తాయి. వాటన్నింటినీ కలిపి మూలధన మార్కెట్‌ అంటారు. పొదుపు మొత్తాల సేకరణ, పెట్టుబడి మార్గాల్లోకి తరలింపు దీని ప్రధాన బాధ్యత. ప్రైవేటు రంగంతో పాటు ప్రభుత్వ రంగం కూడా దీర్ఘకాలిక విత్త అవసరాలకు మూలధన మార్కెట్‌పై ఆధారపడుతుంది. ఈ మార్కెట్‌లో పెట్టుబడి కాలవ్యవధి ఒక సంవత్సరం కంటే ఎక్కువ.

 


మూలధన మార్కెట్‌ సాధనాలు: 1) వాటాలు 2) రుణపత్రాలు 3) బాండ్లు 4) డెరివేటివ్స్‌ 5) మ్యూచువల్‌ ఫండ్స్‌.

 


ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్‌ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆర్థిక వ్యవస్థకు రెండూ అవసరమే. ఒక మార్కెట్‌ కార్యకలాపాలు రెండో మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు అధికంగా ఉంటే మూలధన మార్కెట్‌లో ద్రవ్యానికి డిమాండ్‌ పెరగవచ్చు. మూలధన మార్కెట్‌లో సెక్యూరిటీలపై డివిడెండ్‌ లేదా వడ్డీ చెల్లించినప్పుడు ద్రవ్య మార్కెట్‌లో ద్రవ్య నిధులు పెరగవచ్చు.

 


మూలధన మార్కెట్‌ విధులు:  1) సమాజంలోని పొదుపును సమీకరిస్తుంది, పెట్టుబడి మార్గంలోకి మళ్లిస్తుంది. 2) పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు విత్తాన్ని సమకూరుస్తుంది.3) మూలధన నిధులను అనుత్పాదక రంగాల నుంచి ఉత్పాదక రంగాలకు తరలిస్తుంది. 4) వనరుల సమర్థ వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత పెరుగుదలకు తోడ్పడుతుంది.5) దేశ ఆర్థికాభివృద్ధిలో పాలు పంచుకుంటుంది.

 


భారతీయ మూలధన మార్కెట్‌ స్వరూపం:

 


సెక్యూరిటీల మార్కెట్‌: ద్రవ్యం మీద లేదా విత్త సంబంధ ఆస్తుల మీద ఉన్న హక్కును తెలియజేసే పత్రాలను సెక్యూరిటీలు అంటారు. దీర్ఘకాలిక వ్యవధి ఉన్న సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం నిర్వహించే మార్కెట్‌ను సెక్యూరిటీల మార్కెట్‌ అవుతుంది. దీన్నే స్టాక్‌ మార్కెట్‌ అని కూడా అంటారు. మూలధన మార్కెట్‌లో ప్రధాన విభాగం ఇదే. దీన్ని ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్, ప్రైవేటు సెక్యూరిటీల మార్కెట్‌ అని రెండు రకాలుగా విభజించారు.

 


1) ప్రభుత్వ సెక్యూరిటీల లేదా శ్రేష్ఠ సెక్యూరిటీల మార్కెట్‌ (గిల్ట్‌ ఎడ్జ్‌డ్‌ మార్కెట్‌): ఇది ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ హామీ పొందిన సెక్యూరిటీల క్రయవిక్రయాలు జరిగే మార్కెట్‌. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, ప్రభుత్వ పోర్టు ట్రస్టులు, రాష్ట్ర విద్యుత్తు మండళ్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ అభివృద్ధి బ్యాంకులు జారీ చేసిన సెక్యూరిటీలను ప్రభుత్వ సెక్యూరిటీలు అంటారు. గిల్ట్‌ ఎడ్జ్‌ అంటే ‘మంచి నాణ్యత’ అని అర్థం. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. నష్టభయం ఉండదు. ప్రభుత్వ సెక్యూరిటీలు రూ.100, రూ.1000 విలువతో ఉంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు అధికంగా ప్రామిసరీ నోటు రూపంలో ఉంటాయి.బేరర్‌ బాండ్ల రూపంలో స్టాక్‌ సర్టిఫికెట్‌లు ఉంటాయి.

 


2) పారిశ్రామిక లేదా కార్పొరేట్‌ సెక్యూరిటీల మార్కెట్‌: ప్రైవేటు సెక్యూరిటీల మార్కెట్‌ను పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్‌ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.


ఎ) నూతన జారీ మార్కెట్‌: దీన్ని ప్రాథమిక మార్కెట్‌ అంటారు. వీటి ద్వారా నిధులు సమకూర్చుకునే సంస్థలు కొత్తవి కావచ్చు, విస్తరణకు ప్రయత్నిస్తున్న పాత సంస్థలు కావచ్చు.


బి) పాత జారీ మార్కెట్‌: అప్పటికే అమలులో ఉన్న సెక్యూరిటీలు లేదా పాత జారీల క్రయ విక్రయాలు నిర్వహించే మార్కెట్‌. అలాంటి సెక్యూరిటీలకు ద్రవ్యత్యం కల్పించడమే ఈ మార్కెట్‌ ప్రధాన విధి. దీన్నే ద్వితీయ మార్కెట్‌ అంటారు. దీన్ని రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు.


i) సంఘటిత స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌: వ్యవస్థీకృత మూలధన మార్కెట్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఒక ముఖ్యమైన భాగం. పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిగే మార్కెట్‌. దీన్నే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లేదా స్టాక్‌ మార్కెట్‌గా పిలుస్తారు.


ii) ఓవర్‌ ది కౌంటర్‌ మార్కెట్‌: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో లేని సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహిస్తుంది.

 


స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌: 1956 సెక్యూరిటీ క్రమబద్ధ చట్టం ప్రకారం సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని లేదా వర్తకాన్ని నియంత్రించడానికి లేదా సులభం చేయడానికి ఏర్పాటుచేసిన నమోదైన, లేదా నమోదు కాని వ్యక్తుల సంఘం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. ప్రభుత్వ సెక్యూరిటీలకు రిజర్వు బ్యాంకు అనుమతి పొందిన ప్రభుత్వ బ్రోకర్లు ఉంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో ఉన్న సెక్యూరిటీలకు మార్కెట్‌లో న్యాయబద్ధమైన ధర లభిస్తుంది. పన్నుల విధింపులో కొన్ని రాయితీలు లభిస్తాయి.అలాంటి సెక్యూరిటీలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది.

 


స్థాపన: ప్రపంచంలో మొదట స్థాపించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. దీన్ని 18వ శతాబ్దంలో నెలకొల్పారు. అమెరికాలోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ‘నాస్‌డాక్‌’, ఇంగ్లండ్‌లోని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్, జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు ప్రపంచంలో ప్రధానమైన స్టాక్‌ మార్కెట్లు. భారతదేశంలో మొట్టమొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1875లో ముంబయిలో ఏర్పాటైంది. ఆ తర్వాత అహ్మదాబాద్, చెన్నై, దిల్లీ, ఇందౌర్, హైదరాబాద్, బెంగళూరు, లుథియానా, కాన్పుర్‌ నగరాల్లో స్థాపించారు.


భారతదేశంలో సెబీ గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు 8 ఉన్నాయి. అవి 1) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) 2) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) 3) అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 4) కలకత్తా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 5) ఇండియా ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 6) మగధ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 7) మెట్రోపాలిటన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


8) ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ లిమిటెడ్‌.వీటిలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రధానమైనవి.

 


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌: 1875లో అప్పటి బొంబయిలో ‘ది నేటివ్‌ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌’ అని ఒక సంస్థ ఏర్పడింది. అదే బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. భారతదేశంలో 1957లో శాశ్వత ప్రాతిపదికన మొదట గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇది. ప్రధాన కార్యాలయం ముంబయి దలాల్‌ వీధిలో ఉంది. ఇందులో రిజిస్టరైన కంపెనీల సంఖ్య 5307. ప్రస్తుత ఎండీ, సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి.

 


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌: 1992, నవంబరులో ముంబయిలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించారు. 1994, జూన్‌ 30 నుంచి ఇందులో వ్యాపారం ప్రారంభమైంది. అప్పటివరకు అతి పెద్దదైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కంటే ఎక్కువ వ్యాపారం సాధించింది. ఇందులో రిజిస్ట్టరైన కంపెనీలు 2002. ప్రస్తుత ఎండీ, సీఈఓ అశీష్‌ కుమార్‌ చౌహాన్‌.

 


స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సభ్యులు జాబర్లు, బ్రోకర్లు అని రెండు రకాలు.

 


జాబర్లు: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోనే ఉండి వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తారు.

 


బ్రోకర్లు: కొనుగోలు, అమ్మకం వ్యవహారాల్లో ఇతరులకు ఏజెంట్లుగా పనిచేస్తారు. సభ్యులు కాని వారిని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోకి అనుమతించరు.

 


అంచనా వ్యాపారం: సాధారణంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అంచనా వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. సెక్యూరిటీ ధరల్లో భవిష్యత్తులో వచ్చేందుకు అవకాశం ఉన్న మార్పులను ముందుగానే అంచనా వేసి అధిక లాభాపేక్షతో కొనుగోలు, అమ్మకం చేసే వ్యాపారులను అంచనా వ్యాపారులు అంటారు. అంచనా వ్యాపారం చేసే సభ్యులను స్పెక్యులేటర్లు అంటారు. వీరిని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు.

 


1) బుల్స్‌: భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి, ప్రస్తుత ధరల వద్ద సెక్యూరిటీలు కొని ధరలు పెరిగిన తర్వాత అమ్మేవారిని బుల్స్‌ అంటారు. వీరు ఆశావాదులు.

 


2) బేర్స్‌: భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి సెక్యూరిటీలను అమ్మేవారిని బేర్స్‌ అంటారు. వీరు నిరాశావాదులు.

 


3) స్టాగ్స్‌: వీరు బుల్స్‌ మాదిరిగానే భవిష్యత్తులో సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఊహిస్తారు. కొత్త కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీలను పెద్దమొత్తంలో కొనేందుకు దరఖాస్తు చేస్తారు.

 


4) లేమ్‌డక్‌లు: వీరు తమ వద్ద సెక్యూరిటీలు లేకపోయినా అమ్మడానికి కాంట్రాక్టులు రాసి వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలు కొనడానికి అన్వేషిస్తుంటారు.

 


భారతదేశంలో స్టాక్‌ మార్కెట్‌ సూచికలు:

 


సెన్సెక్స్‌: దీన్నే సెన్సిటివ్‌ ఇండెక్స్‌ అంటారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన సూచిక. ఈ సూచీలోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 30. ఆధార సంవత్సరం 1978-79.

 


నేషనల్‌ ఇండెక్స్‌: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన మరో సూచిక. దీనిలో ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 100. ఆధార సంవత్సరం 1983-84.

 


బీఎస్‌ఈ- 200: ఈ సూచికలోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 200. ఆధార సంవత్సరం 1989-90.

 


డాలెక్స్‌: బీఎస్‌ఈ- 200 డాలర్‌ విలువను డాలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 1989-90.

 


బ్యాంకెక్స్‌: ఇది 2003, జూన్‌ నుంచి రూపుదిద్దుకుంటోంది. ఇందులో 12 బ్యాంకుల వాటాలను చేర్చారు. ఆధార సంవత్సరం 2002.

 


బీఎస్‌ఈ షరియా: బీఎస్‌ఈలో 2010లో దీన్ని ప్రవేశపెట్టారు. దీనిలో 50 కంపెనీలు లిస్టయ్యాయి.

 


నిఫ్టీ ఫిప్టీ (ఎన్‌ఎస్‌ఈ-50): ఈ సూచికను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తయారు చేస్తుంది. 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలను ఇందులో చేర్చారు. దీనిపేరు ఎస్‌ అండ్‌ పీసీఎన్‌ఎక్స్‌ నిఫ్టీగా మార్చారు. ఆధార సంవత్సరం 1975.

 


కమాడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌: కొన్ని వస్తువుల ధరల్లో భవిష్యత్తులో ఎక్కువగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ ప్రభావాన్ని తప్పించేందుకు కొనుగోలుదారులు, అమ్మకందారులు ఒక వస్తువును భవిష్యత్తులో ఒక నిర్ణీత పరిమాణంలో ఒక నిర్ణీత తేదీన, ఒక నిర్ణీత ధర వద్ద కొనడం, అమ్మకం గురించి ఒప్పందం కుదుర్చుకుంటారు. అలాంటి ఒప్పందాలను కమాడిటీ ప్యూచర్స్‌ మార్కెట్‌ అంటారు. వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడి చమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు మొదలైన వస్తువుల్లో ఫ్యూచర్‌ వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్‌కు సంబంధించిన ఎక్స్ఛేంజ్‌లను కమాడిటీ ఎక్స్ఛేంజ్‌లు అంటారు. భారతదేశంలో పనిచేస్తున్న కమాడిటీ ఎక్స్ఛేంజ్‌లు 1) నేషనల్‌ కమాడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎమ్‌సీఈ) అహ్మదాబాద్‌ (2002) 2) ఎం.సి.ఎక్స్‌. ముంబయి- (2003). 3) నేషనల్‌ కమాడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీడీఈఎక్స్‌) 4) ఎ.సి.ఇ. కమాడిటీ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి).

 


క్రిసిల్‌-క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌: క్రిసిల్‌ భారతదేశపు మొదటి రేటింగ్‌ ఏజెన్సీ. దీనిని 1987లో నెలకొల్పారు. సంస్థల వ్యాపార నష్టభయం, నిర్వహణ నష్టభయం, ఆర్థిక నష్టభయం అనే మూడు అంశాలను మూల్యాంకనం చేసి, వ్యాపార సంస్థలకు రేటింగ్‌ ఇస్తుంది.

 


సెబీ: సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా. మూలధన మార్కెట్‌ను క్రమబద్ధీకరించటానికి, అభివృద్ధి చేయడానికి, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడానికి ఒక ఉన్నత స్థాయి సంస్థను నెలకొల్పాలన్న పటేల్‌ కమిటీ సిఫార్సు మేరకు 1988లో సెబీ ఏర్పాటైంది. 1992, జనవరి నుంచి సెబీని చట్టబద్ధం చేశారు. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ప్రస్తుత సెబీ ఛైర్మన్‌ మాదాబి పూరి బచ్‌.

 


సెబీ లక్ష్యాలు: * స్టాక్‌ ఎక్స్చేంజీల్లో, ఇతర సెక్యూరిటీ మార్కెట్లలో వ్యాపార వ్యవహారాలను న్యాయసమ్మతమైన రీతిలో క్రమబద్ధీకరించడం. * బ్రోకర్లు, ఇతర మధ్యవర్తుల పనితీరును క్రమబద్ధం చేయటం.* పెట్టుబడిదారుల మూలధనానికి, వారి హక్కులకు భద్రత కల్పించటం.

 


అభివృద్ధి విత్త సంస్థలు: ప్రత్యేకంగా పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థలను స్థాపించాలని, 1953లో పారిశ్రామిక విత్తసంస్థల విచారణ సంఘం సిఫార్సు చేసింది. దాన్ని అననుసరించి భారత ప్రభుత్వం వరుసగా అనేక విత్త సంస్థలను స్థాపించింది. 1991లో నరసింహం కమిటీ వీటిని అభివృద్ధి విత్త సంస్థలుగా పేర్కొంది.

 


విత్త మధ్యవర్తిత్వ సంస్థలు:

 


1) మర్చంట్‌ బ్యాంకులు: కార్పొరేట్, ఇతర సెక్యూరిటీలను మార్కెట్‌ చేసేవే మర్చంట్‌ బ్యాంకులు.

 


2) మ్యూచువల్‌ ఫండ్స్‌: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, విత్త సంస్థలు మ్యూచువల్‌ ఫండ్స్‌ని ప్రారంభించాయి. ప్రజల నుంచి పొదుపులను సేకరించి స్టాక్‌ మార్కెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం వీటి ప్రధాన లక్ష్యం. మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లోని తమ పొదుపును మ్యూచువల్‌ ఫండ్స్‌కి మళ్లిస్తున్నారు.

 


3) లీజింగ్‌ కంపెనీలు: పరిశ్రమలు ముఖ్యంగా చిన్నతరహా, మధ్యతరహా, పరిశ్రమలకు ప్లాంట్‌ అండ్‌ మిషనరీ సేకరించడంలో లీజింగ్‌ పద్ధతి చాలా ఆదరణ పొందింది. లీజుకు ఇచ్చే సంస్థకు అద్దె చెల్లించి కొంత నిర్ణీత కాలంలో ఆ సంస్థ యంత్రాలను, పరికరాలను లీజుకు తీసుకునే సంస్థ వాడుకునే విధంగా కుదుర్చుకున్న ఒప్పందమే లీజు. సేవారంగంలో లీజింగ్‌ ఎక్కువ వినియోగంలో ఉంది.

 


4) వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీలు: వ్యాపార రంగంలో కొత్త ఔత్సాహికులకు సాంకేతికంగా కొత్తవి, అంతవరకు సమర్థత రుజువు కాని ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమకూర్చే మూలధనమే వెంచర్‌ క్యాపిటల్‌. కొన్ని అఖిలభారత విత్త సంస్థలు వెంచర్‌ క్యాపిటల్‌ కోసం అనుబంధ సంస్థలను ప్రారంభించాయి.

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 02-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బీమా వ్యాపారం

అనుకోని కష్టంలో ఆదుకునే హస్తం!

 


  ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే, ఆధారపడిన కుటుంబం అస్తవ్యస్తం కాకుండా భరోసాగా నిలుస్తుంది జీవిత బీమా. కష్టపడి కూడగట్టుకున్నఆస్తులు, సమకూర్చుకున్న వస్తువులు, వాహనాలు అనుకోని ప్రమాదాల్లో దెబ్బతిన్నా, పనికి రాకుండా పోయినా ఆ నష్టాన్ని పంచుకొని ఆదుకుంటుంది సాధారణ బీమా. ఆధునిక కాలంలో సాధారణ వ్యక్తులు అందుకోలేనంతగా పెరిగిపోయిన వైద్య వ్యయాలను భరించి బాధలను తీరుస్తుంది ఆరోగ్య బీమా. అందరి జీవితాల్లోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ అత్యంత కీలకమైన భాగంగా మారిన ఈ ఇన్సూరెన్స్‌ రంగం పరిణామక్రమం, దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్న సేవలు, ప్రధాన కంపెనీలు, పథకాల వివరాలను పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 


   బీమా ఒక సాంఘిక భద్రతా సౌకర్యం. మనిషి జీవితంలో కొన్ని విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. వాటివల్ల వ్యక్తికి ప్రాణనష్టం, ఆరోగ్య నష్టం లేదా ఆస్తి నష్టం జరగవచ్చు. అలాంటి నష్టభయాన్ని ముందుగా బీమా చేయించుకుంటే ప్రమాదం/నష్టం ఏర్పడినప్పుడు బీమా చేసిన సంస్థ వ్యక్తికి లేదా వ్యక్తి కుటుంబానికి బీమా ద్వారా హామీ ఇచ్చిన మొత్తాన్ని చెల్లిస్తుంది. నష్టభయాన్ని బీమా చేసేందుకు బీమా సంస్థకు ఆ వ్యక్తి ఒకేసారి లేదా కొన్ని వాయిదాల్లో కొంత రుసుము చెల్లించాలి. దీన్ని ప్రీమియం అంటారు. ఆ రకంగా బీమా చేయించుకున్న వ్యక్తికి, బీమా చేసిన వ్యాపార సంస్థకు మధ్య ఒప్పందాన్ని తెలియజేసే పత్రాన్నే బీమా పాలసీ అంటారు.

 


భారతదేశంలో బీమా వ్యాపారం - పరిణామక్రమం: భారతదేశంలో బీమాకు పెద్ద చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో మనుస్మృతిలో దీని ప్రస్తావన ఉంది. యాజ్ఞవల్కుడి ధర్మశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ పేర్కొన్నారు. ద్రవ్య వనరులను సమీకరించి అగ్నిప్రమాదం, వరదలు, అంటువ్యాధుల వ్యాప్తి, కరవు సమయాల్లో పంచిపెట్టడం గురించి ఈ గ్రంథాల్లో రాశారు. నౌకా వ్యాపార రుణాలు, రవాణా సౌకర్యాల ఒప్పందాలు వంటివి బీమాకు సంబంధించిన తొలి రూపాలు కావచ్చు. కాలక్రమేణా ఇతర దేశాలు, ముఖ్యంగా ఇంగ్లండ్‌ నుంచి ఆధునిక బీమా విధానాలను భారతదేశం అనుసరించింది. మన దేశంలో 1818లో మొదటిసారిగా కలకత్తాలో ఓరియంటల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనే ఆధునిక జీవిత బీమా సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 1829లో ‘మద్రాస్‌ ఈక్విటబుల్‌’ అనే జీవిత బీమా వ్యాపారాన్ని మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఏర్పాటు చేశారు. 1870లో బాంబే మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సొసైటీ మొదటి భారతీయ జీవిత బీమా సంస్థను నెలకొల్పింది. 1897లో ఎంపైర్‌ ఆఫ్‌ ఇండియా, 1906లో మద్రాస్‌ యునైటెడ్‌ ఇండియాను స్థాపించారు.

 


బీమా వ్యాపారం క్రమబద్ధీకరణ: 1912 వరకు భారతదేశంలో బీమా వ్యాపారంపై ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ లేదు. 1912లో అప్పటి ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ చట్టం కూడా చేసింది. 1938లో సమగ్ర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టం వచ్చింది. 1999లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం అమల్లోకి వచ్చింది.

 


బీమా రకాలు: 1) జీవిత బీమా, 2) సాధారణ బీమా (లేదా) జీవితేతర బీమా

 


జీవిత బీమా: ఇది ప్రాణనష్టానికి సంబంధించింది. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి తన పాలసీ కాలం పూర్తయ్యేలోపు చనిపోతే వ్యక్తి బీమా చేసిన మొత్తాన్ని, బీమా సంస్థ ఆ వ్యక్తి కుటుంబానికి చెల్లిస్తుంది. చనిపోక ముందే పాలసీ కాలం పూర్తయితే, చెల్లించిన ప్రీమియం మొత్తానికి కొంత బోనస్‌ రూపంలో కలిపి వ్యక్తికి చెల్లిస్తుంది.

 


సాధారణ బీమా: ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు శరీరంలో ఒక భాగం లేదా కొన్ని భాగాలు పనిచేయని పరిస్థితి ఏర్పడవచ్చు. వ్యక్తులు వాడే వాహనాలు ప్రమాదం వల్ల దెబ్బతినవచ్చు. అగ్నిప్రమాదం వల్ల ఆస్తి నష్టం కలగవచ్చు. దొంగతనం వల్ల వస్తువులు కోల్పోవచ్చు. అలాంటి సందర్భాల్లో వ్యక్తులకు నష్టం జరిగితే పొందే బీమా సౌకర్యాన్ని సాధారణ బీమా అంటారు. అగ్నిప్రమాద బీమా, నౌకా బీమా, మోటారు బీమా, ఆరోగ్య బీమా వంటివన్నీ సాధారణ బీమా వ్యాపారానికి చెందుతాయి.

 


జీవిత బీమా వ్యాపారం జాతీయం: 1956, జనవరి 19న మన దేశంలో పనిచేస్తున్న జీవిత బీమా కంపెనీలన్నింటినీ ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకొస్తూ పార్లమెంటు ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ చట్టాన్ని ఆమోదించింది. 1956, సెప్టెంబరు 1 నుంచి ఎల్‌ఐసీ ప్రభుత్వ రంగ సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. 1956లో 154 భారతీయ సంస్థలు, 16 విదేశీ సంస్థలు, 75 ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థల (మొత్తం 245)ను జాతీయం చేశారు.

 


సాధారణ బీమా వ్యాపారం జాతీయం: భారతదేశంలో మొదటి సాధారణ బీమా సంస్థ 1850లో కలకత్తాలో ఏర్పాటైన ట్రియెటాన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ. 1906లో ఏర్పడిన యునైటెడ్‌ ఇండియా (మద్రాస్‌), నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కో-ఆపరేటివ్‌ అస్యూరెన్స్‌ కూడా సాధారణ బీమా సంస్థలే. 1972లో జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ చట్టాన్ని ఆమోదించారు. 1973, జనవరి 1న జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను నెలకొల్పారు. అప్పటివరకు దేశంలో పనిచేస్తున్న 107 సాధారణ బీమా సంస్థలన్నింటినీ జాతీయం చేశారు. సాధారణ బీమా వ్యాపారం చేస్తున్న సంస్థలను ప్రస్తుతం నాలుగు సంస్థలుగా విభజించారు. అవి 1) యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ (మద్రాసు) 2) న్యూ ఇన్సూరెన్స్‌ కంపెనీ (బొంబాయి) 3) నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (కలకత్తా) 4) ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (దిల్లీ).

 

 

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ):  దేశంలో 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల రెండో దశలో బీమా వ్యాపారంలోకి ప్రైవేటు, విదేశీ సంస్థలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ఈ రంగంలో పోటీ, సామర్థ్యం పెరుగుతుందని భావించింది. 1993లో ఆర్‌.ఎస్‌.మల్హోత్ర అధ్యక్షతన కమిటీని నియమించింది. 1994లో ఈ కమిటీ నివేదిక సమర్పించింది. దేశంలోని కార్పొరేట్‌ సంస్థలను బీమా రంగంలోకి అనుమతించాలని, విదేశీ సంస్థల భాగస్వామ్యానికి సమ్మతించాలని మల్హోత్ర కమిటీ సిఫార్సు చేసింది. ఈమేరకు కేంద్రం 1999లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం చేసింది. 2000, ఏప్రిల్‌లో ఐఆర్‌డీఏఐ సంస్థను నెలకొల్పింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ప్రస్తుత ఛైర్మన్‌ దెబాశీష్‌ పాండా.


ఐఆర్‌డీఏఐ లక్ష్యాలు: 1) బీమా పాలసీదార్ల ప్రయోజనాలు కాపాడటం 2) బీమా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడం, ప్రోత్సహించడం 3) సక్రమమైన పద్ధతిలో వృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం


భారతదేశంలో బీమా సంస్థలు: 2020, మార్చి 31 నాటికి భారతదేశంలో 69 సంస్థలు బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఐఆర్‌డీఏఐ 2021-22 నివేదిక ప్రకారం 24 జీవిత బీమా సంస్థలున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగంలో ఒకటి (ఎల్‌ఐసీ), ప్రైవేటు రంగంలో 23 ఉన్నాయి. 


* సాధారణ బీమా సంస్థలు 25 ఉండగా, అందులో ప్రైవేటు రంగంలో 21, ప్రభుత్వ రంగంలో 4 ఉన్నాయి. ఇవేకాకుండా ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సంస్థలు 7, ప్రత్యేక బీమా సంస్థలు 2, పునఃబీమా సంస్థలు 11 ఉన్నాయి. అన్నిరకాలు కలిపి 69 బీమా సంస్థల్లో 8 ప్రభుత్వ రంగంలో, 61 ప్రైవేటు రంగంలో ఉన్నాయి.

 


ప్రభుత్వ రంగంలో ఉన్న బీమా సంస్థలు


* జీవిత బీమా సంస్థ ఒకటి ఉంది. 1) ఎల్‌ఐసీ


* సాధారణ బీమా సంస్థలు నాలుగు ఉన్నాయి. 1) నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 2) ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 3) యునైట్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ 4) న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ.


* ప్రత్యేక బీమా సంస్థలు రెండు ఉన్నాయి. 1) అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 2) ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్, 


* పునఃబీమా సంస్థలు ఒకటి ఉంది. 1) జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.

 


భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ): ఎల్‌ఐసీని 1956, సెప్టెంబరు 1న స్థాపించారు. 1956లో 5 జోన్లు, 33 డివిజన్లు, 240 శాఖలు ఉన్నాయి. ఇందులో 89,000 మంది ఏజెంట్లు పని చేసేవారు. 2017 నాటికి 8 జోన్లు, 113 డివిజన్లు, 2048 శాఖలు ఉండగా 11,63,604 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. ప్రధాన కార్యాలయం ముంబయి. ప్రస్తుత ఛైర్మన్‌ సిద్ధార్థ మొహంతి.

 


జీవిత బీమా పాలసీలు - రకాలు: వీటిని 6 రకాలుగా వర్గీకరించారు. 1) మనీ బ్యాక్‌ పాలసీ 2) టర్మ్‌ పాలసీ 3) పూర్తి జీవితకాల పాలసీ 4) ఎండోమెంట్‌ పాలసీ 5) యూనిట్‌ అనుసంధానం చేసిన పాలసీ 6) బృంద బీమా పాలసీ

 


ఆరోగ్య బీమా:  2020, మార్చి 31 నాటికి ఐఆర్‌డీఏఐ కింది 7 ఆరోగ్య బీమా సంస్థలకు లైసెన్స్‌ మంజూరు చేసింది. వీటిని స్టాండ్‌ అలోన్‌ ఆరోగ్య బీమా సంస్థలు అంటారు. అవి 1) స్టార్‌ హెల్త్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 2) హెచ్‌డీఎఫ్‌సీ - ఎర్గో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 3) మాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

 


4) రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 5) సిగ్మా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 6) ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 7) రిలయన్స్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌

 


వ్యవసాయ బీమా: మన దేశంలో 2003 నుంచి వ్యవసాయ బీమా అమల్లో ఉంది. 2016లో ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన దీన్ని పర్యవేక్షిస్తుంది. వ్యవసాయ బీమా కంపెనీ మూలధనంలో నాబార్డ్‌ వాటా 30%, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వాటా 35% ఉంది.

 


డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌: దీన్ని 1978లో ప్రారంభించారు. బ్యాంకు డిపాజిట్లకు భద్రత కల్పించి బ్యాంకింగ్‌ వ్యవస్థపై విశ్వాసం కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం. 

 


ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న బీమా పథకాలు:


1) ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన: 2017లో దీన్ని ప్రవేశపెట్టారు. 2008లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం ఇందులో విలీనమైంది. 2018, సెప్టెంబరులో రాంచీలో ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ దీనిలో ఒక భాగం. ఈ పథకంలో కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా ఉంటుంది.


2) ఆమ్‌ ఆద్మీ బీమా యోజన: 2007, అక్టోబరు 2న ప్రారంభించారు. 18-59 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. గ్రామాల్లో భూమి లేని కుటుంబంలో ప్రధాన పోషకుడికి వర్తిస్తుంది. సాధారణ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణం లేదా శాశ్వత అంగవైకల్యం అయితే రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 బీమా వర్తిస్తుంది. వార్షిక ప్రీమియం రూ.200. ఈ ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్రాలు సమానంగా భరిస్తాయి.


3) ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన: ఇది జీవిత బీమా పథకం. 2015, మే 9న నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రారంభించారు. 18 - 50 ఏళ్లవయసు వారు అర్హులు. ఏ కారణంతో అయినా మరణించిన వారికి రూ.2 లక్షలు బీమా చెల్లిస్తారు. వార్షిక ప్రీమియం రూ.436. పొదుపు ఖాతా నుంచి ఈ ప్రీమియం మినహాయించిన వారికి వర్తిస్తుంది.


4) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన: ఇది ప్రమాద బీమా పథకం. 2015, మే 9న ప్రారంభించారు. 18 - 70 ఏళ్ల వారికి వర్తిస్తుంది. పొదుపు ఖాతా ఉన్నవారు అర్హులు. వార్షిక ప్రీమియం రూ.20. ప్రమాద మరణం లేదా శాశ్వత అంగవైకల్యానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి రూ.లక్ష ఇస్తారు.

 


బీమా రంగ అభివృద్ధి - ప్రమాణాలు:  


* ప్రపంచంలో అతి పెద్ద బీమా సంస్థ అయిన స్వీస్‌కీ నివేదిక ప్రకారం ప్రపంచ బీమా వ్యాపార విపణిలో భారత్‌ వాటా 1.69% అని అంచనా.


* జీవిత బీమా వ్యాపార గణాంక వివరాలున్న 88 దేశాల్లో భారత్‌ 10వ స్థానంలో ఉంది. ప్రపంచ జీవిత బీమా విపణిలో భారత్‌ వాటా 2.73%. 


* ప్రపంచంలో మొత్తం బీమా ప్రీమియంలో జీవిత బీమా వాటా 35%, జీవితేతర బీమా వాటా 53.68%.


* భారత్‌లో బీమా ప్రీమియం పరిమాణంలో జీవిత బీమా వాటా 35%, జీవితేతర బీమా వాటా 25%.అంటే ప్రపంచంలో జీవితేతర ప్రీమియం అధికంగా ఉంటే, భారత్‌లో మాత్రం జీవిత బీమా ప్రీమియం ఎక్కువగా ఉంది.


బీమా రంగం సంభావ్యత, పనితీరు మదింపునకు రెండు ప్రమాణాలు పాటిస్తారు. 


1) బీమా చొరబాటు: ఒక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి, బీమా ప్రీమియంల నిష్పత్తిని బీమా చొరబాటు అంటారు. ప్రస్తుత బీమా చొరబాటు 4.57 శాతం.


2) బీమా సాంద్రత: మొత్తం జనాభాకు, ప్రీమియంతో ఉన్న నిష్పత్తిని బీమా సాంద్రత అంటారు. దీన్ని అమెరికా డాలర్లలో తెలియజేస్తారు. ప్రస్తుతం బీమా సాంద్రత 91 డాలర్లు.

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌
 

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యోల్బణం - కొలమానాలు

ఆర్థిక అస్థిరతపై   శాస్త్రీయ అంచనాలు!

 

  ఒకప్పుడు వంద రూపాయలకి డజను పైగా మామిడి పళ్లు వచ్చేవి. ఇప్పుడు రెండో మూడో ఇస్తున్నారంటే కొనుగోలు శక్తి తగ్గినట్లే. డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ధరలు వేగంగా పెరుగుతుంటే పొదుపు పడిపోతున్నట్లే.  ముడి సరకుల ధరలు పెరిగి, ఉత్పత్తి వ్యయం ఎక్కువైతే వినియోగ వస్తువుల ధరలు ఆకాశం వైపు వెళుతున్నట్లే. ఇలాంటివన్నీ ద్రవ్యోల్బణం ప్రభావాలే. కొనుగోలు శక్తి తగ్గిపోయినా, పొదుపు పడిపోయినా, ధరలు పెరిగిపోయినా ఆర్థిక వ్యవస్థ అస్థిరమైపోతుంది. ఈ పరిస్థితులను నియంత్రించడానికి ప్రభుత్వం కొన్ని కొలమానాల సాయంతో ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటుంది. 

 

  భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని రెండు సూచీల్లో గణిస్తారు. అవి 1) టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) 2) వినియోగ ధరల సూచిక (సీపీఐ). 

 

టోకు ధరల సూచిక: మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని మొదట్లో టోకు ధరల సూచిక ఆధారంగా గణించేవారు. వ్యవహారాల ప్రారంభ దశలో పెద్దమొత్తంలో వస్తువులు అమ్మేటప్పుడు ధరల సగటు మార్పును లెక్కిస్తారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణ గణాంకాలను నెలకోసారి విడుదల చేస్తున్నారు. దీనిలో ప్రాథమిక వస్తువులు, ఇంధన-విద్యుత్తుకు సంబంధించిన వస్తువులు, తయారీ వస్తువులు అనే మూడు గ్రూపులు తీసుకుంటారు. దీనిలో అత్యధిక ప్రాముఖ్యం (వెయిటేజీ) తయారీ వస్తువులకు ఉంటుంది. ఉత్పత్తి విలువ ఆధారంగా ఈ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. టోకు ధరల సూచీలో సేవలను లెక్కలోకి తీసుకోరు. 2017లో ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌’ టోకు ధరల సూచీని లెక్కించడానికి ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కి మార్చింది. టోకు ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని ఇప్పటివరకు ఏడుసార్లు సవరించారు. కొత్త ఆధార సంవత్సరాన్ని మార్చిన తర్వాత వస్తువుల సంఖ్య 676 నుంచి 697కి పెరిగింది. 

 

కొత్త ఆధార సంవత్సరంలో ప్రధానమైన అంశాలు: వి కొత్త ఆధార సంవత్సరంలో పరోక్ష పన్నులను లెక్కించలేదు.వి అంక మధ్యమానికి బదులు ప్రస్తుతం గుణ మధ్యమంలో లెక్కిస్తున్నారు.వి గతంలో విదుచ్ఛక్తిని వ్యవసాయం, గృహ, వాణిజ్య, రైల్వే, పారిశ్రామిక రంగాల్లో భాగంగా గణించేవారు. ప్రస్తుతం విద్యుచ్ఛక్తిని ప్రత్యక్షంగా సింగిల్‌ యూనిట్‌గా గణిస్తున్నారు.

 

వినియోగ ధరల సూచిక: సమాజంలో ఒక వర్గం ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి వినియోగ ధరల సూచికను గణిస్తారు. వారి వ్యయం ఆధారంగా వస్తువులకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇందులో రిటైల్‌ ధరలను పరిగణనలోకి తీసుకుంటారు.మన దేశంలో నాలుగు రకాల వినియోగ ధరల సూచికలు ఉన్నాయి. 

 

1) పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచిక: లేబర్, ఎంప్లాయిమెంట్‌ సలహా కమిటీ ప్రకారం 260 వస్తుసేవలను అంచనా వేస్తారు. 2020, ఫిబ్రవరిలో ఆధార సంవత్సరాన్ని 2001 నుంచి 2016కి మార్చారు. నెలవారీ ప్రతిపాదికగా గణాంకాలను సేకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని (డీఏ) దీని ఆధారంగానే ప్రకటిస్తారు.

 

2) వ్యవసాయ శ్రామికుల వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రాతిపదికన గణాంకాలను సేకరిస్తారు. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ శ్రామికుల కనీస వేతనాలు సవరించేందుకు ఉపయోగపడతాయి. 

ఉదా: ఉపాధిహామీ పనుల వేతనాలు.

 

3) గ్రామీణ శ్రామికుల వినియోగ ధరల సూచిక: దీని ఆధార సంవత్సరం 1986-87. దీన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. పై మూడు గణాంకాలను ‘లేబర్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా’ అంచనా వేస్తుంది.

 

4) నూతన వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 2011-12. గతంలో వివిధ రకాల వినియోగ ధరల సూచికలను గణించేవారు. ఇవి ఏదో ఒక వర్గం ప్రజలకు సంబంధించిన వస్తువుల ధరల పెరుగుదలను మాత్రమే పేర్కొంటాయి. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం ధరల పెరుగుదలను ప్రతిబింబించవు. అందుకే ఆర్‌బీఐ గ్రామీణ, పట్టణాలకు సంబంధించి ద్రవ్యోల్బణ సూచికలను గణించాలని నిర్ణయించింది. దీని ఆధారంగా కేంద్ర గణాంక సంస్థ సీపీఐ-గ్రామీణ, సీపీఐ-పట్టణ, సీపీఐ-అఖిలభారత సూచికలను తయారు చేస్తుంది.


* 2001 జనాభా లెక్కల ప్రకారం 9 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 310 పట్టణాల్లో సీపీఐ-పట్టణ సూచీని గణిస్తారు.

 

* దేశంలో జిల్లాకు రెండు గ్రామాలను తీసుకొని, 1183 గ్రామాల్లో ధరల కొటేషన్స్‌ సేకరించడం ద్వారా సీపీఐ-గ్రామీణ సూచీని గణిస్తున్నారు. ఆ రెండింటినీ కలిపి సీపీఐ-అఖిల భారత సూచీని రూపొందిస్తున్నారు. నూతన సీపీఐ గణనలో గ్రామీణ ప్రాంతాల్లో 225 వస్తువులను, పట్టణ ప్రాంతాల్లో 250 వస్తువులను తీసుకుంటారు. 20 రకాల సేవలను కూడా దీనిలో చేర్చారు. రిటైల్‌ ధరల ఆధారంగా దీన్ని గణిస్తారు. ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ ఈ నూతన సిఫార్సు చేసింది. ఇందులో అధిక ప్రాధాన్యం ఆహార అంశాలదే.

 

ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (పీపీఐ): బి.ఎన్‌.గోల్డర్‌ అధ్యక్షతన 2017లో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పీపీఐని ప్రవేశపెట్టారు. పీపీఐ అనేది మార్కెట్‌లోని ప్రాథమిక, మధ్యంతర, పూర్తిగా తయారైన వస్తువులు, సేవల ధరల్లో వచ్చే మార్పులను లెక్కిస్తుంది. 

 

ప్రపంచంలో అనేక దేశాలు టోకు ధరల సూచిక స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాయి. బి.ఎన్‌.గోల్డర్‌ కమిటీ భారత్‌లో టోకు ధరల సూచీ స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ గణాంకాలను నెలవారీగా విడుదల చేయాలని, ఆధార సంవత్సరం 2011-12ను కొనసాగించాలని, ప్రారంభంలో 15 సేవలను తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది.

 

ఆహార ద్రవ్యోల్బణం: ఆహార ద్రవ్యోల్బణాన్ని గణించేందుకు రెండు సూచీలు ఉన్నాయి. అవి-

1) టోకు ధరల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: టోకు ధరల సూచికలో ప్రాథమిక వస్తువుల్లోని ఆహార వస్తువులను, తయారీ వస్తువుల్లోని ఆహార వస్తువులను కలిపి దీన్ని లెక్కిస్తారు. ఇందులో అతిపెద్ద వాటా ఆహార వస్తువులదే ఉంటుంది.

2) వినియోగదల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: 2014 నుంచి కేంద్ర గణాంక సంస్థ దీన్ని ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ, దేశానికి సంబంధించిన రిటైల్‌ ధరల ద్వారా దీన్ని గణిస్తారు. ఆధార సంవత్సరం 2012. దీనిలో ఆహారం, పానీయాల వాటా అధికంగా ఉంటుంది.

 

హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌: ఒక భౌగోళిక సరిహద్దు పరిధిలో నివాస ఆస్తుల ధరల్లో మార్పులను తెలియజేస్తుంది. భారత మొదటి ‘రెసిడెక్స్‌’ని 2007లో జాతీయ హౌసింగ్‌ బ్యాంకు ప్రారంభించింది. దీని ఆధార సంవత్సరం 2012-13. ఇది 50 నగరాలకు సంబంధించిన జాతీయ హౌసింగ్‌ బ్యాంకు రెసిడెక్స్‌ని ప్రచురిస్తోంది.

 

బాటిల్‌ నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌: డిమాండ్‌ మారకుండా సప్లయ్‌ భారీగా పడిపోతే పెరిగే ధరలను బాటిల్‌ నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌ అంటారు.

 

* ద్రవ్యోల్బణ ధోరణిలో మార్పులు 2014 తర్వాత భారతదేశ ద్రవ్యోల్బణ ధోరణిలో వ్యవస్థాపరమైన మార్పులు జరిగాయి. 1977-2000 మధ్యకాలంలో 9.0 శాతంగా ఉండేది. 2005-06 మధ్యకాలంలో - 5.0 శాతానికి తగ్గింది.  2006-14 మధ్య తిరిగి 9.0 శాతంగా నమోదైంది. విదేశీ మారక రేటు తగ్గుదల, ముడి చమురు ధరలు, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల దీనికి కారణాలు.


* 2014-15 లలో 5.9 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు 2015-16లో 4.9 శాతానికి, ఆ తర్వాత 2016-17లో 4.5 శాతానికి తగ్గింది. టోకు ధరల సూచీ, వినియోగ ధరల సూచీల మధ్య అంతరం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. 2014-15లో 4.7 శాతం ఉన్న ఈ అంతరం 2015-16లో 8.6 శాతానికి పెరిగింది. వర్తక వస్తువుల ధరల నియంత్రణ వల్ల టోకు ధరల సూచీ స్థాయిని తగ్గించడం ద్వారా ఈ అంతరాన్ని 2.8 శాతానికి తగ్గించారు. వి వినియోగదారుడి ధరల సంబంధిత ఆహార ద్రవ్యోల్బణ రేటు 2014-15లో 6.4 శాతం నుంచి 2015-16లో 4.9 శాతానికి, తర్వాత 2016-17లో 4.2 శాతానికి తగ్గింది. ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరగడంతో 19 లక్షల టన్నుల ఆహారధాన్యాల మిగులు నిల్వల ఏర్పాటుతో ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.

 

ద్రవ్యోల్బణ నియంత్రణకు సూచనలు: * నిరంతరం పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా అభివృద్ధేతర వ్యయాన్ని నియంత్రించాలి. ప్రభుత్వ యంత్రాంగంపై చేసే రెవెన్యూ వ్యయం పెరగకుండా చూడాలి. వి ప్రజోపయోగ పథకాలపై సమర్థంగా ఖర్చు చేసి, తక్కువ ప్రయోజనాలిచ్చే పథకాలు, ప్రచార కార్యక్రమాలపై వ్యయాన్ని నియంత్రించాలి. వి ప్రభుత్వ లోటు బడ్జెట్‌ విధానానికి స్వస్తి చెప్పి సంతులిత బడ్జెట్‌ విధానం వైపు దృష్టి సారించాలి. అంటే రెవెన్యూ లోటు, కోశ లోటును స్థూల దేశీయోత్పత్తిలో 2.0 శాతానికి తగ్గించాలి. వి బడ్జెట్‌ లోటును అధిగమించడానికి రాబడి పెంచుకోవాలి. భారం అధికం కాకుండా ప్రస్తుత పన్ను రేట్లను పెంచి, కొన్ని కొత్త పన్నులు విధించాలి. వి దేశీయ, విదేశీ రుణభారం నిరంతరం పెరుగుతోంది కనుక, రుణ సేకరణ నియమాలను పాటిస్తూ వడ్డీ చెల్లింపుల భారాన్ని కనిష్ఠం చేయాలి. వి కొరతగా ఉన్న వస్తువుల దిగుమతిని అనుమతించి వాటి ఎగుమతిని క్రమబద్ధీకరించాలి. దేశీయ ఉత్పత్తులు పెంచడానికి తగిన ప్రోత్సాహం అందించాలి. 

 

* అక్రమ నిల్వలు, చీకటి వ్యాపారం లాంటి ప్రమాదకర పద్ధతులను కఠినంగా అణచివేయాలి.

 

ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడటానికి కారణాలు:  1) చక్కెర, పప్పులు, ఉల్లిపాయలు లాంటి నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వ. 2) బహుళజాతి సంస్థలు ఆహార వస్తువుల భావి వ్యాపారాన్ని (ఫ్యూచర్‌ ట్రేడ్‌) నిర్వహించడం.   3) వ్యవసాయ రంగంలో సమస్యల వల్ల దేశ జనాభాకు అవసరమైన పరిమాణంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగకపోవడం. 4) రాయితీల తగ్గింపు, వ్యవసాయ ఉత్పాదకాలైన డీజిల్, ఎరువుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడం.

 

ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు: వి ప్రభుత్వం కోశ సంబంధ చర్యలుగా వరి, గోధుమ, పప్పులు, వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని సున్నా రేటుకు తగ్గించింది. రిఫైన్డ్‌ నూనెలు, వెజిటేబుల్‌ ఆయిల్‌పై ఈ సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించింది. ముడి చక్కెర దిగుమతిపై సుంకాన్ని కూడా సున్నా రేటుకు తగ్గించింది. బియ్యం, వంటనూనెలు, పప్పుధాన్యాల  ఎగుమతిని నిషేధించింది. వి 2016-17 నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 13-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - వాణిజ్య బ్యాంకులు - 01

దేశంలోని పొదుపును సమీకరించి, పెట్టుబడిగా తరలించడానికి విత్తమార్కెట్లు దోహదం చేస్తాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. అవి: 

1) ద్రవ్య మార్కెట్‌   2) మూలధన మార్కెట్‌


ద్రవ్య మార్కెట్‌ 

*  స్వల్పకాలిక మొత్తాన్ని సమకూర్చే మార్కెట్‌ను ద్రవ్య మార్కెట్‌ అంటారు. సమీప ద్రవ్యంగా(near money) పేర్కొనే స్వల్పకాలిక పరిమితి ఉన్న వర్తక బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీనోట్లు, బ్యాంకుల అంగీకారాలు మొదలైన పత్రాల కొనుగోలు, అమ్మకాలు జరిగే వ్యవస్థను ‘ద్రవ్య మార్కెట్‌’ అంటారు.


* భారతదేశంలో ఆర్‌బీఐ చట్టం, 1934 ప్రకారం వాణిజ్య బ్యాంకులు(Commercial Banks) పనిచేస్తాయి. మన దేశంలో వాణిజ్య బ్యాంకులను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1) షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు    2) షెడ్యూల్డ్‌ కాని వాణిజ్య బ్యాంకులు

షెడ్యూల్డ్‌వాణిజ్య బ్యాంకులు 

ఆర్‌బీఐ చట్టం - 1934 ప్రకారం, రెండో షెడ్యూల్‌లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు. వీటి నమోదుకు ఉండాల్సిన అర్హతలు:

* బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని భారతదేశంలోనే నిర్వహించాలి.

* రూ.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం నికర ఆస్తి ఉండాలి.

* ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించాలి.

*షెడ్యూల్‌ బ్యాంకులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను కేంద్ర బ్యాంకుకు నివేదించాలి.

* వాణిజ్య బ్యాంకులు ఇండియన్‌ జాయింట్‌ స్టాక్‌ కంపెనీ కింద లేదా భారత ప్రభుత్వ ప్రత్యేక చట్టం కింద లేదా స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులుగా నమోదు చేసుకోవాలి.

* ఆర్‌బీఐ క్లియరింగ్‌ హౌస్‌లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా వాణిజ్య బ్యాంకుల మధ్య ద్రవ్యాన్ని బదిలీ చేస్తుంది.


షెడ్యూల్డ్‌ కాని బ్యాంకులు

* ఇవి ఆర్‌బీఐ చట్ట 1934 ప్రకారం, రెండో షెడ్యూల్‌లో నమోదు కాని బ్యాంకులు. ఇవి చాలా చిన్న బ్యాంకులు, వాటి పెట్టుబడి రూ.5 లక్షలలోపు ఉంటుంది. ఉదా: జమ్మూ-కశ్మీర్‌ బ్యాంకు 


భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల చరిత్ర

ప్రపంచంలో అతి ప్రాచీన వాణిజ్య బ్యాంకు - బ్యాంక్‌ ఆఫ్‌ వెనిస్‌. దీన్ని క్రీ.శ. 1157లో ఇటలీలో స్థాపించారు.

* భారతదేశంలో నెలకొల్పిన మొదటి వాణిజ్య బ్యాంకు - బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌. అలెగ్జాండర్‌ అండ్‌ కో ఆంగ్ల ఏజెన్సీ హౌస్‌ క్రీ.శ.1770లో దీన్ని స్థాపించింది.

ప్రెసిడెన్సీ బ్యాంకులు: బ్రిటిష్‌ వారు మన దేశంలో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను నెలకొల్పారు. అవి:

1. బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా(1806)

2. బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే (1840)

3. బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1843)


ఔద్‌ వాణిజ్య బ్యాంకు: దీన్ని 1881లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో స్థాపించారు. ఇది పూర్తిగా భారతీయ యాజమాన్యంలో నెలకొల్పిన మొట్టమెదటి వాణిజ్య బ్యాంకు. దీని ప్రధాన కార్యాలయం ఫైజాబాద్‌. ఔద్‌ వాణిజ్య బ్యాంకు 1958 వరకు పనిచేసింది.


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

దీన్ని 1894, మే 19న దిల్లీ కేంద్రంగా నెలకొల్పారు. దీని స్థాపకులు - దయాల్‌సింగ్‌ మజితియా, లాలా లజపతి రాయ్‌. ప్రస్తుతం ఇది దేశంలో మూడో అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతోంది. పూర్తి భారతీయ యాజమాన్యంతో నెలకొల్పిన రెండో వాణిజ్య బ్యాంకు ఇది.


ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

* బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా, బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే, బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌లను కలిపి 1921, జనవరి 27న ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు. దీని స్థాపకుడు జె.ఎం.కీన్స్‌. ప్రధాన కార్యాలయం ముంబయి.

గ్రామీణ ప్రాంతాల్లో పరపతి అవసరాలు అంచనా వేసి, పరపతి సహాయం కల్పించే మార్గాలపై అధ్యయనం చేయడానికి 1951లో ఎ.డి.గోర్వాలా ఆధ్వర్యంలో అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన కమిటీని నియమించారు. ఇది 75 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 8 గ్రామాల చొప్పున సుమారు 600 గ్రామాల్లో సర్వే నిర్వహించింది. ఈ కమిటీ 1954లో తన నివేదిక సమర్పించింది. దీని సిఫార్సు మేరకు ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను 1955, జులై 1న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు.


ఆంధ్రా బ్యాంకు

ఇది 1923, నవంబరు 28న (రిజిస్టర్డ్‌ 1923, నవంబరు 20) మచిలీపట్నం కేంద్రంగా ప్రారంభమైంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య దీని వ్యవస్థాపకులు. రూ.లక్ష ప్రాథమిక మూలధనంతో బ్యాంకు ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీన్నే బందరు బ్యాంకు అని కూడా పిలుస్తారు.

ఇది 1980 నాటికి దేశంలోని ముఖ్యమైన ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. 1980, ఏప్రిల్‌ 15న ఆంధ్రా బ్యాంకును జాతీయం చేశారు. ఇది 2020, ఏప్రిల్‌ 1న యూనియన్‌ బ్యాంక్‌లో విలీనమైంది.


భారతీయ మహిళా బ్యాంకు (BMB)

ఇందిరాగాంధీ 96వ జయంతి సందర్భంగా 2013, నవంబరు 19న భారతీయ మహిళా బ్యాంకును ముంబయిలో ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వరంగ బ్యాంకు. ప్రధాన కార్యాలయం దిల్లీ. రూ.1000 కోట్ల మూలధనంతో దీన్ని నెలకొల్పారు.

దీని మొదటి ఛైర్‌పర్సన్‌గా ఉషా అనంతసుబ్రమణియన్‌ పనిచేశారు. 

దీన్ని 2017, ఏప్రిల్‌ 1న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో విలీనం చేశారు.


ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI)

* ఇది ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వ్‌ బ్యాంకుకు అనుబంధ సంస్థగా 1964, జులై 1న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబయి.

* 1975 పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) యాక్ట్‌ ప్రకారం, 1976, ఫిబ్రవరి 16 నుంచి ఇది కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం కిందికి వచ్చింది. 

*1956 కంపెనీల చట్టం కింద, ఐడీబీఐ బ్యాంకు పేరును 2004, అక్టోబరు 1న ఐడీబీఐ లిమిటెడ్‌గా మార్చారు.

* ఆర్‌బీఐ చట్టం 1934 ప్రకారం, 2004 అక్టోబరు 11న ఐడీబీఐ బ్యాంకును జాతీయం చేశారు.

* ఇది పరిశ్రమల అభివృద్ధికి మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది.

* 2019, జనవరి 21న ఐడీబీఐ బ్యాంకును మళ్లీ ప్రైవేట్‌పరం చేశారు.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

*ఇది 1955, జులై 1 న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబయి. ఇది మన దేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంకు. దీని ప్రస్తుత ఛైర్మన్‌ దినేష్‌కుమార్‌ ఖారా.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం - 1959: 1959లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం చేశారు. దీని ప్రకారం, ఎస్‌బీఐకి అనుబంధంగా ఎనిమిది బ్యాంకులు ఏర్పాటు చేశారు. అవి:

1) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ (రాజస్థాన్‌)

2) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జైపూర్‌ (రాజస్థాన్‌) 

3) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర (గుజరాత్‌)

4) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)

5) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (తెలంగాణ)

6) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (కర్ణాటక)

7) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పటియాలా (పంజాబ్‌)

8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ (కేరళ)


1963లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జైపూర్‌లను కలిపి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ - జైపూర్‌గా ఏర్పాటు చేశారు.

* 2008, ఆగస్టు 13న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు.

* 2010, ఆగస్టు 26న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కలిపారు.

* 2017, ఏప్రిల్‌ 1న ఎస్‌బీఐ మిగిలిన  5 అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకుంది.


భారతదేశంలో బ్యాంకుల జాతీయీకరణ

బ్యాంకు అంటే అందరూ డబ్బులు దాచుకునే ‘ధనాలయం’. 1969 నాటికి ఎస్‌బీఐ ఒక్కటే ప్రభుత్వరంగ బ్యాంకు కాగా, మిగిలినవన్నీ ప్రైవేట్‌ రంగానికి చెందినవే. ప్రైవేట్‌ బ్యాంకులపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేది కాదు. కొంతమంది ధనికులకు, వ్యాపారులకు మాత్రమే బ్యాంకింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉండేవి.

* 1947-55 మధ్య కాలంలో 361 ప్రైవేట్‌ బ్యాంకులు కుప్పకూలాయి. ఎంతోమంది ఖాతాదార్లు తమ సొమ్ము పోగొట్టుకున్నారు. ఆశించిన రీతిలో ఆర్థికాభివృద్ధి జరగలేదు.

* వివిధ రంగాల్లోని ప్రైవేట్‌ సంస్థలను జాతీయం చేయాలనే డిమాండు అధికంగా ఉండేది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా 1969, జులై 19న బ్యాంకింగ్‌ కంపెనీస్‌ అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ అనే ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. తర్వాత దాన్ని చట్టం చేశారు.

* ప్రైవేట్‌ రంగంలో రూ. 50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 వాణిజ్య బ్యాంకులు ఇందులో ఉన్నాయి. దాంతో అప్పటి వరకు ఉన్న 70% బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రభుత్వ అజమాయిషీ కిందకి వచ్చాయి.

* ఈ పరిణామంతో దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ముఖచిత్రమే మారిపోయింది. ప్రజలకు బ్యాంకులను చేరువ చేయడంలో, పారిశ్రామిక రంగానికి పెట్టుబడి అవసరాలు తీర్చడంలో, రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల జాతీయీకరణ ఎంతగానో దోహదం చేసింది.

* గ్రామాలు, పట్టణాలు అనే భేదం లేకుండా ప్రజలంతా బ్యాంకులను ఉపయోగించడం ప్రారంభించారు.

* దేశ ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రుణ విస్తరణ లాంటి వివిధ భాగాల్లో బ్యాంకులు క్రియాశీల పాత్ర పోషించాయి. 

* ప్రభుత్వరంగ బ్యాంకులు దేశం నలుమూలలా విస్తరించాయి. 

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1967, డిసెంబరు 14న బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధానాన్ని ప్రకటించింది. దేశ మౌలిక, ఆర్థిక, సాంఘిక ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య బ్యాంకుల విధానాల్లో  మార్పు తేవడం దీని ఉద్దేశం. 1969, ఫిబ్రవరిలో ఈ విధానం అమల్లోకి వచ్చింది.

Posted Date : 15-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రభుత్వ రాబడి

సర్కారు వారి సంపాదన మార్గాలు!


  పరిపాలనకు, పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. పాఠశాలలు కడుతుంది, రోడ్లు వేయిస్తుంది, ఆసుపత్రులు నిర్మిస్తుంది. రక్షణ ఏర్పాట్లు చేస్తుంది. అత్యవసర సేవలను అందిస్తుంది. అనేక రకాల సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వీటన్నింటి వ్యయానికీ కావాల్సిన సొమ్మును రకరకాలుగా రాబడుతుంది. పన్నులు, పన్నేతర మార్గాల్లో, మూలధన ఆస్తుల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ప్రజా ప్రయోజనాల కోసం అలాంటి వ్యవస్థీకృత ఆదాయం అవసరం. ఈ నేపథ్యంలో పన్నుల రకాలు, వర్గీకరణ, వాటి విధింపు తదితర వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


  భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత పాలనా వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. రాజ్యాంగంలోని 268, 300 అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించింది. అవి.. ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా సి) ఉమ్మడి జాబితా. వీటిని అనుసరించి పన్నులు విధించే అధికారాన్ని స్పష్టం చేశారు.


* రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్రం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడినిచ్చే పన్నులు కేంద్రం పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులు విధిస్తున్నాయి.

 


ప్రభుత్వ విత్తశాస్త్రం: ప్రభుత్వ రాబడులు, వ్యయాన్ని తెలియజేసేదాన్ని ప్రభుత్వ విత్తశాస్త్రం అంటారు. ‘ప్రణాళికల్లో తక్కువ ఖర్చు చేసేది ఉత్తమ ప్రణాళిక, పన్నుల్లో తక్కువ పన్ను విధించేది మంచి పన్ను’ అని సంప్రదాయ ఆర్థికవేత్తల్లో ఒకరైన జె.బి.సే అభిప్రాయం. 1936లో జె.ఎం.కీన్స్‌ ‘జనరల్‌ థియరీ’ రచనతో ప్రభుత్వ విత్తశాస్త్రం ప్రాధాన్యం సంతరించుకుంది.

 


ప్రభుత్వ విత్తశాస్త్రం అధ్యయనం చేసే అంశాలు: 1) ప్రభుత్వ రాబడి 2) ప్రభుత్వ వ్యయం 3) ప్రభుత్వ రుణం 4) విత్త నిర్వహణ 5) కోశ విధానం 6) ఫెడరల్‌ విత్తం

 


1) ప్రభుత్వ రాబడి: ప్రభుత్వ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడి అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. దీనిలో ముఖ్యమైనది పన్ను రాబడి.

 


2) ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వం ఏయే అంశాలపై ఖర్చు చేస్తుంది, ప్రభుత్వ వ్యయం పెరగడానికి కారణాలు, ఉత్పత్తి - ఉద్యోగిత - ఆదాయంపై ప్రభుత్వ వ్యయం ప్రభావం లాంటి అంశాలను చర్చిస్తుంది.

 


3) ప్రభుత్వ రుణం: వ్యయానికి సరిపడా ఆదాయం సమకూర్చుకోలేనప్పుడు ప్రభుత్వం అప్పు (రుణం) చేయాల్సి వస్తుంది. ఇది అంతర్గత, బహిర్గత రుణాలను తీసుకుంటుంది.

 


4) విత్త నిర్వహణ: బడ్జెట్‌ తయారుచేసే విధానం, చట్టసభలో దాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం, అమలుపరచడం, ఆడిటింగ్‌ లాంటి అంశాలు ఉంటాయి.

 


5) కోశవిధానం: ప్రభుత్వ ఆదాయ - వ్యయ రుణ విధానాలను తన ఆశయ సాధన కోసం సర్కారు ఎలా ఉపయోగించుకుంటుందో తెలియజేసేది కోశవిధానం.

 


6) ఫెడరల్‌ విత్తం: సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరులను ఎలా విభజిస్తారు? వనరుల పంపిణీలో అసమానతలు ఉంటే, వాటిని ఎలా తగ్గించాలి లాంటి అంశాలను వివరిస్తుంది.

 


ప్రభుత్వ రాబడి వర్గీకరణ: ప్రభుత్వానికి వచ్చే రాబడి రెండు రకాలు. అవి 1) రెవెన్యూ రాబడి 2) మూలధన రాబడి. రెవెన్యూ రాబడి రెండు మార్గాల్లో లభిస్తుంది. 1) పన్ను రాబడి 2) పన్నేతర రాబడి.

 


పన్నేతర రాబడి: పరిపాలన రాబడులు: ఫీజులు, జరిమానాలు, పెనాల్టీలు, అప్పులు, డిపాజిట్ల స్వాధీనం, అభివృద్ధి** ప్రత్యేక విధింపులు.

 


వాణిజ్యపర ఆదాయాలు:  ఉత్పత్తి అయిన వస్తుసేవలను ప్రభుత్వరంగ పరిశ్రమలు, సంస్థలు విక్రయిస్తే వచ్చే రాబడిని వాణిజ్యపర ఆదాయాలు అంటారు. 


ఉదా: రైల్వే రవాణా, విద్యుత్తు సరఫరా, తంతి తపాలా లాంటివి.

 


గ్రాంట్లు: ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఉదారంగా ఇచ్చే ద్రవ్యాన్ని గ్రాంట్లు అంటారు. 


ఉదా: కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు.

 


కానుకలు: ఒక ప్రభుత్వం ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే మొత్తాన్ని కానుకలు అంటారు. 


ఉదా: ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల్లో ఇచ్చే కానుకలు.


ప్రభుత్వ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం: భూములు, గనులు, నదులు లాంటి సహజ వనరులను అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం.


కరెన్సీ నోట్ల ముద్రణ: ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం సరిపడినంత ఆదాయాన్ని సమకూర్చుకోలేనప్పుడు అంతిమంగా కొత్త కరెన్సీ నోట్లు ముద్రించి ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అయితే దీనివల్ల దేశంలో ద్రవ్య సరఫరా పెరిగి ధరలు పెరగవచ్చు.


పన్ను రాబడి: ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే రాబడిని పన్ను రాబడిని అంటారు. సెలిగ్‌ మన్‌ ప్రకారం ‘తనకు సంక్రమించిన ప్రయోజనంతో సంబంధం లేకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు, సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్నులు.


పన్ను లక్షణాలు: 1) ఇవి నిర్బంధ చెల్లింపులు. 


2) ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు.


3) పన్ను చెల్లింపులో ప్రత్యక్ష ప్రతిఫలం లేదు.


4) ప్రజల సామాన్య ప్రయోజనం కోసం విధిస్తారు.


5) పన్ను చెల్లింపులో త్యాగం ఇమిడి ఉంది.


6) ప్రస్తుత కాలంలో ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదు.

 


పన్ను రకాలు: 


ఎ) పన్ను భారాన్ని భరించే వారిని బట్టి పన్నులు రెండు రకాలు: 1) ప్రత్యక్ష పన్ను 2) పరోక్ష పన్ను 

 


పన్ను చెల్లించడం వల్ల వ్యక్తి కోల్పోయే ద్రవ్యమే ద్రవ్య భారం. ఈ భారం రెండు రకాలు. 1) తొలి భారం  2) అంతిమ భారం.

 


ప్రభుత్వం పన్ను విధించినప్పుడు దాన్ని మొదటగా చెల్లించిన వ్యక్తి భరించే భారమే పన్ను తొలిభారం. చివరికి ఎవరు చెల్లిస్తారో ఆ భారమే అంతిమ భారం. ఉదా: వినోద పన్ను తొలి భారాన్ని థియేటర్‌ యజమాని భరిస్తే తుది భారాన్ని ప్రేక్షకుడు భరిస్తాడు.

 


ప్రత్యక్ష పన్ను: పన్ను తొలి, అంతిమ భారాలను ఒకే వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ప్రత్యక్ష పన్నుల భారాన్ని బదిలీ చేయడానికి వీలులేదు. 


ఉదా: ఆదాయ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను, కార్పొరేట్‌ పన్ను, బహుమతి పన్ను, స్టాంప్‌ డ్యూటీ, వడ్డీ పన్ను, ఎస్టేట్‌ డ్యూటీ, వ్యయంపై పన్ను, క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌

 


పరోక్ష పన్ను: పన్ను తొలిభారం ఒకరిపైన, అంతిమభారం మరొకరిపైన ఉంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. పరోక్ష పన్నుల భారాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా బదిలీ చేయవచ్చు. పన్ను మొదట ఎవరిపై విధిస్తారో వారు మరొకరికి పన్ను భారాన్ని బదిలీ చేస్తారు.


ఉదా: కేంద్ర ఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకాలు, సేవాపన్ను, రాష్ట్ర అమ్మకం పన్ను, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకం, మోటారు వాహనాలపై పన్ను, విద్యుత్‌పై పన్ను,  వినోదపు పన్ను 9) ఆక్ట్రాయ్‌ పన్ను

 


బి) పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు మధ్య సంబంధం ఆధారంగా పన్నులు నాలుగు రకాలు:


పన్ను దేని ఆధారంగా విధిస్తున్నారో తెలియజేసేదాన్ని పన్ను ప్రాతిపదిక అంటారు. ఎంత శాతం పన్ను విధిస్తున్నారో తెలియజేసేది పన్ను రేటు. ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారో తెలియజేసేది పన్ను పరిధి.

 


1) అనుపాత పన్ను: పన్ను విధింపునకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్ను రేటు వర్తింపజేస్తే అది అనుపాత పన్ను అవుతుంది. ఉదాహరణకు ఆదాయ పన్ను 10 శాతంగా నిర్ణయిస్తే ఆదాయం రూ.10 వేలు అయినా, లేక రూ.లక్ష అయినా పన్ను రేటు మారదు. 


ఉదా: అమ్మకపు పన్ను, సేవా పన్ను, ఎక్సైజ్‌ సుంకం.

 


2) పురోగామి పన్ను: పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ ఉంటే పన్ను రేటు కూడా మారుతుంది. దీన్ని పురోగామి పన్ను అంటారు. భారత్‌లో ఆదాయ పన్ను ఈ రకానికి చెందింది. ధనికులపై అధిక పన్ను, పేదలపై తక్కువ పన్నును సూచిస్తుంది. అంటే ‘చెల్లించగలిగిన సామర్థ్యం’ ఆధారంగా ఈ పన్ను విధిస్తారు. పురోగామి పన్నుల వల్ల ఆదాయ అసమానతలు తగ్గడమే కాకుండా సాంఘిక న్యాయం జరుగుతుంది. ప్రముఖ ఆర్థికవేత్త ఆడంస్మిత్‌ పేర్కొన్న పన్ను నియమాల్లో సమతా నియమాన్ని పురోగామి పన్ను తెలియజేస్తుంది.

 


3) తిరోగామి పన్ను: పన్నుకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ పెరిగేకొద్దీ పన్ను రేటు తగ్గితే అది తిరోగామి పన్ను అవుతుంది.


ఉదా: రూ.లక్ష - రూ.1.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తిపై 30 శాతం; రూ.1.5 లక్షలు - రూ.2.50 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తి 20 శాతం; రూ.2.50 లక్షలపైన ఆదాయం ఉన్న వ్యక్తి 10 శాతం పన్ను చెల్లించాలంటే అది తిరోగామి పన్ను అవుతుంది.

 


4) డిగ్రెసివ్‌ పన్ను: ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు నెమ్మదిగా పెరిగి, ఒక దశ తర్వాత పన్ను రేటులో మార్పు రాకపోతే దాన్ని డిగ్రెసివ్‌ పన్ను అంటారు. సాధారణంగా డిగ్రెసివ్‌ పన్ను రెండు రకాలుగా ఉంటుంది.


ii* పన్ను ఆధారమైన ఆదాయంలో లేదా సంపద విలువలో కొంత మొత్తాన్ని పన్ను చెల్లింపు నుంచి మినహాయించి మిగిలిన మొత్తం ఆదాయంపై ఒకే రేటులో పన్ను విధించడం.


* పన్ను ఆదాయం   పెరిగినంత వేగంగా పన్ను రేటు పెరగకపోవడం. ఈ పద్ధతిలో అధిక ఆదాయం ఉన్న వ్యక్తి తక్కువ త్యాగం, తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ఎక్కువ త్యాగం చేస్తారు.


సి) పన్ను విధింపు కాలం ఆధారంగా పన్నులు రెండు రకాలు 

 


తాత్కాలిక పన్ను: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాత్కాలిక అవసరాలు తీర్చుకోడానికి విధించే పన్ను.


ఉదా: యుద్ధ సమయంలో విధించే సర్‌ ఛార్జిలు. యుద్ధం ముగిసిన తర్వాత వాటిని రద్దు చేస్తారు.

 


శాశ్వత పన్ను: శాశ్వత ప్రాతిపదికపై విధించే పన్ను. 1866 నుంచి భారత్‌లో ఆదాయ పన్నును శాశ్వత ప్రాతిపదికన విధిస్తున్నారు.


ఉదా: అమ్మకం పన్ను


డి) పన్ను విధింపు ఆధారంగా పన్నులు రెండు రకాలు 

 


నిర్దిష్ట పన్ను: వస్తువు బరువు/సంఖ్య/కొలతను బట్టి విలువతో సంబంధం లేకుండా పరిమాణం ఆధారంగా పన్ను విధిస్తే దాన్ని నిర్దిష్ట పన్ను అంటారు.


ఉదా: వినోదపు పన్ను

 


విలువ ఆధారిత పన్ను: మూల్యానుగత పన్ను, అడ్‌ వాలరెమ్‌ పన్ను అని దీనికి ఇతర పేర్లు. వస్తువు ద్రవ్య విలువపై పన్ను విధిస్తే అది విలువ ఆధారిత పన్ను. సాధారణంగా వస్తువు విలువలో కొంత శాతాన్ని పన్నుగా విధిస్తారు.


ఉదా: సేల్స్‌ టాక్స్, కస్టమ్స్‌. మనదేశంలో ఎక్కువ పన్నులు ఈ రకానికి చెందినవి.


పన్ను విధింపు స్థానం ఆధారంగా రెండు రకాలు 

 


ఏకస్థాన పన్ను: ఉత్పత్తిలో ఒక దశలో మాత్రమే పన్ను విధిస్తే దాన్ని ఏకస్థాన పన్ను అంటారు.

 


బహుళ స్థాన పన్ను: ఉత్పత్తిలో వివిధ దశల్లో పన్ను విధిస్తే దాన్ని బహుళ స్థాన పన్ను అంటారు. 


ఉదా: వ్యాట్‌ 

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 19-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 భారతదేశంలో ముఖ్యమైన పన్నులు 

సంక్షేమ రాజ్యంలో సర్కారు సుంకాలు!

రోడ్లు వేయాలి, కాలువలు తవ్వాలి, ప్రాజెక్టులు నిర్మించాలి. వీటన్నింటికీ సొమ్ము కావాలి. ఫించన్లు, నిరుద్యోగ భృతి తదితరాలకు ఆదాయం  అవసరం.  మౌలిక సదుపాయాలకైనా, సామాజిక సంక్షేమానికైనా ప్రభుత్వం చేసే ఖర్చులకు కాసులను ప్రజలే సమకూర్చాలి. అందరూ తమ సంపాదనలో కొంత గవర్నమెంటుకి సమర్పించాలి. వ్యయం చేసినా సుంకం చెల్లించాలి. వాహనాలు సహా ఏవైనా వస్తువులు కొన్నా సర్కారుకు ముడుపు ముట్టజెప్పాలి. సేవలపై నిర్ణీత రుసుం కట్టడం తప్పనిసరి. దానినే పన్ను అంటారు. అదే ఆర్థిక వ్యవస్థలో అతిముఖ్యమైన పదం.  ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. వ్యక్తులు, వ్యవస్థలపై నేరుగా విధిస్తే ప్రత్యక్ష పన్ను. కనిపించకుండా భారాన్ని పెంచితే పరోక్ష పన్ను. ఆదాయ అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక వృద్ధికి, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడానికి సాయపడే సాధనం. ఈ నేపథ్యంలో దేశంలో పన్నుల పరిణామక్రమంతో పాటు ప్రధానమైన పన్నుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1) వ్యక్తిగత ఆదాయ పన్ను:  ఒక నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటిన వ్యక్తులపై విధించే పన్ను ఆదాయ పన్ను. వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు, రిజిస్టర్‌ కాని సంస్థలకు ఈ పన్ను విధిస్తారు. మన దేశంలో ఆదాయ పన్ను పురోగామి, ప్రత్యక్ష పన్ను. స్వాతంత్య్రానంతరం 1961లో ఆదాయపన్ను చట్టం వచ్చింది. ప్రారంభంలో పన్ను రేటు అధికంగా ఉండటంతో పన్ను ఎగవేత ఎక్కువై నల్లధనం పెరిగింది. రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుతో పన్ను రేటు తగ్గించారు. 1997-98 బడ్జెట్‌ నాటికి ఆదాయ పన్ను గరిష్ఠంగా 30 శాతానికి చేరింది. ఆదాయపన్ను చట్టం-1961 ప్రకారం 100కు పైగా పన్ను మినహాయింపులు ఉండేవి. 2020-21 నుంచి అందులో 70కి పైగా మినహాయింపులను తొలగించారు. పాత పన్ను శ్లాబు విధానం స్థానంలో 7 శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారు.

 


 




2023-24 బడ్జెట్‌లో ముఖ్యమైన అంశాలు (ఆదాయ పన్నుకు సంబంధించి):

* అధిక ఆదాయంపై సర్‌ఛార్జి రేటును 37% నుంచి 25%కి తగ్గించారు.

* కొత్త పన్ను విధానంలో ఆదాయం రూ.15.5 లక్షలు దాటితే స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.52,500గా ప్రకటించారు.

* ప్రస్తుతం రూ.5 కోట్లకు మించిన ఆదాయం ఉన్నవారికి 37% సర్‌ఛార్జి వర్తిస్తుంది. దీన్ని 25%కి తగ్గించారు.

* ఉద్యోగులు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చేసుకున్నప్పుడు రూ.3 లక్షల వరకే పన్ను మినహాయింపు ఉండేది. పెరిగిన వేతనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచారు.

* 2023, ఏప్రిల్‌ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం రూ.5 లక్షల్లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది.

* ఆదాయ పన్ను విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా ‘వివాద్‌ సే విశ్వాస్‌-2’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

* భవిష్యనిధి నిల్వలకు పాన్‌ కార్డు అనుసంధానం లేకుండా పూర్తిగా వెనక్కు తీసుకుంటే ఆ మొత్తంపై ఆదాయ పన్ను భారాన్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం 30 శాతం ఉన్న టీడీఎస్‌ను 20 శాతానికి తగ్గించింది.

* సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం పరిధిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు.

* ఆదాయపు పన్ను గణింపులో కొత్త విధానాన్ని ఎంచుకుంటే 80 C, 80 D కింద మినహాయింపులు వదులుకోవాల్సి వస్తుంది.


2) కార్పొరేట్‌ పన్ను: భారత సంస్థల ఆదాయంపై సర్‌ ట్యాక్స్‌ పేరుతో ఈ పన్ను ప్రవేశపెట్టారు. 1965-66లో కార్పొరేట్‌ పన్నుగా పేరు మార్చారు. రిజిస్టర్‌ అయిన జాయింట్‌ స్టాక్‌ కంపెనీలు, కార్పొరేషన్ల ఆదాయంపై ఈ పన్ను విధిస్తారు. సంస్కరణల్లో భాగంగా రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సులతో కార్పొరేట్‌ పన్ను రేటును 40 శాతానికి తగ్గించారు. 1997-98లో ఈ పన్నుని 35 శాతానికి, 2005-06లో 30 శాతానికి తగ్గించారు. 2015-16 బడ్జెట్‌లో 30% శాతం నుంచి 25%కి  తగ్గించారు. వివిధ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను రద్దు చేశారు. ప్రస్తుతం కంపెనీల వార్షిక టర్నోవర్‌ రూ.400 కోట్లు ఉంటే కార్పొరేట్‌ పన్ను 25 శాతం చెల్లించాలి.
 

MAT (Minimum Alternative Tax): ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, మినహాయింపుల కారణంగా ఏ పన్ను పరిధిలోకి రాని సంస్థలు చెల్లించాల్సిన కనీస పన్ను లీతిగి. దీన్ని అమెరికా తొలిసారిగా ప్రవేశపెట్టింది. భారత్‌లో 1996-97లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం లీతిగిను ప్రవేశపెట్టారు. 18.5% నుంచి 15%కి తగ్గించారు.


3) వడ్డీ పన్ను: వడ్డీ పన్ను చట్టం-1974 ప్రకారం వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీపై దీన్ని విధిస్తారు. బ్యాంకులు, ప్రభుత్వ విత్త సంస్థలు, విత్త కంపెనీలు దీన్ని చెల్లిస్తాయి. 2000-01 నుంచి ఈ పన్నును రద్దు చేశారు.


4) వ్యయంపై పన్ను: కాల్డర్‌ కమిటీ సిఫార్సులపై 1957లో ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి వ్యయంపై పన్నును ప్రవేశపెట్టారు. ‘వ్యయంపై పన్ను చట్టం-1987’ ప్రకారం దీన్ని విధిస్తున్నారు.

ఉదా: హోటల్‌ గదులపై రోజుకి రూ.400 కంటే ఎక్కువ వ్యయం చేస్తే దీన్ని చెల్లించాలి. పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1993 నుంచి దీన్ని రద్దు చేశారు.

కాల్డర్‌ సిఫార్సు చేసిన పన్నులు- 1) వ్యయంపై పన్ను (1957) 2) సంపద పన్ను (1957) 3) బహుమతి పన్ను (1958) 4) క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ (1958)

5) సంపద పన్ను: 1957లో సంపద పన్నును ప్రవేశపెట్టారు. వ్యక్తులు, ఉమ్మడి హిందూ కుటుంబాలు, కంపెనీల వద్ద పరిమితికి మించిన నికర సంపదపై వార్షికంగా ఈ పన్ను విధిస్తారు. సంపదను లెక్కించేటప్పుడు నికర సంపదనే తీసుకుంటారు. వ్యవసాయ భూములు, పీఎఫ్‌ సొమ్ము, ఎల్‌ఐసీ మొత్తాలు దీని నుంచి మినహాయిస్తారు. రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల్లో ఉత్పాదక ఆస్తులైన షేర్లు, బాండ్లలో సంపద పన్నును మినహాయించాలని సూచించారు. 1992-93లో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ షేర్లు, బాండ్లను మినహాయించారు. గెస్ట్‌హౌస్‌లు, రెసిడెన్షియల్‌ హౌస్‌లు, జ్యువెలరీలపై సంపద పన్ను విధించారు. 2015-16 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంపద పన్నును తొలగించారు.


6) ఎస్టేట్ సుంకం: దీన్ని 1953లో ప్రవేశపెట్టారు. వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తిని వారసులకు సంక్రమింపజేసేటప్పుడు విధిస్తారు. కేంద్రం విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తుంది. దీనివల్ల వచ్చే రాబడి తక్కువ ఉండటంతో 1985లో వి.పి.సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని రద్దు చేశారు.


7) బహుమతి పన్ను: కాల్డర్‌ సూచనలపై 1958లో ప్రవేశపెట్టారు. మొదట్లో దీన్ని బహుమతిగా ఇచ్చేవారు. 1990-91 నుంచి గ్రహీతపై విధిస్తున్నారు.ఛారిటబుల్‌ సంస్థలకి ఇచ్చే విరాళాలను మినహాయించి మిగతా విరాళాలు, బహుమతులపై ఈ పన్ను విధిస్తారు. అయితే వివాహ సమయాల్లో మహిళలకు ఇచ్చే బహుమతులు, భార్యకి ఇచ్చే బహుమతులను మినహాయించారు. ఈ పన్ను రాబడి తక్కువగా ఉండటంతో 1998-99లో యశ్వంత్‌ సిన్హా రద్దు చేశారు. తిరిగి 2004-05లో ప్రవేశపెట్టారు. రూ.50 వేలు విలువ దాటిన ప్రతి బహుమతిపైనా ఈ పన్ను విధిస్తారు.


8) సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ పన్ను: స్టాక్‌ ఎక్స్ఛేంజీలో రిజిస్టర్‌ అయిన సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాలపై విధించే ప్రత్యక్ష పన్ను. షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లపై ఈ పన్ను విధిస్తారు. 2004-05 కేంద్ర బడ్జెట్‌లో దీన్ని ప్రవేశపెట్టారు.


9) దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌): ప్రస్తుతం ఏదైనా లిస్టెడ్‌ కంపెనీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల ఈక్విటీ పథకాల యూనిట్లను కొని ఏడాది కంటే తక్కువ కాలంలో అమ్మితే 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధిస్తున్నారు. అదే సంవత్సరం తర్వాత అమ్మితే ఎలాంటి పన్ను లేదు. 2018-19 బడ్జెట్‌లో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచిన వాటాలపై వచ్చిన లాభంపై ఈ పన్ను విధించారు. వార్షిక లాభం రూ.లక్ష మించితే 10% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలని ప్రతిపాదించారు.


10) డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ): డివిడెండ్స్‌ పంపిణీ చేసే దేశీయ కంపెనీలు 15 శాతం డీడీటీ చెల్లించాలి. 2020, ఏప్రిల్‌ 1 నుంచి ఈ పన్నును రద్దు చేశారు.


11) క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌: నల్లధనాన్ని నిరోధించేందుకు 2005లో నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం దీన్ని ప్రవేశపెట్టారు. వ్యక్తులు రూ.50 వేలు, సంస్థలు రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే ఈ పన్ను విధిస్తారు. 2009, ఏప్రిల్‌ 1 నుంచి రద్దు చేశారు.


12) ఫ్రింజ్‌ బెనిఫిట్‌ ట్యాక్స్‌ (ఎఫ్‌బీటీ): దీన్ని 2005లో ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలైన టీఏ, డీఏ, బోనస్, ఇతర అలవెన్స్‌లపై విధించే పన్ను. 2009లో ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని రద్దు చేశారు.

 

13) కస్టమ్స్‌ సుంకాలు: రాజ్యాంగం ప్రకారం ఎగుమతులు, దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాలను కేంద్రం విధిస్తుంది. విదేశీ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దిగుమతుల నియంత్రణలకు దోహదపడుతుంది.


దిగుమతి పన్ను: స్వదేశీ పరిశ్రమల రక్షణకు, విదేశీ వ్యాపార శేషం (బీఓపీ)లో లోటు తగ్గించేందుకు అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి దిగుమతి పన్ను విధిస్తారు. * దేశంలో దిగుమతి సుంకాలు సాధారణంగా అడ్‌ వాలోరమ్‌ పన్నులుగా ఉన్నాయి. అంటే వస్తు ధరలపై కొంత శాతంగా విధిస్తారు.

ఉదా: యంత్రాలు, ముడి సరకులు దిగుమతి చేసుకునేప్పుడు పన్ను విధిస్తారు.


ఎగుమతి పన్ను: ప్రభుత్వ రాబడిని పెంచేందుకు, దేశంలో వస్తు లభ్యత కల్పించేందుకు విధిస్తారు. సంస్కరణలకు ముందు ప్రపంచంలోనే అధిక కస్టమ్స్‌ సుంకాలున్న దేశంగా భారత్‌ ఉండేది. ఉదా: 300%. రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల మేరకు ఈ సుంకాలను తగ్గించారు. 2006-07లో 12.5 శాతానికి, 2007-08 నాటికి 10 శాతానికి తగ్గించారు. 2021-22లో 6.13% ఉంది. ప్రస్తుతం కస్టమ్స్‌ సుంకం 7.72%.


14) కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు: మొదట పత్తి, నూలు మీద 1894లో ఎక్సైజ్‌ సుంకాన్ని విధించారు. తర్వాత మరికొన్ని వస్తువులకు వర్తింపజేశారు. దీన్ని రెండు రకాలుగా విధిస్తారు. 1) మూల్యానుగత పన్ను 2) నిర్దిష్ట పన్ను. దేశంలోని వస్తూత్పత్తిపై ఈ పన్ను విధిస్తారు. తక్కువ ఆదాయ వర్గాల వారు వినియోగించే వస్తువుల మీద ఎక్సైజ్‌ సుంకం తక్కువగా, ధనిక వర్గాల వారు ఉపయోగించే వస్తువులపై అధికంగా విధిస్తారు. రాజ్యాంగం ప్రకారం ఆల్కహాల్, నల్లమందు మినహా కొత్తగా ఉత్పత్తి చేసే ప్రతి వస్తువుపై కేంద్రం సుంకం విధిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ సుంకం చెల్లిస్తే అది వస్తువు కొన్న వ్యక్తికి బదిలీ అవుతుంది. ఇందులో ఎగవేత అధికంగా ఉండటంతో 1978లో ఎల్‌.కె.ఝా కమిటీ లీతివిజుతిగి పేరుతో నూతన విధానాన్ని సిఫార్సు చేసింది. కానీ దీన్ని ప్రభుత్వం ఆమోదించలేదు. 1986, ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం లీవీదీజుతిగిను ప్రవేశపెట్టింది. 2000, ఏప్రిల్‌ నుంచి రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల మేరకు లీవీదీజుతిగి ను దినివిజుతిగి గా మార్పు చేశారు. 2022-23లో కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ 12.15%.


15) సేవా పన్ను: రాజా చెల్లయ్య కమిటీ సేవా పన్నును సిఫార్సు చేసింది. మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1994-95లో మూడు సేవలపై (టెలికామ్, బీమా, స్టాక్‌ మార్కెట్‌) సేవా పన్ను ప్రవేశపెట్టారు. 2011-12 నాటికి 119 సేవలపై విధించారు. ప్రారంభంలో మొత్తం పన్ను రాబడిలో సేవా పన్ను 0.5% ఉండేది. 2016-17 నాటికి 14.8 శాతానికి పెరిగింది. ప్రారంభంలో సేవా పన్ను రేటు 5 శాతం ఉండేది. 2016 నాటికి 15 శాతం పెరిగింది. 2017, జులై నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో సేవా పన్ను దానిలో భాగమైంది.


స్వచ్ఛభారత్‌ సెస్‌: సేవా పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపైన స్వచ్ఛభారత్‌ సెస్‌ను 0.50%గా 2015, నవంబరు 15 నుంచి విధిస్తున్నారు. దీని నుంచి వచ్చే మొత్తాన్ని స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ నిధులు కేంద్రానికి చెందుతాయి.


16) వ్యాట్‌ (జుతిగి): వస్తువు వివిధ ఉత్పత్తి, అమ్మకం దశల్లో పెరిగిన విలువపై మాత్రమే విధించే పన్నును విలువ ఆధారిత పన్ను అంటారు. వ్యాట్‌ అనేది ఒక పరోక్ష పన్ను. భారతదేశంలో వ్యాట్‌ను తొలిసారిగా ఎల్‌.కె.ఝా (1978) కమిటీ సూచించింది. రాజా చెల్లయ్య, మన్మోహన్‌ సింగ్‌ కూడా వ్యాట్‌ ఆవశ్యకత గురించి చెప్పారు. భారతదేశంలో వ్యాట్‌ను అమలుచేసిన తొలి రాష్ట్రం హరియాణా (2003, ఏప్రిల్‌ 1 నుంచి). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005, ఏప్రిల్‌ 1 నుంచి వ్యాట్‌ అమల్లోకి వచ్చింది. ఈ పన్నును చివరిగా అమలుచేసిన రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు. కేంద్రంలో ఎక్సైజ్‌ సుంకాల స్థానంలో, రాష్ట్రంలో అమ్మకం పన్నుల స్థానంలో వ్యాట్‌ అమలు చేస్తారు.


వ్యాట్‌ వల్ల ప్రయోజనాలు: 1) పన్నుపై పన్ను తొలగిపోతుంది. 2) పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. 3) ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. 4) పన్ను భారాన్ని తగ్గించవచ్చు. 5) క్రాస్‌ చెకింగ్‌కు వీలవుతుంది. 6) అంతర్జాతీయ పోటీకి దోహదపడుతుంది.

2023 - 24 కేంద్ర బడ్జెట్‌ ప్రకారం కేంద్రం ఆదాయం ప్రతి రూపాయిలో పన్నుల ద్వారా వచ్చేది:  1) ఆదాయ పన్ను - 15 పైసలు 2) కార్పొరేట్‌ పన్ను - 15 పైసలు 3) కస్టమ్స్‌ సుంకాలు-4 పైసలు 4) ఎక్సైజ్‌ సుంకాలు - 7 పైసలు 5) జీఎస్టీ-17 పైసలు


రాష్ట్ర పన్నులు

1) అమ్మకం పన్ను: ఈ పన్నును మొదటిసారిగా జర్మనీలో ప్రవేశపెట్టారు. భారత్‌లో మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌ అమ్మకాలపై తొలుత ప్రవేశపెట్టారు. తర్వాత మద్రాసులో అమలుచేశారు. రాష్ట్రాలకు అధిక రాబడి ఇచ్చే పన్నుగా ఇది అవతరించింది. ప్రస్తుతం దీన్ని జీఎస్టీలో విలీనం చేశారు.


2) రాష్ట్ర ఎక్సైజ్‌: మద్యం, నల్లమందు, మత్తు పదార్థాల తయారీపై రాష్ట్రం ప్రభుత్వం విధిస్తుంది. అమ్మకం పన్ను తర్వాత అధిక రాబడి ఇచ్చే పన్ను.


3) మోటారు వాహనాలపై పన్ను: వాహనాల బరువు, సీట్లు, వాహనం ఆక్రమించే స్థలం, రవాణా చేసే బరువును బట్టి వివిధ రాష్ట్రాల్లో పలు రకాలుగా విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మోటారు వాహనాలపై జీవిత కాలం పన్ను విధిస్తున్నారు.


4) వినోదపు పన్ను: దీన్ని 1922లో తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌ విధించింది. సినిమా హాళ్లు, సర్కస్‌లు, ఇతర ప్రదర్శనలపై ఈ పన్ను విధిస్తారు.


5) స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌: ఆస్తుల యాజమాన్యం, వాటాల బదిలీ, ఇతర ఒప్పందాలపై ఈ పన్ను విధిస్తారు.


6) వృత్తి పన్ను: డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ.15 వేలకు మించి జీతం పొందేవారు ఏటా వృత్తి పన్ను చెల్లించాలి. దీని గరిష్ఠ పరిమితి రూ.2,500.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 02-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వస్తు సేవల పన్ను - 2

 ఎగవేతలు తగ్గి.. పారదర్శకత పెరిగి!

ఒక వస్తువు తయారీ మొదలు వినియోగదారుడికి చేరే వరకు ఇంతకు ముందు అనేక రకాల పన్నులు చెల్లించాల్సి వచ్చేది. కేంద్రం కొన్ని, రాష్ట్రం ఇంకొన్ని వసూలు చేసేవి. ఏది, ఎంత, ఏ ప్రాతిపదికన విధిస్తున్నారో అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. రాష్ట్రాల మధ్య కూడా తేడాలు ఉండేవి. కానీ కొత్తగా వచ్చిన వస్తు సేవల పన్నుతో ఆ గందరగోళం తొలగిపోయింది. పరోక్ష పన్నుల వ్యవస్థను సరళీకరించి దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయడం వల్ల పాదర్శకత పెరిగింది. పన్ను ఎగవేతలు తగ్గిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను సంస్కరణగా నిలిచిన జీఎస్టీ పుట్టు పూర్వోత్తరాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పులు చేసి ఒకే దేశం-ఒకే పన్ను భావనతో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చారు. పరోక్ష పన్నుల సరళీకృత విధానంగా 2017, జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న 7 రకాల పన్నులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ విధిస్తున్నారు. దేశీయంగా వినియోగమయ్యే వస్తుసేవల అంతిమ విలువపై జీఎస్టీ లెక్కగడతారు. దీనిని వినియోగదారుడే భరించాలి. కానీ వ్యాపారులు వసూలుచేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ పద్ధతిలో వస్తువుల రవాణా వ్యయం తగ్గి దేశంలో వ్యాపార లావాదేవీలు విస్తరిస్తాయి.

జీఎస్టీ లక్ష్యాలు: 1) పన్నుపై పన్ను (డబుల్‌ ట్యాక్సేషన్‌)ను నిరోధించి ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలపై దుష్ప్రభావాలను తొలగించడం. 2) నాణ్యమైన వస్తువుల తయారీ, మార్కెట్‌లో పోటీతత్వం పెంచడం. 3) బహుళ పన్నుల విధానానికి ముగింపు. 4) ఆర్థికాభివృద్ధికి సహకరించడం.

జీఎస్టీ లాభాలు: 1) పన్నుపై పన్ను తొలగిపోతుంది. 2) ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. 3) పన్ను వసూలును సరిచూసుకోవచ్చు (క్రాస్‌ చెకింగ్‌) 4) పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. 5) పన్ను భారాన్ని తగ్గించవచ్చు. 6) అంతర్జాతీయ పోటీకి దోహదపడుతుంది.


జీఎస్టీలో విలీనమైన పన్నులు


ఎ) కేంద్ర స్థాయిలో విలీనమైనవి: 1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు 2) అదనపు ఎక్సైజ్‌ సుంకాలు 3) అదనపు కస్టమ్స్‌ సుంకాలు 4) ప్రత్యేక అదనపు కస్టమ్స్‌ సుంకాలు 5) సేవా పన్ను 6) సెస్‌లు, సర్‌ఛార్జ్‌లు


బి) రాష్ట్ర స్థాయిలో విలీనమైనవి:  1) రాష్ట్ర అమ్మకం పన్ను 2) కేంద్ర అమ్మకం పన్ను (కేంద్రం విధించగా రాష్ట్రాలు వసూలు చేసుకునేవి) 3) వినోదపు పన్ను 4) ప్రవేశ పన్ను 5) లగ్జరీ పన్ను 6) కొనుగోలు పన్ను 7) లాటరీ, పందెం, జూదంపై పన్నులు 8) వ్యాపార ప్రకటనలపై పన్నులు 9) రాష్ట్ర సెస్, సర్‌ఛార్జీలు


జీఎస్టీలో విలీనం కాని పన్నులు

ఎ) కేంద్ర స్థాయిలో: 1) ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాలు 2) కస్టమ్స్‌పై ఉన్న సర్‌ఛార్జీలు 3) కస్టమ్‌ సెస్‌లు 4) పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాలు 5) గ్యాస్, పొగాకుపై ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు 

బి) రాష్ట్ర స్థాయిలో: 1) మోటారు వాహనాలపై పన్ను 2) మద్యంపై ఉన్న రాష్ట్ర ఎక్సైజ్‌  3) పెట్రోల్‌ ఉత్పత్తులపై ఉన్న వ్యాట్‌


జీఎస్టీ రకాలు

1) కేంద్ర జీఎస్టీ: ప్రతి వ్యాపార లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వ వాటాను తెలియజేస్తుంది.

2) రాష్ట్ర జీఎస్టీ: ప్రతి వ్యాపార లావాదేవీలపై రాష్ట్ర వాటాను తెలియజేస్తుంది.

3) కేంద్రపాలిత ప్రాంత (యూటీ) జీఎస్టీ: ప్రతి వ్యాపార లావాదేవీలపై కేంద్రపాలిత ప్రాంతాల వాటాను తెలియజేస్తుంది.

4) సమగ్ర (ఇంటిగ్రేటెడ్‌) జీఎస్టీ: రెండు రాష్ట్రాల మధ్య, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య, విదేశీ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీల మధ్య విభజనతో నిమిత్తం లేకుండా సమగ్ర జీఎస్టీ వసూలవుతుంది.

జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు పన్ను రాబడి తగ్గితే 2015 - 16 సంవత్సరాన్ని ఆధారం చేసుకుని పన్ను రాబడిలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటుని 14 శాతంగా అంచనా వేసి అంతకంటే తక్కువ ఆదాయం లభిస్తే ఆ నష్టాన్ని అయిదేళ్లు కేంద్రం భరిస్తుంది. (మొదటి మూడేళ్లు 100 శాతం, నాలుగో సంవత్సరం 75 శాతం, అయిదో ఏడాది 50 శాతం భరిస్తుంది)

* జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి డీ-మెరిట్‌ వస్తువులపై ప్రత్యేక సెస్‌ వేసి ఆ మొత్తంతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

భారతదేశంలో మొదటిసారిగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది. దానికో రూపం ఇవ్వడానికి 2002-03లో విజయ్‌ కేల్కర్‌ కమిటీని నియమించింది. చివరికి 2014లో వస్తుసేవల పన్ను విషయంలో ముందడుగు పడింది. ఈ అంశాన్ని 2014, డిసెంబరులో లోక్‌సభలో 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు. 2015లో లోక్‌సభ, 2016లో రాజ్యసభ ఆమోదించాయి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2016, సెప్టెంబరు 8న ఆమోదముద్ర వేశారు. దీంతో 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2017, జులై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

జీఎస్టీ బిల్లు ప్రకారం ఈ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోపు రాష్ట్రపతి జీఎస్టీ మండలిని ఏర్పాటు చేస్తారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి ఛైర్మన్‌. సభ్యులుగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు గానీ, పన్నుల వ్యవహారాలు చూసే మంత్రులు గానీ, ఆ రాష్ట్రం నామినేట్‌ చేసే ఇతర మంత్రులు గానీ ఉంటారు.

జీఎస్టీ మండలి నిర్ణయాలు: జీఎస్టీ కౌన్సిల్‌ కేంద్ర - రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తుంది. జీఎస్టీ చట్టంలోని 279(ఎ) సెక్షన్‌ కింద ఈ మండలి ఏర్పాటైంది. దీని సచివాలయం దిల్లీలో ఉంటుంది. ఈ మండలి నిర్ణయాలు 3/4వ వంతు మెజారిటీతో అమల్లోకి వస్తాయి. 1/3వ వంతు ఓట్లు కేంద్రానికి, 2/3వ వంతు ఓట్లు రాష్ట్రాలకు ఉంటాయి. కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్‌ బోర్డు అధ్యక్షులు శాశ్వత ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. అయితే వీరికి ఓటింగ్‌ హక్కు ఉండదు.

సిఫార్సు చేసే అంశాలు:

1) జీఎస్టీలో విలీనం కానున్న పన్నులు, సెస్‌లు, సర్‌ఛార్జీలు

2) జీఎస్టీ నుంచి మినహాయింపు పొందే వస్తుసేవలు

3) జీఎస్టీ పరిధిలోకి వచ్చేందుకు టర్నోవర్‌ పరిమితి 

4) జీఎస్టీ రేట్లు


పన్ను రేట్లు:  2016, నవంబరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 4వ సమావేశంలో పన్ను రేట్లను 0, 5, 12, 18, 28 శాతాలుగా స్లాబ్‌లను నిర్ణయించారు.

సున్నా శాతం పన్ను (జీరో ట్యాక్స్‌):  ఉదా: రాష్ట్రాలు వ్యాట్‌లో మినహాయించిన అవసర వస్తువులను ఉంచారు. తాజాపండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, ప్యాకింగ్‌ చేయని పాలు, మజ్జిగ, పెరుగు; సహజనూనె, ఉప్పు, బెల్లం, కాయధాన్యాలు, జనపనార, గాజులు, స్టాంపులు, జ్యుడీషియల్‌ పత్రాలు, వార్తాపత్రికలు, పోస్టాఫీసు సేవలు, ఆర్‌బీఐ సేవలు, జన్‌ధన్‌ యోజన పొదుపు ఖాతాపై బ్యాంకు సేవలు.

5 శాతం పన్ను: ఉదా: రూ.వెయ్యి కంటే తక్కువ విలువైన వస్త్రాలు, ప్యాకింగ్‌ చేసిన ఆహార వస్తువులు, పెరుగు, శీతలీకరించిన కూరగాయలు, రూ.500 కంటే తక్కువ విలువైన పాదరక్షలు, అగర్‌బత్తీలు, బ్రాండెడ్‌ పన్నీరు, బ్రాండెడ్‌ కాని ఆయుర్వేద మందులు, జీడిపప్పు, పంచదార, కాఫీ, తేయాకు, వృద్ధుల చేతికర్రలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌స్టేషన్లు, దివ్యాంగులు వాడే వస్తువుల విడి పరికరాలు, వార్షిక టర్నోవర్‌ రూ.50 లక్షల కంటే తక్కువున్న రెస్టారెంట్లు, టైలరింగ్‌ సేవలు, ఎకానమీ క్లాస్‌లో విమాన ప్రయాణం, ప్రింట్‌ మీడియాలో ప్రకటనలు.

12 శాతం పన్ను:  ఉదా: రూ.వెయ్యి కంటే ఎక్కువ విలువైన వస్త్రాలు, బ్రాండెడ్‌ ఆయుర్వేద మందులు, పండ్ల రసాలు, టూత్‌ పౌడర్లు, కుట్టుమిషన్లు, ప్లేయింగ్‌ కార్డ్స్, చెస్‌బోర్డులు, క్యారం బోర్డులు, శీతలీకరించిన మాంసం, ప్యాక్‌ చేసిన డ్రైఫ్రూట్స్, రెడీమేడ్‌ దుస్తులు, సెల్‌ఫోన్లు, రూ.100 లోపు సినిమా టిక్కెట్లు, బిజినెస్‌ క్లాస్‌ విమాన ప్రయాణం, రూ.1001 నుంచి రూ.7500 వరకు హోటల్‌ టారిఫ్‌ సేవలు.

18 శాతం పన్ను: ఉదా: 32 అంగుళాల్లోపు టీవీలు, మానిటర్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్‌లు, డిజిటల్‌ కెమెరాలు, మార్బుల్స్, గ్రానైట్‌; రూ.100 కంటే ఎక్కువున్న సినిమా టికెట్లు, రూమ్‌ టారిఫ్‌ రూ.7501 పైన ఉన్న హోటల్స్, ఐటీ, టెలికాం సేవలు.

28 శాతం పన్ను: ఈ జాబితాలో ప్రారంభంలో 226 రకాల  వస్తువులు ఉండేవి. ప్రస్తుతం 28 వస్తువులకు తగ్గించారు. 

ఉదా: ఏసీలు, ఆటోమొబైల్స్, ఆటోమొబైల్‌ విడి పరికరాలు, సిమెంటు, డీ-మెరిట్‌ వస్తువులైన పాన్‌మసాలా, పొగాకు, సిగరెట్లు, విలాసవంతమైన కార్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే లాటరీలు, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు, రేస్‌ క్లబ్‌ బెట్టింగులు మొదలైనవి.

* బంగారం, బంగారు ఆభరణాలపై జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ, ప్లాటినమ్‌ అనుకరణ ఆభరణాలపై 3% జీఎస్టీ విధిస్తారు. ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులు, రియల్‌ ఎస్టేట్‌పై స్టాంప్‌ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీలను జీఎస్టీ నుంచి మినహాయించారు. రూ.40 లక్షల్లోపు టర్నోవర్‌ ఉన్న సంస్థలు జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాయి.

నెలవారీ రాబడి:  కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా జీఎస్టీ వసూలు చేస్తుంది. ఈ గణాంకాల ఆధారంగా జీఎస్టీ వార్షిక సగటు వసూళ్లను నిర్ణయిస్తారు. దేశంలో 2017 - 18లో జీఎస్టీ నెలవారీ వసూళ్లు రూ.82,294 కోట్లు కాగా, 2018 - 19 నాటికి రూ.96,114 కోట్లకు పెరిగాయి. 2019 - 20లో రూ.1,01,844 కోట్లు, 2021లో రూ.1.15 లక్షల కోట్లకు చేరాయి. 2022 - 23 ఆర్థిక సర్వే ప్రకారం జీఎస్టీ నెలవారీ సగటు వసూళ్లు రూ.1.24 లక్షల కోట్లకు పైగా పెరిగాయి.

పన్నులపై నియమించిన వివిధ కమిటీలు: 1) జాన్‌ మత్తాయ్‌ కమిటీ (1953) - కార్పొరేట్‌ పన్ను 2) కాల్డర్‌ కమిటీ (1956) - బహుమతి, సంపద, వ్యయం, మూలధన ఆదాయాలపై పన్నులు 3) మహావీర్‌ త్యాగీ కమిటీ (1959) - ప్రత్యక్ష పన్నుల పరిశీలన 4) చందా కమిటీ (1964) - పన్ను ఎగవేత నిరోధానికి సూచనలు 5) భూతలింగం కమిటీ (1967) - పన్ను విధానాల ఆధునికీకరణ 6) ఎన్‌.డి.తివారీ కమిటీ (1967) - కస్టమ్స్‌ సుంకాలపై 7) వాంఛూ కమిటీ (1970) - ప్రత్యక్ష పన్నులు, పన్ను ఎగవేత, నల్లధనంపై 8) కె.ఎన్‌.రాజ్‌ కమిటీ (1972) - వ్యవసాయ ఆదాయంపై పన్ను 9) ఎల్‌.కె.ఝా కమిటీ (1976 - 78) - పరోక్ష పన్నులు (వ్యాట్‌) 10) చోక్సీ కమిటీ (1977) - ప్రత్యక్ష పన్నుల సులభతరం 11) రాజా చెల్లయ్య కమిటీ (1991) - ప్రత్యక్ష, పరోక్ష పన్నులు (సేవా పన్నును సూచించింది) 12) రేఖీ కమిటీ (1992) - పరోక్ష పన్నులు 13) పార్థసారథి షోమ్‌ (2001, 2012) - 10వ ప్రణాళికలో పన్నుల మీద నిర్ణయాలు  14) విజయ్‌ కేల్కర్‌ (2002) - ప్రత్యక్ష, పరోక్ష పన్నులు  (జీఎస్టీ). 


రచయిత: ధరణి శ్రీనివాస్

Posted Date : 12-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  ప్రభుత్వ బడ్జెట్‌

సర్కారు ఆర్థిక నిర్వహణ సాధనం!

   ప్రభుత్వ పాలనలో అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. ప్రజల కోసం రోడ్లు వేయాలి, వంతెనలు కట్టాలి. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాలి. జీతాలు, సబ్సిడీలు,పెన్షన్లు ఇవ్వాలి. అందుకోసం ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. అప్పులు చేస్తుంది. వీటన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తూ ఆర్థికవృద్ధిని సాధించడానికి సాయపడే కీలక సాధనం బడ్జెట్‌. ఇది ప్రభుత్వ ప్రాధాన్యాలను, విధానాలను ప్రతిబింబిస్తుంది.  భవిష్యత్తు లక్ష్యాలతో, వర్తమాన అవసరాలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ అంశాలపై సమగ్ర అవగాహనను పోటీ పరీక్షల అభ్యర్థులు పెంపొందించుకోవాలి. 


Budget అనే ఆంగ్ల పదం Bougate  అనే ఫ్రెంచ్‌ పదం నుంచి వచ్చింది. దీనికి సంచి (Bag) అని అర్థం. భారత రాజ్యాంగంలో 112 అధికరణలో బడ్జెట్‌ అనే పదానికి బదులు Annual Financial Statement of Central Government  అనే పదాన్ని ఉపయోగించారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో దేశానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం, ఏ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాల బడ్జెట్‌ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. భారతదేశ బడ్జెట్‌ ముసాయిదా వివరాలను కేంద్రం పార్లమెంటుకు సమర్పిస్తుంది. 2017 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టి, మార్చిలో మార్పులు చేర్పులు చేసి చట్టసభ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెస్తున్నారు.


ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళికనే బడ్జెట్‌ అని చెప్పవచ్చు. రాబోయే ఏడాదిలో ప్రభుత్వ రసీదులు, చెల్లింపులు, సంబంధిత పరిమాణాత్మక విలువలను ఇది తెలియజేస్తుంది. అలాగే చేపట్టాల్సిన పథకాలు, వ్యూహాలను సూచిస్తుంది. సాధారణంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున సమర్పిస్తారు. దానికి ముందురోజు ఆర్థిక సర్వే, అంతకు ముందు రోజు రైల్వే బడ్జెట్‌ను సమర్పిస్తారు. 


2017-18 బడ్జెట్‌ని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. 1999 వరకు కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. 1999లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టి బ్రిటిష్‌ సంప్రదాయాన్ని విడిచిపెట్టారు. అదేవిధంగా 2017-18 బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిరోజున ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని వదిలేసి, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ప్రారంభించారు.


మనదేశంలో సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేయాలని అక్వర్త్‌ కమిటీ 1921లో సూచించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేసి చూపిస్తున్నారు. బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీ సిఫార్సులపై 2016 సెప్టెంబరులో రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్‌తో కలిపేందుకు అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఫలితంగా 2017-18 బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి చూపుతున్నారు. 


బ్రిటిష్‌ పాలనలో భారతదేశ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినవారు జేమ్స్‌ విల్సన్‌ (1860). స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్‌ని ఆర్‌.కె.షణ్ముఖం చెట్టి (1947) ప్రవేశపెట్టారు. ఆనాటి ఆదాయం రూ.171 కోట్లు కాగా, వ్యయం రూ.194 కోట్లు. గణతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను జాన్‌ మత్తాయ్‌ 1949 - 50లో ప్రవేశపెట్టారు.

* ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్‌ (10 బడ్జెట్‌లు), రెండో స్థానంలో పి.చిదంబరం (9 బడ్జెట్‌లు) ఉన్నారు.


* బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని నెహ్రూ, తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ.

 ప్రధానిగా ఉంటూ విత్తమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది

* జవహర్‌లాల్‌ నెహ్రూ - 1958 - 59

* ఇందిరాగాంధీ - 1970 - 71 

* రాజీవ్‌గాంధీ - 1987 - 88

* మన్మోహన్‌సింగ్‌ - 2009 - 10


రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినవారు ప్రణబ్‌ ముఖర్జీ. తొలిసారిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సి.డి.దేశ్‌ముఖ్‌ (1951 - 52). కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్, మొదటి మహిళ ఇందిరా గాంధీ.


కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌ను రాజ్యసభ 14 రోజుల్లోపు ఆమోదించి తిరిగి పంపించాలి. లేకపోతే రాజ్యసభ ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.


* కేంద్ర బడ్జెట్‌ను రూపొందించే ప్రారంభ సమయం సందర్భంగా నిర్వహించే వేడుక హల్వా - సెర్మనీ.


* రైల్వే బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తొలి మహిళ మమతా బెనర్జీ.

భారతదేశ బడ్జెట్‌ నిర్మాణం: దేశ బడ్జెట్‌లో భాగంగా రాబోయే ఏడాదికి అంచనా వేసిన రాబడులు, చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం మూడు ఖాతాలుగా చూపుతుంది. 1) సంఘటిత నిధి 2) ఆగంతుక నిధి 3) ప్రభుత్వ ఖాతా.


సంఘటిత నిధి: కేంద్రం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని మార్గాల నుంచి వచ్చే రాబడి మొత్తం సంఘటిత నిధిలో చేరుతుంది. ప్రభుత్వం చేసే అన్ని రకాల వ్యయాలను ఈ నిధి నుంచి సేకరించాలి. పార్లమెంటు అనుమతి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నిధి నుంచి కావాల్సినంత మొత్తాన్ని సేకరించవచ్చు.


ఆగంతుక నిధి: పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు, కొన్ని అత్యవసర సమయాల్లో ప్రభుత్వం వ్యయం చేయాల్సి వస్తుంది. భారత దేశాధ్యక్షుడి అధీనంలో ఉన్న ఆగంతుక నిధి నుంచి ప్రభుత్వం ఆ వ్యయం చేయవచ్చు. అయితే తర్వాత పార్లమెంటు ఆమోదం తప్పక పొందాల్సి ఉంటుంది. ఈ నిధి నుంచి వాడుకున్న మొత్తాన్ని కేంద్రం తిరిగి జమ చేయాలి.


ప్రభుత్వ ఖాతా: సంఘటిత నిధి ఖాతాలో భారత ప్రభుత్వ రాబడి, వ్యయాల గణాంకాలతోపాటు ఇతర లావాదేవీలు కూడా ఉంటాయి. అలాంటి లావాదేవీల్లో ఉద్యోగుల భవిష్యనిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు ముఖ్యమైనవి. 


వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. ఈ మార్గాల ద్వారా ప్రభుత్వ ఖాతాలో చేరిన మొత్తం ప్రభుత్వ రాబడి కాదు. ఏదో ఒక సమయంలో ఈ మొత్తాలను వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మినహా ఈ లావాదేవీలు జరపడానికి ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం లేదు.

బడ్జెట్‌ - రకాలు: కొన్ని అంశాల ప్రాతిపదికపై బడ్జెట్‌ను పలు రకాలుగా విభజిస్తారు.


1) రాబడి, వ్యయాల ఆధారంగా బడ్జెట్‌లు: దీనిలో రెండు రకాలు ఉన్నాయి.


ఎ) సంతులిత బడ్జెట్‌: రాబోయే సంవత్సరంలో వ్యయాలు, రాబడులకు సమానమైతే దాన్ని సంతులిత బడ్జెట్‌ అంటారు. అప్పుడు మిగులు కానీ, లోటు కానీ ఉండదు.


బి) అసంతులిత బడ్జెట్‌: రాబోయే ఏడాదిలో ప్రభుత్వ వ్యయాలు.. రాబడులకు సమానంగా లేకపోతే అది అసంతులిత బడ్జెట్‌. వ్యయం కంటే రాబడి ఎక్కువ ఉంటే మిగులు బడ్జెట్‌. వ్యయం కంటే రాబడి తక్కువ ఉంటే లోటు బడ్జెట్‌. 


2) సరళత్వాన్ని బట్టి బడ్జెట్‌లు: ఇవి రెండు రకాలు.


ఎ) స్థిర బడ్జెట్‌: బడ్జెట్‌ను అమలు చేసే కాల పరిమితిలో మార్పు లేకుండా స్థిరంగా ఉండేది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయి, అంచనా వేసిన బడ్జెట్‌ కార్యక్రమాల స్థాయి సమానంగా ఉంటుంది.


బి) చర బడ్జెట్‌: అభివృద్ధి దశల్లోని మార్పులకు అనుకూలంగా, ఇతర అత్యవసర పరిస్థితులు కల్పించే మార్పుల వల్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థాయి మారుతుంది. కాబట్టి అంచనా వేసిన బడ్జెట్‌ కార్యక్రమాల స్థాయికి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయికి తేడా వస్తుంది.


3) గతేడాది కేటాయింపుల ఆధారంగా: ఇవి రెండు రకాలు.


ఎ) సంప్రదాయ బడ్జెట్‌: గడిచిన సంవత్సరం కేటాయింపుల ఆధారంగా వర్తమాన సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులు జరిగితే దాన్ని సంప్రదాయ/ఆధారిత బడ్జెట్‌ అంటారు. 


ఉదా: భారత్‌లో అమలు చేసే బడ్జెట్‌ విధానం.


బి) శూన్య ఆధారిత బడ్జెట్‌: గతంలో అమలు చేసిన బడ్జెట్‌ కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుత అవసరాల దృష్ట్యా కేటాయింపులు చేసేది శూన్యధార బడ్జెట్‌. అంటే ప్రతి సంవత్సరం 0 నుంచి కొత్తగా ఆలోచించి కేటాయిస్తారు. 1969 పీటర్‌ఫైర్‌ (అమెరికా) దీన్ని ఒక ప్రైవేట్‌ పరిశ్రమలో ప్రవేశపెట్టారు. రాజీవ్‌ గాంధీ కాలంలో వి.పి.సింగ్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు 1986-87లో భారత్‌లో శూన్యధార బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది కొనసాగలేదు. ఏపీలో 2000-01లో యనమల రామకృష్ణుడు ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని దీర్ఘకాలిక బడ్జెట్‌ అని కూడా అంటారు.


4) సంఖ్య ఆధారంగా: ఇవి రెండు రకాలు.


ఎ) బహుళ బడ్జెట్‌: ఆర్థిక వ్యవస్థలో ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్‌లు ఉంటే అది బహుళ బడ్జెట్‌. భారత్‌లో 1924 తర్వాత రైల్వే, సాధారణ బడ్జెట్లు ఉండేవి. ఇది బహుళ బడ్జెట్‌ విధానం. 


ఉదా:

* కర్ణాటకలో 2011-12 నుంచి వ్యసాయ బడ్జెట్‌. 


* ఆంధ్రప్రదేశ్‌లో 2013-14 నుంచి వ్యవసాయ బడ్జెట్‌.


ఇవి సాధారణ బడ్జెట్‌లో కాకుండా విడిగా ప్రవేశపెట్టడం వల్ల బహుళ బడ్జెట్‌లోకి వస్తాయి.


బి) ఏక బడ్జెట్‌: ఆర్థిక వ్యవస్థలో ఒకే ఒక బడ్జెట్‌ను ప్రవేశపెడితే అది ఏక బడ్జెట్‌. 2017-18 నుంచి ఈ విధానాన్ని భారత్‌ అమలు చేస్తోంది.


5) పాలన సౌకర్యం ఆధారంగా: ఇవి రెండు రకాలు.


ఎ) కుంటి బాతు బడ్జెట్‌: ఇది ఏడాదిలో కొంత కాలానికి మాత్రమే సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలను, విధానాలను ప్రతిబింబించే బడ్జెట్‌. దీనిలో సూచించే రాబడులు, వ్యయాల వివరాలు సంవత్సరంలోని కొంత కాలానికి మాత్రమే సంబంధించి ఉంటాయి. రాజకీయ పరిపాలన అనిశ్చితి పరిస్థితుల్లో ఇలాంటి బడ్జెట్‌ను అనుసరిస్తారు.


బి) అనుబంధ బడ్జెట్‌: ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లాంటి అత్యవసర సమయంలో ప్రధాన బడ్జెట్‌ కాకుండా అనుబంధ బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టి అమలు చేయవచ్చు.


6) కాలపరిమితి బడ్జెట్‌: ఒక నిర్దిష్ట కాలానికి రూపొందించే బడ్జెట్‌. 

ఉదా:

* భారత్‌లో బడ్జెట్‌ కాలం - ఒక సంవత్సరం 


* అమెరికాలో బడ్జెట్‌ కాలం - రెండేళ్లు 


* సింగపూర్‌లో బడ్జెట్‌ కాలం - ఆరు నెలలు


7) మధ్యంతర బడ్జెట్‌: ప్రభుత్వం కొనసాగే వీలు లేనప్పుడు, ఎన్నికలు దగ్గర పడినప్పుడు స్వల్పకాలానికి రూపొందించే బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను ఆపద్ధర్మ ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. సాధారణంగా ఈ బడ్జెట్‌ కాలం 2 నెలలు నుంచి 6 నెలలు. ఈ బడ్జెట్‌లో వ్యయాలు మాత్రమే ఉంటాయి.


8) బహిరంగ బడ్జెట్‌: ప్రజలకు బహిరంగపరిచి వారి సూచనలు, సలహాలు తీసుకుని ఆ మేరకు అవసరమైన మార్పులు చేసి చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందే బడ్జెట్‌. ఈ రకమైన బడ్జెట్‌ను 2002-03లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు.


9) ఔట్‌ కమింగ్‌ బడ్జెట్‌: 2005లో నాటి కేంద్ర ఆర్థికమంత్రి ఈ రకమైన బడ్జెట్‌కు మార్గదర్శకాలను రూపొందించారు.

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయాదాయం

ఒక దేశ ఆర్థిక స్థితి, ప్రగతిని స్థూలంగా తెలుసుకోవడానికి 


జాతీయాదాయం, ఉత్పత్తి, వ్యయాలు ప్రధాన కొలమానాలు. స్థూల ఆర్థిక శాస్త్రంలో ఇవి ముఖ్యమైన భాగాలు. వీటిని శాస్త్రీయంగా గణించే విధానాలు, మదింపు పద్ధతులు, ఇందుకు పరిగణనలోకి తీసుకునే అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలు, వాటి ప్రాధాన్యం, వృద్ధి రేటును నిర్ణయించే అంశాలు, ప్రణాళికల కాలంలో నమోదైన గణాంకాలతో పాటు జాతీయాదాయంలోని ముఖ్యమైన భావనల గురించి తెలుసుకోవాలి.


1. ఉత్పత్తి మదింపు పద్ధతిలో కిందివాటిలో చేరే అంశం?

1) స్వయం వినియోగం     2) వడ్డీ      3) సొంత ఇంటి అద్దె      4) పైవన్నీ

జవాబు : పైవన్నీ


 

2. ఉత్పత్తి మదింపు పద్ధతిలో మినహాయించేవి?

ఎ) గృహిణి సేవలు     బి) పాత వస్తువుల అమ్మకం       సి) షేర్లు, బాండ్ల వల్ల వచ్చే ఆదాయం

1) ఎ మాత్రమే      2) ఎ, బి మాత్రమే      3) సి మాత్రమే     4) పైవన్నీ

జవాబు : పైవన్నీ
 

 

3. ఆదాయ మదింపు పద్ధతిని ప్రవేశపెట్టినవారు?

1) రాబిన్‌సన్‌         2)కీన్స్‌      3) జె.ఆర్‌.హిక్స్‌       4) 2, 3

జవాబు: కీన్స్‌
 


4.  ఆదాయ మదింపు పద్ధతిలో కిందివాటిలో చేర్చే భాగం?

1) వేతనం     2) డివిడెండ్‌     3) భాటకం     4) పైవన్నీ

జవాబు: పైవన్నీ



5. మాధ్యమిక వస్తువుల వినియోగాన్ని మినహాయించగా వచ్చే ఆదాయం?

1) GVA at MP     2) GDP at MP     3) GNP at MP     4) 1, 2

జవాబు : 1, 2



6.  వ్యయ మదింపు పద్ధతిలో కుటుంబాలు చేసేవ్యయం?

1) వినిమయం    2) వినియోగం    3) ఎంపిక     4) 1, 2

జవాబు : వినియోగం


7.  నికర ఎగుమతులు అంటే

1) ఎగుమతులు + దిగుమతులు    2) ఎగుమతులు - దిగుమతులు

3) ఎగుమతులు/దిగుమతులు    4) ఎగుమతులు x దిగుమతులు

జవాబు : ఎగుమతులు - దిగుమతులు


8. మూలధన ఆదాయంలో యాజమాన్య ఆదాయం కానిది?

1) డివిడెండ్‌     2)భాటకం      3) కార్పొరేట్‌ పన్ను    4) పంపిణీ కాని లాభాలు

జవాబు : భాటకం

 

9. విదేశీ వ్యాపారంలో ఉండేది?

1) ఎగుమతులు      2) దిగుమతులు       3) చెల్లింపులు     4) 1, 2

జవాబు : 1, 2

 

10. ద్వితీయ రంగం + గనుల తవ్వకాన్ని ఏమంటారు?

1) ద్వితీయ రంగం      2) పారిశ్రామిక రంగం     3) ఆర్థిక రంగం    4) పైవన్నీ

జవాబు : పారిశ్రామిక రంగం

 

11. ‘హిందూ వృద్ధి రేటు’ గురించి చెప్పినవారు?

1) అట్కిన్‌సన్‌    2) దాదాభాయ్‌ నౌరోజి     3) రాజ్‌కృష్ణ      4) డి.ఆర్‌.గాడ్గిల్‌

జవాబు : రాజ్‌కృష్ణ

 

12. భారతదేశంలో అధిక వృద్ధి రేటు నమోదైన ప్రణాళిక?

1) 10వ       2) 11వ      3) 12వ       4) 9వ

జవాబు : 11వ

 

13. ప్రస్తుతం జాతీయ ఆదాయంలో అతితక్కువ వాటా అందించే రంగం?

1)  వ్యవసాయం     2) పరిశ్రమలు      3)సేవలు     4) కార్పొరేట్‌

జవాబు : వ్యవసాయం

 

14. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అధిక వాటా అందించే రంగం?

1) ప్రభుత్వ      2) ప్రైవేట్‌     3)1, 2      4) కార్పొరేట్‌

జవాబు : ప్రైవేట్‌ 



15. ప్రస్తుత జాతీయ ఆదాయంలో ఆధార సంవత్సరం?

1) 2004-05     2) 2011-12      3) 2015-16       4) 2020-21

జవాబు : 2011-12
 

 

16. చక్రీయ ఆదాయ ప్రవాహంలో కారకాల మార్కెట్‌ అంటే?

1) వ్యాపార రంగం    2) ప్రభుత్వ రంగం      3) గృహ రంగం       4) పారిశ్రామిక రంగం

జవాబు : గృహ రంగం  

 

 

17. చక్రీయ ఆదాయ ప్రవాహంలో చివరిగా ఆదాయాన్ని పొందేవారు?

1) ప్రభుత్వ రంగం      2) ఉత్పాదక రంగం      3)గృహ రంగం      4) విదేశీ రంగం

జవాబు : ఉత్పాదక రంగం 
 

 

18. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసినవారు?

 1) ఆర్‌.సి.దేశాయ్‌      2) వి.కె.ఆర్‌.వి.రావు      3) నటరాజన్‌    4) కె.టి.షా

జవాబు : వి.కె.ఆర్‌.వి.రావు
 

 

19. ప్రభుత్వానికి ఆదాయం పన్నుల ద్వారా లభిస్తుంది. అయితే వాటిని ఏయే రంగాల ద్వారా చెల్లిస్తారు?

1) గృహ రంగాలు    2) వ్యాపార రంగాలు      3) ప్రభుత్వ రంగాలు    4) 1, 2

జవాబు : 1, 2

 

20. మూడు రంగాల నమూనాల్లో లీకేజీ ఏది?

1) పొదుపు      2) వ్యయాలు     3) పన్నులు    4) దిగుమతులు

జవాబు : వ్యయాలు   


 

21. పొదుపు పెట్టుబడిని అధిగమిస్తే ఆర్థిక వ్యవస్థ స్వరూపం?

1) ఆదాయ ప్రవాహం పెరుగుతుంది      2) ఆదాయ ప్రవాహం తగ్గుతుంది

3)ఆదాయ ప్రవాహం స్థిరం     4) ఆదాయ ప్రవాహం సమతుల్యం

జవాబు : ఆదాయ ప్రవాహం స్థిరం 

 

22. నాలుగు రంగాల నమూనాలో ఇన్‌జెక్షన్‌గా పనిచేసే వరుస క్రమం?

1) ఎగుమతులు+ప్రభుత్వ వ్యయం + పెట్టుబడి

2) పెట్టుబడి+ ప్రభుత్వ వ్యయం + ఎగుమతులు

3)ప్రభుత్వ వ్యయం + ఎగుమతులు + పెట్టుబడి

4) ఎగుమతులు+ పెట్టుబడి + ప్రభుత్వ వ్యయం

జవాబు : ఎగుమతులు+ప్రభుత్వ వ్యయం + పెట్టుబడి

 

23. జాతీయ ఆదాయంలో సరైంది?

ఎ) తలసరి ఆదాయం × జనాభా      బి) NNP at FC

 సి) NDP at FC     డి) NVA at FC

1)  బి మాత్రమే       2) ఎ, బి      3) ఎ, బి, డి       4) ఎ, బి, సి, డి

జవాబు : ఎ, బి, డి  


 

24. 2015 జాతీయాదాయాన్ని లెక్కించడానికి తీసుకునే అంశం?

 1) GDP at MP    2) GDP at FC 

3) GNP at MP     4) GNP at FC

జవాబు : GDP at MP 

 

25. ఆదాయ మదింపు పద్ధతిలో చేర్చని ఆదాయాలు?

ఎ) స్మగ్లింగ్‌ ఆదాయం      బి) జాతీయ రుణాలపై వడ్డీ

 సి) గాలి వాటా లాభాలు     డి) ప్రైవేటు బదిలీ చెల్లింపులు

1) ఎ, బి     2) బి, సి    3) ఎ, బి, సి     4) పైవన్నీ

జవాబు : పైవన్నీ

 

26. ఒక దేశ పౌరులచే ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువు?

1) జాతీయ ఉత్పత్తి     2) దేశీయ ఉత్పత్తి      3)తలసరి ఉత్పత్తి        4) స్థూల ఉత్పత్తి

జవాబు : జాతీయ ఉత్పత్తి

 

27. జీడీపీ అంతరం అంటే?

1) వనరుల ఉత్పత్తి వాస్తవ ఉత్పత్తికి సమానం      2) వాస్తవ ఉత్పత్తికి, వనరుల ఉత్పత్తికి మధ్య తేడా

3) జీడీపీ, జీఎన్‌పీ మధ్య తేడా       4) జీడీపీ = జీఎన్‌పీ

జవాబు : వాస్తవ ఉత్పత్తికి, వనరుల ఉత్పత్తికి మధ్య తేడా

 

28. గ్రీన్‌ జీడీపీ అంటే?

1) పర్యావరణ నష్టాన్ని జీడీపీ ద్వారా సర్దుబాటు చేయడం

2) జీడీపీ నష్టాన్ని పర్యావరణం ద్వారా సర్దుబాటు చేయడం

3) పర్యావరణాన్ని పెంచడం

4) పర్యావరణాన్ని తగ్గించడం

జవాబు : పర్యావరణ నష్టాన్ని జీడీపీ ద్వారా సర్దుబాటు చేయడం

 

29. కిందివాటిలో బదిలీ చెల్లింపులు?

1) జీతాలు   2) వడ్డీలు     3) పింఛన్లు     4) విదేశీ ఆదాయం

జవాబు : పింఛన్లు

 

30. నామమాత్రపు ఆదాయం వచ్చే విధానం?

1) ప్రస్తుత ఉత్పత్తి × ఆదాయ సంవత్సర ధరలు        2) ప్రస్తుత ఉత్పత్తి/ఆదాయ సంవత్సర ధరలు

3) ప్రస్తుత ఉత్పత్తి × ప్రస్తుత ధరలు       4) ప్రస్తుత ధరలు/ప్రస్తుత ఆదాయం

జవాబు : ప్రస్తుత ఉత్పత్తి × ప్రస్తుత ధరలు

 

31. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు- 

1) వాటి పాత ధరలను తీసుకోవాలి        2)వాటి ప్రస్తుత ధరలను తీసుకోవాలి

3)వాటిపై వచ్చే కమిషన్‌ తీసుకోవాలి     4) పైవన్నీ

జవాబు : వాటిపై వచ్చే కమిషన్‌ తీసుకోవాలి 

 

32.NFIA లో ఉండే కారకాలు?

1)  రాబడి      2) వ్యయం      3) నికర లాభాలు     4) 1, 2

జవాబు : 1, 2

 

33. NDP =

1) GDP - NFIA      2) GDP -  పన్నులు  

3) GNP - D     4) GDP - D

జవాబు : GDP - D

 

34. కేంద్ర గణాంక సంస్థ ఎప్పుడు ఏర్పడింది?

1) 1951     2)1954       3) 1960       4) 1970

జవాబు : 1951   

 

35. జాతీయ ఆదాయ వృద్ధి రేటు అధికంగా ఎప్పుడు నమోదైంది?

1) 1957-58      2) 1965-66       3)1966-67     4) 1988-89

జవాబు : 1988-89


36. జాతీయ ఆదాయ వృద్ధి రేటు = 

1) జాతీయ ఆదాయ వృద్ధి రేటు - జనాభా వృద్ధి రేటు

 2) జాతీయ ఆదాయ వృద్ధి రేటు x జనాభా వృద్ధి రేటు

3)జాతీయ ఆదాయ వృద్ధి రేటు/తలసరి ఆదాయ వృద్ధి రేటు

4) జాతీయాదాయం/ధరల సూచీ

జవాబు : జాతీయ ఆదాయ వృద్ధి రేటు - జనాభా వృద్ధి రేటు

 

37. ఉత్పత్తి మదింపు పద్ధతిని ‘ఉత్పత్తి సేవా పద్ధతి’ అని పేర్కొన్నవారు?

1) రాబర్ట్‌ సన్, బౌలే      2) జె.ఎం.కీన్స్‌      3) కుజ్‌నెట్స్‌     4) ఆడంస్మిత్‌

జవాబు : కుజ్‌నెట్స్‌

 

38. ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం లెక్కించేటప్పుడు వాస్తవ ఆదాయంలోకి మార్చాలి అంటే ఏంచేయాలి?

1) ఇన్‌ఫ్లేటర్‌ చేయాలి    2) డిఫ్లేటర్‌ చేయాలి      3) రెండు సార్లు లెక్కించాలి     4) వ్యయం కలపాలి 

జవాబు : డిఫ్లేటర్‌ చేయాలి 

 

39. దేశీయ కారక ఆదాయం + NFIA =

1) జాతీయ ఆదాయం     2) తలసరి ఆదాయం    3) వ్యష్టి ఆదాయం      4) వ్యయార్హ ఆదాయం

జవాబు : జాతీయ ఆదాయం

 

40. వ్యయార్హ ఆదాయంలో ఉండేది?

1) వినియోగం       2) పొదుపు       3) రాబడి      4) 1, 2

జవాబు : 1, 2


41. కిందివాటిలో సరైంది?

1) భాటకం + వేతనం + వడ్డీలు + లాభాలు + మిశ్రమ ఆదాయం = N1

 2) భాటకం + వేతనం + వడ్డీలు + మిశ్రమ ఆదాయం = N1

3)వేతనం + లాభాలు = N1

4) మిశ్రమ ఆదాయం =N1

జవాబు : భాటకం + వేతనం + వడ్డీలు + లాభాలు + మిశ్రమ ఆదాయం = N1

 

42. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఉండే రంగాలు

1) ప్రాథమిక రంగం      

2) తయారీ రంగం (రిజిస్టర్‌ అయినవి)

3)నిర్మాణ రంగం (పట్టణంలో ఉండేవి) 

4) పైవన్నీ

జవాబు : పైవన్నీ

 

43. కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం 1954లో దేశ తలసరి ఆదాయం?

1) రూ.20     2) రూ.225   3) రూ.27     4) రూ.8,710

జవాబు : రూ.225


44. ప్రస్తుతం దేశంలో 202223 సర్వే ప్రకారం తలసరి ఆదాయం

1) రూ.1,70,620     2) రూ.1,69,770       3) రూ.1,89,420      4) రూ.1,60,340

జవాబు : రూ.1,70,620

 

45. నాలుగు రంగాల నమూనాలో ఆర్థిక వృద్ధికి సమీకరణం?

1) పొదుపు = పన్నులు = దిగుమతులు

 2) పెట్టుబడి = వ్యయం = దిగుమతులు

3) పొదుపు = పెట్టుబడి = పన్నులు

4) ఎగుమతులు = దిగుమతులు = పన్నులు

జవాబు : పొదుపు = పన్నులు = దిగుమతులు


46. 1954 కేంద్ర గణాంక కార్యాలయం (CSO) తుది నివేదిక ప్రకారం సరికానిది?

1) జాతీయాదాయంలో సగభాగం వ్యవసాయం నుంచి వస్తుంది.

2) ద్వితీయ రంగం నుంచి 1/6వ వంతు జాతీయాదాయంలో భాగం

3) తృతీయ రంగంలో 1/6వ వంతు జాతీయాదాయంలో భాగం

4) NDP  లో ప్రభుత్వ రంగం వాటా 7 - 9% గా ఉంది 

జవాబు : NDP  లో ప్రభుత్వ రంగం వాటా 7 - 9% గా ఉంది 


సమాధానాలు

1-4; 2-4; 3-2; 4-4; 5-4; 6-2; 7-2; 8-2; 9-4; 10-2; 11-3; 12-2; 13-1; 14-2; 15-2; 16-3; 17-2; 18-2; 19-4; 20-2; 21-3; 22-1; 23-3; 24-1; 25-4; 26-1; 27-2; 28-1; 29-3; 30-3; 31-3; 32-4; 33-4; 34-1; 35-4; 36-1; 37-3; 38-2; 39-1; 40-4; 41-1; 42-4; 43-2; 44-1; 45-1; 46-4.

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర బడ్జెట్‌ (2023-24)

ఆఖరి వరకు అభివృద్ధి ఫలాలు!


  దేశ వార్షిక ఆర్థిక నివేదికే బడ్జెట్‌. రాబోయే ఏడాది పాటు ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల అంచనాలను అది వెల్లడిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూప, స్వభావాలను వివరిస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు, భవిష్యత్తు లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏడు ప్రాధాన్యాంశాలను కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. స్వతంత్ర భారతావని వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అవసరమైన ప్రణాళికలను రచించింది. సాధికారత, సార్వజనీనత, సుసంపన్నతలే పరమావధులుగా పటిష్ఠ పునాదులు వేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణ, ఆహార భద్రతలకు పెద్ద పీట వేస్తూ, అభివృద్ధి ఫలాలు ఆఖరి వ్యక్తికీ చేరాలనే దృఢ సంకల్పాన్ని వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలో. కేంద్రపద్దులోని ముఖ్యాంశాల నుంచి మొత్తం సారాంశం వరకు గణాంకాల సహితంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2023, ఫిబ్రవరి 1న డిజిటల్‌ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు (దేశంలో డిజిటల్‌ బడ్జెట్‌ను మొదటిసారిగా 2021, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు). వందేళ్ల స్వాతంత్య్ర భారతానికి మార్గం వేస్తూ దీర్ఘకాలిక లక్ష్యాలతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రకటించారు. దీన్ని మొదటి అమృత్‌కాల్‌ బడ్జెట్‌గా అభివర్ణించారు.


స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరుసగా అయిదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆరో కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ గుర్తింపు పొందారు. అంతకుముందు వరుసగా అయిదు, అంతకంటే ఎక్కువగా కేంద్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్, మొరార్జీ దేశాయ్‌ల వరుసలో ఆమె చేరారు. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళగానూ గుర్తింపు పొందారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన అనంతరం (2019లో సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్‌ ఇది.


అమృత్‌కాల్‌-సప్తర్షి: సాధికారత, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలను అమృత్‌కాల్‌ విజన్‌ ప్రతిబింబిస్తుంది. అమృత్‌కాల్‌ లక్ష్య సాధనకు సప్తర్షి మార్గనిర్దేశం చేస్తుంది. ఇందు కోసం సాంకేతికతతో నడిచే, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావాలి. బలమైన ప్రభుత్వ విత్తం, దృఢమైన ఆర్థిక రంగం తోడవ్వాలి. ఇది జన్‌ భాగీదారీ (ప్రజా భాగస్వామ్యం) ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇందుకు సబ్‌ కా సాథ్‌-సబ్‌ కా ప్రయాస్‌ (అందరి తోడు - అందరి ప్రయత్నం) అవస రమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విజన్‌ను సాధించడానికి ఆర్థిక ఎజెండా మూడు ప్రాధాన్యాలపై దృష్టి పెడుతోంది. 


1) యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి విస్తృత అవకాశాలు కల్పించడం. 


2) వృద్ధికి, ఉద్యోగ సృష్టికి బలమైన ప్రేరణ అందించడం. 


3) స్థూల, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం. 


భారతదేశంజీ100 నాటికి ఆ ప్రాధాన్యాలను సాధించే విధంగా కేంద్రం బడ్జెట్‌ నాలుగు పరివర్తన అవకాశాలను గుర్తించింది.


1) స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా ఆర్థిక సాధికారత: దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ ద్వారా గ్రామీణ మహిళలను 81 లక్షల స్వయం సహాయక బృందాలుగా సమీకరించారు. వీటి ద్వారా ఆర్థిక సాధికారత తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది.


2) ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌ (పీఎం వికాస్‌): కేంద్ర ఆర్థికమంత్రి సంప్రదాయ కళాకారుల కోసం విశ్వకర్మ పేరిట కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందులో మూడు అంశాలుంటాయి. 


ఎ) MSME ల ద్వారా వారి ఉత్పత్తుల నాణ్యత స్థాయి, మెరుగు అంశాల అభివృద్ధి. 


బి) ఆర్థిక సాయంతోపాటు ఆధునిక నైపుణ్య శిక్షణ, ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం, డిజిటల్‌ చెల్లింపులు, సామాజిక భద్రత కల్పించడం. 


సి) షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఓబీసీలు, మహిళలు, బలహీనవర్గాల ప్రజలు మరిన్ని ప్రయోజనాలను పొందే విధంగా చేయడం.


3) మిషన్‌ మోడ్‌లో పర్యాటకానికి ప్రోత్సాహం: ఈ రంగంలో యువతకు ఉద్యోగాలు, వ్యవస్థాపకత కోసం భారీ అవకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాలతో పర్యాటకం ప్రచారాన్ని మిషన్‌ మోడ్‌లో చేపడతారు.


4) సబ్‌ కా సాథ్‌ - సబ్‌ కా వికాస్‌: కేంద్ర బడ్జెట్‌ 2023-24 ముఖ్య ఉద్దేశం సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించడం. ‘సబ్‌ కా సాథ్‌ - సబ్‌ కా వికాస్‌’ నినాదం ద్వారా ప్రభుత్వం అన్ని అంశాల్లో వృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతుంది. 




సప్తర్షి: వారణాసి విశ్వనాథుడి సన్నిధిలో వినిపించే సప్తర్షి పదాన్ని ఆర్థిక మంత్రి తన ప్రసంగానికి ఆలంబనగా చేసుకున్నారు. దీన్ని అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ అని ఆమె ప్రస్తావించారు. ఏడు అంశాలకు సప్తర్షి మార్గంగా నామకరణం చేశారు. అవి

1) సమ్మిళిత వృద్ధి

2) చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి

3) మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు

4) సామర్థ్యాలను వెలికితీయడం

5) హరిత వృద్ధి  

6) యువశక్తి

7) ఆర్థిక రంగం బలోపేతం


1) సమ్మిళిత వృద్ధి:

* గ్రామీణ ప్రాంతాల్లో 9 కోట్ల తాగునీటి కనెక్షన్లను ఏర్పాటు చేస్తారు. 


* స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద 11.7 కోట్ల కుటుంబాలకు శౌచాలయాలు నిర్మిస్తారు.  


* పీఎం కిసాన్‌ పథకం కింద 11.4 కోట్ల రైతులకు రూ.2.2 లక్షల కోట్లు అందిస్తారు. 


* 44.6 కోట్ల మందికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద బీమా కవరేజీ కల్పిస్తారు. 


* 47.8 కోట్ల ప్రధానమంత్రి జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తారు.


* ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తారు. 


* 102 కోట్ల మంది ప్రజలకు 220 కోట్ల కొవిడ్‌ టీకాలు అందించారు. 


2) చివరి వ్యక్తికీ లబ్ధి: అన్నివర్గాల ప్రజలను కలిపి చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం చేకూర్చే విధంగా పనులు చేపడుతున్నారు. గిరిజనుల అభ్యున్నతి నుంచి మొదలుపెట్టి పురాతన శాసనాల డిజిటలైజేషన్‌ వరకు అన్నివర్గాలకు అభివృద్ధిని అందిస్తున్నారు. పురాతన శాసనాలను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు భారత్‌శ్రీ అనే వ్యవస్థను నెలకొల్పుతారు. ‘ప్రధానమంత్రి గరీభ్‌ కల్యాణ్‌ ఆవాస్‌ యోజన’ కింద ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తారు.


3) మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు: మౌలిక సదుపాయాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచే రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహాలను అందిస్తారు. దీంతో వృద్ధి రేటు పెరగడంతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి. మూలధన పెట్టుబడులను 33.4% పెంచి 10 లక్షల కోట్లకు చేర్చారు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కొనసాగిస్తారు. రైల్వే రంగానికి రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. 100 రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయనున్నారు.


4) సామర్థ్యాల వెలికితీత: విద్యాసంస్థల్లో మూడు ప్రత్యేక కృత్రిమ మేధా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల వ్యవసాయం, వైద్యం, సుస్థిర నగరాల అభివృద్ధిలో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. 


* వివాద్‌ సే విశ్వాస్‌-1 కింద కొవిడ్‌ సమయంలో ప్రభావితమైన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సరళంగా కాంట్రాక్టులు అమలుచేస్తారు. 


* వివాద్‌ సే విశ్వాస్‌-2 కింద సులభమైన, ప్రామాణిక సెటిల్‌మెంట్‌ పథకం ద్వారా కాంట్రాక్టు వివాదాలను పరిష్కరిస్తారు.


5) హరిత వృద్ధి: భారత ప్రభుత్వ బడ్జెట్‌లో హరిత వృద్ధికి పెద్దపీట వేశారు. 2070కి శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 


* గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కోసం ఈ బడ్జెట్‌లో రూ.19,700 కోట్లు కేటాయించారు. ఈ మిషన్‌ కింద 2030 నాటికి ఏడాదికి 500 మిలియన్ల మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. 


* కాలుష్యరహిత ఇంధన రంగం కోసం ఇంధన పరివర్తన శూన్య ఉద్గారాల లక్ష్యాల సాధన, ఇంధన భద్రత కోసం ఈ బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు కేటాయించారు. 


* పీఎం ప్రణామ్‌ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహకాలను అందిస్తారు. 


* తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకానికి మిష్టి పథకం ప్రారంభమైంది. చిత్తడి నేలల సమర్థ వినియోగానికి అమృత్‌ ధరోహర్‌ పథకం అమలు చేస్తారు. 


* రైతుల ద్వారా ప్రకృతి సేద్యం కోసం 10 వేల బయోఇన్‌పుట్‌ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయిస్తారు. 


* తడి, పొడి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై ‘గోబర్ధన్‌ పథకం’ కింద కొత్తగా 500 వ్యర్థం నుంచి అర్థం (ధనం) ప్లాంట్‌ల ఏర్పాటు చేస్తారు. 


6) యువశక్తికి ప్రోత్సాహం:

* ‘దేఖో అప్నా దేశ్‌’ లక్ష్యాలను సాధించేందుకు యువతలో ఆయా రంగాల్లో నైపుణ్యాలు, వ్యాపార మెలకువలను సంయుక్తంగా పెంపొందిస్తారు.


* కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్‌ తదితర అంశాలతో కూడిన కొత్త కోర్సులు ప్రవేశపెడతారు. స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి 50 ప్రాంతాలను ఎంపికచేసి ప్యాకేజీగా అభివృద్ధి చేస్తారు. ఈ అంశంలో మూడు ప్రధాన పథకాలు ఉంటాయి. అవి 


1) ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 


2) డిజిటల్‌ స్కిల్‌ ఇండియా 


3) 47 లక్షల మందికి స్టైపెండ్‌.


7) ఆర్థిక రంగం బలోపేతం:

 * కేంద్రీకృత డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుతో కంపెనీల చట్టం కింద పాలనా వ్యవహారాలను వేగవంతం చేస్తారు. 


* ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకం ద్వారా తనఖా అవసరం లేకుండా రుణాలు ఇచ్చేందుకు అదనంగా రూ.2 లక్షల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తారు. 


* మహిళల కోసం రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల రూపాయల చొప్పున ఆదా చేసుకోవడానికి ‘మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర్‌’ పేరుతో చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని ప్రారôభిస్తారు. 


* వయోవృద్ధులు పొదుపు పథకాల్లో గరిష్ఠంగా డిపాజిట్‌ చేసే మొత్తాన్ని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు.



కేంద్ర రాబడులు - వ్యయాలు రూపాయి రాక

1) ఇతర అప్పులు - 34 పై 


2) జీఎస్టీ - 17 పై 


3) ఆదాయ పన్ను - 15 పై 


4) కార్పొరేట్‌ పన్ను - 15 పై 


5) కేంద్ర ఎక్సైజ్‌ పన్ను - 7 పై 


6) పన్నేతర రాబడి - 6 పై 


7) కస్టమ్స్‌ సుంకాలు - 4 పై 


8) రుణేతర మూలధన రాబడి - 2 పై 


రూపాయి పోక 


1) వడ్డీ చెల్లింపులు - 20 పై


2) పన్నుల సుంకాల్లో రాష్ట్రాల వాటా - 18 పై 


3) ఆర్థిక సంఘం, ఇతర బదిలీలు - 9 పై 


4) కేంద్ర ప్రాయోజిత పథకాలు - 9 పై 


5) రక్షణ - 8 పై 


6) కేంద్ర పథకాలు - 17 పై


7) ఇతర వ్యయాలు - 8 పై


8) రాయితీలు - 7 పై


9) పింఛన్లు - 4 పై 


ధరలు తగ్గేవి


1) మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా లెన్స్‌లు 


2) టీవీ ప్యానెల్‌ పార్టులు 


3) లిథియం అయాన్‌ బ్యాటరీలు 


4) ఎలక్ట్రిక్‌ వాహనాలు


5) దేశీయంగా ఉత్పత్తి చేసే ఆహారం


6) వజ్రాల తయారీ వస్తువులు


ధరలు పెరిగేవి 


1) బంగారం, ప్లాటినంతో తయారు చేసే ఆభరణాలు


2) వెండి ఉత్పత్తులు


3) సిగరెట్లు, టైర్లు


4) దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ చిమ్నీలు


5) రాగి, తుక్కు


6) రబ్బరు



ప్రధాన పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు
 


ఎ) మూల పథకాలు 


1) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - రూ.60,000 కోట్లు 


2) జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం - రూ.9,636 కోట్లు 


3) మైనారిటీల అభివృద్ధి గొడుగు కార్యక్రమం - రూ.610 కోట్లు 


4) ఇతర బలహీన వర్గాల అభివృద్ధి కార్యక్రమం - రూ.2,194 కోట్లు 


5) షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి - రూ.4,295 కోట్లు 


6) షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి - రూ.9,409 కోట్లు 


బి) కోర్‌ పథకాలు

 

1) ఆయుష్మాన్‌ భారత్‌ - రూ.7,200 కోట్లు 


2) నీలి విప్లవం - రూ.2,025 కోట్లు 


3) సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి - రూ.600 కోట్లు 


4) పర్యావరణం అటవీ, వన్యప్రాణులు - రూ.759 కోట్లు 


5) హరిత విప్లవం - రూ.2,025 కోట్లు


6) జలజీవన్‌ మిషన్‌ - రూ.70,000 కోట్లు 


7) జాతీయ విద్యామిషన్‌ - రూ.38,953 కోట్లు 


8) జాతీయ ఆరోగ్యమిషన్‌ - రూ.36,785 కోట్లు 


9) జాతీయ జీవనోపాధి మిషన్‌ - రూ.14,129 కోట్లు 


10) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - రూ.79,590 కోట్లు 


11) ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన - రూ.19,000 కోట్లు 


12) ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన - రూ.10,787 కోట్లు 


13) శాస్త్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ - రూ.895 కోట్లు 


14) స్వచ్ఛ భారత్‌ మిషన్‌ - రూ.5000 కోట్లు


15) స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) - రూ.7,192 కోట్లు 


16) అమృత్‌ పథకం - రూ.16,000 కోట్లు 


17) ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ - రూ.11,600 కోట్లు 


18) రాష్ట్ర కృషి వికాస్‌ యోజన - రూ.7,150 కోట్లు 


19) నదుల అనుసంధానం - రూ.3500 కోట్లు 


సి) ప్రధాన కేంద్ర రంగ పథకాలు 


1) సంక్షేమ పథకాలకు - రూ.800 కోట్లు 


2) ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి - రూ.60,000 కోట్లు 


3) పంటల బీమా - రూ.13,625 కోట్లు 


4) ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ - రూ.5,943 కోట్లు 


5) ఖేలో ఇండియా - రూ.1,000 కోట్లు 


6) జాతీయ గిరిజన సంక్షేమ కార్యక్రమం - రూ.655 కోట్లు 


7) ఎంపీ లాడ్స్‌  - రూ.3,959 కోట్లు 


8) బయోటెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి - రూ.1,345 కోట్లు 


9) ఖాదీ గ్రామోద్యోగ్‌ వికాస్‌ యోజన - రూ.917 కోట్లు 


10) ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం - రూ.2,700 కోట్లు 


11) ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన - రూ.2,273 కోట్లు


12) జాతీయ గంగా ప్రణాళిక - రూ.4,000 కోట్లు 


13) అటల్‌ భుజల్‌ యోజన - రూ.1,000 కోట్లు 


14) జాతీయ ఆహార భద్రత చట్టం - రూ.1,37,207 కోట్లు 


15) పోస్టల్‌ ఆపరేషన్‌ - రూ.1,144 కోట్లు 


16) మిషన్‌ వాత్సల్య - రూ.1,472 కోట్లు 


17) కృషి ఉన్నతి యోజన - రూ.7,066 కోట్లు 



(బడ్జెట్‌ సమగ్ర స్వరూపం అంకెలు, రూపాయలు, కోట్లలో)
 


1) రెవెన్యూ వసూళ్లు - రూ.26,32,281 కోట్లు


పన్ను ఆదాయం - రూ.23,30,631 కోట్లు  


పన్నేతర ఆదాయం - రూ.3,01,650 కోట్లు 



2) మూలధన వసూళ్లు - రూ.18,70,816 కోట్లు 
 


రుణాలు తిరిగి వసూళ్లు - రూ.23,000 కోట్లు


ఇతర వసూళ్లు - రూ.61,000 కోట్లు 


రుణాలు, ఇతరాలు - రూ.17,86,816 కోట్లు 

3. మొత్తం వసూళ్లు (1+2) - రూ.45,03,097 కోట్లు  


4. రెవెన్యూ ఖాతా - రూ.35,02,136 కోట్లు 


5. మూలధన ఖాతా - రూ.10,00,961 కోట్లు 


6. వడ్డీ చెల్లింపులు - రూ.10,79,971 కోట్లు


7. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు - రూ.3,69,988 కోట్లు 


8. మూలధన వ్యయం (5+7) - రూ.13,70,949 కోట్లు 


9. రెవెన్యూలోటు (4-1) - రూ.8,69,855 కోట్లు (2.9%)


10. నికర రెవెన్యూ లోటు (9-7) - రూ.4,99,867 కోట్లు (1.7%)


11. ద్రవ్యలోటు (మొత్తం వ్యయం - (రెవెన్యూ వసూళ్లు + రుణాలు తిరిగి వసూళ్లు + ఇతర వసూళ్లు)


45,03,097 - (26,32,281 + 23,000 + 61,000) = రూ.17,86,816 కోట్లు (5.9%)


12. ప్రాథమిక లోటు = ద్రవ్యలోటు - వడ్డీ చెల్లింపులు 


= 17,86,816 - 1,07,997 = రూ.7,06,845 కోట్లు (2.3%) 


రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 30-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

‘సులభంగా తెచ్చుకో.. భద్రంగా దాచుకో!’

ద్రవ్యం

 


 

ఏది కొనాలన్నా డబ్బు, ఏది కావాలన్నా డబ్బు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఎవరు పుట్టించారు? నాగరిక సమాజం కనిపెట్టిన వినిమయ సాధనాల్లో ప్రధానమైంది డబ్బు. దీన్నే ఆర్థిక పరిభాషలో ద్రవ్యం అంటారు. ప్రభుత్వాలు ముద్రించే నాణేలు, నోట్లు ద్రవ్యంగా చెలామణి అవుతాయి. పూర్వం వస్తుమార్పిడితో జరిగిన లావాదేవీలు, ఆధునిక కాలంలో ద్రవ్యం ద్వారా సాగుతున్నాయి. మార్కెట్‌ మొత్తానికి ఆధారమై నడిపిస్తున్న ఆ ద్రవ్యం పుట్టుపూర్వోత్తరాలు, విధులు, రకాలు, లక్షణాలు, స్వభావాలు, సరఫరా, నియంత్రణ తీరుతెన్నులను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.     వస్తుమార్పిడి పద్ధతికి మరొక పేరు?

1) వస్తు పంపిణీ విధానం           2) వస్తు వినియోగ పద్ధతి

3) వస్తు వినిమియ విధానం       4) వస్తు ఉత్పత్తి విధానం


2.     వస్తుమార్పిడి పద్ధతిలో సరైంది?

1) మానవుడి కోరికలు పరిమితంగా ఉండటం    2) ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండటం

3) వినిమయ మాధ్యమం ఉండదు.            4) పైవన్నీ


3.     వస్తుమార్పిడి పద్ధతిలో ఉండే లోపాల్లో సరికానిది?

1) కోర్కెల సమన్వయం లేకపోవడం             2) వాయిదా చెల్లింపులకు వీలు లేకపోవడం

3) విలువ కొలిచే కొలమానం ఉండటం         4) కాల సమన్వయం లేకపోవడం


4.     ‘ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అది ద్రవ్యం’ అని నిర్వచించింది ఎవరు?    

1) సెలిగ్‌ మన్‌        2) క్రౌధర్‌    

3) వాకర్‌              4) డాల్టన్‌


5.     కిందివాటిలో మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ నిర్వచనం?

1) సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం           2) తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం ద్రవ్యం

3) విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం       4) వినిమయ సాధనంగా పనిచేసేదే ద్రవ్యం


6.     కింది ద్రవ్య పరిణామ క్రమంలో సరైంది?    

1) వస్తు ద్రవ్యం, లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం

2) కాగితపు ద్రవ్యం, లోహ ద్రవ్యం, వస్తు ద్రవ్యం

3) లోహ ద్రవ్యం, వస్తు ద్రవ్యం, కాగితపు ద్రవ్యం

4) కాగితపు ద్రవ్యం, వస్తు ద్రవ్యం, లోహ ద్రవ్యం


7.     లోహాలతో మొదటిసారిగా నాణేలు తయారుచేసినవారు?

1) రోమన్లు                2) లిడియన్లు  

3) ఫ్రెంచ్‌వారు         4) గ్రీకులు


8.     ‘పణా’ అనే వెండి నాణేలను తయారుచేసినవారు?

1) రోమన్లు          2) గ్రీకులు          3) మౌర్యులు         4) గుప్తులు


9.     కిందివాటిలో సమీప ద్రవ్యానికి సమానమైనవి?

1) హుండీలు                 2) బాండ్లు  

3) ట్రెజరీ బిల్లులు         4) పైవన్నీ


10. మన దేశంలో పూర్తి ప్రామాణికత ఉన్న వెండి నాణం ఎప్పుడు అమల్లో ఉండేది?

1) 1835 - 93              2) 1845 - 93   

3) 1855 - 93             4) 1835 - 94


11. కిందివాటిలో లోహ ద్రవ్యం ఎన్ని రకాలుగా ఉంటుంది?

1) పూర్తిప్రమాణ ద్రవ్యం             2) తక్కువ ప్రమాణ ద్రవ్యం

3) ప్రాతినిధ్య ద్రవ్యం                 4) పైవన్నీ


12. జారీ చేసిన కాగితపునోట్లు బంగారు, వెండి లోహాల్లోకి మార్చుకునే వీలు లేకపోతే అది ఏ ద్రవ్యం?

1) పరివర్తన కాగితపు ద్రవ్యం             2) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం

3) ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం           4) పైవన్నీ


13. ప్రజల వద్ద ఉండే నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్‌ డిపాజిట్లు ఏ ద్రవ్యానికి సమానం?

1) సమీప ద్రవ్యం            2) సామాన్య ద్రవ్యం

3) పరపతి ద్రవ్యం           4) బ్యాంకు ద్రవ్యం


14. వినియమ మాధ్యమం అనే విధికి ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థికవేత్త?

1) ఫిషర్‌        2) వాకర్‌          3) సెలిగ్‌మన్‌        4) డాల్టన్‌


15. కింది ద్రవ్య విధి అయిన విలువ కొలమానంలో సరైంది?

1) ఈ విధి వల్ల వస్తువుల మధ్య వినిమయం సులభమైంది.

2) దీనివల్ల వ్యాపార ఖాతాలు సులభమైనవి.

3) వస్తుసేవల సాపేక్ష ధరలు గణించేందుకు ఉపయోగపడుతుంది.            4) పైవన్నీ


16. ‘ద్రవ్యాన్ని సులభంగా తీసుకుపోవచ్చు, దాచుకోవచ్చు, నిల్వ చేయడానికి ఎక్కువ ప్రదేశం అవసరం లేదు’ అని తెలిపే ద్రవ్యవిధి?

1) వినిమయ మాధ్యమం              2) విలువ కొలమానం

3) విలువ నిధి                   4) పైవన్నీ


17. ఆచార్య కిన్లే వర్గీకరించని ద్రవ్యవిధి?

1) ప్రాథమిక                     2) గౌణ  

3) అనుషంగిక                 4) వినియోగం


18. మంచి ద్రవ్యానికి ఉండే లక్షణం?

1) ఆమోదయోగ్యత                    2) సజాతీయత  

3) మన్నిక                         4) పైవన్నీ


19. కింది గ్రేషమ్‌ సూత్రంలో సరైంది?

1) నాసిరకం ద్రవ్యం మేలైన ద్రవ్యాన్ని చెలామణి నుంచి తరిమివేస్తుంది.

2) మేలైన ద్రవ్యం నాసిరకం ద్రవ్యాన్ని చెలామణి నుంచి తరిమివేస్తుంది.

3) నాసిరకం, మేలైన ద్రవ్యాలు రెండూ చెలామణిలో ఉంటాయి.

4) నాసిరకం ద్రవ్యం మాత్రమే చెలామణిలో ఉంటుంది.


20. కిందివాటిలో సంప్రదాయ ఆర్థికవేత్తల ద్రవ్య సమీకరణం?

1) M = C + DD + TD              2) M = C + DD

3) M =C                            4) MC = DD


21. ప్రజల వద్ద కరెన్సీ, బ్యాంకు డిమాండ్‌ డిపాజిట్లు, ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు ఉండే ద్రవ్య సప్లయి?

1) M1 ద్రవ్యం         2) M2 ద్రవ్యం 

3) M3 ద్రవ్యం         4) M4 ద్రవ్యం


22. కిందివాటిలో విశాల ద్రవ్య కొలమానం

1) M1            2) M2          3) M3            4) M4


23. M1, M2 ద్రవ్యాల మధ్య తేడా?

1) బ్యాంకుల వద్ద ఉన్న కాల డిపాజిట్లు   

2) పోస్టాఫీసులో ఉన్న మొత్తం డిపాజిట్లు

3) బ్యాంకుల వద్ద ఉన్న పొదుపు డిపాజిట్లు  

4) పోస్టాఫీసుల్లోని పొదుపు డిపాజిట్లు


24. 1997లో నూతన ద్రవ్య సప్లయికి సంబంధించి సరైంది?

ఎ) పోస్టాఫీసుల్లోని డిపాజిట్లను తొలగించారు.

బి) బ్యాంకుల్లోని కాలపరిమితి డిపాజిట్లను రెండు రకాలుగా వర్గీకరించారు.

సి) వాణిజ్య బ్యాంకుల్లోని సర్టిఫికెట్‌ డిపాజిట్లను పరిగణనలోకి తీసుకున్నారు.

1) ఎ మాత్రమే                   2) బి మాత్రమే   

3) ఎ, బి మాత్రమే              4) పైవన్నీ 


25. ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ ద్రవ్య వనరులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?

1) రెండు        2) మూడు            3) నాలుగు           4) అయిదు


26. L2 ద్రవ్య వనరుల్లో సరైనవి?

1) విత్తసంస్థల కాలడిపాజిట్లు   

2) విత్త సంస్థలు జారీ చేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు

3) విత్త సంస్థల టర్మ్‌ బారోయింగ్స్‌                             4) పైవన్నీ


27. ద్రవ్య గుణకం సమీకరణం-


28. అధిక శక్తిమంతమైన ద్రవ్యానికి మరో పేరు?

1) మూలాధార ద్రవ్యం           2) ప్రాథమిక ద్రవ్యం

3) రిజర్వు ద్రవ్యం              4) పైవన్నీ


29. ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్‌ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తుసేవలు కొనడానికి చేతులు మారడాన్ని తెలియజేసేది-

1) ద్రవ్య గుణకం                 2) ద్రవ్య డిమాండ్‌  

3) ద్రవ్య ప్రసారవేగం              4) ద్రవ్య మార్పిడి


30. నోటీస్‌ మనీ కాలపరిమితి ఎన్ని రోజులు? 

1) 14         2) 15           3) 20       4) 30


31. ఒక దేశంలో వడ్డీ రేటు తగ్గడం వల్ల అధిక వడ్డీ రేటు ఉన్న దేశంలోకి పెట్టుబడులు తరలిపోవడాన్ని తెలిపే ద్రవ్యం?    

1) కాల్‌ మనీ            2) హాట్‌ మనీ  

3) టైట్‌ మనీ             4) చీప్‌ మనీ


32. కీన్స్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతంలో ద్రవ్యత్వాభిరుచి కింది ఏ అంశంపై ఆధారపడుతుంది?

ఎ) దైనందిన వ్యవహార ఉద్దేశం  

బి) ముందు జాగ్రత్త కోసం

సి) అంచనా వ్యాపారం కోసం

1) ఎ, బి           2) సి           3) బి         4) ఎ, బి, సి


33.  ఫ్రీడ్‌మన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతంలో ద్రవ్య డిమాండ్‌ను నిర్ణయించే అంశం?

1) ధరల స్థాయి              2) ఆదాయ స్థాయి 

3) ప్రస్తుత వడ్డీరేటు           4) పైవన్నీ 


34. ద్రవ్య ప్రసార వేగాన్ని నిర్ణయించే అంశం?

1) పరపతి సంస్థలు               2) నగదు వ్యవహారాలు 

3) వేతన విధానం                  4) పైవన్నీ


35. మనదేశంలో M3 ద్రవ్యసప్లయి కొలమానం దేన్ని తెలుపుతుంది?

1) M1 + పోస్టాఫీసులో మొత్తం డిపాజిట్లు

2) M1 + వాణిజ్య బ్యాంకుల్లో కాలపరిమితి డిపాజిట్లు

3) M1 + పొదుపు డిపాజిట్లు

4) ఏదీకాదు


36. సమీప ద్రవ్యం అంటే ఏ రకమైన ఆస్తులు?

1) వినిమయ మాధ్యంగా, విలువల నిధిగా ఉపయోగపడేవి. 

2) విలువల నిధిగా ఉపయోగపడుతూ, తాత్కాలిక వినిమయ మాధ్యమంగా ఉపయోగపడేవి.

3) విలువల నిధిగా ఉంటూ 100 శాతం ద్రవ్యత్వం కలిగింది.

4) విలువల నిధి అనే విధిని సంతృప్తి పరిచేవి, వినిమయ మాధ్యమంగా వెంటనే మార్పు చెందేవి.


37. ఫిషర్‌ ద్రవ్యరాశి సిద్ధాంతం సమీకరణ-

1) MV + M1V1 = PT                2) M1V1 + PT

3) MV = PT                      4) PT = MV


38. ద్రవ్య డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యరాశి సిద్ధాంతం చెప్పిన ఆర్థికవేత్తలు

1) ఫిషర్‌                     2) చికాగో ఆర్థికవేత్తలు

3) కేంబ్రిడ్జి ఆర్థికవేత్తలు       4) ఫ్రీడ్‌మన్‌ 


39. ఫిషర్‌ ప్రకారం ద్రవ్య సప్లయికి, ధరల స్థాయికి మధ్య సంబంధం-

1) విలోమ                2) అనులోమ  

3) రెండూ                  4) ఏదీకాదు 


40. బేమల్‌ ప్రకారం ద్రవ్య డిమాండ్‌ దేనిపై ఆధారపడుతుంది?

1) ఆదాయం             2) వడ్డీరేటు     

 3) 1, 2                 4) వ్యాపారం


41. కిందివారిలో కోశ విధానాన్ని ఎవరు నియంత్రిస్తారు?

1) రిజర్వ్‌ బ్యాంకు                2) స్టేట్‌ బ్యాంకు   

3) కేంద్ర ప్రభుత్వం               4) ఆర్థిక సంఘం


42. కింది కోశ విధాన పాత్రలో లేని అంశం?

1) నల్లధనం                 2) ఉద్యోగిత  

3) స్థిరత్వం                  4) బ్యాంకింగ్‌


43. కోశ విధాన సాధనాలు ఏమిటి?

1) పన్నులు                   2) వ్యయం   

3) రుణం                    4) పైవన్నీ


44. ద్రవ్యోల్బణ కాలంలో ఏ బడ్జెట్‌ను అవలంబిస్తారు?

1) లోటు బడ్జెట్‌                2) మిగులు బడ్జెట్‌  

3) సంతులిత బడ్జెట్‌          4) పైవన్నీ


45. 2023-24 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు ఎంత?

1) 2.3%         2) 2.9%           3) 5.9%        4) 6.4%

 


సమాధానాలు

13; 24; 33; 43; 52; 61; 72; 83; 94; 101; 114; 122; 132; 141; 154; 163; 174; 184; 191; 202; 211; 223; 234; 244; 252; 264; 271; 284; 293; 301; 312; 324; 334; 344; 352; 364; 371; 383; 391; 403; 413; 424; 434; 442; 452. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విత్త వ్యవస్థ - భాగాలు

 

విత్త వ్యవస్థలో నాలుగు భాగాలు ఉంటాయి. అవి:


1. విత్త సంస్థలు

2. విత్త సాధనాలు (Financial Instruments) 

3. విత్త ఆస్తులు (Financial Securities) 

4. విత్త మార్కెట్లు


విత్త సంస్థలు 


వీటిలో రెండు రకాలు ఉన్నాయి. 


ఎ) బ్యాంకేతర విత్తసంస్థలు 


(Non-Banking Financial Institutions ( NBFIs):  ఇవి కింది విధంగా ఉంటాయి.


i. అభివృద్ధి విత్త సంస్థలు (Development Financial Corporations n- DFCs) 

ii. బ్యాంకేతర విత్త కంపెనీలు  (Development Financial Corporations n- DFCs) 

iii. గృహనిర్మాణ విత్త కంపెనీలు (Non-Banking Financial Companies - NBFCs) 
 

బి) బ్యాంకింగ్‌ సంస్థలు:


i. టర్మ్‌ విత్తసంస్థలు


ఉదా: ఐడీబీఐ, ఐసీఐసీఐ, ఐఎఫ్‌సీఐ మొదలైనవి. 


ii. స్పెసిఫైడ్‌ విత్త సంస్థలు


ఉదా: ఎగ్జిమ్‌ బ్యాంక్, టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్స్‌.


iii. రంగాలవారీ విత్తసంస్థలు


ఉదా: నాబార్డ్, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌.


iv. పెట్టుబడి సంస్థలు 


ఉదా: యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌


 బీమా సంస్థలు. ఉదా: ఎల్‌ఐసీ, జీఐసీ


i. రాష్ట్ర స్థాయి సంస్థలు. 

ఉదా: రాష్ట్ర విత్త సంస్థలు


విత్త సాధనాలు 

ఒక వ్యక్తి లేదా సంస్థ విత్త సంస్థల నుంచి పొందిన రుణాన్ని వడ్డీ రూపంలో చెల్లించేందుకు విత్త సాధనాలు అవసరం. భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన లేదా కొంత కాలవ్యవధిలో వడ్డీ/ డివిడెండ్‌ రూపంలో కొంత ద్రవ్యాన్ని చెల్లించే విధంగా రాసే క్లెయిమ్‌ను విత్త సాధనం అంటారు. వీటిని విత్త సెక్యూరిటీలు అని కూడా అంటారు. 

ఉదా: కాగితం సంపద, వాటాలు, డిబెంచర్లు, బాండ్లు.


 ఒక నిర్దిష్ట కాలం తర్వాత, నిర్దిష్ట ద్రవ్యంపై చెల్లించే వడ్డీ లేదా డివిడెండ్‌ క్లెయిమ్‌ పత్రాన్ని విత్త ఆస్తి అంటారు. 

ఉదా: బ్యాంకు డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు, కంపెనీ వాటాలు, రుణ పత్రాలు మొదలైనవి.

 

విత్త ఆస్తులు 


నిధులను రుణంగా స్వీకరించడానికి, సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి, చెల్లింపులు చేయడానికి విత్త మార్కెట్‌లో నష్టభయాన్ని అదుపుచేయడానికి ఉపకరించేవే విత్త ఆస్తులు.

విత్త మార్కెట్లు 


ఇవి రెండు రకాలు: 

1 ద్రవ్య మార్కెట్‌  


2 మూలధన మార్కెట్‌

ద్రవ్య మార్కెట్‌


ద్రవ్య మార్కెట్‌ను స్థూలంగా రెండు రకాలుగా విభజించారు. అవి:


1. సంఘటిత ద్రవ్య మార్కెట్‌ (Organised money market) 


2. అసంఘటిత ద్రవ్య మార్కెట్‌  (Un-organised money market) 


సంఘటిత ద్రవ్య మార్కెట్‌


భారతీయ సంఘటిత ద్రవ్య మార్కెట్‌లో ఆర్‌బీఐ, ఎస్‌బీఐ దాని అనుబంధ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, అభివృద్ధి బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రైవేట్‌ రంగంలోని స్వదేశీ - విదేశీ బ్యాంకులు భాగంగా ఉంటాయి. 


దీన్ని వివిధ ఉపమార్కెట్ల కింద విభజించారు. అవి:


1. Call money market

2. బిల్లుల మార్కెట్‌  

3. వాణిజ్య పత్రాలు


4. డిపాజిట్‌ సర్టిఫికెట్లు


5. ద్రవ్యమార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

 

బిల్లుల మార్కెట్‌


  ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:


ఎ) ట్రెజరీ బిల్లుల మార్కెట్‌ 


బి) వాణిజ్య బిల్లుల మార్కెట్‌ 


ట్రెజరీ బిల్లుల మార్కెట్‌: భారత ప్రభుత్వం తాత్కాలిక ద్రవ్య నిధుల అవసరాల కోసం ట్రెజరీ బిల్లులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలు పొందడానికి ఉపయోగించే సాధనాలే కోశ బిల్లులు లేదా ట్రెజరీ బిల్లులు. వీటిని కేంద్ర ప్రభుత్వ స్వల్పకాలిక రుణ సాధనాలుగా పేర్కొంటారు.

ట్రెజరీ బిల్లులు 3 రకాలు:


1) 91 రోజుల ట్రెజరీ బిల్లులు  


2)182 రోజుల ట్రెజరీ బిల్లులు 


3) 364 రోజుల ట్రెజరీ బిల్లులు 


 ఒకప్పుడు కేవలం చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిష్పత్తి కాపాడేందుకు మాత్రమే వాణిజ్య బ్యాంకులు ట్రెజరీ బిల్లులను కొనేవి. ప్రస్తుతం స్వల్పకాలిక ద్రవ్య నిర్వహణకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.


ట్రెజరీ బిల్లులను పోలి ఉండే ఇతర మార్కెట్లు:


నగదు నిర్వహణ బిల్లులు(Cash management bills) : వీటి కాలవ్యవధి 91 రోజుల కంటే తక్కువ. ఇవి కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక అవసరాల కోసం ఆర్‌బీఐ విక్రయించే సెక్యూరిటీలు. వీటిని చట్టబద్ధ ద్రవ్యత్వ నిబంధన కింద బ్యాంకులు తమ వద్ద ఉంచుకుంటాయి.


వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌: వీటిని తాత్కాలిక  ట్రెజరీ బిల్లుల స్థానంలో ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అవసరాల కోసం ఆర్‌బీఐ ఇచ్చే రుణాలు/ ఓవర్‌డ్రాఫ్ట్‌ను వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌గా పేర్కొంటారు. కాలవ్యవధి 10-14 ఏళ్లు.


తేదీ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు: చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని బ్యాంకులు కొంత కాలవ్యవధికి తగ్గించాలని ఎం. నరసింహం కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 5, 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న సెక్యూరిటీలను ఈ కొత్త విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.


వాణిజ్య బిల్లుల మార్కెట్‌: వ్యాపార నిమిత్తం ఒక సంస్థ మరొక దాని పేరుపై విడుదల చేసే బిల్లును వాణిజ్య బిల్లు అంటారు. దీని కాలవ్యవధి సాధారణంగా 3 నెలలు. కొనుగోలుదారుడు చెల్లింపును వాయిదా వేసినప్పుడు ఈ విధమైన బిల్లు అమ్మకందారుడు లేదా వ్యాపారి పొందుతాడు. దీని కాలవ్యవధి ముగిసేలోగా వ్యాపారి దాన్ని మరొకరికి అమ్మి డబ్బు పొందుతాడు.


రకాలు:


i డిమాండ్‌ బిల్లులు: డిమాండ్‌ చేసినప్పుడు చెల్లించాల్సిన బిల్లులు.


ii కాలపరిమితి బిల్లులు: బిల్లులో రాసిన నిర్దిష్ట సమయం తర్వాత చెల్లించే బిల్లులు.


iii వ్యాపార బిల్లులు: వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను జతచేసిన బిల్లులు. 


i ద్రవ్య/ విత్త బిల్లులు: ఏ విధమైన వ్యాపార లావాదేవీలకు సంబంధం లేని పత్రాలను  జతచేసిన బిల్లులు. ఇవి కేవలం సర్దుబాటు(Accommodation) బిల్లులు. వీటిని క్లియర్‌ బిల్స్‌ అని కూడా అంటారు.


 దేశీయ బిల్లులు: దేశీయ వ్యాపారానికి ద్రవ్యం సమకూర్చే బిల్లులు.


i విదేశీ బిల్లులు: అంతర్జాతీయ వ్యాపారానికి డబ్బు సమకూర్చే బిల్లులు. వీటిలో ఎగుమతి, దిగుమతి బిల్లులు అని రెండు రకాలు ఉన్నాయి.


 భారతదేశం అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను ‘హుండీలు’ అంటారు. ఇవి ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో వాడుకలో ఉన్నాయి. హుండీల్లో డిమాండ్‌ బిల్లులను దర్శని అని, వ్యాపార బిల్లులను ముద్దతి అని పిలుస్తారు. హుండీల్లో ఎక్కువ భాగం ద్రవ్య, విత్త బిల్లులే.


ద్రవ్య మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ 


 ద్రవ్య మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాన్ని 1992, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు. వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టేవారికి అదనపు, స్వల్పకాలిక పెట్టుబడి అవకాశాన్ని ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 


 బ్యాంకులు, ప్రభుత్వ విత్త సంస్థలు, ప్రైవేట్‌ రంగంలోని సంస్థలు ప్రజల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ను సేకరించవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


వాణిజ్య పత్రాలు  ( Commercial Papers)

వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాణిజ్య పత్రాలను ప్రవేశ పెట్టింది. 1990, జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. మంచి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న కంపెనీలు వ్యాపార బిల్లులను ప్రామిసరీ నోట్ల రూపంలో వాణిజ్య పత్రాలుగా జారీ చేయొచ్చు. కంపెనీ మార్కెట్‌ విలువ ఆధారంగా వాటిపై డిస్కౌంట్‌ రేటు ఉంటుంది. వీటిని స్వేచ్ఛగా బదిలీ చేయొచ్చు. ఒక్కొక్క పత్రం 


రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కనీసం రూ.కోటి విలువకు జారీ చేయాలి.


 డిపాజిట్‌ సర్టిఫికెట్లు


 వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు 1989, జూన్‌లో వీటిని ప్రవేశపెట్టారు.


 వ్యక్తులు లేదా సంస్థలు బ్యాంకుల్లో ఉంచే డిపాజిట్లకు సంబంధింత బ్యాంకులు సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్లు జారీ చేశాయి. వీటిని డిస్కౌంట్‌ ప్రాతిపదికన జారీ చేస్తారు. 


 డిస్కౌంట్‌ లేదా వడ్డీ రేటు మార్కెట్‌ను అనుసరించి ఉంటుంది. వీటిని మార్కెట్‌లో విక్రయించవచ్చు.

 

 Call money market 


 వివిధ బ్యాంకుల మధ్య నిధుల బదిలీ ఈ మార్కెట్‌ లక్ష్యం. దీని ద్వారా మిగులు డబ్బు ఉన్న బ్యాంకుల నుంచి తాత్కాలికంగా నగదు కొరత ఏర్పడిన బ్యాంకులకు నిధులు సమకూరుస్తారు. 


 దీన్ని అంతర బ్యాంకుల తక్షణ ద్రవ్య మార్కెట్‌ (Inter bank call money market) లేదా తక్షణ/ అల్పవ్యవధి ద్రవ్యమార్కెట్‌ (Call/ Short notice money market) అంటారు.


 తక్షణ రుణం కాలపరిమితి ఒకరోజు. అల్పవ్యవధి రుణం కాలపరిమితి 14 రోజులు. తక్షణ ద్రవ్య మార్కెట్‌లో తాత్కాలికంగా మిగులు ద్రవ్యం ఉన్న బ్యాంకులు రుణదాతలుగా వ్యవహరిస్తాయి. అన్ని రకాల బ్యాంకులు ఈ మార్కెట్‌లో పాల్గొంటాయి. 


 

 

 


 

 


 

 

 


 

Posted Date : 16-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విదేశీ వ్యాపారం

ఎల్లలు లేని క్రయవిక్రయాలు!

 

 ప్రపంచంలో వివిధ దేశాల మధ్య వస్తుసేవల మార్పిడి తప్పనిసరి. సహజవనరులు, మానవ నైపుణ్యాల పరంగా ప్రపంచంలో ఏ దేశం కూడా స్వయంసమృద్ధిగా ఉండటం కాదు. అందుకే ఒక దేశం స్థానిక  వనరులను ఇతర దేశాలకు అందించి, ప్రతిగా తనకు కావాల్సిన వస్తుసేవలను పొందుతుంది. ఎల్లలు లేని ఈ పరస్పర వినిమయమే విదేశీ వ్యాపారంగా వృద్ధి చెందింది. స్వాతంత్య్రానంతరం నుంచి నేటివరకు జరిగిన అభివృద్ధి, సంస్కరణలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అంతర్జాతీయ వ్యాపారం ఆవశ్యకత, అందులో భారతదేశ స్థానం, ప్రధాన ఎగుమతి, దిగుమతులు, ముఖ్య వాణిజ్య భాగస్వాముల గురించి అవగాహన పెంచుకోవాలి. 

వస్తుసేవల అమ్మకం, కొనుగోలును వాణిజ్యం లేదా వ్యాపారం అంటారు. ఈ వ్యాపారం ఒక దేశంలో ఉండే పౌరుల మధ్య జరిగితే దాన్ని దేశీయ/ జాతీయ లేదా అంతర్గత వ్యాపారం అంటారు. అదే వ్యాపారం ఒక దేశ పౌరులకు, ఇతర ప్రపంచ దేశాల పౌరులకు మధ్య జరిగితే దాన్ని విదేశీ/ప్రపంచ లేదా అంతర్జాతీయ వ్యాపారం అంటారు.

 ఒక దేశంలోని ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం విదేశాల్లోని ప్రజలు, సంస్థలు  ప్రభుత్వంతో జరిపే వ్యాపారమే అంతర్జాతీయ వ్యాపారం. అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. మన దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు అమ్మితే ఎగుమతులని, ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులను మన దేశ పౌరులు కొనడాన్ని దిగుమతులని అంటారు.

నిరపేక్ష వ్యయానుకూలత సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ఆడంస్మిత్‌ ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒక దేశంలో ఉత్పత్తి చేయడానికి వీలుకాని లేదా ఉత్పత్తి చేయడానికి ఇతర దేశాల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే వస్తువులను ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అదే విధంగా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేయడానికి వీలుకాని లేదా ఉత్పత్తికి ఎక్కువ ఖర్చయ్యే వస్తువులను ఆ దేశం ఎగుమతి చేస్తుంది.


తులనాత్మక వ్యయానుకూలత సిద్ధాంతం:  డేవిడ్‌ రికార్డో ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒక దేశం ఏవైనా వస్తువుల ఉత్పత్తిలో వ్యయానుకూలత కలిగి, రెండో దేశం అవే వస్తువుల ఉత్పత్తిలో వ్యయ ప్రతికూలత కలిగి ఉంటే ఆ రెండు దేశాల మధ్య లాభదాయకమైన వ్యాపారం ఏర్పడుతుంది. ప్రపంచ దేశాల మధ్య సహజ వనరులు, మూలధన లభ్యత, శీతోష్ణస్థితి, శ్రామిక నైపుణ్యం వంటి అంశాల్లో వ్యత్యాసాల వల్ల అంతర్జాతీయ వ్యాపారం జరగవచ్చు.


   ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని హెక్సర్‌-ఒహ్లిన్‌ రూపొందించారు. ఈయన ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం ధరల ఆధారంగా తులనాత్మక వ్యయ అనుకూలతను పరిగణనలోకి తీసుకున్నారు. ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయకుండా ఒంటరిగా ఉండిపోతే దాన్ని అటార్కి అంటారు. ఇది Closed Economy లో ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం ప్రపంచశాంతికి పెట్టని కోట వంటిదని జె.ఎస్‌.మిల్‌ అభిప్రాయం.

భారతదేశానికి అంతర్జాతీయ వ్యాపారం ఆవశ్యకత: భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ వ్యాపార అభివృద్ధి, దిగుమతుల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవసరమైన మూలధన వస్తువులు, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన యాజమాన్య పద్ధతులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని అభివృద్ధి దిగుమతులు అంటారు.

ఉదా: ఉక్కు, సిమెంట్, ఎరువులు, రవాణా, దూరవాణి వంటి పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన మూలధన పరికరాలు.

నిర్వహణ దిగుమతులు: అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశాల్లో పెట్టుబడులు అధికమై ప్రజల ఉద్యోగిత, ఆదాయ పరిమాణాలు పెరుగుతాయి. కానీ వాటికి దీటుగా వినియోగ వస్తువుల సరఫరా పెరగదు. ఈ నేపథ్యంలో కొరతగా ఉన్న వినియోగ వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసి స్థిరత్వం సాధించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటానికి ఆహారధాన్యాలు, ఇతర వినియోగ వస్తువుల దిగుమతులు అవసరమవుతాయి. ఇలాంటి దిగుమతులను నిర్వహణ దిగుమతులు అంటారు.

ఎగుమతులు పెంపొందించే ఆవశ్యత: దిగుమతుల కోసం విదేశీ మారక ద్రవ్యం అవసరమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని సమీకరించడానికి ఆ దేశ వస్తుసేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ దేశాలు ముడి ఖనిజాలు, ముడిసరకులు, వ్యవసాయ ఉత్పత్తులు లాంటి వాటిని ఎగుమతి చేస్తాయి.


మూడో ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం గతంలో వలసవాద బాధిత దేశాలే. సామ్రాజ్యవాద దేశాలు విదేశీ వ్యాపారం రూపంలో మూడో ప్రపంచ దేశాలను దోపిడీ చేశాయని ప్రెబిష్, సింగర్, మిర్దాల్, నర్క్స్‌ల అభిప్రాయం. 1960వ దశకంలో జపాన్, సింగపూర్, హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా దిగుమతులను సరళీకరించి ఎగుమతులను ప్రోత్సహించడంతో మంచి ప్రగతిని చూపాయి. ఈ విజయాలతో అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు దిగుమతుల సరళీకరణ, ఎగుమతుల ప్రోత్సాహాన్ని సమర్థించాయి. మన దేశంలో 1991లో ఈ తరహా విదేశీ వ్యాపారాన్ని అనుమతించారు.


భారత ఎగుమతులు, దిగుమతులు:


ప్రణాళికల కాలంలో భారత ఎగుమతి దిగుమతులు రెండూ పెరుగుతూ వచ్చాయి. మరోవైపు వ్యాపార లోటు కూడా పెరిగింది. మొత్తం ప్రణాళికా కాలంలో రెండేళ్లు మాత్రమే (1972-73, 1976-77) వ్యాపార మిగులు కనిపించింది. 1990-91లో వర్తకపు లోటు 5.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. 1991-92లో దిగుమతులపై ఆంక్షలు విధించడంతో లోటు తగ్గినప్పటికీ పారిశ్రామిక వృద్ధి ప్రతికూలంగా మారింది. 1992-93లో దిగుమతుల సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టడంతో మళ్లీ వ్యాపార లోటు పెరిగింది. ఈ లోటు 2019-20లో 161 బిలియన్‌ డాలర్లకు, 2020-21లో 102 బిలియన్‌ డాలర్లకు, 2021-22లో 191 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2022-23లో వ్యాపార లోటు 267 బిలియన్‌ డాలర్లు ఉంది.


భారతదేశ పది ప్రధాన వస్తు దిగుమతులు


* 1960-61లో శివీలి (పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్లు) దిగుమతులు మొత్తం దిగుమతుల్లో 6.1 శాతంగా ఉండేవి. 1980-81 నాటికి 41.9 శాతానికి పెరిగాయి. 1991-92 నాటికి ఈ వాటా 25 శాతానికి తగ్గగా, ప్రస్తుతం 26.3 శాతానికి చేరాయి.


* ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల దిగుమతులు పెరిగాయి.


* రత్నాలు, ఆభరణాల దిగుమతులు పెరిగాయి.


* దేశీయంగా బొగ్గు కొరత తలెత్తడంతో బొగ్గు దిగుమతులు పెరిగాయి.


1) పెట్రోలియం, క్రూడ్, పెట్రో ఉత్పత్తులు - 26.39%


2) ఎలక్ట్రానిక్‌ వస్తువులు - 12.06%


3) బంగారం - 7.53%


4) మెషినరీ, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ - 6.51%


5) బొగ్గు, కోక్‌ - 5.17%


6) ముత్యాలు, రత్నాభరణాలు - 5.06%


7) ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్‌ కెమికల్స్‌ - 4.94%


8) రవాణా పరికరాలు - 3.40%


9) కృత్రిమ రెసిన్లు, ప్లాస్టిక్‌ పరికరాలు - 3.29%


10) వంట నూనెలు - 3.09%


భారతదేశ పది ప్రధాన వస్తు ఎగుమతులు


* 1960-61లో ఎగుమతుల్లో 21% ఉన్న జనపనార నేడు 0.01%కి తగ్గింది.


* 1960-61లో రెండో ప్రధాన ఎగుమతిగా తేయాకు 19 శాతం మేర ఉండేది. నేడు 0.3 శాతానికి పడిపోయింది.


* ఇంజినీరింగ్‌ వస్తువులు 1960-61లో 3.4 శాతం ఉంటే నేడు 26.58%కి పెరిగాయి.


1) ఇంజినీరింగ్‌ వస్తువులు - 26.58%


2) పెట్రోలియం ఉత్పత్తులు - 15.98%


3) రత్నాలు, ఆభరణాలు - 9.26%


4) ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్‌ కెమికల్స్‌ - 6.95%


5) డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ - 5.83%


6) రెడీమేడ్‌ దుస్తులు - 3.79%


7) ఎలక్ట్రానిక్‌ వస్తువులు - 3.71%


8) కాటన్‌ యార్న్‌ - 3.62%


9) ప్లాస్టిక్, లినోలియం - 2.33%


10) బియ్యం - 2.29%


* భారత ఎగుమతి, దిగుమతుల పరిశీలనతో వ్యాపార భాగస్వాములను 5 ప్రధాన గ్రూపులుగా విభజించవచ్చు.


1) వీనిదిదీ దేశాలు (యూకే, యూఎస్‌ఏ, స్విట్జర్లాండ్, జపాన్‌)


2) వీశినిది దేశాలు (యూఏఈ, ఇరాక్, సౌదీ అరేబియా)


3) తూర్పు ఐరోపా దేశాలు


4) అభివృద్ధి చెందుతున్న దేశాలు (చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, సింగపూర్, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా)


5) ఇతర దేశాలు


1960-61 నుంచి 2021-22 మధ్య విదేశీ వ్యాపారంలో వీనిదిదీ ప్రాధాన్యం తగ్గింది. భారత దిగుమతుల్లో ఈ దేశాల వాటా 78% నుంచి 29%కి పడిపోయింది. అదే సమయంలో వీశినిది దేశాల వాటా 4.6% నుంచి 20%కి పెరిగింది. తూర్పు ఐరోపా సామ్యవాద దేశాలతో మొదట వ్యాపారం విస్తరించినప్పటికీ 1990-91 తర్వాతŸ వీటి వాటా తగ్గింది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు 5.7% నుంచి 36%కి పెరిగాయి.


భారతదేశ దిగుమతుల్లో అధిక వాటా కలిగిన దేశాలు (2022-23): 1) చైనా 2) యూఏఈ 3) అమెరికా 4) సౌదీ అరేబియా 5) ఇరాక్‌


భారతదేశ ఎగుమతుల్లో అధిక వాటా కలిగిన దేశాలు (2022-23): 1) అమెరికా 2) యూఏఈ 3) నెదర్లాండ్స్‌  4) చైనా 5) బంగ్లాదేశ్‌


2022-23లో భారత దేశానికి వ్యాపార మిగులు ఉన్న దేశాలు: 1) అమెరికా 2) బంగ్లాదేశ్‌ 3) నేపాల్‌


భారతదేశానికి వ్యాపార లోటు ఉన్న దేశాలు: 1) చైనా 2) స్విట్జర్లాండ్‌ 3) ఇరాక్‌

ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటా: బ్రిటిషర్లు మన దేశానికి వచ్చేనాటికి ప్రపంచ వ్యాపారంలో భారత్‌కు 18 శాతం వాటా ఉండేది. 1950-51 నాటికి ఇది 1.78 శాతానికి పడిపోయింది. దిగుమతుల ప్రతిస్థాపన, ఇన్వాడ్‌ లుకింగ్‌ పాలసీని అనుసరించడం వల్ల 1990 నాటికి ఇది 0.59 శాతానికి తగ్గింది. 1991 నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా విదేశీ వ్యాపారంపై ఆంక్షలు తొలగించడంతో ప్రపంచంలో భారత వ్యాపార వాటా కొంచెం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా ప్రకారం 2006 నాటికి 1 శాతానికి, 2008 నాటికి 1.64 శాతానికి చేరింది.


2022లో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) గణాంకాల ప్రకారం ప్రపంచ వస్తు వ్యాపారంలో భారత్‌ ఎగుమతుల వాటా 1.8%, దిగుమతుల వాటా 2.5%. అలాగే వ్యాపార సేవల్లో ఎగుమతుల వాటా 4%, దిగుమతుల వాటా 3.5%. స్థూలంగా ప్రపంచ వస్తుసేవల ఎగుమతుల్లో మన వాటా 2.2%, దిగుమతుల వాటా 2.7%. 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 17-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - సహకార బ్యాంకులు

రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ (State Financial Corporation  - SFC)


* కేంద్ర ప్రభుత్వం 1951లో స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ) చట్టాన్ని ఆమోదించింది.


* ఈ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌ఎఫ్‌సీలను ఏర్పాటు చేస్తాయి. 


* రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థల అధీకృత మూలధనం రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. మూలధనాన్ని వాటాలుగా నిర్ణయిస్తారు. 


* ఈ సంస్థల వాటాలను రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), షెడ్యూల్‌ బ్యాంకులు, ఇతర విత్తసహాయ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు కొనుగోలు చేస్తాయి.


* రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్థల వాటాలకు హామీ ఇస్తాయి. 


* బాండ్లు, రుణపత్రాలు అమ్మడం ద్వారా కూడా ఎస్‌ఎఫ్‌సీలు తమ నిధులను పెంచుకోవచ్చు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణ అవసరాలను తీర్చడం, పెట్టుబడి సాయం అందించడం వీటి లక్ష్యాలు.


రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు (State Industrial Development  Corporations - SIDCs)


* వీటిని మొదటిసారి 1960లో ఆంధ్రప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు.


* రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నెలకొల్పాయి. 


* ఈ సంస్థ లక్ష్యాలు: పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయడం; మార్కెటింగ్‌ వసతులు, నూతన అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు మొదలైనవి.


పెట్టుబడి సంస్థలు


ఇవి 3 రకాలు. అవి:


1) యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యూటీఐ)


2) భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)


3) సాధారణ బీమా సంస్థ (జీఐసీ)


యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా


* దీన్ని 1964,  ఫిబ్రవరిలో యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్, 1963 ప్రకారం నెలకొల్పారు. 


* 1954లో షరాఫ్‌ కమిటీ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. 


* 2003, ఫిబ్రవరి 1 నుంచి దీని పేరు యూటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌గా మారింది.


* ప్రధాన కార్యాలయం ముంబయి.


* దీని లక్ష్యాలు: మధ్యతరగతి కుటుంబాల నుంచి పొదుపు సేకరించడం, పారిశ్రామికీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వారికి కల్పించడం.


* ఇది యూనిట్ల (ప్రజల) ద్వారా సేకరించిన మొత్తాన్ని పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థల్లో పెట్టుబడిగా పెడుతుంది. వాటి ద్వారా వచ్చిన లాభాలను యూనిట్‌ కొనుగోలుదారులకు పంచుతుంది.


భారత జీవిత బీమా సంస్థ(Life Insurance Corporation of India - LIC)


మన దేశంలో జీవిత బీమా వ్యాపారంలో కొన్ని ముఖ్య ఘట్టాలు:


* 1818లో బ్రిటిష్‌ వారు ఓరియంటల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని కలకత్తాలో నెలకొల్పారు.


* బాంబే మ్యూచువల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ కంపెనీ 1870లో మొదటి స్వదేశీ ఇన్సూరెన్స్‌ కంపెనీని ముంబయిలో ఏర్పాటు చేసింది.


* దేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని నియంత్రించేందుకు 1912లో భారతీయ జీవిత బీమా కంపెనీల చట్టాన్ని చేశారు. ఇది బీమా రంగంలో చేసిన మొదటి చట్టం.


* లైఫ్, నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారాల గణాంక సమాచారాన్ని ప్రభుత్వం సేకరించేందుకు వీలుగా 1928లో ఇండియన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల చట్టం రూపొందింది.


* బీమా చేసే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యంతో 1938లో బీమా చట్టం చేశారు.


* భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ని 1956, సెప్టెంబరు 1న రూ. 5 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేశారు.


* ప్రధాన కార్యాలయం ముంబయి. 


* ఎల్‌ఐసీ ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ - సిద్ధార్థ్‌ మొహంతి.


* దీని నినాదం - ‘యోగక్షేమం వహామ్యహం’ (మీ సంక్షేమం మా బాధ్యత)


* దీని యజమాని - భారత ప్రభుత్వం. దీని పరిపాలన నియంత్రణను కేంద్ర ఆర్థికశాఖ చూస్తుంది. ఇందులో ప్రభుత్వం వాటా 96.5%


సాధారణ బీమా సంస్థ (General Insurance Coroporation - GIC)


* జీఐసీని 1956 కంపెనీ చట్టం ద్వారా నెలకొల్పారు. దీన్ని 1972, నవంబరు 22న స్థాపించారు. 


* ప్రధాన కార్యాలయం ముంబయి. 


* ప్రస్తుత ఛైర్మన్‌ ఆండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ): దేవేశ్‌ శ్రీవాస్తవ.


* దీని యాజమాని: భారత ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ వాటా 85.78%.


ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ)


ఆర్‌ఎన్‌. మల్హోత్రా కమిటీ: బీమా రంగంలో పెట్టుబడులపై అధ్యయనం కోసం ప్రభుత్వం 1993లో ఒక కమిటీని నియమించింది. దీనికి రామ్‌నారాయణ్‌ మల్హోత్రా అధ్యక్షత వహించారు. 


* ఈ కమిటీ 1994లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 


* బీమా రంగంలోకి భారతదేశంలోని కార్పొరేట్‌ సంస్థలను అనుమతించాలని, అవి విదేశీ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోవచ్చని ఈ కమిటీ తెలిపింది. 


* అయితే విదేశీ సంస్థల వాటాను 26 శాతానికి పరిమితం చేయాలని నివేదికలో పేర్కొంది. 


* ప్రస్తుతం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు.


* 1999లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఐఆర్‌డీఏ) భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.


* దీని ప్రకారం 2000, ఏప్రిల్‌లో ఐఆర్‌డీఐ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.


ప్రత్యేక విత్త బ్యాంకులు


ఎగ్జిమ్‌ బ్యాంక్‌ (EXIM Bank)


* దీన్ని 1982, జనవరి 1న భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యాలయం ముంబయి. 


* ఇది ఎగుమతి, దిగుమతిదారులకు విత్తసహాయం అందిస్తుంది. 


* అంతర్జాతీయ వ్యాపారానికి విత్తసహాయం అందించే సంధానకర్తగా పనిచేస్తుంది.


జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు (National Housing Bank - NHB)


* ఇది ఆర్‌బీఐ అనుబంధ సంస్థ. దీన్ని 1988, జులై 9న ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీ. దీని యాజమాన్యం కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం.


* ప్రభుత్వం 2019లో నేషనల్‌ హౌసింగ్‌ యాక్ట్‌ 1987ను ఫైనాన్స్‌ యాక్ట్‌గా మార్చింది. 


* ఇది దేశంలోని గృహ నిర్మాణానికి విత్త సహాయం అందిస్తుంది. గృహనిర్మాణ విత్తాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, క్రమబద్ధీకరించడం, దేశంలో ఆరోగ్యకరమైన గృహనిర్మాణ విత్త వ్యవస్థను అభివృద్ధి చేయడం దీని లక్ష్యాలు.


* ఇది బాండ్లు, డిబెంచర్ల ద్వారా తనకు అవసరమైన నిధులు సమీకరిస్తుంది. అంతేకాకుండా, ఆర్‌బీఐ నుంచి 18 నెలల కాల పరిమితికి స్వల్పకాలిక రుణాలు స్వీకరిస్తుంది. 


* ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నేషనల్‌ హౌసింగ్‌ క్రెడిట్‌ ఫండ్‌ నుంచి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటుంది. ఇది విదేశీ కరెన్సీలోనూ రుణాలను గ్రహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర విత్త సంస్థల నుంచి దీర్ఘకాలిక డిపాజిట్లు పొందుతుంది.


నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌


* దీని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 2021, మార్చి 22న లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెట్టింది. 2021, మార్చి 23న లోక్‌సభ, మార్చి 25న రాజ్యసభ దీన్ని ఆమోదించాయి. 


* ఇది ఒక కార్పొరేట్‌ సంస్థ. దీని అధీకృత మూలధనం రూ.లక్ష కోట్లు.


* వాటాదార్లు: కేంద్రప్రభుత్వం, బహుళార్థక సంస్థలు, సావరిన్‌ సంపద నిధులు, పింఛన్‌ నిధులు, బీమా సంస్థలు, విత్త సంస్థలు, బ్యాంకులు, కేంద్రప్రభుత్వం అనుమతించే ఇతర సంస్థలు.


* ఇందులో కేంద్రానికి 100% వాటా ఉంటుంది. క్రమంగా దీన్ని 26 శాతానికి తగ్గిస్తారు. 


* ఇది అవస్థాపన రంగంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టులకు రుణాలు ఇస్తుంది.


* దీని లక్ష్యాలు: కొత్తగా ప్రారంభించిన అవస్థాపన ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడం, పాతవాటికి రీఫైనాన్స్‌ చేయడం; ప్రైవేట్‌ రంగం నుంచి అవస్థాపన రంగానికి పెట్టుబడులు ఆకర్షించడం.


భారతీయ అవస్థాపన విత్త సంస్థ (ఇండియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ - ఐఐఎఫ్‌సీఎల్‌) 


* దీన్ని 2006, జనవరి 6న ప్రారంభించారు. ఇది దీర్ఘకాలిక అవస్థాపన సౌకర్యాలకు విత్త సహాయం చేస్తుంది. రహదారులు, విద్యుత్, విమానాశ్రయాలు, ఓడరేవులు, పట్టణ అవస్థాపన ప్రాజెక్టులకు ఈ సంస్థ నిధులు ఇస్తుంది.


ముద్రా బ్యాంక్‌ (మైక్రో యూనిట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీఫైనాన్స్‌ ఏజెన్సీ బ్యాంక్‌) 


దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015, ఏప్రిల్‌ 8న ప్రవేశ పెట్టారు. ప్రధాన కార్యాలయం ముంబయి. 


భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI) కి ఇది అనుబంధ సంస్థ. ఇది సూక్ష్మ, చిన్న, మధ్య  తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. సూక్ష్మ, విత్త సంస్థలకు; బ్యాంకేతర విత్త సంస్థలకు తక్కువ వడ్డీకి రుణ సహాయం అందిస్తుంది.


* ఈ సంస్థ రుణ గ్రహీతలను ‘3’ రకాలుగా వర్గీకరించి రుణాలు అందిస్తుంది. అవి:


1) శిశు - వీరికి రూ.50 వేల వరకు రుణాలు ఇస్తుంది.


2) కిశోర్‌ - వీరికి రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.


3) తరుణ్‌ - వీరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.


* మొత్తం రుణాల్లో శిశుకు 40 శాతం, కిశోర్‌కు 35 శాతం, తరుణ్‌కు 25 శాతం కేటాయించారు.


* రుణగ్రహీతలకు ముద్ర కార్డ్, ఒక రూపే డెబిట్‌ కార్డు ఇస్తారు. 


* చిన్నతయారీ సంస్థలు, దుకాణదార్లు, పండ్లు - కూరగాయల విక్రేతలు, చేతి వృత్తులవారికి ఈ సంస్థ రుణాలు ఇస్తుంది.


జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ - నాబార్డ్‌): 


* దీన్ని బి. శివరామన్‌ కమిటీ సూచనల మేరకు 1982, జులై 12న నెలకొల్పారు. ఇది నాబార్డ్‌ యాక్ట్‌-1981 ద్వారా ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబయి.


* దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలకు రుణాలు అందించే విత్త సంస్థలకు పునర్విత్త (పరోక్ష) సహాయం అందించడం. 


* నాబార్డ్‌ ప్రస్తుత ఛైర్మన్‌ - వి. షాజీ కృష్ణన్‌ (2022, డిసెంబరు 7 నుంచి పదవిలో ఉన్నారు.) 


* ఇది కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలో ఉంటుంది. 
 

Posted Date : 20-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం

మిగులు పోయి.. లోటు వచ్చి!
 


ఒక దేశం ఏడాది కాలంలో ఇతర ప్రపంచ దేశాలతో జరిపే అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలను, ఎగుమతి దిగుమతుల విలువలను క్రమపద్ధతిలో రాసే పట్టికే ‘విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం’. స్వాతంత్య్రానికి పూర్వం వలస పాలనలో మిగులుతో లాభదాయకంగా ఉన్న దేశ కరెంటు ఖాతా, అనంతరం లోటుకి చేరింది. మధ్యలో ఒకట్రెండు సందర్భాల్లో మినహా నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ లోటుకు కారణాలు, అందుకు దారితీసిన ప్రభుత్వ నిర్ణయాలు, దిద్దుబాటు చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో విదేశీ వ్యాపారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి.

బ్రిటిష్‌ ఇండియాలో ఆంగ్లేయ అధికారుల జీతభత్యాల చెల్లింపు, బ్రిటిష్‌ స్టెర్లింగ్‌ రుణాలపై వడ్డీ చెల్లింపులు, తెల్లవారి పెట్టుబడులపై డివిడెండ్ల కోసం భారతదేశం అధిక  ఎగుమతులు చేసేది. దాంతో దేశ వ్యాపార శేషం అనుకూలంగా ఉండేది. అరబ్, ఆగ్నేయాసియా దేశాల మార్కెట్‌ కూడా లభించడంతో భారతదేశ ఎగుమతులు బాగా పుంజుకున్నాయి. 1945కు ముందు ఇండియా ముడిసరకులు, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తూ విదేశీ వ్యాపారంలో మిగులు పొందేది. 

1) ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవసరమైన మూలధన వస్తువులను, యంత్ర పరికరాలను, సాంకేతిక విజ్ఞానాన్ని, మెరుగైన యాజమాన్య పద్ధతులను అభివృద్ధి దిగుమతులు అంటారు. 

ఉదా: ఉక్కు, సిమెంట్, ఎరువులు, రవాణా, దూరవాణి లాంటి పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన మూలధన పరికరాల దిగుమతులను అభివృద్ధి దిగుమతులు అంటారు.

2) అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశాలు ప్రగతి ప్రక్రియలను కొనసాగించడానికి, వాటిని వేగవంతం చేయడానికి, పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి ముడిసరకులు, మాధ్యమిక ఉత్పత్తి వస్తువులు అవసరమవుతాయి. వీటిని నిర్వహణ దిగుమతులు అంటారు.

3) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు అధికమై ప్రజల ఉద్యోగిత, ఆదాయ పరిమాణాలు ఎక్కువవుతాయి.. కానీ వాటికి దీటుగా వినియోగ వస్తువుల సరఫరా పెరగదు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఉత్పన్నమవుతుంది. దానిని అదుపు చేసి, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటానికి ఆహార ధాన్యాలు, ఇతర వినియోగ వస్తువుల దిగుమతులు అవసరమవుతాయి. వీటిని ద్రవ్యోల్బణ ప్రతికూల దిగుమతులు అంటారు. అంటే స్వాతంత్య్రం తర్వాత ప్రాజెక్టులకు అవసరమయ్యే మూలధన వస్తువులను, వాటి నిర్వహణకు మధ్యంతర వస్తువులను, ద్రవ్యోల్బణం పెరగకుండా వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల భారత విదేశీ వ్యాపారంలో లోటు పెరుగుతూ వచ్చింది. ఫలితంగా భారత్‌లో మొదటి ప్రణాళిక నుంచి వర్తకపు ఖాతా(BOT)  లోటులోనే ఉంది. రెండేళ్లు (1972-73, 1976-77) మినహాయించి మిగిలిన అన్ని సంవత్సరాల్లో మన దేశానికి ఈ లోటు ఉంది.


అదృశ్య అంశాలు: భారత్‌లో అదృశ్య అంశాలు (సేవలు) మొదటి నుంచి మిగులు చూపిస్తున్నాయి. 1950 తర్వాత 40 సంవత్సరాల కాలానికి అంటే 1990-91లో తొలిసారిగా అదృశ్య అంశాల్లో రుణాత్మకత కనిపించింది (రూ.4.33 కోట్లు). ఈ మధ్యకాలంలో అదృశ్య అంశాలున్న మిగులు, దృశ్యాంశా (వస్తువులు)ల్లో లోటును కూడా భర్తీ చేయగలిగి కరెంట్‌ ఖాతాలో మిగులు కనపడింది. 2020-21లోనూ మిగులు కనిపించింది.


సంస్కరణలకు ముందు భారత బీఓపీ (Balance of Payment): రెండో ప్రపంచ యుద్ధకాలంలో మన దేశం నుంచి పెద్దమొత్తంలో ఇంగ్లండ్‌ వస్తువులు కొనుగోలు చేయడంతో విదేశీ మారక నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా మారింది. అంటే స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత ‘బీఓపీ’ మిగులులో ఉండేది. మొదటి ప్రణాళిక నుంచి లోటు ప్రారంభమైంది. అయితే అదృశ్య అంశాల్లో మాత్రం మొదటి నుంచి మిగులే కనిపిస్తుంది. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ బీఓపీ సమస్య, స్వభావం ఆధారంగా సంస్కరణల ముందు కాలాన్ని 3 భాగాలుగా విడదీశారు. 

1) మొదటి కాలం 1956-57 నుంచి 1975-76 

2) రెండో కాలం 1976-77 నుంచి 1979-80 

3) మూడో కాలం 1980-81 నుంచి 1990-91


మొదటి కాలం: ఆహార వస్తువుల కొరత ఏర్పడటంతో దిగుమతులు పెరిగాయి. దాంతో మహలనోబిస్‌ భారీ పరిశ్రమల నమూనాకు ప్రాధాన్యం ఇచ్చి మూలధన పరికరాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఎగుమతులు స్తబ్దుగా ఉండటంతో బీఓపీలో లోటు పెరిగింది.

రెండో కాలం: అయిదో పంచవర్ష ప్రణాళికలో ఎగుమతులు బాగా పెంచుకోవడంతో, రెండోసారి (1976-77) వ్యాపార శేషంలో మిగులు కనిపించింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో విదేశీ మారక ద్రవ్యాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించడాన్ని అరికట్టారు. ఆ కొన్నేళ్లు జీడీపీలో కరెంట్‌ అకౌంట్‌ 0.6 శాతం మిగులు ఉంది.. ఏడు నెలల దిగుమతులకు సరిపోయే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. 


ఈ మిగులుకు కారణాలు

* ఇంధనం/ఆయిల్‌ ఎగుమతి చేసే దేశాలకు భారతీయులు వలస వెళ్లి అక్కడ పనిచేయడంతో ప్రైవేటు రెమిటెన్సెస్‌ పెరిగాయి.

* ఎగుమతుల్లోనూ వృద్ధి కనిపించింది. 

* దేశంలో ఇంధన సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. 

* భారతీయ సంస్థలు ఆయిల్‌/ఇంధనం ఎగుమతి చేసే దేశాలకు రోడ్లు, ఎయిర్‌పోర్టులు, విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు లాంటి సేవలు అందించడం వల్ల విదేశీ మారకద్రవ్యం లభించింది.


మూడో కాలం: 6, 7 ప్రణాళికల్లో బీఓపీ సమస్య తీవ్రమైంది. 1990-91లో లోటు భారీగా పెరగడానికి కారణాలు- 

* 1990-91లో గల్ఫ్‌ సంక్షోభం బీఓపీ లోటును మరింత తీవ్రతరం చేసింది.

* అదృశ్య అంశాల్లో మిగులుకు బదులుగా లోటు కనిపించింది. 

* విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సెస్‌ తగ్గాయి. ఫలితంగా వ్యాపార లోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరిగాయి.


సంస్కరణల తర్వాత బీఓపీ: 1991లో భారతదేశ విదేశీ చెల్లింపుల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దానిని పరిష్కరించడానికి కొత్త సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడానికి దిగుమతులను సులభతరం చేశారు. ప్రత్యక్ష, పోర్టుఫోలియో పెట్టుబడులను ఆకర్షించడానికి అదృశ్య ఎగుమతులు పెంచి, నికర రాబడులను ధనాత్మకం చేశారు.

1993-94లో దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండటంతో బీఓపీ పరిస్థితి మెరుగుపడింది. విదేశీ మారక నిల్వలు పెరిగాయి. 9వ ప్రణాళిక చివరి ఏడాది, 10వ ప్రణాళిక మొదటి సంవత్సరంలో కరెంటు ఖాతాలో మిగులు కనిపించింది. 12వ ప్రణాళిక మొదటి సంవత్సరం వ్యాపార లోటు 190 బిలియన్‌ డాలర్లు. నికర అదృశ్య అంశాల మిగులు 107 బిలియన్‌ డాలర్లు. ఫలితంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు 88 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది జీడీపీలో 4.8%. అంతర్జాతీయ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గడంతో, ముఖ్యంగా ముడిచమురు ధరలు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు ఇంకా తగ్గుతూ వచ్చింది. 12వ ప్రణాళిక రెండో ఏడాది నుంచి కరెంటు ఖాతా లోటు అభిలషణీయ పరిధిలోనే ఉంది. బంగారం దిగుమతులు తగ్గడం, అనుకూల వర్తక నిబంధనలే దీనికి కారణం. 2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో వర్తక ఖాతా లోటు వరుసగా 157.5, 102.2, 189.4, 265.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇదే కాలంలో కరెంట్‌ అకౌంట్‌ (-)25, (+)24, (-)38.7, (-)67. బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంటే 2020-21లో కరెంట్‌ ఖాతా మిగులులో ఉంది. 

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో అభివృద్ధి దిగుమతులు ఏవి?

1) ఉక్కు  2) సిమెంట్‌   3) ఎరువులు   4) పైవన్నీ

 

2. కిందివాటిలో సరికానిది?

1) మాధ్యమిక వస్తువుల ఉత్పత్తికి నిర్వహణ దిగుమతులు అవసరం.

2 మధ్యంతర వస్తువులను ద్రవ్యోల్బణం పెరగకుండా దిగుమతి చేయాలి.

3) మొదటి ప్రణాళికా కాలం నుంచి వర్తకపు ఖాతా లోటు ఉంది.

4) ద్రవ్యోల్బణం నివారణకు ఆహార ధాన్యాలు ఇతర వినియోగ వస్తువులను దిగుమతి చేయాలి.


3. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏ దేశం నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసింది?

1) అమెరికా     2) ఇంగ్లండ్‌   3) జపాన్‌   4) రష్యా


4. కిందివాటిలో బిమల్‌ జలాన్‌ వివరించని విదేశీ వ్యాపార దశ?

1) 1956-57 నుంచి 1975-76    

2) 1980-81 నుంచి 1990-91 

3) 1976-77 నుంచి 1979-80

4) 1960-61 నుంచి 1980-81


5. విదేశీ మారక ద్రవ్యాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించడం ఎప్పుడు అరికట్టారు?

1) జాతీయ బ్యాంకులు ఏర్పడినప్పుడు     2) జాతీయ రాజకీయాలు మారినప్పుడు

3) జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు     4) జాతీయ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు


6. ఏ సంవత్సరంలో భారతదేశంలో విదేశీ చెల్లింపుల విషయంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది?

1) 1980    2) 1970    3) 1991   4) 1998


7. 1980 దశకం నుంచి ఏ రుణాలను ఎక్కువగా కరెంట్‌ ఖాతా లోటును భర్తీ చేయడానికి ఉపయోగించారు?

1) అంతర్గత వాణిజ్య రుణాలు  2) బహిర్గత వాణిజ్య రుణాలు

3) విదేశీ బ్యాంకు రుణాలు   4) స్వదేశీ బ్యాంకు రుణాలు


8. 2022లో అధికంగా రెమిటెన్సెస్‌ పొందిన దేశం?

1) భారత్‌   2) మెక్సికో   3) చైనా   4) పైవన్నీ


9. కిందివాటిలో విదేశీ పెట్టుబడుల్లో లేనివి?

1) ప్రత్యక్ష పెట్టుబడులు  2) పోర్టుఫోలియో పెట్టుబడులు

3) అంతర్గత పెట్టుబడులు   4) విదేశీ సంస్థాగత పెట్టుబడులు


10. ఎవరి సిఫార్సుపై 1992-93లో రూపాయికి పాక్షిక మార్పిడి కల్పించారు?

1) బిమల్‌ జలాన్‌     2) రంగరాజన్‌  

3) నరసింహన్‌   4) స్వామినాథన్‌

 

సమాధానాలు

14; 22; 32; 44; 53; 63; 72; 84; 93; 103.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 11-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విత్త వ్యవస్థ - మూలధన మార్కెట్‌

స్టాక్‌ ఎక్స్స్ఛేంజ్‌/ స్టాక్‌ మార్కెట్‌   (Stock Exchange/ Stock Market)

ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు


 ఇంగ్లండ్‌లోని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. ఇది ప్రపంచంలో మొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. దీన్ని 18వ శతాబ్దంలో నెలకొల్పారు.


 అమెరికాలోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  ( National Association of Securities Dealers Automated Quotations Stock Market  (NASDAQ). దీన్ని 1971, ఫిబ్రవరి 8న నెలకొల్పారు. 


 జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌ - టోక్యో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్, ఒకాసా సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ను కలిపి జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌గా ఏర్పాటు చేశారు. ఇది 2023, జనవరి 1 నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


భారతదేశంలో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల చరిత్ర


1939 నాటికి దేశంలో ఏడు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఉండగా, 1945 నాటికి వీటి సంఖ్య 21కి పెరిగింది. 1956 సెక్యూరిటీల కాంట్రాక్ట్‌ (రెగ్యులేషన్‌) చట్టం ప్రకారం, ప్రస్తుతం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) దేశంలో ఎనిమిది స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు గుర్తింపు ఇచ్చింది. వీటిలో శాశ్వతమైనవి అయిదు. అవి:


1) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1875)


2) అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1894)


3) కోల్‌కతా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1908)


4) మగధ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1986)


5) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1992)


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)


( ఇది భారత్‌లోనే కాకుండా ఆసియాలో ఏర్పాటైన మొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌.


( దీన్ని 1875, జులై 9న అప్పటి బొంబయిలో ‘ది నేషనల్‌ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌’ పేరుతో ఏర్పాటు చేశారు. స్థాపకుడు ప్రేమ్‌చంద్‌ రాయ్‌చంద్‌. 


( తర్వాతి కాలంలో ఇదే బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. ఇది దేశంలో శాశ్వత ప్రాతిపదికన గుర్తించిన తొలి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 


( ఇది ప్రపంచ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉంది.


( తర్వాత అహ్మదాబాద్, చెన్నై, దిల్లీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు, లూథియానా, కాన్పూర్‌ నగరాల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లను స్థాపించారు.


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ)   దీన్ని 1992 నవంబరులో నెలకొల్పారు.


 1991లో మనోహర్‌ జె.ఫెర్మానీ కమిటీ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశారు.


 ఎన్‌ఎస్‌ఈ 1994, జూన్‌ 30 నుంచి విధులు ప్రారంభించింది.  దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.


 ఈకిట్వీ మార్కెట్‌ విభాగం 1994, నవంబరు 3 నుంచి లావాదేవీలు ప్రారంభించింది.  స్టాక్‌ మార్కెట్‌ సూచికలు


ప్రపంచంలో ప్రఖ్యాత స్టాక్‌ మార్కెట్‌ సూచికలు: డోజోన్స్‌ (న్యూయార్క్‌); నిక్కీ (టోక్యో); హంగ్‌సెంగ్‌ (హాంగ్‌కాంగ్‌); డోలెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ ఫిఫ్టీ (ముంబయి)


మన దేశంలో ప్రధాన స్టాక్‌ మార్కెట్‌లు   అనుసరించే సూచికలు: 


సెన్సెక్స్‌: దీన్నే సెన్సిటివ్‌ ఇండెక్స్‌ అంటారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి చెందింది. ఇందులో ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 30. ఆధార సంవత్సరం 1978-79.


నేషనల్‌ ఇండెక్స్‌: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి చెందిన మరొక సూచిక. దీని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 100. ఆధార సంవత్సరం 1983-84.


బీఎస్‌ఈ 200: ఈ సూచికలోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 200. ఆధార సంవత్సరం 1989-90. ఇందులో 21 ప్రభుత్వరంగ సంస్థల వాటాలు నమోదై ఉన్నాయి.


డాలెక్స్‌: బీఎస్‌ఈ 200 డాలర్‌ విలువను డాలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 1989-90.


బాంకెక్స్‌: ఇది 2003, జూన్‌ నుంచి అమల్లో ఉంది. ఇందులో 10 బ్యాంకుల వాటాలు ఉన్నాయి. అవి:


1) ఐసీఐసీఐ బ్యాంక్‌


2) ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌


3) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌


4) కెనరా బ్యాంక్‌


5) ఫెడరల్‌ బ్యాంక్‌ 


6) కొçక్‌ మహీంద్రా బ్యాంక్‌


7) యాక్సిస్‌ బ్యాంక్‌


8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)


9) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా


10) ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌  


నిఫ్టీ ఫిఫ్టీ: ఈ సూచికను ఎన్‌ఎస్‌ఈ ఉపయోగిస్తోంది. దీనిలో 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలు ఉన్నాయి.


కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ 


 మార్కెట్‌లో వస్తువుల ధరలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు. వాటిలో హెచ్చుతగ్గులుంటాయి. అమ్మకందార్లు/ కొనుగోలుదార్లు భవిష్యత్తులో పెరిగే ధరలను ముందుగానే అంచనా వేస్తారు. దీనికి అనుగుణంగా వారు సంబంధిత వస్తువుకు రాబోయే కాలానికి ఒక నిర్ణీత పరిమాణం, తేదీ, ధర వద్ద కొనడం లేదా అమ్మడంపై ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలాంటి ఒప్పందాలను కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్స్‌ అంటారు.


 వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడిచమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు మొదలైన వస్తువులపై భవిష్యత్తు గురించిన వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్‌కు చెందిన ఎక్స్ఛేంజ్‌లను కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు అంటారు. 

 భారత్‌లో పనిచేస్తున్న కమోడిటీ ఎక్సేంజ్‌లు:


1) నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎంసీఈ),  అహ్మదాబాద్‌


2) ఎంసీఎక్స్, ముంబయి


3) నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీడీఈఎక్స్‌)


4) ఏసీఈ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ముంబయి


క్రిసిల్‌    ( Credit Rating Information Services of India Limited - CRISIL )


ఇది భారతదేశ మొదటి రేటింగ్‌ ఏజెన్సీ. 1987లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.


 ఇది మూడు అంశాలను మూల్యాంకనం చేసి వ్యాపార   సంస్థలకు రేటింగ్‌ ఇస్తుంది.


అవి:

1) సంస్థల వ్యాపార నష్టభయం.


2) నిర్వహణ నష్టభయం


3) ఆర్థిక (విత్త) నష్టభయం


 క్రిసిల్‌కి సంబంధించి అనేక సూచికలు ఉన్నాయి. ఇది నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కలిసి క్రిసిల్‌ 500 సూచికను అభివృద్ధి చేసింది. 2015లో దీని పేరును S&P CNX 500 గా మార్చారు.


రచయిత

బండారి ధనుంజయ  విషయ నిపుణులు 

Posted Date : 21-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ద్రవ్య  వ్యవస్థ - కరెన్సీ

* కరెన్సీ అంటే ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నాణేలు, కాగితం నోట్లు. వీటిని కేంద్ర బ్యాంకు (ఆర్‌బీఐ) ముద్రిస్తుంది.  కరెన్సీ నోట్లు, బ్యాంకు డిపాజిట్లు ద్రవ్యంలో భాగాలే.


ద్రవ్యత్వం: ద్రవ్యానికి ద్రవ్యత్వం ఉంటుంది. దీని అర్థం కొనుగోలు చేసే శక్తి (Ready purchasing power).-ఒక వస్తువు విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాలంలో ద్రవ్యంగా మార్చగల (సత్వరం కొనుగోలు చేయగలిగే శక్తి) గుణాన్ని ద్రవ్యత్వంగా పేర్కొంటారు. అందుకే ద్రవ్యాన్ని ‘పరిపూర్ణ ద్రవ్యత్వం ఉన్న ఆస్తి’ అంటారు.


ద్రవ్యం


Money (ద్రవ్యం) అనే ఆంగ్ల పదం ‘మానెటా’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. రోమన్ల కాలం నుంచే ఈ పదాన్ని వాడారు. ఆ కాలంలో రోమన్‌ దేవత మానెటా ఆలయంలో నాణేలు ముద్రించారు.


పరిణామక్రమం


ద్రవ్య పరిణామక్రమంలో కింది దశలను పేర్కొంటారు.


వస్తురూప ద్రవ్యం: చర్మంతో చేసిన వస్తువులు, జంతువుల చర్మాలు, ఏనుగు దంతాలు, గోధుమ, వరి, పశువులు.


లోహద్రవ్యం: బంగారం, వెండి, రాగి, నికెల్‌ నాణేలు.


కాగితం ద్రవ్యం: కరెన్సీ నోట్లు.


పరపతి ద్రవ్యం: బ్యాంకు డిపాజిట్లు, చెక్కులు.


సమీప ద్రవ్యం: ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు.


భారతదేశ కరెన్సీ చరిత్ర


క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికే మన దేశంలో నాణేల వాడకం అమల్లో ఉంది. మొగలుల కాలంలో వీటి వినియోగం విస్తృతమైంది. 


*  నాణేలను మొదట వ్యాపార సంఘాలు వాడాయి. క్రమంగా ప్రభుత్వాలు నాణేలను ముద్రించాయి.


*  ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఆధునిక రూపాయికి మాతృక రూపియా. దీన్ని మొగల్‌ పాలకుడు షేర్షా సూరి (1486-1545) అమల్లోకి తెచ్చాడు. 


* మన దేశంలోనే కాకుండా మొగల్‌ సామ్రాజ్య ప్రాబల్యం ఉన్న ఇండోనేసియా, మాల్దీవులు, మారిషస్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలో కూడా రూపియా ప్రాబల్యం పొందింది.


* భారతదేశ ద్రవ్య మూలాధార యూనిట్‌ రూపాయి. ఇది కాగితాలు, నాణేల రూపంలో ఉంటుంది. రూపాయి నోటు సాంకేతికంగా కరెన్సీ కాదు. దాన్ని నాణెంగానే పరిగణిస్తారు.


*  1957కు ముందు రూపాయి - అణాలు - పైసల కరెన్సీ వ్యవస్థ అమల్లో ఉండేది. 1957, ఏప్రిల్‌ 1 నుంచి దశాంశ వ్యవస్థను(Decimal System) ప్రవేశపెట్టారు.


నాణేల ముద్రణ


క్రీ.పూ. 7 నుంచి 1వ శతాబ్దం మధ్యకాలం వరకు వెండి నాణేలపై ఒకవైపు చిత్రాలను ముద్రించారు. వాటిని ‘పంచ్‌ మార్క్‌డ్‌’ నాణేలు అనేవారు.


* అప్పటి నుంచి వివిధ రాజవంశాలు భారతీయ చరిత్రను, సాంఘిక - సాంస్కృతిక పరిస్థితులను ప్రతిబింబించే వివిధ రకాల బొమ్మలతో అనేక రకాల నాణేలను ముద్రించాయి. వీటి తయారీకి బంగారం, వెండి, రాగి లోహాలను ఉపయోగించారు.


*  మొగల్‌ చక్రవర్తి షేర్షా దేశవ్యాప్తంగా ఒకే ద్రవ్యం చలామణి అయ్యేలా రూపియా పేరుతో ఒక వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. దాని బరువు 178 గ్రా. మొహర్‌ అనే బంగారు నాణేన్ని, డామ్‌ అనే రాగి నాణేన్ని కూడా ఆ కాలంలోనే చలామణిలోకి తెచ్చారు.


*  ప్రస్తుతం మన దేశంలో 1, 2, 5, 10 రూపాయిల విలువైన నాణేలు చలామణిలో ఉన్నాయి.


మనదేశంలోని నాణేల ముద్రణా కేంద్రాలు:


*  ముంబయి (మహారాష్ట్ర)    *  కోల్‌కతా (పశ్చిమ్‌ బంగా)


*  హైదరాబాద్‌ (తెలంగాణ)    *  నోయిడా (ఉత్తర్‌ ప్రదేశ్‌)


కాగితం కరెన్సీ


భారతదేశంలో కాగితం కరెన్సీ జారీ 18వ శతాబ్దంలో ప్రారంభమైంది.


*  మొదటిసారి కరెన్సీ నోట్లు జారీ చేసిన బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ (1770 - 1832), బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ అండ్‌ బిహార్‌ (1773 - 75).


*  ఇవేకాకుండా, బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ (1806), బ్యాంక్‌ ఆఫ్‌  బొంబాయి (1840), బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1843) ప్రెసిడెన్సీ బ్యాంకులు కూడా కాగితం కరెన్సీని జారీ చేశాయి.


* 1861 కాగితం కరెన్సీ చట్టం భారత ప్రభుత్వానికి కాగితం కరెన్సీని జారీ చేసే అధికారాన్ని కల్పించింది. అప్పటినుంచి 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లు జారీ చేసింది. వీటి పంపిణీకి ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏజెంట్లుగా పని చేశాయి.


*  1935, ఏప్రిల్‌ 1న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏర్పడింది. ఇది 1938 నుంచి కరెన్సీ నోట్లు జారీ చేస్తోంది.


*  రూపాయి నోటును భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. దీనిపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది.


*  ప్రస్తుతం కేంద్ర బ్యాంకు 10, 20, 50, 100, 200, 500 రూపాయిల విలువైన కాగితం కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. వీటిపై ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకం ఉంటుంది.


*  ముద్రణా ఖర్చు పెరగడంతో ప్రభుత్వం 1994 నుంచి రూపాయి నోటు ముద్రణను నిలిపివేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో రూపాయి నోటును ముద్రించింది.


*  కరెన్సీ నోటుపై దాని విలువను 17 భారతీయ భాషల్లో ముద్రిస్తారు. నోటు వెనుక ఒక పక్క ఉండే అక్షరక్రమంలో 15 భారతీయ భాషలు ఉంటే, రెండో పక్క (ముఖం వైపు) ఆంగ్లం, హిందీ భాషలు ఉంటాయి.


*  ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ: 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 రూపాయలు.


దేశంలోని కరెన్సీ నోట్ల ముద్రణా కేంద్రాలు:


*  మహారాష్ట్రలోని నాసిక్‌ (1928). ఇందులో 10, 100, 200, 2000 రూపాయల విలువైన నోట్లను ముద్రిస్తారు.


*  మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ (1974). ఇక్కడ 20, 50, 100, 500, 2000 రూపాయల విలువగల నోట్లను ముద్రిస్తారు.


*  1995లో కర్ణాటకలోని మైసూరు, పశ్చిమ్‌ బంగాలోని సాల్బోనీలో కరెన్సీ ముద్రణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని ఆధునిక కరెన్సీ ముద్రణా కేంద్రాలుగా పేర్కొంటారు. వీటిలో 2016లో 500, 2000 రూపాయల విలువైన కరెన్సీ నోట్లు ముద్రించారు. 2023, మే 19న ఆర్‌బీఐ రూ.2000 నోట్లను రద్దు చేసింది.


ప్రముఖుల అభిప్రాయాలు


‘‘ఒక చర్య తర్వాత మరొక చర్యను కొనసాగించి, చలామణి ద్వారా ద్రవ్యాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించడమే ద్రవ్య సారాంశం.’’ 


- జి.డి.హెచ్‌.కోల్‌


‘‘వస్తు చెల్లింపులు లేదా ఇతర వ్యాపార వ్యవహారాల పరిష్కారానికి అధికంగా జనామోదం పొందిందే ద్రవ్యం. ప్రజల అభిప్రాయంతో లోహ ద్రవ్యం మాత్రమే సాధారణ ఆమోదాన్ని పొందుతుంది.’’ 


- డి.హెచ్‌. రాబర్ట్‌సన్‌


‘‘అందరికీ ఆమోదయోగ్యమైన వినిమయ మాధ్యమంగా, కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడే దేన్నైనా ద్రవ్యం అంటారు.’’ 


- జి.ఎఫ్‌.క్రౌథర్‌


‘‘ Money is What Money Does - అంటే ద్రవ్య విధులను నిర్వహించే విషయాలన్నింటినీ ద్రవ్యంలో చేర్చొచ్చు. ద్రవ్యం అంటే కేవలం లోహంతో చేసిన నాణేలు, కరెన్సీ నోట్లు మాత్రమే కాదు, ఇందులో చెక్కులు, హుండీలు, మారకపు బిల్లులు మొదలైనవి ఉంటాయి. ఎందుకంటే ద్రవ్యం చేసే పనులను ఇవి కూడా చేస్తాయి.’’ - ఫ్రాన్సిస్‌ వాల్కర్‌


 

Posted Date : 24-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు (అంతర్జాతీయ ద్రవ్యనిధి-ఐఎంఎఫ్‌)

సంతులిత వృద్ధికి ద్రవ్య సహకారం! 


ఒకటి కంటే ఎక్కువ దేశాలు కలిసి స్థాపించిన ఆర్థిక సంస్థలే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు.  సభ్య దేశాలే అందులో వాటాదారులవుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మారకపు విధానం సక్రమంగా, సమతూకంగా పనిచేసేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం అభివృద్ధికి ఇవి దోహదపడతాయి. సంక్షోభాల కారణంగా చితికిపోయిన దేశాల పునర్నిర్మాణం, అల్ప ఆదాయ, వెనుకబడిన దేశాలకు ఆర్థిక చేయూత అందించడమే వీటి ప్రధాన లక్ష్యం. ఇలాంటి సంస్థల ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం వాటి పనివిధానం, ప్రాధాన్యం వరకు పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. అంతర్జాతీయ ద్రవ్య సహకారం, రుణ వితరణలో కీలకమైన ఐఎంఎఫ్‌ నిర్మాణం, అందులోని కోటాలు, రుణ సహాయం అందించేందుకు అనుసరిస్తున్న విధానాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

అంతర్జాతీయంగా 1870 దశకం నాటికి స్వర్ణ ప్రమాణ స్థిర మారకపు రేట్లు స్థిరపడ్డాయి. ఈ ప్రమాణమే సుమారు 50 ఏళ్ల పాటు అంతర్జాతీయ వ్యాపారాన్ని వృద్ధి చేసింది. 1920 దశకంలో ఈ వ్యవస్థ కుప్పకూలడంతో అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో ఖాళీ ఏర్పడింది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ప్రపంచ దేశాలు దేశీయ నిరుద్యోగిత సమస్యను పరిష్కరించడానికి పోటీ పడి తమ కరెన్సీలను మూల్యహీనీకరణ చేశాయి. దీనినే అర్థశాస్త్రంలో ‘బెగ్గర్‌ మై నైబర్‌’ అంటారు. అదే సమయంలో ప్రతి దేశం దిగుమతి సుంకాలు విధించేది. ఫలితంగా అంతర్జాతీయ వ్యాపారం క్షీణించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా వైట్‌ ప్రణాళికను, బ్రిటన్‌ కీన్స్‌ ప్రణాళికను ప్రతిపాదించాయి. వీటి ఆధారంగా 1944లో బ్రిటన్‌ వుడ్స్‌లో జరిగిన ప్రపంచ దేశాల సమావేశంలో ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఏర్పాటుకు నిర్ణయించారు. వీటినే ‘బ్రిటన్‌ వుడ్స్‌ కవలలు’ అంటారు.


ప్రపంచ యుద్ధాల వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సహాయాన్ని పెంపొందించేందుకు ఐఎంఎఫ్‌ కృషి చేస్తాయి. అలాగే అంతర్జాతీయ వ్యాపారంపై ఉండే ఆంక్షలను తొలగించి వ్యాపార విస్తరణకు వీలుగా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (ఐటీఓ)ను కూడా స్థాపించాలని నిర్ణయించారు. అయితే అమెరికన్‌ కాంగ్రెస్‌ ఐటీఓ స్థాపనను ఆమోదించకపోవడంతో ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ మాత్రమే ఏర్పడ్డాయి. ఐఎంఎఫ్‌ ప్రపంచ దేశాలకు స్వల్పకాలిక రుణాలను ఇస్తే, ఐబీఆర్‌డీ దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది.


అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌): ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న స్వతంత్ర సంస్థ. వాషింగ్టన్‌ ప్రధాన కార్యాలయంగా 1945, డిసెంబరు 27న ప్రారంభమైంది. 1947 నుంచి ఇది పనిచేస్తోంది. ఇందులో 30 ప్రారంభ సభ్య దేశాలుండగా, 2020 నాటికి అండోర్రా దేశంతో కలిపి సభ్యదేశాల సంఖ్య 190కు చేరింది. ఐఎంఎఫ్‌ ఆర్థిక సంవత్సరం మే 1 నుంచి ఏప్రిల్‌ 30. ప్రస్తుత ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  బల్గేరియాకు చెందిన క్రిస్టాలినా జార్జివా (2019 నుంచి అయిదేళ్ల వరకు). ఈ సంస్థ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపినాథ్‌ (2018 నుంచి).


ఐఎంఎఫ్‌ లక్ష్యాలు: 

 * అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని పెంపొందించడం. 


* బీఓపీలో స్వల్పకాల అసమతౌల్యాన్ని సరిదిద్దేందుకు సహకారం అందించడం. 


* వినిమయ రేటు స్థిరత్వాన్ని సాధించేందుకు సహకరించడం.


* అంతర్జాతీయ సంతులిత వ్యాపార వృద్ధికి సహకరించడం.


ఐఎంఎఫ్‌ పాలనా నిర్మాణం (బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌-బీఓజీ): ఐఎంఎఫ్‌లో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ బీఓజీ. దీనిలో ప్రతి సభ్య దేశానికి ఒక గవర్నరు, మరొక ప్రత్యామ్నాయ గవర్నరు ఉంటారు. సాధారణంగా ఆర్థిక మంత్రి/కేంద్ర బ్యాంకు గవర్నరు సభ్య దేశ గవర్నరుగా వ్యవహరించాలి. సభ్య దేశాల కోటాను పెంచడం, ఎస్‌డీఆర్‌లను కేటాయించడం, కొత్త దేశాలను అనుమతించడం, కార్యనిర్వాహక డైరెక్టర్లను ఎన్నుకోవడం లాంటి అధికారాలు బీఓజీకి ఉంటాయి. బీఓజీకి రెండు కమిటీలు సలహాలిస్తాయి. 

1) ఇంటర్నేషనల్‌ మానిటరీ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ 

2) డెవలప్‌మెంట్‌ కమిటీ.


ఎగ్జిక్యూటివ్‌ బోర్డు: 24 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఉంటుంది. బీఓజీ అధికారాలను ఇది అమలుచేస్తుంది. అయిదేళ్ల కాలానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఛైర్మన్‌గా బోర్డు ఎన్నుకుంటుంది.


ఐఎంఎఫ్‌ విధులు:  

1) పర్యవేక్షణ విధులు 

2) రుణాలకు సంబంధించిన విధులు 

3) సాంకేతిక సహాయ విధులు


సభ్య దేశాల కోటా: సభ్య దేశాలిచ్చే కోటా ఐఎంఎఫ్‌కి విత్త వనరుగా ఉపయోపడుతుంది. ఇది ఎస్డీఆర్‌ల రూపంలో ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ సాపేక్ష ప్రాధాన్యం ఆధారంగా కోటా ఉంటుంది. కోటాలో 25% విదేశీ కరెన్సీ రూపం (డాలర్లు, యెన్, యూరో లాంటివి)లో చెల్లించాలి. దీనిని రిజర్వ్‌ ట్రాంచ్‌ (ళి’(’౯్ర’ గి౯్చ-‘్త’్శ అంటారు. ప్రతి అయిదేళ్లకు దీనిని సమీక్షిస్తారు. కోటా ఆధారంగానే ఓటింగ్, రుణం తీసుకునే శక్తులు ఆధారపడి ఉంటాయి. ఒక దేశ జీడీపీ, విదేశీ వ్యాపారస్థాయి, అంతర్జాతీయ రిజర్వ్‌ల ఆధారంగా కోటాను నిర్ణయిస్తారు. ఈ విషయంలో జీడీపీకి 50 శాతం, విదేశీ వ్యాపారానికి 30 శాతం, ఆర్థిక చరత్వం 15 శాతం, అంతర్జాతీయ రిజర్వ్‌లకు 5 శాతం భాజితాన్ని ఇస్తారు. 1971 నుంచి కోటాలను ఎస్డీఆర్‌ఎస్‌లో నిర్ణయిస్తున్నారు. 2015 నుంచి ఎస్డీఆర్‌ నిర్ణయంలో అమెరికా డాలర్, జపాన్‌ యెన్, బ్రిటన్‌ పౌండ్‌తో పాటు చైనా కరెన్సీ రెన్‌మిన్‌బిని కూడా తీసుకున్నారు.


ఐఎంఎఫ్‌ విత్త సహాయం రాయితీ రుణాలు, రాయితీ లేని రుణాలుగా రెండు రకాలుగా ఉంటుంది.


రాయితీ రుణాలు: అల్ప ఆదాయం ఉండే సభ్య దేశాలకు రాయితీ రుణాలను సున్నా వడ్డీ రేటుకు ‘పావర్టీ రిడక్షన్‌ గ్రోత్‌ ట్రస్ట్‌ (పీఆర్‌జీటీ)’ కింద అందిస్తారు. అవి:


1) స్టాండ్‌ బై క్రెడిట్‌ ఫెసిలిటీ (ఎస్‌సీఎఫ్‌): స్వల్పకాల బీఓపీ సంక్షోభాన్ని నివారించేందుకు అల్ప ఆదాయ దేశాలకు రుణాలు అందిస్తుంది.


2) ఎక్స్‌టెండెడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీ (ఈసీఎఫ్‌): అల్ప ఆదాయ దేశాలకు బీఓపీ సమస్యల నివారణకు మధ్యకాల, దీర్ఘకాల రుణాలను అందిస్తుంది.


3) ర్యాపిడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీ (ఆర్‌సీఎఫ్‌): అల్ప ఆదాయ దేశాలకు అత్యవసర బీఓపీ అవసరాల కోసం దీన్ని అందిస్తారు.


రాయితీ లేని రుణాలు: సభ్య దేశాలకు మార్కెట్‌ వడ్డీ రేటుకు రుణ సౌకర్యం కల్పిస్తాయి. అవి..


1) స్టాండ్‌ బై అరెంజ్‌మెంట్‌ (ఎస్‌బీఏ): సభ్యదేశాల బీఓపీ సమస్యలకు స్వల్పకాల రుణాలను అందిస్తాయి. ఇది కేవలం అల్ప ఆదాయ దేశాలకు మాత్రమే. ఈ రుణ కాల పరిమితి 12 నెలల నుంచి 18 నెలలు. గరిష్ఠంగా మూడేళ్లు.


2) ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ (ఈఎఫ్‌ఎఫ్‌): అల్ప ఆదాయ దేశాలకు మధ్య, దీర్ఘకాల బీఓపీ సమస్యల పరిష్కారాలకు రుణాలను అందిస్తుంది.


3) ర్యాపిడ్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (ఆర్‌ఎఫ్‌ఐ): అత్యవసర బీఓపీ అవసరాలు తీర్చడానికి ఇచ్చే రుణాలు.


4) ఫ్లెక్సిబుల్‌ క్రెడిట్‌ లైన్‌ (ఎఫ్‌సీఎల్‌): విధానాలను అమలు చేయడానికి ఈ రుణాలు అందిస్తుంది. 


5) ప్రికాషనరీ అండ్‌ లిక్విడిటీ లైన్‌ (పీఎల్‌ఎల్‌): విధానాలు బాగా అమలుపరిచే సభ్య దేశాలకు ఈ రుణాలు అందిస్తారు.


* ప్రస్తుతం భారత్‌ అల్ప ఆదాయ దేశం కాదు. అందుకే రాయితీ రుణం లభించడం లేదు.


ఐఎంఎఫ్‌ విత్త వనరులు: 

 1) కోటా: సభ్యదేశాలు అందించే కోటా ప్రధాన విత్త వనరు. 


2) న్యూ అరేంజ్‌మెంట్‌ టు బారో (ఎన్‌ఏబీ): 40 సభ్య దేశాల నుంచి ఎన్‌ఏబీ ద్వారా రుణాలు తీసుకుంటాయి. 


3) ద్వైపాక్షిక రుణ ఒప్పందాలు: కోటా, ఎన్‌ఏబీల తర్వాత సభ్యదేశాల విత్త అవసరాలు తీర్చేందుకు ఐఎంఎఫ్‌ ఈ రుణ ఒప్పందాలు చేసుకుంటుంది. దీనిలో కూడా 40 దేశాలున్నాయి. 


ఐఎంఎఫ్‌ ప్రధాన నివేదికలు


1) వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ):   సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్, అక్టోబరు) ప్రచురిస్తారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంచనాలను సభ్య దేశాల విధానాలను విశ్లేషిస్తుంది. వృద్ధిపై ప్రభావం చూపే నష్టభయాలను, అనిశ్చితత్వాలను తెలియజేస్తుంది.

2) గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌ (జీఎఫ్‌ఎస్‌ఆర్‌): దీన్ని కూడా డబ్ల్యూఈఓ మాదిరిగానే ఏడాదికి రెండు సార్లు ప్రచురిస్తారు, ప్రపంచ విత్త మార్కెట్ల స్థిరత్వాన్ని అంచనా వేస్తుంది. విత్త, నిర్మాణాత్మక అసమతౌల్యాన్ని తెలియజేసి పరిష్కారాలను సూచిస్తుంది.

3) ఫిస్కల్‌ మానిటర్‌ రిపోర్ట్‌: ఇది ప్రభుత్వ విత్త అభివృద్ధిని విశ్లేషిస్తుంది.

4) ఎక్స్‌టర్నల్‌ సెక్టార్‌ రిపోర్ట్‌:  ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల బహిర్గత స్థితిని అంచనా వేస్తుంది.

5) రీజినల్‌ ఎకనమిక్‌ రిపోర్ట్‌: ప్రత్యేక ప్రాంతాల్లో దేశాల ఆర్థికాభివృద్ధి అవకాశాలను తెలియజేస్తుంది.


స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్డీఆర్‌): ట్రిఫిన్‌ ప్రణాళిక, బెర్నెస్టెయిన్‌ ప్రణాళికల ప్రకారం అంతర్జాతీయ ద్రవ్యత్వ సమస్య నివారణకు 1969లో ఎస్డీఆర్‌ను ప్రవేశపెట్టారు. వాణిజ్య బ్యాంకులు పరపతి ద్రవ్యాన్ని సృష్టించినట్లే ఐఎంఎఫ్‌ ఎస్డీఆర్‌లను జారీ చేస్తుంది. వీటిని పేపర్‌ గోల్డ్‌ అంటారు.


ప్రస్తుతం ఎస్డీఆర్‌ అనేది ఐఎంఎఫ్‌ ఖాతాలో ఒక భాగం (Unit of Account) లాంటిది (1SDR = 1.38 డాలర్లు).    అయితే ఎస్డీఆర్‌ విలువ నిర్ణయంలో అమెరికా డాలర్‌ 43.38%, యూరో 29.31% భారాలను కలిగి ఉన్నాయి.


ఎస్డీఆర్‌లోని ముఖ్యమైన దేశాల కరెన్సీల భారితాలు: 

* అమెరికా (డాలర్‌) - 43.38%  


* యూరో దేశాలు (యూరో) - 29.31%  


* చైనా (రెన్‌మిన్‌బి) - 12.28%  


* జపాన్‌ (యెన్‌) - 7.59% 


* ఇంగ్లండ్‌ (పౌండ్‌ స్టెల్లింగ్‌) - 7.40%


ఐఎంఎఫ్‌ జనరల్‌ కోటాలో భారత్‌కు 2.75 శాతం వాటా ఉంది. అధిక వాటా అమెరికా కలిగి ఉంది. 


(అమెరికా 17.69% , జపాన్‌ 6.47%, జర్మనీ 6.12%, యూకే 4.51%, చైనా 4.00%, భారత్‌ 2.75%, కెనడా 2.67%, రష్యా 2.50%.)


వాషింగ్టన్‌ కాన్‌సెన్సస్‌(Washington Consensus): ఐఎంఎఫ్‌ సభ్యదేశాలు కొన్ని విధానాలు, షరతులు అనుసరించినప్పుడే విత్త సహాయాన్ని పొందగలుగుతాయి. వీటిని వాషింగ్టన్‌ కాన్‌సెన్సస్‌ అంటారు. వాటిలో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. అవి

 1) కరెన్సీ విలువ తగ్గించడం 

2) కరెన్సీని స్థిరీకరించేందుకు అధిక వడ్డీ రేట్లు

3) వ్యయాన్ని తగ్గించడం, సమతౌల్య బడ్జెట్‌ 

4) ధరల నియంత్రణలను, రాయితీలు తొలగించడం 

5) విదేశీ పెట్టుబడిదారుల హక్కులను పెంచడం

6) వ్యాపార సరళీకరణ 

7) సుంకాల సరళీకరణ


ఈ షరతులను అనుసరిస్తే బీఓపీ (బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) సంక్షోభాన్ని పరిష్కరించుకుని ఐఎంఎఫ్‌ రుణాన్ని తిరిగి తీర్చవచ్చు.


మాదిరి ప్రశ్నలు


1. స్వర్ణ ప్రమాణం పరిణతి చెంది విదేశీ వ్యాపారం ఎన్నేళ్ల పాటు సుస్థిరతను సాధించింది?

1) 40  2) 50  3) 60 4) 70


2. దేశీయ నిరుద్యోగితను పరిష్కరించడానికి దేశాలు తమ కరెన్సీని మూల్యహీనీకరణ చేయడాన్ని ఏమంటారు?

1) బెగ్గర్‌ మై నైబర్‌   2) బెగ్గర్‌ మై కంట్రీ   

3) కాంట్రిబ్యూట్‌ మై నైబర్‌   4) ఫైనాన్స్‌ మై నైబర్‌

 

3. బ్రిటన్‌ వుడ్స్‌ కవలలు అంటే...

1) ప్రపంచ బ్యాంకు, నాబార్డు   2) ఐఎంఎఫ్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు

3) ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌   4) ఐఎంఎఫ్, రిజర్వ్‌ బ్యాంకు


4. అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదించని సంస్థ-

1) ఐబీఆర్‌డీ     2) ఐఎంఎఫ్‌     3) ఐటీఓ     4) డబ్ల్యూటీఓ


5. ఐఎంఎఫ్‌ ఎలాంటి రుణాలు ఇస్తుంది?

1) దీర్ఘకాలిక   2) మధ్యకాలిక   3) స్వల్పకాలిక   4) పైవన్నీ


6. ఐఎంఎఫ్‌లో 190వ దేశం ఏది?

1) సియోల్‌   2) ఇథియోపియా   3) సోమాలియా   4) అండోర్రా


7. ఐఎంఎఫ్‌ కార్యనిర్వాహకవర్గంలో ఎంతమంది సభ్యులు ఉంటారు?

1) 190   2) 24  3) 16  4) 10


8. ఐఎంఎఫ్‌ కోటాను నిర్ణయించేటప్పుడు జీడీపీ ఎంత శాతం భారితం?

1) 30%   2) 50%  3) 15%  4) 5%


9. సభ్య దేశాలకు మార్కెట్‌ వడ్డీ రేటుకు అందించే రుణసౌకర్యాలు ఏవి?

1) రాయితీ రుణాలు   2) రాయితీ లేని రుణాలు   3) వడ్డీ రుణాలు   4) వడ్డీ లేని రుణాలు


10. వాషింగ్టన్‌ కాన్‌సెన్సన్‌ అంటే?

1) విధానాలు, షరతులు అనుసరించి విత్త సహాయాన్ని పొందడం

2) విధానాలు, షరతులు లేకుండా విత్త సహాయాన్ని పొందడం

3) విధానాలు, షరతులు పాటించకుండా ఉండటం

4) ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం పొందడం


సమాధానాలు: 

1-2, 2-1, 3-3, 4-3, 5-3, 6-4, 7-2, 8-2, 9-2, 10-1.

 

 

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

Posted Date : 24-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రపంచ బ్యాంకు

 ఆర్థిక వ్యవస్థలకు అంతర్జాతీయ అండ!
 

అభివృద్ధి చెందుతున్న దేశాల పురోభివృద్ధికి రుణ సాయం చేసే అంతర్జాతీయ ఆర్థిక సంస్థే ప్రపంచ బ్యాంకు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించడానికి కృషి చేస్తోంది. సభ్య దేశాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధి ఆశయంతో పాటు పేదరికం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ వంటి ఉన్నత లక్ష్యాలతో పనిచేస్తోంది. రెండో ప్రపంచ యద్ధానంతరం దీని ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల నుంచి ప్రస్తుత పనితీరు, పరిధి, ఇందులో మన దేశ భాగస్వామ్యం, ఇంతవరకు పొందిన ప్రయోజనాల గురించి అభ్యర్థులకు తగిన అవగాహన ఉండాలి. ప్రపంచబ్యాంకు నిర్వహణ, నిర్మాణంలోని లోపాల కారణంగా ఏర్పాటైన కొత్తతరం అంతర్జాతీయ సంస్థలు, అందులో భారత్‌ పోషిస్తున్న క్రియాశీల పాత్ర గురించి తెలుసుకోవాలి.

  

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం, సులభ ద్రవ్యత్వం ప్రపంచానికి అత్యవసర లక్ష్యంగా మారింది. ఇందుకోసమే 1944లో జులై 1 నుంచి 22 వరకు న్యూహంప్‌షైర్‌ (అమెరికా)లోని బ్రిటన్‌ వుడ్స్‌లో 44 దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ‘ఐక్యరాజ్య సమితి ద్రవ్య, ఆర్థిక సమావేశం’గా వ్యవహరించిన ఆ కార్యక్రమంలో దేశాలన్నీ ఐబీఆర్‌డీ, ఐఎమ్‌ఎఫ్‌ అనే రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఏర్పాటుకు అంగీకరించాయి. వీటినే బ్రిటన్‌ వుడ్స్‌ కవలలు అంటారు. అందులోని ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (IBRD) ను ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్నారు.

ప్రపంచ బ్యాంకు సంస్థలు: ప్రపంచ బ్యాంకు గ్రూపులో అయిదు సంస్థలున్నాయి.అవి  

1) ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (IBRD)

2) ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (IDA) 3)

3) ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (IFC) 4)

4) మల్టీలేటరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్యారంటీ ఏజెన్సీ (MIGA)

5) ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెటిల్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిస్ప్యూట్స్‌ (ICSID)

భారతదేశానికి ICSIDలో తప్ప మిగిలిన నాలుగు సంస్థల్లోనూ సభ్యత్వం ఉంది. వీటిలో మొదటిసారిగా ఏర్పడింది ఐబీఆర్‌డీ (1945). ప్రపంచ బ్యాంకు సభ్యత్వం కావాలంటే మొదట ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం అవసరం. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రస్తుత (2019 నుంచి అయిదేళ్ల కాలానికి) ఛైర్మన్‌ డేవిడ్‌ మాల్‌పాస్‌. ఈయన జపనీస్‌ జాతీయుడు. ఈ బ్యాంకు ఆర్థిక పునర్నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. ఐఎమ్‌ఎఫ్‌ సభ్యదేశాలన్నీ ఐబీఆర్‌డీలోనూ సభ్య దేశాలే. ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం రద్దయితే ఐబీఆర్‌డీలోనూ సభ్యత్వం పోతుంది. అయితే 75% సభ్యులు అనుమతి ఇస్తే ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం రద్దయినప్పటికీ ఐబీఆర్‌డీలో కొనసాగవచ్చు.

ఐబీఆర్‌డీలో రెండురకాల సభ్య దేశాలుంటాయి.

1) 1945, డిసెంబరు 31 నాటికి ఉన్న స్థాపక సభ్య దేశాలు. వీటిలో భారత్‌ ఉంది.

2) సాధారణ సభ్యదేశాలు.

 

విధులు: 

 1) మధ్య ఆదాయ, పరపతి సామర్థ్యం ఉన్న అల్ప ఆదాయ దేశాలకు రుణాలను అందిస్తుంది.


2) పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తక్కువ వడ్డీ రేటుకు ఇస్తుంది. 


3) అవినీతి వ్యతిరేక, సురక్షిత వలయానికి చెందిన సంస్థాగత సంస్కరణలను ప్రోత్సహిస్తుంది. 


4) విత్త సంక్షోభ సమయంలో సహాయం చేస్తుంది.


ప్రపంచ బ్యాంకు-భారతదేశం

మొదటి రుణం: రైల్వే పునరావాసం కోసం 1948, నవంబరులో 34 మిలియన్‌ డాలర్లు తీసుకుంది.

తర్వాత రుణం: 104 కార్యకలాపాలకు 27.1 బిలియన్‌ డాలర్ల మేరకు భారత్‌ రుణాలు పొందింది.

* కొవిడ్‌-19కు సంబంధించి సామాజిక సహాయం కోసం 400 మిలియన్‌ డాలర్లు, ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం’లో 80 కోట్ల మందికి అదనపు రేషన్, తక్షణ నగదు బదిలీ కోసం 750 మిలియన్‌ డాలర్లు రుణాలు తీసుకుంది.

అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (IDA): 1960లో ఏర్పాటు చేశారు. భారతదేశం ఇందులో సభ్యదేశం. దీనిని సాఫ్ట్‌ విండో లేదా సాఫ్ట్‌ లెండింగ్‌ ఆర్మ్‌ ఆఫ్‌ వరల్డ్‌ బ్యాంక్‌ అంటారు. వెనుకబడిన, పేద దేశాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. వీటిని 30-40 సంవత్సరాల్లోపు చెల్లించాలి. దేశాలు తమ సొంత కరెన్సీలోనూ తిరిగి చెల్లించవచ్చు. అందుకే ఐడీఏను సాఫ్ట్‌ లోన్‌ విండో అని పిలుస్తారు. 2023 నాటికి ఏ దేశాల తలసరి ఆదాయం 1255 డాలర్ల కంటే తక్కువ ఉంటుందో ఆ దేశాలు మాత్రమే దీని కింద రుణాలు పొందడానికి అర్హులు.


ప్రపంచ దేశాల వర్గీకరణ

1) తక్కువ ఆదాయ దేశాలు → తలసరి ఆదాయం 1,085 డాలర్ల కంటే తక్కువ.

2) తక్కువ మధ్య ఆదాయ దేశాలు → 1,086 డాలర్ల కంటే అధికం, 4,255 డాలర్ల కంటే తక్కువ.

3) అధిక మధ్య ఆదాయ దేశాలు → 4,256 డాలర్ల కంటే అధికం, 13,205 డాలర్ల కంటే తక్కువ.

4) అధిక ఆదాయ దేశాలు → 13,205 డాలర్ల కంటే ఎక్కువ.

* ఇండియా తలసరి ఆదాయం 2277 డాలర్లు.

 

కొన్ని దేశాల తలసరి ఆదాయం కటాఫ్‌ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ పరపతి సామర్థ్యం లేకపోవడం వల్ల ఐబీఆర్‌డీ నుంచి రుణాలు పొందలేకపోతున్నాయి. వాటికి కూడా ఐడీఏ సహాయం చేస్తుంది. 

ఉదా: నైజీరియా, పాకిస్థాన్‌.


ఐడీఏ ద్వారా భారత్‌ ఎక్కువ లబ్ధి పొందింది. అయితే 2015 నుంచి ఎలాంటి మద్దతు తీసుకోలేదు. కారణం 2014లో భారతదేశాన్ని గ్రాడ్యుయేటెడ్‌గా ప్రకటించింది (వరుసగా 2 ఆర్థిక సంవత్సరాల్లో తలసరి ఆదాయం ఆపరేషనల్‌ కటాఫ్‌ మించిపోతే ఆ దేశాన్ని గ్రాడ్యుయేట్‌గా ప్రకటిస్తారు). 2020 నాటికి 37 దేశాలు ఈ హోదాను పొందాయి.


భారతదేశం-ఐడీఏ 


1) 1960, సెప్టెంబరు 24న కలకత్తా, బొంబాయి, మద్రాసు ఓడరేవు సౌకర్యాల విస్తరణ కోసం రుణం పొందింది.


2) భారతీయ రైల్వే సరకు రవాణా సామర్థ్యం విస్తరణతోపాటు దుర్గాపుర్, కొయనా, కోర్బా విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు రుణం పొందింది.


3) బియాస్‌ - సట్లెజ్‌ నదీ వ్యవస్థ ఆనకట్టలు, కాలువల నిర్మాణ కోసం రుణం.


4) ఎడారి సాగు కోసం కాలువల నిర్మాణం, రాజస్థాన్‌ నీటిపారుదల వ్యవస్థ విస్తీర్ణం పెంచేందుకు రుణం.


5) హరిత విప్లవం, శ్వేతవిప్లవం, పోలియో, టి.బి. నివారణకు సహాయం.


* 1961 నుంచి 2015 వరకు పొందిన మొత్తం రుణాలు 46 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు.


అంతర్జాతీయ విత్త కార్పొరేషన్‌ (IFC):  1956, జులై 20న ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేటు రంగ పరిశ్రమలకు రుణ సదుపాయం అందిస్తుంది. బలమైన ప్రైవేటు రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులను, సాంకేతిక నిపుణులను, సలహా సేవలను అందిస్తుంది. అందుకే దీన్ని ‘ప్రైవేట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ బ్యాంక్‌’ అంటారు. అంతర్జాతీయ విత్త మార్కెట్‌లో బాండ్లు జారీ చేయడం ద్వారా ఐఎఫ్‌సీ నిధులు సమకూర్చుకుంటుంది.


ఉదా: అమెరికా డాలర్‌ బెంచ్‌ మార్క్‌ బాండ్, లోకల్‌ కరెన్సీ బాండ్స్, 2014లో రూపీ బాండ్, మసాలా బాండ్‌ల ద్వారా భారత కంపెనీలకు  ఐఎఫ్‌సీ విత్తాన్ని సమకూర్చింది.


భారతదేశం - ఐఎఫ్‌సీ:

1) ఆర్థిక సమ్మిళిత్వానికి తోడ్పడేందుకు 20 మిలియన్‌ డాలర్లతో ఐఎఫ్‌సీ భారత్‌లో పెట్టుబడులు పెట్టింది.

 2) వాతావరణ మార్పులను సరిదిద్దడం కోసం పెట్టుబడులు

 3) నీటికొరత ప్రభావాలను పరిష్కరించడం.


బహుపాక్షిక పెట్టుబడి హామీ ఏజెన్సీ (MIGA): ఇది 1988లో ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. కరెన్సీ బదిలీలు, యుద్ధం, పౌర అశాంతి తదితర నష్టభయ సమయాల్లో విదేశీ పెట్టుబడిదారులకు బీమాను అందిస్తుంది. 


పెట్టుబడి వివాదాల పరిష్కార అంతర్జాతీయ కేంద్రం(ICSID):  1966, అక్టోబరు 14న విదేశీ పెట్టుబడిదారులు, వారికి ఆతిథ్యం ఇచ్చే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఏర్పడే పెట్టుబడి వివాదాలను సయోధ్య లేదా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఈ సంస్థను స్థాపించారు.

 

భారతదేశం - ఐసీఎస్‌ఐడీ:  దీనికి సంబంధించిన సమావేశంలో భారతదేశం సంతకం చేయలేదు. కారణం ఈ కన్వెన్షన్‌ నియమాలు అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా ఉండటమే.


న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌/ బ్రిక్స్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌: ప్రపంచ జనాభాలో సగం జనాభా బ్రిక్స్‌ దేశాల్లో ఉన్నప్పటికీ ఐఎమ్‌ఎఫ్‌ ఓటింగ్‌లో మాత్రం 15% కంటే తక్కువ ఓటింగ్‌ ఉంది. అందుకే ప్రపంచ బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా కొత్త అభివృద్ధి బ్యాంకును 2015లో రష్యాలో జరిగిన సమావేశంలో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం షాంఘై (చైనా)లో ఉంది. ఇటీవల (2023) 6 కొత్త దేశాలను బ్రిక్స్‌లో చేర్చారు. అవి అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌. ప్రస్తుత అధ్యక్షుడు మార్కోస్‌ ట్రోయోజో (బ్రెజిల్‌). బ్రిక్స్‌ దేశాల్లో BOP సమస్యలు ఎదురైనప్పుడు స్వల్పకాల ద్రవ్యత్వ సర్దుబాటుకు 2015లో కాంటింజెంట్‌ రిజర్వ్‌ అరేంజ్‌మెంట్‌ (CRA) ను ఏర్పాటు చేశారు. దీనిని 100 బిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేశారు. దీనిలో చైనా 41%; బ్రెజిల్, ఇండియా, రష్యాలు 18%; దక్షిణాఫ్రికా 5% వాటా కలిగి ఉంటాయి.


ఆసియా అభివృద్ధి బ్యాంకు(ADB): 31 సభ్యదేశాలతో 1966లో ఏడీబీని ఏర్పాటు చేశారు. ఇండియా కూడా ప్రారంభ సభ్య దేశం. 2019 నాటికి సభ్య దేశాల సంఖ్య 68కి పెరిగింది. ఇందులో 49 దేశాలు ఆసియా-పసిఫిక్, 19 దేశాలు బయట ప్రాంతాల నుంచి ఉన్నాయి. దీని ప్రధాన కేంద్రం ఫిలిప్పైన్స్‌లోని మండలాయాంగ్‌లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు మసత్సుజు అసకవా (జపాన్‌). భారత్‌ ప్రారంభ సభ్యదేశం, 4వ అతిపెద్ద వాటాదారు.


ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (AIIB):  ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో అవస్థాపన సదుపాయాల అభివృద్ధికి చైనా ప్రతిపాదన ఆధారంగా 2014లో ఈ బ్యాంకు ప్రారంభమైంది. 2016 నాటికి సభ్యదేశాలు 57. భారత్‌ కూడా సభ్యదేశమే. 2020 నాటికి సభ్యదేశాలు 103కి పెరిగాయి. అమెరికా, జపాన్‌ సభ్యత్వం తీసుకోలేదు. ఏఐఐబీ ప్రధాన కార్యాలయం బీజింగ్‌ (చైనా)లో ఉంది. దీని అధ్యక్షుడు జిన్లీ క్వున్‌ (చైనా).


ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (OECD): దీనిని 1947లో ఏర్పాటు చేశారు. 1960లో అమెరికా, కెనడాలు, 1964లో జపాన్‌ చేరాయి. దీనిలో భారత్, చైనా సభ్య దేశాలు కావు. దీని ప్రధాన కేంద్రం ప్యారిస్, సభ్యదేశాల సంఖ్య 38. అధ్యక్షుడు మథియాస్‌ కోర్మాన్‌.


యూరోపియన్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (EBRD):  ఇది 1991లో ఏర్పడింది. దీనిలో 71 సభ్య దేశాలున్నాయి. 2018 నుంచి భారత్‌ సభ్యత్వం పొందింది. ప్రధాన కేంద్రం లండన్‌. అధ్యక్షుడు ఒడిలే రెనాడ్‌ బస్సో.

 

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

 

Posted Date : 31-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  ప్రపంచ వాణిజ్య సంస్థ

అంతర్జాతీయ వ్యాపార కాపలాదారు! 


ప్రపంచంతో పాటు ప్రతి దేశ పురోగతికి అంతర్జాతీయ వాణిజ్యం తప్పనిసరి. దాన్ని నియంత్రించి, సులభతరం చేసేందుకు శిఖరాగ్ర స్థాయిలో ఏర్పాటైనదే ప్రపంచ వాణిజ్య సంస్థ. పలు దేశాల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ సంస్థ సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అందుకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తువులు, సేవల సరఫరాతో పాటు మేధోసంపత్తి వాణిజ్యాన్ని సులభతరం చేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య నియమాల రూపకల్పన, అమలు, సవరణల విషయంలో డబ్ల్యూటీవోకు ఉన్న ప్రాధాన్యాన్ని అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ సంస్థ రూపొందించిన ప్రధాన ఒప్పందాలు, వాటి ప్రభావాలు భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. 


  

అంతర్జాతీయ వ్యాపారాన్ని 1930లో తలెత్తిన ఆర్థిక మాంద్య పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం చేశాయి. దేశాలన్నీ తమ ఆర్థిక వ్యవస్థల రక్షణ కోసం దిగుమతి సుంకాలు విధించడం ప్రారంభించాయి. దీంతో అంతర్జాతీయ వ్యాపారం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాపార అభివృద్ధికి కొన్ని దేశాలు ‘గాట్‌’ sGATT- General Agreement on Tariff and Trade) పేరుతో ఒప్పందం చేసుకున్నాయి. 1947, అక్టోబరులో 23 దేశాలు గాట్‌పై సంతకాలు చేశాయి. ఇందులో భారత్‌ ప్రారంభ సభ్య దేశం. 1948, జనవరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇది బహుళపక్ష ఒడంబడిక. సభ్యదేశాల మధ్య వ్యాపార అభివృద్ధి కోసం గాట్‌ నిరంతర చర్చావేదికను ఏర్పాటు చేసింది.


ముఖ్యమైన నిబంధనలు:  

1) సుంకాలు తగ్గించడం.

 2) పరిమాణాత్మక ఆంక్షల తొలగింపు. 

3) అత్యంత అభిమాన దేశం హోదా (MFN) ను అన్ని సభ్యదేశాలకు ఇవ్వడం.  

4) వాణిజ్య వివాదాల పరిష్కారం.


* సభ్యదేశాల మధ్య వివక్ష లేకుండా వ్యాపారం జరగాలని చెప్పేదే MFN అంటే ఒక దేశం మరొక దేశానికి అనుకూల తీర్మానాలు చేస్తే అవి గాట్‌లోని అన్ని దేశాలకు వర్తిస్తాయి.


గాట్‌ సమావేశాలు-డబ్ల్యూటీవో ఆవిర్భావం: గాట్‌కి సంబంధించి 8 సమావేశాలు (రౌండ్లు) జరిగాయి. 1986లో 8వ సమావేశం ఉరుగ్వేలో ప్రారంభమై 1994లో జెనీవాలో ముగిసింది. దీనిలో 15 అంశాలపై చర్చలు జరపగా, అందులో 14 అంశాలు వస్తువులకు, ఒకటి సేవలకు చెందినవి. సేవల అంశం వివాదాస్పదమైంది. ఈ చర్చల సారాంశాన్ని అప్పటి గాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్థర్‌ డంకెల్‌ ‘డంకెల్‌ డ్రాఫ్టు’గా రూపొందించారు. దీనిపై భారత్‌తో సహా 117 దేశాలు 1994, ఏప్రిల్‌లో మొరాకోలోని మారకేష్‌ నగరంలో సంతకాలు చేశాయి. ఫలితంగా 1994, డిసెంబరు 12న గాట్‌ రద్దయింది. దాని స్థానంలో WTO (ప్రపంచ వాణిజ్య సంస్థ) అనే స్వతంత్ర, శాశ్వత, చట్టబద్ధమైన సంస్థ 1995, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.


* గాట్‌ మాదిరిగానే ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రం కూడా స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోనే ఏర్పాటైంది. దీనిలో ప్రారంభ సభ్యదేశాలు 121. ప్రస్తుతం 164కి చేరాయి. 2016లో అఫ్గానిస్థాన్‌ 164వ దేశంగా చేరింది. ప్రస్తుత డబ్ల్యూటీవో డైరెక్టర్‌ జనరల్‌ గోజి ఒకోంజో ఇవాలా (ఆఫ్రికా). డబ్ల్యూటీవో అంతర్జాతీయ వ్యాపార కాపలాదారుగా పనిచేస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం సభ్యదేశాలతో ప్రతి రెండేళ్లకోసారి సమావేశం నిర్వహిస్తుంది.


మంత్రుల స్థాయి సమావేశాలు: డబ్ల్యూటీవోలో ఇప్పటివరకు 12 మంత్రుల స్థాయి సమావేశాలు జరిగాయి.


ప్రపంచీకరణ ప్రభావంతో నేడు ప్రపంచమంతా కుగ్రామం (గ్లోబల్‌ విలేజ్‌)గా మారుతోంది. ఇందులో ప్రపంచ వ్యాపారాన్ని సంరక్షించడంలో డబ్ల్యూటీవో కృషి చేస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా వస్తువులు, మూలధనం, టెక్నాలజీ, శ్రామికులు ఒక దేశం నుంచి మరో దేశానికి స్వేచ్ఛగా తరలాలి. అయితే శ్రామికుల స్వేచ్ఛా గమనశీలతను అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించడమే డబ్ల్యూటీవో లక్ష్యం. ‘గాట్‌’ కంటే దీని పరిధి ఎక్కువ. వాణిజ్య సంబంధాలు నిర్వహించేందుకు వీలుగా పన్నులు వేసే ప్రాంతం కలిగి ఉంటే డబ్ల్యూటీవోలో సభ్యత్వం పొందవచ్చు. ఇందుకు పూర్తి స్వతంత్య్ర దేశం కావాల్సిన అవసరం లేదు. అందుకే హాంకాంగ్, తైవాన్‌ కూడా ఇందులో సభ్యదేశాలయ్యాయి. డబ్ల్యూటీవో ఐక్యరాజ్య సమితిలో భాగం కాదు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు మాదిరిగా కాకుండా ఒక దేశం - ఒక ఓటు విధానాన్ని అనుసరిస్తూ ఏటా ప్రపంచ వ్యాపార నివేదికను ప్రచురిస్తుంది.


సాధారణ మండలి: సభ్యదేశాల దౌత్యాధికారులు ప్రతి ఏడాది దీనికి హాజరవుతారు. మంత్రుల సమావేశం తరఫున ఇది పనిచేస్తుంది. వివాదాల పరిష్కార మండలిగా, ట్రేడ్‌ పాలసీ సమీక్ష మండలిగా వ్యవహరిస్తుంది. సాధారణ మండలి నిర్ణయాలపై డబ్ల్యూటీవోలోని అప్పిలేట్‌ సంస్థకు నివేదించవచ్చు.


వ్యాపార మండలి: దీనిలో 

1) వస్తువుల వ్యాపార మండలి 

2) సేవల వ్యాపార మండలి 

3) ట్రిప్స్‌ (Trade Related aspects of Intellectual Rights) కు చెందిన వ్యాపార మండలి ఉంటాయి. వీటిపై సాధారణ మండలికి నివేదించవచ్చు.


డబ్ల్యూటీవో నియమాలు:


అత్యంత అభిమాన దేశం హోదా (ఎంఎఫ్‌ఎన్‌): డబ్ల్యూటీవో సభ్యదేశాలు వ్యాపారపరంగా ఎలాంటి వివక్ష చూపకూడదు. అంటే ఒక దేశానికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే, మిగతా సభ్య దేశాలకూ వాటినే అందించాలి. అయితే 

1) ప్రాంతీయ ఆర్థిక ఒప్పందాలకు మినహాయింపు ఉంటుంది. 

2) అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేకంగా తక్కువ సుంకాలు విధించవచ్చు.

3) ప్రత్యేక దేశాల నుంచి న్యాయంగా లేని వస్తువులు దిగుమతి అవుతున్నప్పుడు ఆంక్షలు పెంచవచ్చు. 

4) దేశ భద్రత నిబంధన వర్తిస్తుంది.


* భారతదేశం 1996లో పాకిస్థాన్‌కు ఎంఎఫ్‌ఎన్‌ హోదా ఇచ్చింది. 2019లో పుల్వామా దాడి కారణంగా ఆ హోదాను ఉపసంహరించి, పాకిస్థాన్‌ నుంచి వచ్చే దిగుమతులపై 200% సుంకాలు విధిస్తోంది.


నేషనల్‌ ట్రీట్‌మెంట్‌: వ్యాపార ఉత్పత్తులపై దేశీయ, విదేశీ అనే వివక్ష చూపకూడదు. అంటే దిగుమతి సుంకాలు విధించిన తర్వాత  దిగుమతి అయిన వస్తువులు, దేశీయ ఉత్పత్తుల మధ్య వివక్ష ప్రదర్శించకూడదు.


* భారతదేశం ప్రారంభించిన నేషనల్‌ సోలార్‌ మిషన్‌ కింద ప్రాజెక్టులో 30% దేశీయ ఉత్పత్తులు ఉండాలి. దీనివల్ల దేశీయ సోలార్‌ సెల్స్‌ పరిశ్రమలను ప్రోత్సహించినట్లు అవుతుంది. దీనిపై అమెరికా వ్యాపార ప్రతినిధులు వివాదాల పరిష్కార మండలికి వెళ్లగా భారత్‌కు ప్రతికూల తీర్పు వచ్చింది. అయితే అప్పిలేట్‌ అథారిటీలో మాత్రం భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.


అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక మినహాయింపులు: వాణిజ్య ఒప్పందాలను అమలుచేసే విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ సమయం ఇవ్వాలి. డంపింగ్‌ వ్యతిరేక సుంకాలు, రక్షణకు కొంత అవకాశం ఇవ్వాలి. డబ్ల్యూటీవోలో తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఇతర దేశాలు సుంకాలు తగ్గించవచ్చు. దోహాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


డబ్ల్యూటీవో ప్రధాన ఒప్పందాలు:


వ్యవసాయ ఒప్పందం: 


ఎ) గ్రీన్‌ బాక్స్‌ సబ్సిడీలు: వ్యవసాయ పరిశోధన, శిక్షణ, మార్కెట్‌ సమాచారం, గ్రామీణ అవస్థాపన సదుపాయాలకు ఇచ్చే రాయితీలను ‘గ్రీన్‌బాక్స్‌ సబ్సిడీలు’ అంటారు. ఎలాంటి పరిమితి లేకుండా వీటిని అనుమతిస్తారు. ఎందుకంటే ఇవి వ్యాపారాన్ని తగ్గించవు.


బి) బ్లూ బాక్స్‌ సబ్సిడీలు: ఉత్పత్తి కోటాలు విధించడం, రైతు భూమికి ఎకరా చొప్పున రాయితీలు ఇవ్వడం లాంటి చర్యల వల్ల ఉత్పత్తిని పరిమితం చేయవచ్చు. ఈ రాయితీలకు పరిమితి లేదు.


సి) అంబర్‌ బాక్స్‌ సబ్సిడీలు: ఎరువులు, విత్తనాలు, నీటిపారుదల విద్యుత్తుకు రాయితీల ద్వారా ఉత్పత్తిని పెంచి వ్యాపారాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే వీటిపై పరిమితులున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తి విలువపై 5%, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10% రాయితీ మించకూడదు. ఎగుమతి సబ్సిడీలను అభివృద్ధి చెందిన దేశాలు ఆరేళ్లలో 36%, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదేళ్లలో 24% తగ్గించాలి. 


* వ్యవసాయ ఒప్పందం వల్ల, ముఖ్యంగా అంబర్‌ బాక్స్‌ రాయితీలపై పరిమితుల కారణంగా భారత ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలు కూడా దీని పరిధిలోకి వస్తుండటంతో పేదలకు ప్రజాపంపిణీ (పీడీఎస్‌) ద్వారా ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందించలేకపోవచ్చు.


వ్యవసాయేతర మార్కెట్‌ - సౌలభ్యం: పారిశ్రామిక వస్తువులు, వస్త్రాలు, ఇంధన ఉత్పత్తులు, ఎగుమతులపై సుంకాలు తగ్గించాలి.


గాట్స్‌ (జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ సర్వీసెస్‌): సభ్యదేశాల మధ్య సేవల వ్యాపార సరళీకరణకు సంబంధించింది.


ట్రిప్స్‌ (అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ రిలేటెడ్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌): కాపీరైట్లు, పేటెంట్‌ హక్కులు, ట్రేడ్‌ మార్కులు, జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌కు సంబంధించిన నిబంధనలు ఇందులో ఉంటాయి. దీని ప్రకారం వస్తువును కనుక్కున్న దేశానికి పేటెంట్‌ హక్కులు వస్తాయి. భారత్‌లో పేటెంట్‌ హక్కు కాలం 21 ఏళ్లు. వస్తువులకు ట్రేడ్‌మార్క్‌ లేదా బ్రాండ్‌ పేరు కూడా ఉంటుంది. ట్రేడ్‌మార్క్‌ కాలవ్యవధి పదేళ్లు. సాహిత్యం, సంగీతం, కళాకారుల ప్రతిభకు కూడా కాపీరైట్స్‌ వర్తిస్తాయి. ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో ప్రత్యేక లక్షణాలు ఉండే ఉత్పత్తులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ ఇస్తారు.


ఉదా: డార్జిలింగ్‌ టీ, కాంచీపురం పట్టుచీరలు, నాగ్‌పుర్‌ కమలాలు, కొల్హాపూర్‌ చెప్పులు, ఆల్ఫాన్సో మామిడి 


ట్రిమ్స్‌ (ట్రేడ్‌ రిలేటెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మెజర్‌): ఇది వస్తు వ్యాపారానికి సంబంధించింది. దీని ప్రకారం దేశ, విదేశీ పెట్టుబడుల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదు.


శానిటరీ అండ్‌ ఫైటోశానిటరీ మెజర్‌  (SPS): ఒక దేశం విదేశాల నుంచి ఆహారం దిగుమతి చేసుకునేటప్పుడు అది ఎంతవరకు సురక్షితమైనదో పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ఆహార భద్రత, జంతువులు, మొక్కల ఆరోగ్య ప్రమాణాలపై డబ్ల్యూటీవో ప్రత్యేక ఒప్పందం చేస్తుంది.


ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ అగ్రిమెంట్‌ (TFA): దేశాల మధ్య వస్తువులు రవాణా అయ్యేటప్పుడు కాలయాపన జరుగుతుంది. అందుకే ఎగుమతి, దిగుమతుల ప్రక్రియలో ఆధునికీకరణ, సమతౌల్యం తీసుకొచ్చి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి రూపొందించిన ఒప్పందం. దోహా సమావేశ ఫలితంగా 2017 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

 


 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వృద్ధి - అభివృద్ధి

పరిమాణాత్మక మార్పు.. గుణాత్మక ప్రగతి! 

వస్తుసేవల ఉత్పత్తిని అధికం చేస్తే జీడీపీ పెరుగుతుంది. విద్యా సంబంధ కార్యక్రమాలపై పెట్టుబడి పెడితే నిపుణులైన ఉత్పాదకశక్తి కలిగిన శ్రామికులు సిద్ధమవుతారు. మొదటిది ఆర్థికవృద్ధి, అది పరిమాణాత్మకమైతే, రెండోది ఆర్థికాభివృద్ధి నాణ్యమైనది, దేశ దీర్ఘకాలిక శ్రేయస్సుకి దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక, గుణాత్మక మార్పులకు కారణమవుతుంది. ఆర్థికశాస్త్రంలో ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసాలను పలువురు శాస్త్రవేత్తలు సమగ్రంగా వివరించారు.   దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సూక్ష్మ, స్థూల స్థాయుల్లో అర్థంచేసుకోవడానికి ఉపయోగపడే ఆ అంశాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వృద్ధి కారకాలు, మన దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ప్రణాళికల ద్వారా సాధించిన ప్రగతితో పాటు వృద్ధి రేటును గణించే సూత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే పదాలను ఆడం స్మిత్‌ కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. అయితే 1960 దశకం వరకు ఆర్థికవృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే భావనలను పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ హిల్స్, షుంపీటర్‌ లాంటి ఆర్థికవేత్తలు వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలను వ్యక్తం చేశారు.  

 

ఆర్థికవృద్ధి


దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికవృద్ధి అంటారు. అంటే ఒక దేశంలో జాతీయోత్పత్తి పెరుగుదలే ఆర్థికవృద్ధి. ఇది పరిమాణాత్మక మార్పును తెలియజేస్తుంది. 

ఉదా: స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదల.

దీర్ఘకాలంలో తలసరి, వాస్తవ, స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. దీనిలో మూడు అంశాలు ఉంటాయి.

1) జాతీయోత్పత్తి పెరుగుదల అనేది వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా పెరగవచ్చు. అది ఆర్థికవృద్ధి కాదు. దీర్ఘకాలంలో పెరుగుదల ఉన్నప్పుడే ఆర్థికవృద్ధిగా పరిగణిస్తారు. 

2) జాతీయోత్పత్తి కంటే జనాభా వేగంగా పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. అందుకే జనాభా పెరుగుదల కంటే స్థూల జాతీయోత్పత్తి వేగంగా పెరగాలి.

3) ధరల పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరగవచ్చు. అది నామమాత్ర జాతీయ ఆదాయం అవుతుంది. అందువల్ల ధరల ప్రభావాన్ని తొలగించి స్థిర ధరల్లో వాస్తవ జాతీయాదాయాన్ని లెక్కిస్తారు. వాస్తవిక జాతీయ ఆదాయం పెరుగుదలే ఆర్థికవృద్ధి.

ఆర్థికవృద్ధి సూచికలు: 

 1) నామమాత్ర స్థూల దేశీయోత్పత్తి 


2) వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 


3) నామమాత్ర తలసరి ఆదాయం 


4) వాస్తవ తలసరి ఆదాయం

నాలుగు కారకాలు: ఆర్థిక వృద్ధి నాలుగు కారకాల మీద ఆధారపడి ఉంటుంది. 

1) పొదుపు రేటు 

3) శ్రామికశక్తి వృద్ధి రేటు 

2) మూలధన ఉత్పత్తి నిష్పత్తి 

4) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు, నవకల్పనలు

ఆర్థిక వృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. చాలామంది ఆర్థికవేత్తలు వృద్ధి నమూనాలను ప్రతిపాదించారు. వారిలో ముఖ్యులు కార్ల్‌మార్క్స్, హరాడ్‌ - డోమర్, కాల్డార్, జాన్‌ రాబిన్‌సన్‌.

వృద్ధిరేటు గణించే విధానం: సాంవత్సరిక జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఆధారంగా ఆర్థిక వృద్ధిని గణిస్తారు.

ఆర్థికాభివృద్ధి 

1960 దశకం వరకు ఆర్థికాభివృద్ధిని వృద్ధికి పర్యాయ పదంగా వాడేవారు. ప్రస్తుతం వృద్ధి, అభివృద్ధిలను వేర్వేరు అర్థాల్లో ఉపయోగిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక, సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పులను ఆర్థికాభివృద్ధి అంటారు.


ఆర్థికాభివృద్ధి  = ఆర్థిక వృద్ధి + వ్యవస్థాపూర్వక మార్పులు

                            =  వృద్ధి + పేదవారికి అనుకూలంగా వనరుల పునఃపంపిణీ

                           =  వృద్ధి + పురోగాత్మక మార్పులు

                           =  వృద్ధి + సంక్షేమం

నిర్వచనాలు:

‘పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం అధిక స్థాయి నుంచి తగ్గడమే ఆర్థికాభివృద్ధి.’
 - డడ్లీ సీర్స్‌                                                              
‘మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పథంలో పయనించడమే ఆర్థికాభివృద్ధి.’
 - గున్నార్‌ మిర్ధాల్‌
‘80 శాతం ఉన్న వ్యవసాయ ఉపాధిని 15 శాతంగా మార్చే ప్రక్రియ ఆర్థికాభివృద్ధి.’
 
- హాన్స్‌ సింగర్‌
‘ధనిక దేశాల ఆదాయ స్థాయి పెరుగుదలకు సంబంధించిందే ఆర్థికవృద్ధి, పేద దేశాల ఆదాయ స్థాయి పెరుగుదలకు చెందింది ఆర్థికాభివృద్ధి.’
 -మాడిసన్‌


కిండిల్‌ బర్గర్‌: ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉత్పత్తికి సంబంధించినది. ఆర్థికాభివృద్ధి అనేది ఉత్పత్తి, సాంకేతిక, సంస్థాగత మార్పులకు చెందినది. అభివృద్ధి లేకుండా వృద్ధిని సాధిస్తే ఉపయోగం లేదు.

ఉదా: అరబ్బు దేశాలు. ఇవి పెట్రోలియం ఎగుమతి ద్వారా జాతీయ తలసరి ఆదాయాలు పెంచుకుని వృద్ధిని సాధించాయి. కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణంలో మార్పులు రాలేదు.

* రాబర్ట్‌ క్లోవర్‌ ‘గ్రోత్‌ విత్‌ అవుట్‌ డెవలప్‌మెంట్‌’ గ్రంథంలో లైబీరియా దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఏ విధంగా జరుగుతుందో వివరించారు. వృద్ధికి, అభివృద్ధికి తేడాలు ఊహాజనితమైనవి, అవాస్తవికమైనవి. పెద్దగా తేడాలు లేవనేది ఆర్థర్‌ లూయిస్‌ అభిప్రాయం.

 

భారతదేశంలో ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు:  

1) అధిక వృద్ధి రేటుతో జీవనప్రమాణం 

2) స్వయం పోషకత్వం 

3) సామాజిక న్యాయం 

4) ఆధునికీకరణ 

5) ఆర్థిక స్థిరత్వం 

6) సమ్మిళిత వృద్ధి

అధిక వృద్ధి రేటు: మొదట మూడు దశాబ్దాల ప్రణాళికల కాలంలో తక్కువ వృద్ధి రేటు (3.5%) నమోదైంది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు అధికంగా ఉండటంతో తలసరి ఆదాయ వృద్ధి రేటు తక్కువ (1.4%)గా నమోదైంది. 6వ ప్రణాళిక నుంచి వృద్ధి 5% పైనే నమోదైంది. అధిక వృద్ధి రేటు ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి.


స్వయంపోషకత్వం: భారతదేశం ప్రణాళికల ప్రారంభంలో ఆహార ధాన్యాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది. అదేవిధంగా భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, రైల్వే, రోడ్ల సామగ్రికి దిగుమతుల మీద ఆధారపడేది. ఆ విధంగా 3వ ప్రణాళిక వరకు విదేశాల అవసరం ఉండేది. తర్వాత 4వ ప్రణాళిక నుంచి దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంపోషకత్వం సాధ్యమైంది. 5వ ప్రణాళికలో విదేశీ మారక ద్రవ్యం కోసం ఎగుమతులను ప్రోత్సహించారు. దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించారు.


సామాజిక న్యాయం: వివిధ వర్గాల మధ్య ఆదాయ, సంపదల్లో సమాన పంపిణీ జరగాలనేదే సామాజిక న్యాయం. భారతదేశంలో నాలుగు సామాజిక న్యాయ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 

1) రాజకీయ వ్యవస్థలో సామాజిక న్యాయం 

2) ప్రాంతీయ అసమానతలు తగ్గించడం 

3) ఆర్థిక వ్యవస్థలో సామాజిక న్యాయం 

4) వెనుకబడిన, అణగారిన వర్గాల్లో సామాజిక న్యాయం

ఆధునికీకరణ: స్వాతంత్య్రం తర్వాత ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరణ చేయడం కోసం వ్యవస్థాపర, సంస్థాపరమైన మార్పులు తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల జాతీయాదాయంలో పారిశ్రామిక రంగం వాటా పెరుగుతూ వచ్చింది.

ఆర్థిక స్థిరత్వం: ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత, స్వయంపోషకత్వంతో కూడిన వృద్ధిని సాధించడం ఆర్థికాభివృద్ధి లక్ష్యం. దీని సాధనకు ప్రభుత్వం ద్రవ్య, కోశ విధానాలను ఉపయోగిస్తుంది.

సమ్మిళిత వృద్ధి: ఈ భావనను ప్రపంచ బ్యాంకు వెలుగులోకి తెచ్చింది. వృద్ధి ఫలాలు అన్నివర్గాల వారికి సమాన స్థాయిలో పంపిణీ కాకపోవడంతో సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యం పెరిగింది. గతంలో విస్మరించిన వర్గాలను వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడమే సమ్మిళిత వృద్ధి లక్ష్యం. జనాభాలో దిగువనున్న 20 శాతం మంది జాతీయ ఆదాయంలో కేవలం 2 నుంచి 3 శాతం ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారు. జాతీయ ఆదాయంలో వీరి వాటాను పెంచడమే సమ్మిళిత వృద్ధి.

ఆధునిక ఆర్థిక వృద్ధి: సైమన్‌ కుజ్‌నెట్స్‌ ‘ఆధునిక ఆర్థిక వృద్ధి’ అనే గ్రంథం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన ఆరు లక్షణాలను వివరించారు.

1) అధిక తలసరి ఉత్పత్తి వృద్ధి రేటు, అధిక జనాభా రేటు 

2) ఉత్పాదకత పెరుగుదల 

3) ఎక్కువ స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు 

4) పట్టణీకరణ 

5) అభివృద్ధి చెందిన దేశాల బాహ్య విస్తరణ 

6) అంతర్జాతీయ వ్యక్తులు, వస్తువులు, మూలధన కదలికలు

ఆర్థికాభివృద్ధి మాపనాలు:  

1) వాస్తవ స్థూల జాతీయోత్పత్తి 

2) తలసరి ఆదాయం 

3) తలసరి వినియోగ స్థాయి 

4) నికర ఆర్థిక సంక్షేమ సూచిక 

5) భౌతిక జీవన ప్రమాణ సూచిక 

6) సమీకృత అభివృద్ధి, సూచిక 

7) మానవాభివృద్ధి సూచిక 

8) లింగ సంబంధిత అభివృద్ధి సూచిక 

9) లింగ సాధికార కొలమానం 

10) మానవ పేదరిక సూచిక - 1  

11) మానవ పేదరిక సూచిక - 2  

12) సామాజిక ప్రగతి సూచిక

వాస్తవ స్థూల జాతీయోత్పత్తి:

దీనిని సైమన్‌ కుజ్‌నెట్స్, మీడ్, వీనర్, ప్రాంకెల్‌ ఆర్థికవేత్తలు సమర్థించారు.

తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి కొలమానంగా ఎక్కువ మంది జాతీయాదాయం కంటే తలసరి ఆదాయాన్ని ఉత్తమమైన కొలమానంగా ఆమోదిస్తున్నారు.

తలసరి వినియోగ స్థాయి: కొంతమంది ఆర్థికవేత్తలు తలసరి వినియోగ స్థాయిని బట్టి ఆర్థికాభివృద్ధిని మాపనం చేయవచ్చని పేర్కొన్నారు.

నికర ఆర్థిక సంక్షేమ సూచిక: విలియం నర్థూవస్, జేమ్స్‌ టోబిన్‌లు ఆదాయ సూచీని మెరుగుపరిచి ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని రూపొందించారు. పాల్‌.శ్యామూల్‌సన్‌ దీనిని నికర ఆర్థిక సంక్షేమంగా పేరు మార్చారు. జాతీయాదాయానికి విశ్రాంతి సమయ విలువను, గృహిణి సేవలను కలిపి, ఆధునిక పట్టణీకరణ కాలుష్యం లాంటి అసౌకర్యాల విలువను మినహాయించాలి.

నికర ఆర్థిక సంక్షేమ సూచీ = వాస్తవ స్థూల జాతీయోత్పత్తి + విశ్రాంతి సమయం + మార్కెటేతర కార్యకలాపాలు  పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం

భౌతిక జీవన ప్రమాణ సూచిక: ఆదాయ సూచీలపై విమర్శలు రావడం వల్ల ఆదాయేతర సూచీలను ప్రవేశపెట్టారు. వాటిలో మొదటిది భౌతిక జీవన ప్రమాణ సూచిక. 1979లో మోరిస్‌ డేవిడ్‌ మోరిస్‌ మూడు అంశాలను ఆధారం చేసుకుని భౌతిక జీవన ప్రమాణ సూచికను రూపొందించారు. 

1) ప్రజల ఆయుర్ధాయం

 2) శిశు మరణాల రేటు 

3) అక్షరాస్యత

  అంశం  గరిష్ఠ విలువ    కనిష్ఠ విలువ  వ్యాప్తి
1) ప్రజల ఆయుర్ధాయం  77 ఏళ్ళు  28 ఏళ్ళు  49
 2) శిశు మరణాల రేటు   09  229  220
3) అక్షరాస్యత 100  0  100


శిశు మరణాల రేటు విషయంలో మాత్రం కనిష్ఠ విలువ నుంచి వాస్తవ విలువ తీసేయాలి.

సూచిక విలువ 0 - 100 మధ్య ఉంటుంది.

తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాల్లో PQLI (Physical Quality of Life Index) విలువ తక్కువగా, ఎక్కువ తలసరి ఆదాయ దేశాల్లో PQLI విలువ అధికంగా ఉంటుంది.

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 21-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

ద్రవ్యం - విధులు


ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం నిర్వర్తించే విధులను రెండు రకాలుగా విభజించారు. అవి:

1. ప్రాథమిక విధులు     2. ద్వితీయ విధులు


ప్రాథమిక విధులు


ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:


విలువ కొలమానం (Measures of value) : అన్ని వస్తు, సేవల విలువను ద్రవ్యంతో కొలుస్తారు. ఆ విలువను ద్రవ్యరూపంలో పేర్కొంటే ధర ఏర్పడుతుంది.


వినిమయ మాధ్యమం(Medium of exchange) : వస్తువుకు, వస్తువుకు మధ్య ద్రవ్యం మధ్యవర్తిగా ఉంటుంది. ఇది అమ్మకాలు, కొనుగోళ్లు చేయడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా ప్రజల సమయం, శక్తి ఆదా అవుతాయి. 


ద్వితీయ విధులు


ఇందులో మూడు రకాలు ఉన్నాయి. అవి:


విలువ నిధి(Store of value): జె.ఎం. కీన్స్‌ విలువ నిధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సంపద అనేది ప్రస్తుత వినియోగానికే కాక, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.


వాయిదా చెల్లింపుల ప్రమాణం(Standard of deferred Payments): వ్యాపార, వ్యవహారాలు అరువు పద్ధతిలో కూడా నిర్వహించేందుకు ద్రవ్యం తోడ్పడుతుంది. ‘వాయిదా’ అంటే చెల్లింపులను భవిష్యత్తులో చేయడం.


విలువ బదిలీ(Transfer of value):  ఒక వ్యక్తి ఒక ప్రదేశంలోని ఆస్తిని అమ్మి, మరొక ప్రదేశంలో కొత్త ఆస్తిని కొనొచ్చు. రుణాన్ని తీసుకోవడం, రుణాన్ని ఇవ్వడం కూడా ద్రవ్యరూపంలోనే జరుగుతుంది. డేవిడ్‌ కిన్లే విలువ బదిలీ విధిని కింది విధంగా వివరించాడు. అవి:


ఎ) జాతీయాదాయ మదింపు - పంపిణీ: జాతీయాదాయాన్ని కొలవడంలో ద్రవ్యం సహాయపడుతుంది. వివిధ వస్తు, సేవల విలువను ద్రవ్యం రూపంలోకి మార్చి జాతీయాదాయాన్ని కొలుస్తారు.


బి) ఉపాంత ప్రయోజనాలు, ఉత్పాదకతలను సమానం చేసేదిగా ఉంటుంది: వస్తువుల ధరలు వాటి ఉపాంత ప్రయోజనాలను సూచించడమే కాక, అవి ద్రవ్యరూపంలోనే ఉంటాయి. కాబట్టి వివిధ వస్తువుల ఉపాంత ప్రయోజనాలను సమానం చేయడంలో ద్రవ్యం సహాయపడుతుంది.


సి) పరపతిని సృష్టించడం: ద్రవ్యం లేకుండా పరపతి సాధనాలు చలామణిలో ఉండే అవకాశం లేదు.


డి) అధిక  ద్రవ్యత్వ ఆస్తి: అన్ని రకాల సంపదను ద్రవ్యంలోకి మార్చవచ్చు.


వస్తు ద్రవ్యం 


వస్తు మార్పిడి లేదా వినిమయ పద్ధతి: ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతిని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉన్నప్పుడు ఈ పద్ధతి అమల్లో ఉండేది. ప్రాచీనకాలంలో మనిషి వస్తువును ద్రవ్యంగా ఉపయోగించాడు. ఆఫ్రికాలో ఏనుగు దంతాలు, అమెరికాలో పొగాకు, సముద్రతీర ప్రాంతాల్లో అరుదైన గవ్వలు, భారతదేశంలో గోవులను ద్రవ్యంగా వాడారు.


లక్షణాలు: ప్రజల కోరికలు పరిమితంగా ఉంటాయి.


* వినిమయ మాధ్యమం ఉండదు.


*  ప్రత్యక్షంగా వస్తువుకు బదులు వస్తువును మార్పిడి చేసుకుంటారు.


* లావాదేవీలు మందకొడిగా ఉంటాయి.


*  పరిమితమైన మార్కెట్‌ ఉంటుంది.


లోపాలు: ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల విషయంలో ఏకాభిప్రాయం ఉండకపోవొచ్చు.


* వస్తువు విలువను కొలిచే ప్రామాణిక కొలమానం లేదు.


* వస్తువులను విభజించలేం.


* వస్తువులను నిల్వ చేసుకోవడం కష్టం.


* సేవల మార్పిడికి పనికిరాదు.


* వాయిదా చెల్లింపులకు పనికిరాదు.


* ప్రత్యేకీకరణకు ఉపయోగపడదు.


* విలువలను బదిలీ చేయలేం.


కాగితపు ద్రవ్యం 


ఇందులో కాగితాన్ని ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీని చలామణికి ప్రభుత్వ అనుమతి ఉంటుంది.


*  ప్రపంచంలోనే మొదటిసారి క్రీ.శ.9వ శతాబ్దంలో చైనాలో కాగితపు ద్రవ్యాన్ని ఉపయోగించారు.


*  కాగితపు ద్రవ్యాన్ని పెద్ద మొత్తంలో వాడటం క్రీ.శ.17, 18వ శతాబ్దాల్లో ప్రారంభమైంది.


*  మన దేశంలో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో మొదలైంది.

 

*  1861 పేపర్‌ కరెన్సీ చట్టం భారత ప్రభుత్వానికి కాగితం కరెన్సీని జారీచేసే అధికారాన్ని కల్పించింది. అప్పటి నుంచి 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లు జారీ చేసేది.


*  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 1935, ఏప్రిల్‌ 1న ఏర్పడింది. ఆర్‌బీఐ 1938 నుంచి కరెన్సీ నోట్లను జారీచేస్తోంది.


*  మన దేశంలో కాగితం కరెన్సీని మొదటగా జారీ చేసింది - బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌. ఇది 1806లో దీన్ని తెచ్చింది.


*  కాగితం కరెన్సీ సౌకర్యవంత వినిమయ మాధ్యమంగా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు, నిల్వ చేయొచ్చు. ఈ కారణంగానే కాగితం కరెన్సీ ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చింది.


పాల్‌ ఐన్‌జిగ్‌ వర్గీకరణ

పాల్‌ ఐన్‌జిగ్‌ తాను రచించిన‘‘How money is managed'' అనే పుస్తకంలో ద్రవ్య విధులను రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి: 

1. నిశ్చల విధులు 

2. చలన (గతిశీల) విధులు


నిశ్చల విధులు: ద్రవ్యం అనేది వినిమయ సాధనం, విలువల కొలమానం,  విలువల నిధి లాంటి సంప్రదాయక విధులను నిర్వహిస్తుంది. వీటిని నిశ్చల విధులు లేదా సాంకేతిక విధులు అంటారు. ఈ విధుల వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై ఎలాంటి ప్రభావం ఉండదు. 


చలన విధులు: ద్రవ్యం తన విధుల ద్వారా ధరల స్థాయిని, ఉత్పత్తిని, వినియోగాన్ని, పంపిణీని ప్రభావితం చేస్తే వాటిని చలనాత్మక విధులు అంటారు.


ద్రవ్య పరిణామక్రమం


ద్రవ్య పరిణామక్రమంలో ముఖ్యంగా కింది దశలు  ఉంటాయి. అవి:

1. వస్తు ద్రవ్యం   2. లోహ ద్రవ్యం

3. కాగితపు ద్రవ్యం  4. పరపతి ద్రవ్యం 

5. సమీప ద్రవ్యం


లోహ ద్రవ్యం 


నాగరికత, అభివృద్ధి చెందిన వ్యాపార సంబంధాలు పెరగడం వల్ల లోహ ద్రవ్యం వాడుకలోకి వచ్చింది. బంగారం, వెండి, రాగి, మొదలైన లోహాలను ద్రవ్యంగా వాడేవారు.


*  లోహాన్ని ప్రారంభంలో కడ్డీల రూపంలో లేదా ముద్దరూపంలో వాడారు. తర్వాతి కాలంలో నాణేలుగా చలామణిలోకి తెచ్చారు.


*  నాణేలను మొదటగా క్రీ.పూ. 700లో వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.


పరపతి ద్రవ్యం 


ప్రజలు తమ వద్ద అవసరానికంటే ఎక్కువగా ఉన్న డబ్బును బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంచుతారు. 


*  ఆ ధనాన్ని వారు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు లేదా ఇతరులకు బ్యాంకు చెక్కుల ద్వారా బదిలీ చేయొచ్చు. 


* బ్యాంకు చెక్కును పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యం అంటారు. 


సమీప ద్రవ్యం 


ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు మొదలైనవాటిని సమీప ద్రవ్యంగా పేర్కొంటారు.


*  వీటికి ద్రవ్యత్వం ఎక్కువ. తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో వీటిని నగదులోకి మార్చుకోవచ్చు.


ద్రవ్యం - రకాలు 

స్వభావం ఆధారంగా ద్రవ్యాన్ని కింది విధాలుగా వర్గీకరించారు. అవి:  

1. పదార్థాన్ని బట్టి ద్రవ్యం రకాలు

2. చట్టబద్ధతను బట్టి ద్రవ్యం రకాలు

3. ద్రవ్యత్వాన్ని బట్టి ద్రవ్యం రకాలు

4. ఇతర రకాలు


 

Posted Date : 24-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

ఆర్‌బీఐ ద్రవ్య వర్గీకరణ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 1977, ఏప్రిల్‌ నుంచి నాలుగు రకాల ద్రవ్య భావనలను ప్రవేశపెట్టింది. వీటిని ద్రవ్య సమిష్టులు అని కూడా అంటారు.

1. M1   2. M    3. M    4. M4


M1 : దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి: 

i. ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు (C)

ii. సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల డిమాండ్‌ డిపాజిట్లు (DD)

iii. కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు (OD)

దీన్నే సంకుచిత ద్రవ్యం  ( Narrow Money) అంటారు. 

సంప్రదాయవాదులు దీన్ని ద్రవ్య సరఫరాగా పేర్కొన్నారు.

M2: ఇందులో M1తో పాటు అదనంగా తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాల్లో ఉన్న డిపాజిట్‌ మొత్తాలు కూడా కలుస్తాయి.

M3: ఇందులో M1తో పాటు వివిధ సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల్లో ఉండే కాలపరిమితి డిపాజిట్లు కూడా కలుస్తాయి. దీన్ని విశాల ద్రవ్యం (Broad Money) అంటారు.

M4: ఇందులో లీ1తో పాటు తపాలా కార్యాలయాల్లోని అన్ని రకాల డిపాజిట్లు కలిపి ఉంటాయి.

ప్రస్తుతం అనుసరిస్తున్న సమిష్టులు కింది విధంగా ఉన్నాయి.

* M1 +  కరెన్సీ + డిమాండ్‌ డిపాజిట్లు + ఇతర డిపాజిట్లు (మార్పు లేదు)

* M2= M1 + బ్యాంకుల కాలపరిమితి డిపాజిట్లు + బ్యాంకులు జారీచేసే డిపాజిట్లు

* M3 = M2 + ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న డిపాజిట్లు + స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు 

* Mను తొలగించారు.


ద్రవ్యత్వ వనరులు (Liquidity Resource)  

ద్రవ్యత్వ వనరులను ఆర్‌బీఐ వర్కింగ్‌ కమిటీ ప్రవేశపెట్టింది. ఇవి కింది విధంగా ఉంటాయి.

* L1 = సవరించిన M3 + జాతీయ పొదుపు పత్రాలతో సహా తపాలా కార్యాలయాల్లో ఉండే అన్ని రకాల డిపాజిట్లు.

*L2 = L1+  దీర్ఘకాలిక రుణాలు, విత్త సంస్థల కాలపరిమితి రుణాలు ్ఘ విత్త సంస్థలు జారీచేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు.

* L3 = L+ బ్యాంకేతర విత్త సంస్థల ప్రజా డిపాజిట్లు.


స్మారక నాణేలు

ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో వీటిని విడుదల చేస్తారు.

* సాధారణ కరెన్సీ నోట్లు, నాణేల మాదిరి స్మారక నాణేలు వినియోగం కోసం జారీ చేసేవికాదు. వీటిని బంగారం, వెండి తదితర లోహాలతో తయారుచేస్తారు. వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని కేవలం సేకరించడానికి తప్ప, వినియోగానికి ఉపయోగించరు. 

* కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాల్లోని ముద్రణాలయాల్లో స్మారక నాణేలను రూపొందిస్తారు. 

* నాణేల సేకరణపై ఆసక్తి ఉన్నవారు దేశంలోని ముద్రణాలయాల ద్వారా వీటిని పొందవచ్చు.


ద్రవ్యరాశి సిద్ధాంతాలు

ద్రవ్య పరిమాణంలో వచ్చే మార్పులకు ద్రవ్యం విలువ ఎలా మారుతుందో ద్రవ్యరాశి సిద్ధాంతాలు తెలుపుతాయి.

ద్రవ్య విలువ: వస్తుసేవలను కొనుగోలు చేయడానికి ఉండే శక్తిని ద్రవ్య విలువ అంటారు.

ద్రవ్య చలామణి వేగం: ఒక యూనిట్‌ మారక ప్రక్రియలో లేదా వ్యవహారాల్లో ద్రవ్యాన్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తారో అదే ద్రవ్య చలామణి వేగం.

పరిణామ క్రమం: ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని మొదటిసారి క్రీ.శ.1558లో ఇటాలియన్‌ ఆర్థికవేత్త దావన్‌ జెట్టి ప్రతిపాదించారు.


ప్రముఖుల అభిప్రాయాలు

* ‘‘యూరప్‌ ఖండంలో బంగారు నిక్షేపాలు ఎక్కువగా లభ్యమయ్యాయి. ఇది ధరల స్థాయుల్లో పెరుగుదలకు కారణమైంది’’ - కోపర్నికస్, జీన్‌ బోడిన్‌.

* ద్రవ్య సప్లయ్‌ ద్రవ్య వ్యవహారం మధ్య ఉండే సంబంధాన్ని డేవిడ్‌ హ్యూమ్‌ (1752) ప్రతిపాదించాడు. దీన్నే జె.ఎస్‌.మిల్‌ తన వినిమయ సమీకరణంలో ప్రస్తావించాడు.

* ఆధునిక ద్రవ్య సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌.

* అమెరికా ఆర్థికవేత్త ఇర్వింగ్‌ ఫిషర్‌ (1911) తన  Purchasing Power  of money అనే పుస్తకంలో ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతాన్ని వివరించాడు.

*  జె.ఎం.కీన్స్‌ 1923లో A Tract n moneytary Reform  అనే పుస్తకంలో నూతన ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.


కొత్త పార్లమెంట్‌ స్మారక నాణెం 

* కొత్త పార్లమెంట్‌ భవనాన్ని 2023, మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం రూ.75 నాణేన్ని విడుదల చేసింది. 

* దీనిపై కొత్త పార్లమెంట్‌ భవన చిత్రం ఉంటుంది. దాని పైభాగంలో ‘సంసద్‌ సానుకూల్‌’ అని దేవనాగరి లిపిలో, దిగువ భాగంలో పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ అని ఇంగ్లిష్‌లో ముద్రించారు. 

* ఈ నాణెం 44 మిల్లీ మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 వంకీలు ఉంటాయి. దాదాపు 35 గ్రాముల బరువు ఉంటుంది. 

* ఈ నాణేన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌ కలిపిన మిశ్రమంతో తయారు చేశారు. 

* నాణేనికి మరోవైపు మూడు సింహాలతో ఉన్న అశోక స్తూపం, దాని కింద ‘సత్యమేవ జయతే’, రెండువైపులా ‘భారత్‌’ అని దేవనాగరి లిపిలో, ఇండియా అని ఇంగ్లిష్‌లో రాసి ఉంటుంది. 

*  మూడు సింహాల గుర్తు కింద రూపాయి గుర్తు, నాణెం విలువను సూచిస్తూ 75 సంఖ్య అడుగు భాగాన ముద్రించారు. 

* ఇంతకుముందు కూడా రూ.75 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్రం ఈ నాణేన్ని రూపొందించింది.


ఎన్టీఆర్‌ స్మారక నాణెం

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్‌.టి. రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ రూ.100 స్మారక నాణేన్ని ముద్రించింది. 

* దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023, ఆగస్టు 28న విడుదల చేశారు. 

* ఈ నాణేన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌తో రూపొందించారు. ఇది 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది.


 


మాదిరి ప్రశ్నలు

1. భారత పేపర్‌ కరెన్సీ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1860  2) 1861  3) 1862  4) 1863


2. కింది వాటిలో సమీప ద్రవ్యానికి (Near Money) ఉదాహరణ?

1) ట్రెజరీ బిల్లులు, బాండ్లు   2) డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు

3) ప్రామిసరీ నోట్లు    4) పైవన్నీ


3. ప్రజలు తమ వద్ద ఎక్కువగా ఉన్న ద్రవ్యాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే దాన్ని ఏమంటారు?

1) రిజర్వ్‌ ద్రవ్యం    2) సమీప ద్రవ్యం

3) టోకెన్‌ ద్రవ్యం    4) సామాన్య ద్రవ్యం


4. రిజర్వ్‌ ద్రవ్యాన్ని ఏమని పిలుస్తారు?

1) అధిక శక్తిమంతమైన ద్రవ్యం   2) మూలాధార ద్రవ్యం

3) 1, 2         4) ఆవర్జా ద్రవ్యం


5. మనదేశంలో నాణేల ముద్రణా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

1) ముంబయి, కోల్‌కతా   2) హైదరాబాద్‌

3) నోయిడా          4) పైవన్నీ


6. క్రిప్టో కరెన్సీని ఏమని పిలుస్తారు?

1) డిజిటల్‌ కరెన్సీ   2) ప్రత్యామ్నాయ కరెన్సీ

3) వర్చువల్‌ కరెన్సీ     4) పైవన్నీ


సమాధానాలు 

1-2    2-4    3-1    4-3    5-4    6-4

 

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

    ఆర్థిక సంఘం

విత్త వనరుల విశిష్ట విభజన!


సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం అత్యంత కీలకం. అధికారాలు, విధులతో పాటు ఆర్థిక వనరుల పంపిణీ ఆచరణాత్మకంగా, అభిలషణీయంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ విశిష్ట బాధ్యతల నిర్వహణ కోసం ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్థిక సంఘం. ప్రభుత్వాల ఆర్థిక స్థితిని అంచనా వేయడం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను సిఫార్సు చేయడం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని నిర్ణయించే సూత్రాలను రూపొందించడం దీని విధి. ప్రభుత్వాలు చేసే ఖర్చులో నాణ్యతను పెంచడంతో పాటు ఆర్థిక స్థిరత్వం, సమ్మిళిత వృద్ధి సాధించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటివరకు ఆర్థిక సంఘాలు చేసిన సూచనలు, వాటి అమలుతీరు, కాలానుగుణంగా మారుతున్న ప్రాధాన్యాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ బాధ్యతను ఆర్థిక సంఘం నిర్వహిస్తుంది. ఇది ప్రణాళికేతర విత్తవనరుల బదిలీని సూచిస్తుంది.

విధులు:

1) పన్నుల ద్వారా సమకూరిన నికర రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం, అందులో రాష్ట్రాల వాటా నిర్ణయించడం.

2) సంఘటిత నిధి నుంచి గ్రాంట్ల బదిలీకి అనుసరించాల్సిన నియమాలను సూచించడం.

3) రాష్ట్రపతి సూచించిన ఇతర ఆర్థిక అంశాలపై విశ్లేషణ.


మన దేశంలో పన్ను వనరులు కేంద్రానికి ఎక్కువగా, రాష్ట్రాలకు తక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో వనరుల బదిలీ జరగాలని రాజ్యాంగంలోని 275వ అధికరణ నిర్దేశిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కూడా నిర్దిష్ట సహాయం అందుతుంది. ఆర్థిక సంఘం సలహా ప్రకారమే ఈ బదిలీలు జరుగుతాయి. అలాగే 282వ అధికరణ ప్రకారం ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలకు తన విచక్షణపై గ్రాంట్లు ఇవ్వవచ్చు. ఇందులో గ్రాంట్ల పరిమాణాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది.


* రాష్ట్రాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రుణాలు తీసుకోవచ్చు. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వనరులు 3 విధాలుగా బదిలీ అవుతాయి. అవి

1) పన్నులు, సుంకాల్లో వాటా

2) గ్రాంట్లు

3) రుణాలు.

ఆర్థిక సంఘం ద్వారా వనరుల బదిలీ (1951-2000): కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధులు బదిలీ చేసేటప్పుడు దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వనరుల బదిలీ ప్రాతిపదికలను కూడా మారుస్తుంటారు.


1) ఆదాయపన్ను, ఎక్సైజ్‌ సుంకం: ఒకటో ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు ఆదాయ పన్నులో 55 శాతం పంచాలని నిర్ణయించగా, పదో ఆర్థిక సంఘం 77.5% ఇవ్వాలని సూచించింది. మొదటి విత్త సంఘం కేంద్ర ఎక్సైజ్‌ సుంకాల్లో రాష్ట్రాలకు 40% సూచిస్తే, పదో విత్త సంఘం 47.5% వాటాను ప్రతిపాదించింది.

2) అదనపు ఎక్సైజ్‌ సుంకం: 1956లో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)తో కుదిరిన ఒప్పందం ప్రకారం మిల్లులో తయారైన నూలు, పొగాకు, పంచదారపై అమ్మకం పన్ను స్థానంలో అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం విధిస్తుంది. ఈ ఆదాయం ఆ రాష్ట్రాల్లో వినియోగం మేరకు బదిలీ అవుతుంది.


3) ఎస్టేట్‌ సుంకం: ఈ పన్ను రాబడిని కూడా కేంద్రం పూర్తిగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. (1985లో ఈ సుంకం రద్దయ్యింది.)


4) రాష్ట్రాలకు గ్రాంట్లు: మొదటి ఆర్థిక సంఘం ప్రకారం గ్రాంట్లు అందించేటప్పుడు బడ్జెట్‌ అవసరాలు, పన్ను ప్రయత్నాలు, రాష్ట్రాల వ్యయం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. తొమ్మిదో విత్త సంఘం బడ్జెట్‌ అంతరాలను భర్తీ చేయడానికి గ్రాంట్లు ఇచ్చే బదులు కోశ అవసరాలను బట్టి గ్రాంట్లు ఇవ్వాలని సూచించింది.


5) రాష్ట్రాలకు రుణాలు: రెండో విత్త సంఘం మార్కెట్‌ వడ్డీ రేటుకే కేంద్రం రాష్ట్రాలకు రుణం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆరో విత్త సంఘం రుణ చెల్లింపు కాలాన్ని 20 నుంచి 30 ఏళ్ల వరకు పెంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. పదమూడో విత్తసంఘం రెవెన్యూ లోటు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు స్థూల జాతీయోత్పత్తిలో 68 శాతం మించకూడదని సిఫార్సు చేసింది.


6) విపత్తు నిధి: జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ఎనిమిదో ఆర్థిక సంఘం వరకు రాష్ట్రానికి కొంత సహాయం చేసేవారు. దీనినే మార్జిన్‌ మనీ స్కీమ్‌ అంటారు. తొమ్మిదో విత్త సంఘం విపత్తు నిధిని ప్రతి రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి కేంద్రం, రాష్ట్రాలు 75 : 25 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి. పదో విత్త సంఘం దీన్ని కొనసాగించడమే కాకుండా కేంద్రానికి సెంట్రల్‌ ఫండ్‌ని సిఫార్సు చేసింది. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పదకొండో విత్త సంఘం జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సిఫార్సు చేసింది.


7) స్థానిక సంస్థలు: 1993లో తీసుకొచ్చిన 73, 74వ రాజ్యాంగ సవరణలు పంచాయతీలు, మున్సిపాలిటీ, స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి అవకాశం కల్పించాయి. స్థానిక సంస్థలకు నిధులు అందించాలని పదకొండో ఆర్థిక సంఘం మొదటిసారిగా సిఫార్సు చేసింది.

 

8) రుణ ఉపశమనం: రాష్ట్రాలు రుణాల కోసం కేంద్రంపై ఆధారపడటం తగ్గించాలని, నేరుగా మార్కెట్‌ నుంచే సేకరించుకోవాలని పన్నెండో విత్త సంఘం సిఫార్సు చేసింది.


14వ ఆర్థిక సంఘం (2015-20):  డాక్టర్‌ వై.వి.రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది. పన్నులు, గ్రాంట్లను రాష్ట్రాలకు బదిలీ చేసేటప్పుడు 1971 జనాభా లెక్కలతోపాటు 1971 తర్వాత వచ్చిన జనాభా మార్పులనూ పరిగణనలోకి తీసుకుంది.


1) కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా: కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాని 32% నుంచి 42%కు పెంచింది.


2) రాష్ట్రాల మధ్య పన్నుల బదిలీకి కొత్త సూత్రాన్ని సూచించింది.

గమనిక: 13వ ఆర్థిక సంఘం కోశ నిర్వహణను పరిగణించగా, 14వ ఆర్థిక సంఘం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.


* 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి అధిక పన్నుల వాటా బదిలీ అయిన రాష్ట్రాలు

1) ఉత్తర్‌ప్రదేశ్‌

2) బిహార్‌.

తక్కువ పన్నుల వాటా పొందిన రాష్ట్రాలు

1) సిక్కిం

2) గోవా.


3) గ్రాంట్లు: రెవెన్యూ లోటు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, స్థానిక సంస్థలకు గ్రాంట్లను సిఫార్సు చేసింది.


4) జీఎస్టీ: 14వ విత్త సంఘం జీఎస్టీపై సూచనలు చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 100 శాతం, 4వ సంవత్సరం 75 శాతం, 5వ సంవత్సరానికి 50 శాతం కేంద్రం భరించాలి.


5) కేంద్ర ప్రాయోజిత పథకాలు: కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 30 పథకాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసినప్పటికీ పథకాల ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 8 పథకాలనే బదిలీ చేశారు.

15వ ఆర్థిక సంఘం (2020-25):  రాష్ట్రపతి 15వ ఆర్థిక సంఘాన్ని 2017, నవంబరు 17న ఎన్‌.కె.సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. 2020-25 కాలానికి వర్తించే విధంగా ఈ కమిటీ 2019, అక్టోబరులో సిఫార్సులు అందించాల్సి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పలు కీలక పరిణామాలు సంభవించాయి.. అవి

1) జమ్ము-కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం (2019)

2) ప్రపంచ ఆర్థిక వృద్ధిలో తగ్గుదల (3 శాతం)

3) కార్పొరేట్‌ పన్ను రాబడి 19 శాతం తగ్గుదల

4) నిర్మాణాత్మక సంస్కరణలు.


ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ విత్త సంఘం రెండు నివేదికలను సమర్పించాల్సి వచ్చింది. 2020 -21 సంవత్సరానికి మధ్యంతర సిఫార్సులతో తొలి నివేదికను 2020, ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందు ఉంచింది. తుది నివేదికను 2020, నవంబరులో రాష్ట్రపతికి సమర్పించారు. తర్వాత 2021 ఫిబ్రవరిలో పార్లమెంటు ముందు ఉంచారు. ఈ సిఫార్సులు 2021-22 నుంచి 2025-26 కాలానికి వర్తిస్తాయి.

2015-16లో కోశ విధానపరంగా పలు మార్పులు జరిగాయి.


1) ప్రణాళికా సంఘం రద్దు.


2) ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు రద్దు.


3) జీఎస్టీని ప్రవేశపెట్టడం.


4) రాష్ట్రాలకు 41 శాతం పన్నుల వాటా బదిలీ.


5) పన్ను జీడీపీ నిష్పత్తి 10.2 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది.


6) జీడీపీ రక్షణ వ్యయం 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది.


7) రాష్ట్రాల్లో కోశ లోటు 1.9 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది.


8) స్థూల పన్ను రాబడుల్లో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా 2018-19 నాటికి 19.9% పెరిగింది.

 

రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ప్రాతిపదిక


        


గమనిక: ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని దేశంలో అత్యధిక జీఎస్‌డీపీ ఉన్న రాష్ట్రంతో పోల్చడం ద్వారా ఆదాయ దూరాన్ని నిర్ణయిస్తారు.


* 15వ ఆర్థిక సంఘం ప్రకారం అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (17.939%), బిహార్‌ (10.058%), మధ్యప్రదేశ్‌ (7.850%), పశ్చిమ బెంగాల్‌ (7.523%), మహారాష్ట్ర (6.317%)


* తక్కువ వాటా పొందిన రాష్ట్రాలు గోవా (0.386%), సిక్కిం (0.388%)


* తెలుగు రాష్ట్రాల వాటా: ఆంధ్రప్రదేశ్‌ (4.047%), తెలంగాణ (2.102%).


*15వ ఆర్థిక సంఘం 1. ఛైర్మన్‌: ఎన్‌.కె. సింగ్‌ - మాజీ ప్రభుత్వ కార్యదర్శి

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 06-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యోల్బణం - కొలమానాలు

సమర్థ ఆర్థిక విధానాలకు సాధనాలు!


ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. అవి ద్రవ్య విధాన నిర్ణయాలను, పెట్టుబడి వ్యూహాలను, వేతనాల తీరుతెన్నులను నిర్ణయిస్తుంటాయి. ఆ పరిణామాలను కొన్ని ధరల సూచికల ఆధారంగా అంచనా వేస్తుంటారు. దాంతోపాటు జనాభా కొనుగోలు శక్తిని, ధరల స్థిరత్వాన్ని లెక్కించడానికి, స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి, ద్రవ్యోల్బణం ఒత్తిడిని నియంత్రించడానికి, సమర్థ ఆర్థిక విధానాలను రూపొందించడానికి ఆ సూచికలనే కొలమానాలుగా ఉపయోగిస్తుంటారు. వీటిపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు ద్రవ్యోల్బణాన్ని గణించే సూచికలను, ఆహార ద్రవ్యోల్బణం, వివిధ నియంత్రణ చర్యల గురించి తెలుసుకోవాలి. 


భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని రెండు సూచీల ఆధారంగా గణిస్తున్నారు. అవి 

1) టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ),  

2) వినియోగ ధరల సూచిక (సీపీఐ). 


టోకు ధరల సూచిక: మొదట్లో ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచిక ఆధారంగా గణించేవారు. వ్యవహారాల ప్రారంభ   దశలో పెద్ద మొత్తంలో వస్తువులు అమ్మేటప్పుడు ధరల సగటు మార్పును లెక్కిస్తారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణ గణాంకాలను నెలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. గణనకు ప్రాథమిక వస్తువులు, ఫ్యూయల్, విద్యుత్తుకు సంబంధించిన వస్తువులు, తయారీ వస్తువులు అనే మూడు గ్రూపులు తీసుకుంటారు. ఈ గణనలో తయారీ వస్తువులు అత్యధిక భారితం (వెయిటేజీ) కలిగి ఉంటాయి. ఉత్పత్తి విలువను బట్టి ఈ భారితాన్ని ఇస్తారు. టోకుధరల సూచీలో సేవలను పరిగణనలోకి తీసుకోరు. ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌’వారు టోకు ధరల సూచీని లెక్కించడానికి ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కి 2017లో మార్చారు. టోకు ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని ఇప్పటివరకు 7 సార్లు సవరించారు. అవి 1952-53, 1961-62, 1970-71, 1981-82, 1993-94, 2004-05, 2011-12. సౌమిత్ర చౌదరీ అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్‌ గ్రూప్‌ 2011-12 ఆధార సంవత్సరాన్ని సిఫార్సు చేసింది. కొత్త ఆధార  సంవత్సరాన్ని మార్చిన తర్వాత వస్తువుల సంఖ్య 676 నుంచి 697కి పెరిగింది. 


ప్రధాన అంశాలు: 

1) కొత్త ఆధార సంవత్సరంలో పరోక్ష పన్నులను లెక్కించలేదు. 

2) అంకమద్యమానికి బదులు ప్రస్తుతం గుణమద్యమంలో లెక్కిస్తున్నారు. 

3) గతంలో విద్యుచ్ఛక్తిని వ్యవసాయం, గృహ, వాణిజ్య, రైల్వే, పారిశ్రామిక రంగాల్లో భాగంగా గణించేవారు. ప్రస్తుతం    విద్యుచ్ఛక్తిని ప్రత్యక్షంగా సింగిల్‌ యూనిట్‌గా గణిస్తున్నారు. 


వినియోగ ధరల సూచిక: సమాజంలో ఒక వర్గం ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి వినియోగధరల సూచికను గణిస్తారు. వారి వ్యయాన్ని బట్టి వస్తువులకు భారితాన్ని ఇస్తారు. దీనిలో రిటైల్‌ ధరలు తీసుకుంటారు. మనదేశంలో 4 రకాల వినియోగ ధరల సూచికలు ఉన్నాయి. 


1) పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచిక: లేబర్, ఎంప్లాయిమెంట్‌ సలహా కమిటీ ప్రకారం 260 వస్తువుల సేవలను అంచనా వేస్తారు. 2020, ఫిబ్రవరిలో ఆధార సంవత్సరాన్ని 2001 నుంచి 2016కి మార్చారు. నెలవారీ ప్రాతిపదికన గణాంకాలను సేకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని (డీఏ) దీని ద్వారా ప్రకటిస్తారు. 


2) వ్యవసాయ శ్రామికుల వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రాతిపదికగా గణాంకాలను సేకరిస్తారు. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ శ్రామికుల కనీస వేతనాలను సవరించడానికి ఉపయోగపడుతుంది. ఉదా: ఉపాధిహామీ పనుల వేతనాలు 


3) గ్రామీణ శ్రామికుల వినియోగ ధరల సూచిక: దీని ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ మూడు గణాంకాలను లేబర్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా వారు అంచనా వేస్తారు. 


4) నూతన వినియోగ ధరల సూచిక: ఆధార సంవత్సరం 2011-12 కి ముందు వివిధ రకాల వినియోగ ధరల సూచికలను గణించేవారు. ఇవి ఏదో ఒక కేటగిరి ప్రజలకు సంబంధించిన వస్తువుల ధరల పెరుగుదలను మాత్రమే  ప్రకటించేవి. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం ధరల పెరుగుదలను వ్యక్తపరిచేవి కావు. అందువల్ల ఆర్‌బీఐ గ్రామీణ, పట్టణాలకు సంబంధించి ద్రవ్యోల్బణ సూచికలను గణించాలని నిర్ణయించింది. దీని ఆధారంగా కేంద్ర గణాంక సంస్థ సీపీఐ గ్రామీణ, సీపీఐ పట్టణ, సీపీఐ అఖిలభారత సూచికలను తయారు చేస్తుంది. 


* 2001 జనాభా లెక్కల ప్రకారం 9 లక్షల జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్న 310 పట్టణాల్లో సీపీఐ పట్టణాన్ని   గణిస్తారు. 

* దేశంలో జిల్లాకు రెండు గ్రామాలను తీసుకుని 1183 గ్రామాల్లో ధరల కొటేషన్లను సేకరించడం ద్వారా సీపీఐ గ్రామీణాన్ని గణిస్తారు.

* ఈ రెండింటినీ కలిపి సీపీఐ అఖిలభారతాన్ని రూపొందిస్తున్నారు. నూతన సీపీఐ గణనలో గ్రామీణ ప్రాంతాల్లో 225 , పట్టణ ప్రాంతాల్లో 250 వస్తువులను తీసుకుంటారు. 20రకాల సేవలను కూడా ఇందులో చేర్చారు. రిటైల్‌ ధరల ఆధారంగా దీనిని గణిస్తారు. ఈ నూతన సూచీని ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ సిఫార్సు చేసింది. దీనిలో అత్యధిక భారితం ఆహార అంశాలకు ఉంది.


ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (పీపీఐ): బీఎన్‌ గోల్డర్‌ అధ్యక్షతన 2017లో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పీపీఐను ప్రవేశపెట్టారు. పీపీఐ అనేది మార్కెట్‌లోని ప్రాథమిక, మధ్యంతర, పూర్తిగా తయారైన వస్తువులు, సేవల ధరల్లో వచ్చే మార్పులను గణిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలు టోకుధరల సూచిక స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాయి. బీఎన్‌ గోల్డర్‌ కమిటీ భారత్‌లో టోకు ధరల సూచీ స్థానంలో పీపీఐని ప్రవేశపెట్టాలని, సూచీని నెలవారీ ప్రాతిపదికన విడుదల చేయాలని, ఆధార సంవత్సరం 2011-12ని కొనసాగించాలని, ప్రారంభంలో 15 సేవలను తీసుకోవాలని సిఫార్సు చేసింది. 


ఆహార ద్రవ్యోల్బణం: గణించేందుకు రెండు సూచీలున్నాయి. 


1) టోకు ధరల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: టోకు ధరల సూచికలోని ప్రాథమిక వస్తువుల్లో ఆహార వస్తువులను, తయారీ వస్తువుల్లోని ఆహార వస్తువులను కలిపి దీన్ని లెక్కిస్తారు. దీనిలో అతిపెద్ద వాటాదారు ఆహారవస్తువులు. ఆ ఆహారవస్తువుల్లో అధిక భారితం కలిగింది పాలు.  


2) వినియోగ ధరల ఆధార ఆహార ద్రవ్యోల్బణం: కేంద్ర గణాంక సంస్థ దీన్ని 2014లో ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ, దేశానికి సంబంధించిన రిటైల్‌ ధరల ద్వారా దీన్ని గణిస్తారు. ఆధార సంవత్సరం 2012లో ఆహారం,     పానీయాల వాటా అధికంగా ఉంది. 


హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌: ఒక భౌగోళిక సరిహద్దు పరిధిలో నివాస ఆస్తుల ధరల్లో మార్పులను తెలియజేస్తుంది.   భారతదేశ మొదటి రెసిడెక్స్‌ని 2007లో జాతీయ హౌసింగ్‌ బ్యాంకు ప్రారంభించింది. దీని ఆధార సంవత్సరం 2012-13. జాతీయ హౌసింగ్‌ బ్యాంకు 50 నగరాలకు సంబంధించిన రెసిడెక్స్‌ని ప్రచురిస్తోంది. 


బాటిల్‌నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌: డిమాండ్‌ మారకుండా సప్లయి భారీగా పడిపోతే పెరిగే ధరలను బాటిల్‌నెక్‌ ఇన్‌ఫ్లేషన్‌ అంటారు. 


ద్రవ్యోల్బణ ధోరణిలో మార్పులు (2015-20): 2014 తర్వాత భారతదేశ ద్రవ్యోల్బణ ధోరణిలో వ్యవస్థాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1977-2000 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 9.0 శాతంగా ఉండేది. 2005-06 మధ్యకాలంలో -5.0 శాతానికి తగ్గింది. తర్వాత 2006-14 మధ్య తిరిగి 9.0 శాతంగా నమోదైంది. ముడిచమురు, విదేశీ మారకరేటు తగ్గుదల, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ఇందుకు కారణాలు. 2014-15లో 5.9 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు 2015-16లో 4.9 శాతానికి, ఆ తర్వాత 2016-17లో 4.5 శాతానికి తగ్గింది. టోకుధర, వినియోగ ధరల సూచీల మధ్య అంతరం తగ్గడమే ఇందుకు కారణం. 2014-15లో 4.7 శాతంగా ఉన్న ఈ అంతరం 2015-16లో 8.6 శాతానికి పెరిగింది. వర్తక వస్తువుల ధరల నియంత్రణ వల్ల టోకుధరల సూచీ స్థాయిని తగ్గించడంతో ఈ అంతరాన్ని 2.8 శాతానికి తగ్గించారు. వినియోగదారుడి ధరల సంబంధిత ఆహార ద్రవ్యోల్బణ రేటు 2014-15లో 6.4 శాతం నుంచి 2015-16లో 4.9 శాతానికి, తర్వాత 2016-17లో 4.2 శాతానికి తగ్గింది. ఆహారధాన్యాల ఉత్పత్తులు పెరగడం, 19 లక్షల టన్నుల ఆహారధాన్యాల మిగులు నిల్వలు ఏర్పాటుతో ఆహారద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.


ద్రవ్యోల్బణ నియంత్రణకు సూచనలు: 

1) నిరంతరం పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా అభివృద్ధేతర వ్యయాన్ని నియంత్రించాలి. ప్రభుత్వ యంత్రాంగంపై చేసే రెవెన్యూ వ్యయాన్ని పెరగకుండా చూడాలి. 

2) ప్రజాఉపయోగకరమైన పథకాలపై సమర్థంగా ఖర్చు చేసి, తక్కువ ప్రయోజనాలిచ్చే పథకాలు, ప్రచార కార్యక్రమాలపై వ్యయాన్ని నియంత్రించాలి. 

3) ప్రభుత్వం లోటు బడ్జెట్‌ విధానానికి స్వస్తి చెప్పి సంతులిత బడ్జెట్‌ విధానం వైపు దృష్టి సారించాలి. అంటే రెవెన్యూలోటు, కోశలోటును స్థూల దేశీయోత్పత్తిలో 2.0 శాతానికి తగ్గించాలి. 

4) బడ్జెట్‌ లోటును అధిగమించడానికి రాబడిని పెంచుకోవాలి. భారం అధికం కాకుండా ప్రస్తుత పన్నురేట్లను పెంచి, కొన్ని కొత్త పన్నులను విధించాలి. 

5) దేశీయ, విదేశీయ రుణభారం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో రుణసేకరణ నియమాలను పాటిస్తూ వడ్డీ చెల్లింపుల భారాన్ని కనిష్ఠంచేయాలి. 

6) కొరతగా ఉన్న వస్తువుల దిగుమతిని అనుమతించి, వాటి ఎగుమతిని క్రమబద్దీకరించాలి. దేశీయఉత్పత్తులను పెంచడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. 

7) అక్రమనిల్వలు, చీకటి వ్యాపారం లాంటి ప్రమాదకర పద్ధతులను కఠినంగాఅణచివేయాలి.


ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడటానికి కారణాలు: ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. 

1) చక్కెర, పప్పులు, ఉల్లిపాయలు లాంటి నిత్యావసర వస్తువుల అక్రమనిల్వ. 

2) బహుళజాతి సంస్థలు ఆహారవస్తువుల వ్యాపారంలో భావి వ్యాపారాన్ని నిర్వహించడం. 

3) వ్యవసాయరంగంలో సమస్యల వల్ల దేశ జనాభాకు అవసరమైన పరిమాణంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగకపోవడం. 

4) సబ్సిడీల తగ్గింపు, వ్యవసాయ ఉత్పాదకాలైన డీజిల్, ఎరువుల ధరలు   పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడం.


నియంత్రణ చర్యలు: 

1) కోశసంబంధ చర్యలుగా వరి, గోధుమ, పప్పులు, వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని సున్నారేటుకు తగ్గించింది. రిఫైన్డ్‌ నూనెలు, వెజిటేబుల్‌ ఆయిల్‌పై ఈ సుంకాన్ని ప్రభుత్వం 7.5 శాతానికి తగ్గించింది.ముడి చక్కెర దిగుమతిపై సుంకాన్ని కూడా సున్నారేటుకు తగ్గించింది. బియ్యం, వంటనూనెలు, పప్పుధాన్యాలు ఎగుమతిని నిషేధించింది. 

2) బియ్యం, మినుము, కందిపప్పు లాంటి ఆహారధాన్యాల భావివ్యాపారాన్ని నిలిపివేసింది. 

3) రాష్ట్రప్రభుత్వాలు రైతుబజార్లు, సంచాలక బజార్లు నెలకొల్పడానికి అనుమతించింది. 

4) మండీ టాక్స్, ఆక్ట్రాయ్‌ ఇతర స్థానిక పన్నుల వసూలును నిలిపేయాలని సూచించింది. 

5) శీతల గిడ్డంగుల నిర్మాణానికి కావాల్సిన నిధులకు ప్రోత్సాహం ఇచ్చింది. 

6) 2016-17 నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది.

7) 20 లక్షల టన్నుల కందిపప్పు మిగులు నిల్వలను ఏర్పాటుచేసి దాన్ని సబ్సిడీ ధరకు అమ్మడానికి ఏర్పాట్లుచేశారు. కందిపప్పు, ఉల్లిపాయలు, వంటనూనెలనిల్వలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లభించాయి. వీటి దిగుమతులపై సుంకం లేకుండా చేసి ఎగుమతులపై ఆంక్షలు విధించారు. 

8) ఆహారవస్తువుల కనీస మద్దతుధరను బాగా పెంచారు.

9) చక్కెర ఎగుమతులపై 20 శాతం పన్నువిధించి వంటనూనెలు, బంగాళాదుంపలపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు.


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 23-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్య సరఫరా కొలమానాలు

వినిమయ సాధనాల విలువల నిధి!

 

 


ఒక దేశ ఆర్థిక స్థిరత్వం ఆ ఆర్థిక వ్యవస్థలో జరిగే ద్రవ్యసరఫరా, చెలామణిపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు మారుస్తూ బ్యాంకుల్లో డిపాజిట్లు పెంచడం లేదా తగ్గించడం, ప్రజల చేతిలో ఉండే నగదును నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం లాంటివన్నీ ద్రవ్య సరఫరాతో ముడిపడినవే. అభివృద్ధిలో, ఆర్థిక విధానంలో కీలకమైన ద్రవ్య సరఫరాకు నిర్దిష్ట కొలమానాలున్నాయి. పూర్తిగా కేంద్రం, కేంద్ర బ్యాంకు పర్యవేక్షణలో జరిగే ఈ ప్రక్రియపై పరీక్షార్థులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. దీనికి సంబంధించి ప్రాచుర్యం పొందిన  సిద్ధాంతాలు, అందులోని ముఖ్యాంశాలను తెలుసుకోవాలి.

 

 


ద్రవ్య సరఫరాకు సంబంధించి రెండు రకాల నిర్వచనాలు ఉన్నాయి. మొదటిది సంప్రదాయంగా వ్యవహారంలో ఉన్నదైతే, రెండోదాన్ని చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చారు.  1) సంప్రదాయ నిర్వచనం ప్రకారం ద్రవ్య సరఫరా అంటే ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లో ఉన్న డిమాండ్‌ డిపాజిట్ల మొత్తం. 

2) చికాగో ఆర్థికవేత్తలైన మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ తదితరుల ప్రకారం ద్రవ్య సరఫరా అంటే ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లతోపాటు టైమ్‌ డిపాజిట్ల మొత్తం. సంప్రదాయ నిర్వచనం పరిమిత అర్థాన్ని ఇస్తే, చికాగో ఆర్థికవేత్తలు దాన్ని మరింత విస్తృత పరిచారు. 


భారతదేశంలో ద్రవ్య సరఫరా: 1967-68 వరకు దేశంలో సంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనాన్ని అమలు చేశారు. కానీ 1968 తర్వాత చికాగో ఆర్థికవేత్తల నిర్వచనాన్ని భారత రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించింది. 1977లో ఆర్‌బీఐ నాలుగు రకాల ద్రవ్య సరఫరా కొలమానాలను ప్రకటించింది. అవి ఎమ్‌-1, ఎమ్‌-2, ఎమ్‌-3, ఎమ్‌-4. 

ఎమ్‌-1 ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లు, రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-2 ద్రవ్యం: ఎమ్‌-1 ద్రవ్యంలోని అంశాలతోపాటు పోస్టాఫీసుల్లోని పొదుపు డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-3 ద్రవ్యం: ఎమ్‌-1 ద్రవ్యంలోని అంశాలతోపాటు బ్యాంకు వద్ద ఉండే కాలపరిమితి డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-4 ద్రవ్యం: ఎమ్‌-3 ద్రవ్యంలోని అంశాలతోపాటు పోస్టాఫీసుల్లోని మొత్తం డిపాజిట్లు.


ఎమ్‌-1ను సంకుచిత ద్రవ్యం అంటారు. దీనికి ద్రవ్యత్వం అధికం. ఎమ్‌-3ని విశాల ద్రవ్యం, సమష్టి ద్రవ్య వనరులు అని వ్యవహరిస్తారు. 


నూతన ద్రవ్యం-ద్రవ్యత్వ వనరులు: 1997లో డాక్టర్‌    వై.వి.రెడ్డి అధ్యక్షతన నియమించిన ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూపు, ద్రవ్య సరఫరాపై అధ్యయనం చేసి 1998లో నివేదిక సమర్పించింది. ఇది మూడు నూతన ద్రవ్య కొలమానాలను, మూడు ద్రవ్యత్వ కొలమానాలను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం పోస్టాఫీసులోని పొదుపు డిపాజిట్లను, మొత్తం డిపాజిట్లను, ద్రవ్యసరఫరా పరిధి నుంచి తొలగించారు. దాంతో నూతన ద్రవ్య కొలమానాలు మూడు రకాలుగా ఉన్నాయి.

ఎమ్‌-1 ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లు, రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-2 ద్రవ్యం: ఎమ్‌-1 ద్రవ్యంలోని అంశాలతోపాటు బ్యాంకుల వద్ద సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్న టైమ్‌ డిపాజిట్లు, బ్యాంకులు జారీ చేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు, కాలపరిమితితో చెల్లించే బ్యాంకు డిపాజిట్లు. 

 వాణిజ్య బ్యాంకులు జారీ చేసే డిపాజిట్‌ సర్టిఫికెట్లను మొదటిసారిగా 1989లో ప్రవేశపెట్టారు. వీటి పరిపక్వత కాలం 3 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. వీటిపై వడ్డీ అధికంగా ఉంటుంది. రూ.కోటి కనీస మొత్తానికి వీటిని జారీ చేస్తారు.

ఎమ్‌-3 ద్రవ్యం:  ఎమ్‌-2 ద్రవ్యంలోని అంశాలతోపాటు సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న టైం డిపాజిట్లు సహా స్వల్పకాల, దీర్ఘకాల బ్యాంకు రుణాలు.


ద్రవ్యత్వ వనరులు: రిజర్వ్‌ బ్యాంక్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నూతనంగా 3 రకాల ద్రవ్యత్వ వనరులను ప్రవేశపెట్టింది.

ఎల్‌-1: నూతన ఎమ్‌-3 ద్రవ్యం సహా పోస్టాఫీసుల్లోని అన్ని రకాల డిపాజిట్లు. 

ఎల్‌-2: ఎల్‌-1 సహా విత్త సంస్థల కాలపరిమితి డిపాజిట్లు, విత్త సంస్థలు జారీ చేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు, విత్త సంస్థల దీర్ఘకాలిక రుణాలు.  

ఎల్‌-3: ఎల్‌-2 సహా బ్యాంకేతర విత్త సంస్థల వద్ద ఉన్న ప్రజల డిపాజిట్లు. 


రిజర్వ్‌ ద్రవ్యం: ద్రవ్య సరఫరాని నిర్ణయించే అంశాల్లో ముఖ్యమైంది రిజర్వ్‌ ద్రవ్యం. రిజర్వ్‌ బ్యాంకు జారీ చేసి ప్రజలు, ఇతర వాణిజ్య బ్యాంకుల వద్ద నిల్వ ఉండే ద్రవ్యంతోపాటు రిజర్వ్‌ బ్యాంకు దగ్గర ఉన్న ఇతర డిపాజిట్లను కలిపి రిజర్వ్‌ ద్రవ్యం అంటారు. దీనిని ప్రభుత్వ ద్రవ్యం, మూలాధార ద్రవ్యం, హైపర్‌ ద్రవ్యం, ప్రాథమిక ద్రవ్యం అని వివిధ పేర్లతో వ్యవహరిస్తారు.


1991, మార్చి నాటికి ప్రజల వద్ద ఉన్న కరెన్సీ 63 శాతం అయితే, అది 2021, ఆగస్టు నాటికి 79.46 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ వద్ద ఉన్న బ్యాంకుల డిపాజిట్లు 36.2 శాతం నుంచి 19.03 శాతానికి తగ్గాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు 2021 నాటికి 1.2% మాత్రమే. నీ సాధారణ ద్రవ్యంలో డిమాండ్‌ డిపాజిట్లు ఉంటాయి. రిజర్వు ద్రవ్యంలో బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు ఉంటాయి.    


ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా అనేది రిజర్వ్‌ ద్రవ్య పరిమాణం, ద్రవ్య గుణకం మీద ఆధారపడి ఉంటుంది.


ద్రవ్య ప్రసార వేగం: ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్‌ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తుసేవల కొనుగోలుకు చేతులు మారుతుందో తెలియజేసే దాన్ని ద్రవ్యప్రసార వేగం అంటారు. ద్రవ్యప్రసార వేగం పలు అంశాలపై ఆధారపడుతుంది. అవి 1) పరపతి సంస్థలు 2) నగదు వ్యవహారాలు 3) వినియోగ ప్రవృత్తి 4) ఆదాయ పంపిణీ 5) ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 6) వేతన విధానం 7) రెగ్యులర్‌ ఆదాయం 8) పారిశ్రామిక అభివృద్ధి    9) రవాణా అభివృద్ధి 10) ప్రసార సాధనాల అభివృద్ధి



ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు:

1) సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనిలో ఫిషర్‌ సిద్ధాంతం ముఖ్యమైంది. ఇతడి ప్రకారం ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయడంతో వస్తుసేవలు కొనడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు.

2) నవ్య సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనిని కేంబ్రిడ్జి ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ద్రవ్యం విలువల నిధిగా పనిచేయడం వల్ల భవిష్యత్తు ఖర్చు   కోసం ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు.

3) కీన్స్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: జె.ఎం.కీన్స్‌ ప్రకారం ద్రవ్యాన్ని వినిమయ సాధనంగా మాత్రమే కాకుండా విలువల నిధిగా కూడా ఉపయోగిస్తారు. ద్రవ్య డిమాండ్‌ను ద్రవ్యత్వాభిరుచి నిర్ణయిస్తుంది. ఇది 3 అంశాలపై ఆధారపడుతుంది. 1) దైనందిన వ్యవహారాల ఉద్దేశం 2) ముందు జాగ్రత్తల కోసం 3) అంచనా వ్యాపారం కోసం.

దైనందిన వ్యవహారాల డిమాండ్, ముందు జాగ్రత్తల కోసం చేసే డిమాండ్‌ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కీన్స్‌ తర్వాత ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు 3 రకాలుగా ఉన్నాయి.


1) బౌమల్‌ ద్రవ్య సిద్ధాంతం: బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు వడ్డీ రేటుతో వ్యాకోచత్వ సంబంధం ఉంటుంది. వ్యక్తులు, సంస్థలు వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకుంటే వడ్డీని కోల్పోతారు. మార్కెట్‌లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే తమ వద్ద తక్కువ ద్రవ్యం ఉంచుకుంటారు. అంటే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు, వడ్డీ రేటుకు విలోమ సంబంధం ఉంటుంది. ఆదాయం పెరిగితే వ్యాపార వ్యవహారాల కోసం ఉంచుకునే ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయానికి, వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు అనులోమ సంబంధం ఉంటుంది. బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌ అనేది వడ్డీ రేటు, ఆదాయం అనే రెండు అంశాలపై  ఆధారపడి ఉంటుంది.


2) టోబిన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: కీన్స్‌ ప్రకారం వ్యక్తులు తమ ఆస్తిని ఎల్లప్పుడూ బాండ్లు లేదా నగదు రూపంలో నిల్వ చేస్తారు. టోబిన్‌ దీనిని వ్యతిరేకించాడు. సాధారణంగా వ్యక్తులు తమ ఆస్తి మొత్తాన్ని ఒకే రూపంలో కాకుండా, కొంతభాగాన్ని బాండ్ల మీద, మరికొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుతారు. సంపదలో కొంత భాగాన్ని బాండ్ల రూపంలోకి మారిస్తే దానిపై ప్రతిఫలం వస్తుంది. పైగా మూలధనం వృద్ధి జరుగుతుంది. అయితే ఒక్కోసారి వడ్డీ రేటు తగ్గితే మూలధనం నష్టం కూడా 
సంభవించవచ్చు.

3) ఫ్రీˆడ్‌మన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనినే ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతం అని కూడా అంటారు. ఇతడి ప్రకారం ద్రవ్యం సంపన్నుల సంపదను పెంచే ఒక సాధనం. ద్రవ్య డిమాండ్‌ను 4 అంశాలు నిర్ణయిస్తాయి. అవి  1) ధరల స్థాయి 2) ఆదాయ స్థాయి 3) ప్రస్తుత వడ్డీ రేటు 4) సాధారణ ధరల స్థాయిలోని మార్పు రేటు. ద్రవ్య డిమాండ్‌కు మొదటి రెండు అంశాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అంటే ధరల స్థాయి పెరిగినా, ఆదాయ స్థాయి పెరిగినా ద్రవ్య డిమాండ్‌ పెరుగుతుంది. అలాగే ద్రవ్య డిమాండ్‌కు 3, 4 అంశాలతో విలోమ సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరిగితే ద్రవ్యానికి డిమాండ్‌ తగ్గుతుంది. ధరల స్థాయి మారినప్పుడు ద్రవ్యం విలువ మారుతుంది.



రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 01-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రభుత్వ రాబడి

నిర్బంధ చెల్లింపులతో సంక్షేమ వ్యయాలు!

భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూరే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. రాజ్యాంగంలోని 268, 300 అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం పాలనా విధులను ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా సి) ఉమ్మడి జాబితాలుగా విభజించింది. వాటిని అనుసరించి పన్నులు విధించే అధికారాలను స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్రం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడినిచ్చే పన్నులు కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులను విధించి రాబడి పొందుతున్నాయి.


ప్రభుత్వ రాబడులు, వ్యయాన్ని ప్రభుత్వ విత్త శాస్త్రం తెలియజేస్తుంది. సంప్రదాయ ఆర్థికవేత్తల్లో ఒకరైన జె.బి.సే ‘‘ప్రణాళికల్లో తక్కువ ఖర్చు చేసేది ఉత్తమ ప్రణాళిక, పన్నుల్లో తక్కువ పన్ను విధించేది మంచి పన్ను’’ అని అభిప్రాయపడ్డారు. 1936లో జె.ఎం.కీన్స్‌ జనరల్‌ థియరీ రచనతో ప్రభుత్వ విత్తశాస్త్రం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


*  ప్రభుత్వ విత్తశాస్త్రం అధ్యయనం చేసే అంశాలు:


1) ప్రభుత్వ రాబడి: ప్రభుత్వ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడి అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో పన్నుల ద్వారా రాబడి ముఖ్యమైంది.


2) ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వం ఏయే అంశాలపై ఖర్చు చేస్తుంది, ప్రభుత్వ వ్యయం పెరగడానికి   కారణాలు; ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయంపై ప్రభుత్వ వ్యయం ప్రభావం లాంటి అంశాలను చర్చిస్తుంది.


3) ప్రభుత్వ రుణం: వ్యయానికి సరిపడా ఆదాయం సమకూర్చుకోలేనప్పుడు ప్రభుత్వం రుణం చేయాల్సి వస్తుంది. అంతర్గత, బహిర్గత రుణాలను ప్రభుత్వం తీసుకుంటుంది.


4) విత్త నిర్వహణ: బడ్జెట్‌ తయారు చేసే విధానం, చట్టసభలో దాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం, అమలుపరచడం, ఆడిటింగ్‌ లాంటి అంశాలుంటాయి.                                                              


5) కోశ విధానం: నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వ ఆదాయ-వ్యయ రుణ విధానాలను ప్రభుత్వం ఏవిధంగా ఉపయోగించుకుంటుందో   తెలియజేసేదే కోశ విధానం.


6) ఫెడరల్‌ విత్తం: ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరులు ఏవిధంగా విభజించాలి? వనరుల పంపిణీలో అసమానతలను ఎలా తగ్గించాలి? లాంటి   అంశాలను వివరిస్తుంది.


* ప్రభుత్వ రాబడి వర్గీకరణ: ప్రభుత్వానికి వచ్చే రాబడి రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అని రెండు రకాలు. రెవెన్యూ రాబడి రెండు మార్గాల్లో లభిస్తుంది.    

1) పన్ను రాబడి 

2) పన్నేతర రాబడి. 


1) పన్ను రాబడి:  పన్నులు విధించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడిని పన్ను రాబడి అంటారు. సెలిగ్‌మన్‌ ప్రకారం ‘‘తనకు సంక్రమించిన ప్రయోజనంతో సంబంధం లేకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు, సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్నులు’’. ఇవి పలు రకాలుగా ఉన్నాయి. 

ఎ) పన్ను భారాన్ని భరించే వారిని బట్టి పన్నులు రెండు రకాలు  

1) ప్రత్యక్ష పన్ను  

2) పరోక్ష పన్ను

వ్యక్తి పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే ద్రవ్యమే ద్రవ్య భారం. ఈ భారం రెండు రకాలు 

1) తొలి భారం 

2) అంతిమ భారం. ప్రభుత్వం పన్ను విధించినప్పుడు దాన్ని మొదటగా చెల్లించిన వ్యక్తి భరించే భారమే పన్ను తొలి భారం. పన్ను చిట్టచివరగా ఎవరు చెల్లిస్తారో ఆ భారమే అంతిమ భారం.


ఉదా: వినోద పన్ను తొలి భారాన్ని థియేటర్‌ యజమాని భరిస్తే, తుది భారాన్ని ప్రేక్షకుడు భరిస్తాడు.


ప్రత్యక్ష పన్ను: పన్ను తొలి, అంతిమ భారాలు ఒకే వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ప్రత్యక్ష పన్నుల భారాన్ని బదిలీ చేయడానికి వీలు కాదు.


ఉదా: ఆదాయ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను, కార్పొరేట్‌ పన్ను, బహుమతి పన్ను, స్టాంపు డ్యూటీ, వడ్డీ పన్ను, ఎస్టేట్‌ డ్యూటీ, వ్యయంపై పన్ను,   క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌


పరోక్ష పన్ను: పన్ను తొలి భారం ఒకరిపైన, అంతిమ భారం మరొకరిపైన ఉంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. పరోక్ష పన్నుల భారాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా బదిలీ చేయవచ్చు. పన్ను మొదట    ఎవరిపై విధిస్తారో వారు మరొకరికి పన్ను భారాన్ని బదిలీ చేస్తారు. ఉదా: కేంద్ర ఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకాలు, సేవా పన్ను, రాష్ట్ర అమ్మకం పన్ను, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకం, మోటారు వాహనాలపై పన్ను, విద్యుత్తుపై పన్ను, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను


బి) పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు మధ్య సంబంధం ఆధారంగా పన్నులు నాలుగు రకాలు:  పన్ను దేని ఆధారంగా విధిస్తారో తెలియజేసేది పన్ను ప్రాతిపదిక కాగా, ఎంత శాతం పన్ను విధిస్తారో తెలియజేసేది పన్ను రేటు. ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారో తెలియజేసేది పన్ను పరిధి.


1) అనుపాత పన్ను: పన్ను విధించడానికి ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్ను రేటు వర్తింపజేస్తే అది అనుపాత పన్ను అవుతుంది. ఉదాహరణకు ఆదాయ పన్ను 10 శాతంగా నిర్ణయిస్తే రూ.10 వేలు ఆదాయమైనా, రూ.లక్ష ఆదాయమైనా పన్ను రేటు మారదు. ఉదా: 1) అమ్మకపు పన్ను 2) సేవా పన్ను 3) ఎక్సైజ్‌ సుంకం


2) పురోగామి పన్ను: పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ, పన్ను రేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు. భారత్‌లో ఆదాయ పన్ను ఈ రకానికి చెందింది. ధనికులపై అధిక పన్ను,   పేదలపై తక్కువ పన్నును సూచిస్తుంది. అంటే ‘చెల్లింపు సామర్థ్యం (ఎబిలిటీ టూ పే’ ఆధారంగా ఈ పన్ను విధిస్తారు. పురోగామి పన్నుల వల్ల ఆదాయ అసమానతలు తగ్గడమే కాకుండా సాంఘిక న్యాయం జరుగుతుంది. ఆడంస్మిత్‌ పేర్కొన్న పన్ను నియమాల్లో సమతా    నియమాన్ని పురోగామి పన్ను తెలియజేస్తుంది. పన్ను చెల్లింపు సామర్థ్యం సూత్రంపై ఆధారపడింది.


3) తిరోగామి పన్ను: పన్నుకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే అది తిరోగామి పన్ను అవుతుంది. ఉదా: రూ.లక్ష - రూ.1.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తి 30 శాతం పన్ను, రూ.1.5 లక్షలు - రూ.2.50 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తి 20 శాతం పన్ను, రూ.2.50 లక్షల పైన ఆదాయం ఉన్న వ్యక్తి 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటే అది తిరోగామి పన్ను అవుతుంది.


4) డిగ్రెసివ్‌ పన్ను: ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు నెమ్మదిగా పెరిగి ఒక దశ తర్వాత పన్ను రేటులో మార్పు రాకపోతే దానిని డిగ్రెసివ్‌ పన్ను అంటారు. సాధారణంగా ఇది రెండు రకాలుగా ఉంటుంది.

1) పన్ను ఆధారమైన ఆదాయంలో లేదా సంపద విలువలో కొంత మొత్తాన్ని పన్ను చెల్లింపు నుంచి మినహాయించి మిగిలిన మొత్తం ఆదాయంపై ఒకే రేటులో పన్ను విధించడం. 

2) పన్ను ఆధారం పెరిగినంత వేగంగా పన్ను రేటు పెరగకపోవడం. ఈ పన్ను పద్ధతిలో అధిక ఆదాయం ఉన్న వ్యక్తి తక్కువ త్యాగం, తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ఎక్కువ త్యాగం చేస్తాడు.


సి) పన్ను విధింపు కాలం ప్రాతిపదికన పన్నులు రెండు రకాలు: 


1) తాత్కాలిక పన్ను: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాత్కాలిక అవసరాలు తీర్చుకునేందుకు విధించే పన్ను తాత్కాలిక పన్ను.

ఉదా: యుద్ధ సమయాల్లో విధించే సర్‌ఛార్జిలు. (యుద్ధం ముగిసిన తర్వాత దాన్ని రద్దు చేస్తారు.)


2) శాశ్వత పన్ను: శాశ్వత ప్రాతిపదికపై విధించే పన్ను శాశ్వత పన్ను. 

ఉదా: అమ్మకం పన్ను. 1886 నుంచి భారత్‌లో ఆదాయ పన్నును శాశ్వత ప్రాతిపదికన విధిస్తున్నారు.


డి) పన్ను విధింపు ఆధారంగా పన్నులు రెండు రకాలు:     

1) నిర్దిష్ట పన్ను 

2) విలువ ఆధారిత పన్ను


1) నిర్దిష్ట పన్ను: వస్తువు విలువతో సంబంధం లేకుండా బరువు/  సంఖ్య/కొలత/పరిమాణం ఆధారంగా పన్ను విధిస్తే దాన్ని నిర్దిష్ట పన్ను అంటారు. ఉదా: వినోదపు పన్ను


2) విలువ ఆధారిత పన్ను: దీనికి మూల్యానుగత పన్ను, అడ్వలోరెమ్‌ పన్ను అనే పేర్లు కూడా ఉన్నాయి. వస్తువు ద్రవ్య విలువ ఆధారంగా పన్ను విధిస్తే అది విలువ ఆధారిత పన్ను. సాధారణంగా వస్తువు విలువలో కొంత శాతాన్ని పన్నుగా విధిస్తారు. ఉదా: సేల్స్‌ ట్యాక్స్, కస్టమ్స్‌. మన దేశంలో ఎక్కువ పన్నులు ఈ రకానికి చెందినవి.


ఇ) పన్ను విధింపు స్థానం ఆధారంగా పన్నులు రెండు రకాలు: 

1) ఏకస్థాన పన్ను 

2) బహుళస్థాన పన్ను


ఏకస్థాన పన్ను: ఉత్పత్తిలో ఒక దశలో మాత్రమే పన్ను విధిస్తే దాన్ని ఏకస్థాన పన్ను అంటారు.


బహుళస్థాన పన్ను: ఉత్పత్తిలో వివిధ దశల్లో పన్ను విధిస్తే దాన్ని బహుళ స్థాన పన్ను అంటారు. ఉదా: జుతిగి


2) పన్నేతర రాబడి:


పరిపాలన రాబడులు: ఫీజులు, జరిమానాలు, పెనాల్టీలు, అప్పులు, డిపాజిట్ల స్వాధీనం, అభివృద్ధి లెవీలు, ప్రత్యేక విధింపులు.


వాణిజ్యపర ఆదాయాలు: ప్రభుత్వరంగ పరిశ్రమలు, సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తుసేవలు విక్రయించగా వచ్చిన రాబడిని వాణిజ్య ఆదాయాలు అంటారు. ఉదా: రైల్వే రవాణా, విద్యుత్తు సరఫరా, తంతి తపాలా మొదలైనవి.


గ్రాంట్లు, కానుకలు: ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఉదారంగా ఇచ్చే ద్రవ్యమే గ్రాంటు. ఉదా: కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంటు. ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని కానుకలు అంటారు. ఉదా: ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల్లో ఇచ్చే కానుకలు.


ప్రభుత్వ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం: భూములు, గనులు, నదుల లాంటి సహజ వనరులను అద్దెకు ఇవ్వడం లేదా వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం.


కరెన్సీ నోట్ల ముద్రణ: ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం సరిపడినంత ఆదాయాన్ని సమకూర్చుకోలేనప్పుడు, అంతిమంగా నూతన కరెన్సీ నోట్లు ముద్రించి ఆదాయం సమకూర్చుకుంటుంది. అయితే దీనివల్ల దేశంలో ద్రవ్య సరఫరా పెరిగి ధరలు    పెరగవచ్చు.


 


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 11-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మూలధన వనరులు

ఆర్థిక పురోగతికి పునాదులు!

దేశ ప్రగతి, ఆర్థిక పురోగతి మూలధన వనరుల లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి చెందినా, చెందుతున్నా ఆ దేశానికి మూలధన వనరుల లభ్యత బాగా ఉందని అర్థం. వస్తు, సేవల ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడులే ఈ మూలధన వనరులు. ప్రజల పొదుపుతో పాటు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు మూలధన నిల్వలుగా మారుతుంటాయి. పూర్వం అసంఘటితంగా జరిగిన ఈ పెట్టుబడుల సేకరణ ప్రస్తుతం అధికశాతం సంఘటితంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో విస్తృత పరిధి ఉన్న విత్త మార్కెట్‌ స్వరూప స్వభావాలను, పరిణామక్రమాన్ని అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రధాన పెట్టుబడి సమీకరణ వ్యవస్థ అయిన స్టాక్‌మార్కెట్‌ గురించి, బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీల గమనంపై అవగాహన పెంచుకోవాలి.


ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమైంది మూలధనం. ఆచార్య రాగ్నర్‌ నర్క్స్‌ ప్రకారం వెనుకబడిన దేశాల్లో పేదరికపు విషవలయాలను ఛేదించాలంటే మూలధన సంచయనం అవసరం. పెట్టుబడి అంటే మార్కెట్‌ల నుంచి వాటాలు, బాండ్లు, డిబెంచర్లు, రుణాలు, సెక్యూరిటీల అమ్మకం  మొదలైనవి. దీనినే విత్త పెట్టుబడి అని కూడా అంటారు. వాస్తవిక పెట్టుబడి అంటే ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, డ్యామ్‌లు, రోడ్లు, భవనాలు మొదలైన ప్రజాఆస్తులు అని జె.ఎమ్‌.కీన్స్‌ నిర్వచించాడు. పెట్టుబడి ఒక ప్రవాహం, మూలధనం ఒక నిల్వ.


మూలధనం - ప్రయోజనాలు:

1) అవస్థాపన సదుపాయాలు పెరుగుతాయి. 

2) సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది. 

3) జనాభా పెరుగుదలను ఎదుర్కొంటుంది.        

4) ఉద్యోగితను పెంచుతుంది. 

5) విదేశీ వ్యాపార లోటు తొలగిస్తుంది. 

6) ద్రవ్యోల్బణాన్ని నివారిస్తుంది. 

7) ఆర్థిక సంక్షేమాన్ని పెంచుతుంది.


రకాలు: 

1) మానవ మూలధనం. 

2) భౌతిక మూలధనం. మానవ మూలధనం అంటే విద్య, వైద్యం నైపుణ్యాలపై చేసే ఖర్చు. భౌతిక మూలధనం అంటే యంత్రాలు, ఫ్యాక్టరీలు, దీర్ఘకాలిక పెట్టుబడులు. భౌతిక మూలధనం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

1) పొదుపు  

2) ఆర్థిక సంస్థలు (బ్యాంకులు)

3) ఉత్పత్తిదారులు.

 పొదుపు ఆర్థిక సంస్థల్లో జమ అయి, ఉత్పత్తిదారులకు రుణం రూపంలో పెట్టుబడిగా లభిస్తుంది.పెట్టుబడి పెరిగేకొద్దీ మూలధన సంచయనం జరుగుతుంది.


మూలధనాన్ని సేకరించే మార్గాలు:  
 

1) దేశీయ మార్గాలు (పొదుపు, లోటు బడ్జెట్, దేశీయ రుణాలు, విదేశీ వర్తకంలో మిగులు) 

2) విదేశీ మార్గాలు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సంస్థాగత పెట్టుబడులు, విదేశీ సంస్థల ఆర్థిక సహకారం).

దేశీయ మార్గాల ద్వారానే అధిక పెట్టుబడి లభిస్తుంది. ఇందులో ముఖ్యమైంది పొదుపు. దేశీయ పొదుపును ‘గ్రాస్‌ డొమెస్టిక్‌ సేవింగ్స్‌ (జీడీఎస్‌)’ అంటారు. ఈ పొదుపు మూడు రకాలుగా జరుగుతుంది. 

1) గృహ   రంగాలు 

2) కార్పొరేట్‌ రంగాలు 

3) ప్రభుత్వ రంగం

గృహరంగాల్లో రెండురకాలుగా పొదుపు జరుగుతుంది. 

1) భౌతిక పొదుపు (బంగారం, వెండి లాంటి లోహాలు, గృహ నిర్మాణాలు మొదలైనవి) 

2) విత్త పొదుపు (బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో పొదుపు) భారత్‌లో విత్త పొదుపు  6.6%గా ఉంటే భౌతిక పొదుపు 10.6%గా ఉంది.


మూలధన సంచయనం: ఒక ఆర్థిక సంవత్సరంలో లభించిన స్థూల, స్థిర మూలధనాన్ని మూలధన సంచయనం అంటారు. అధికంగా మూలధన సంచయనం 74% ప్రైవేటు రంగం కల్పిస్తే, 26% ప్రభుత్వ రంగం కల్పిస్తుంది.


విత్త మార్కెట్లు: ఆర్థిక వ్యవస్థలో విత్త మార్కెట్లు కీలకం. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి దోహదం చేస్తాయి. విత్త మార్కెట్లు ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్‌ అని రెండు రకాలుగా ఉంటాయి. 


1) ద్రవ్య మార్కెట్‌: ఇది స్వల్పకాలిక మార్కెట్‌. ఇందులో మంజూరయ్యే రుణాల కాలవ్యవధి ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. దీన్ని స్వల్పకాలిక పరపతి మార్కెట్‌ అని కూడా అంటారు. ద్రవ్య మార్కెట్‌ ప్రత్యక్షంగా ద్రవ్యంతో వ్యవహరించదు. సమీప ద్రవ్యంగా పిలిచే వర్తకపు బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల అంగీకార పత్రాలు మొదలైన రూపాల్లో ఉంటుంది. ఈ పత్రాలన్నింటికీ అధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్య మార్కెట్‌ను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు.


ఎ) అసంఘటిత ద్రవ్య మార్కెట్‌: దీనిలో మూడు రకాలు ఉంటాయి. 

1) క్రమబద్ధీకరించని నాన్‌ బ్యాంకింగ్‌ విత్త సంస్థలు ఉదా: విత్త కంపెనీలు, చిట్‌ఫండ్‌ కంపెనీలు, నిధి కంపెనీలు మొదలైనవి. 

2) దేశీయ బ్యాంకర్లు. ప్రాచీన కాలం నుంచి దేశీయ బ్యాంకర్ల వ్యవస్థ ఉంది. ఇవి నాణేలను భద్రపరిచి రుణాలుగా ఇచ్చేవి. ఉదా: బెంగాల్‌లో జగత్‌ సేఠ్‌లు, పట్నాలో షాలు, సూరత్‌లో నాధ్‌జీ, అంబాజీలు; మద్రాస్‌లో చెట్టియార్లు. 

3) వడ్డీ వ్యాపారులు


బి) సంఘటిత ద్రవ్య మార్కెట్‌: భారతీయ సంఘటిత ద్రవ్య మార్కెట్లో రిజర్వ్‌ బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఉంటాయి. సంఘటిత మార్కెట్‌లో వివిధ రకాల ఉపమార్కెట్లు ఉంటాయి.


i) కాల్‌మనీ మార్కెట్‌: ఇవి ప్రధాన నగరాలైన ముంబయి, కోల్‌కతా, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్‌లో   ఎక్కువగా ఉంటాయి. 1970 నుంచి ఎల్‌ఐసీ, ‘యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ ద్రవ్య మార్కెట్‌లో రుణదాతలుగా వ్యవహరించేవి. 1987లో వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం నాన్‌బ్యాంకింగ్‌ విత్త సంస్థలను కూడా రుణదాతలుగా అనుమతించారు. 1988లో ‘డిస్కౌంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ హౌస్‌ ఆఫ్‌ ఇండియా (డీఎఫ్‌హెచ్‌ఐ)’ నెలకొల్పారు.


ii) ట్రెజరీ బిల్లుల మార్కెట్‌: ద్రవ్యమార్కెట్‌లో అత్యంత ప్రధానమైంది బిల్లుల మార్కెట్‌. ఇందులో స్వల్పకాల వ్యవధి ఉన్న బిల్లుల క్రయవిక్రయాలు జరుగుతాయి. సాధారణ ట్రెజరీ బిల్లులకు 91 రోజుల కాలపరిమితి ఉంటుంది. వీటిని ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, వాణిజ్య ప్రభుత్వ సంస్థలకు, విత్త సంస్థలకు అమ్ముతుంది. 1986లో 182 రోజుల గడువుతో, 1992లో 364 రోజుల గడువుతో, 1997లో 14 రోజుల కాలపరిమితితో ట్రెజరీ బిల్లులు ప్రవేశపెట్టారు. 2001లో వీటిని నిలిపివేశారు.


iii) వాణిజ్య బిల్లుల మార్కెట్‌: ఒక వ్యాపార సంస్థ మరో వ్యాపార సంస్థ పేరు మీద విడుదల చేసే బిల్లులను వాణిజ్య బిల్లు అంటారు. సాధారణంగా దీని కాలవ్యవధి మూడు నెలలు ఉంటుంది. వాణిజ్య బిల్లులు అనేక రకాలుగా ఉంటాయి. 

1) డిమాండ్‌ బిల్లులు 

2) కాలపరిమితి బిల్లులు 

3) వ్యాపార బిల్లులు 

4) విత్త బిల్లులు 

5) దేశీయ బిల్లులు  

6) విదేశీ బిల్లులు. భారతదేశంలో అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను హుండీలు అంటారు.


iv) వాణిజ్య పత్రాలు: వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వ్‌ బ్యాంకు వాణిజ్య   పత్రాలను ప్రవేశపెట్టింది. కంపెనీలు జారీ చేసే వాణిజ్య పత్రాల విలువ కనీసం రూ.కోటి ఉండాలి.


v) డిపాజిట్ల సర్టిఫికెట్లు: వీటిని వాఘల్‌ కమిటీ సిఫార్సు చేసింది. వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ వద్ద ఉంచిన డిపాజిట్లపై బ్యాంకులు జారీ చేసే సర్టిఫికెట్లను డిపాజిట్‌ సర్టిఫికెట్లు అంటారు. 1991-92లో అఖిల భారత విత్త సంస్థలైన ఐడీబీఐ, ఐసీఐసీఐ, ఐఎఫ్‌సీఐ లు కూడా ఈ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఆర్‌బీఐ     అనుమతి ఇచ్చింది.


vi) మ్యూచువల్‌ ఫండ్స్‌: ద్రవ్య మార్కెట్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ని ఆర్‌బీఐ 1992, ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. వ్యక్తిగత పెట్టుబడిదారులకు అదనపు స్వల్పకాలిక   పెట్టుబడి అవకాశాన్నివ్వడం ఈ పథకం ఉద్దేశం. 2007, మార్చి 7 నుంచి ద్రవ్య మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ‘సెబి’ నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చింది.


2) మూలధన మార్కెట్‌: పరిశ్రమలకు అవసరమైన దీర్ఘ కాలిక విత్తాన్ని సమకూర్చే మార్కెట్‌ను మూలధన మార్కెట్‌ అంటారు. గవర్నమెంటు మార్కెట్‌ను గిల్ట్‌ ఎడ్జ్‌ అని కూడా అంటారు. ‘గిల్ట్‌ ఎడ్జ్‌’ అంటే అంటే ‘అత్యంత శ్రేష్టమైన బంగారంతో సమానం’ అని అర్థం. మూలధన మార్కెట్‌ను నియంత్రించే సంస్థ సెబీ. భారతదేశంలో ‘సెబీ’ గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు 23. వీటిలో శాశ్వతమైనవి 5.అవి 

1) అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌      

2) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 

3) కోల్‌కతా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 

4) మగధ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 

5) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ): 1875లో బాంబేలోని దలాల్‌ స్ట్రీట్‌లో ప్రారంభించారు. ఆసియాలో మొదటి, పురాతన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 1986లో సెన్సెక్స్‌ (సెన్సిటివిటీ ఇండెక్స్‌)  పేరుతో ఒక సూచీని ప్రవేశపెట్టింది. (ఆధార సంవత్సరం 1978-79). 30 కంపెనీల వాటా ధరలను పరిగణిస్తూ భార సగటు పద్ధతిలో ప్రతి 15 సెకన్లకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సూచీ జవాబును పాయింట్స్‌ అంటారు. ప్రస్తుతం బీఎస్‌ఈ ఛైర్మన్‌ ఎస్‌.ఎస్‌.ముంద్రా.


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ): 1992, నవంబరు 1న బాంబేలో స్థాపించారు. దీన్ని నాదకర్ణి కమిటీ సిఫార్సు చేసింది. యూటీఐ, ఐడీబీఐ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఎల్‌ఐసీ తదితర ఆర్థిక సంస్థలు కలిసి స్థాపించాయి. 1996లో ‘నిఫ్టీ’ పేరుతో సూచీని ప్రవేశపెట్టింది. (ఆధార సంవత్సరం 1995-96.) 50 కంపెనీల వాటాల ధరలను ప్రతి 15 సెకన్లకు ఒకసారి భార సగటు పద్ధతిలో లెక్కించి పాయింట్లు ప్రకటిస్తారు. ప్రస్తుత ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌ ఆశీష్‌ కుమార్‌ చౌహాన్


సెబీ (ఎస్‌ఈబీఐ - సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా): షేర్వాణి కమిటీ సిఫార్సుల మేరకు 1988లో బొంబాయిలో స్థాపించారు. 1992లో ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించారు. స్టాక్‌మార్కెట్లను సెబీ క్రమబద్ధం చేస్తుంది. ప్రస్తుతం సెబీ ఛైర్మన్‌ మాధాబి పూరి బచ్‌.


షేర్‌ మార్కెట్‌ కుంభకోణాలు: 1991లో హర్షద్‌ మెహతా కుంభకోణంపై బీఎస్‌ఈ జానకీరామన్‌ కమిటీని నియమించింది. 2001లో కేతన్‌ పారఖ్‌ కుంభకోణంపై ‘ప్రకాష్‌మణి త్రిపాఠి’ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. 


బుల్‌: స్టాక్‌ మార్కెట్‌లో వాటాల ధరలు పెరుగుతుంటే ‘బుల్‌’ అంటారు. 


బేర్‌: స్టాక్‌ మార్కెట్‌లో వాటాల ధరలు తగ్గితే ‘బేర్‌’ అంటారు.


బ్రోకర్‌: స్టాక్‌ మార్కెట్‌లో వాటాల కొనుగోలు, అమ్మకాలపరంగా మధ్యవర్తిగా వ్యవహరించే వారిని ‘బ్రోకర్‌’ అంటారు. వీరు ప్రతి లావాదేవీలపై కమిషన్‌ వసూలు చేస్తారు.

 


 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యం

సర్వాంగీకార వినిమయ సాధనం!

ఆర్థిక లావాదేవీల కోసం మానవుడు సృష్టించిన వినిమయ సాధనమే ద్రవ్యం. ప్రభుత్వాలు చట్టబద్ధంగా జారీ చేసే నాణేలు, కరెన్సీ నోట్లతో పాటు ద్రవ్యత్వ విలువ ఉన్న అధీకృత కాగితాలు, కార్డులు నేడు ద్రవ్యంగా చెలామణి అవుతున్నాయి. మన దేశంలో ఒకప్పుడు పశువులను వస్తురూప ద్రవ్యంగా వాడితే, ప్రస్తుతం పాలిమర్‌ ద్రవ్యం విస్తృతంగా వినియోగంలో ఉంది. సమాజ, వ్యక్తిగత ఆర్థిక ప్రగతిలో కీలకమై, ప్రభుత్వాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ద్రవ్యం పరిణామక్రమాన్ని, జారీ అయ్యే పద్ధతులను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఇప్పటి ఆర్థిక వ్యవస్థలో ఉన్న ద్రవ్యం రూపాలు, రకాలు, వాటి అవసరం, ఉపయోగిస్తున్న సందర్భాలను అర్థం చేసుకోవాలి.


ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఆధునిక సమాజంలో ద్రవ్యం ప్రవేశపెట్టక పూర్వం వస్తుసేవల కొనుగోలు, అమ్మకానికి ఒక నిర్దిష్ట మాధ్యమం లేదు. వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దానిలోని లోపాల వల్ల ద్రవ్యం ఒక వినిమయ మాధ్యమంగా చెలామణిలోకి వచ్చింది.


వస్తుమార్పిడి పద్ధతి: వస్తువును ఇచ్చి, దానికి బదులుగా కావాల్సిన మరొక వస్తువును పొందడాన్ని వస్తుమార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అంటారు. వస్తుమార్పిడి పద్ధతిలో వినిమయ మాధ్యమం ఉండదు. అందుకే దీనిని వస్తువు నుంచి వస్తువు ఆర్థిక వ్యవస్థ అనేవారు.


ద్రవ్య ఆవిర్భావం - నిర్వచనం - పరిణామక్రమం: ‘మనీ’ (money) అనే ఆంగ్ల పదం లాటిన్‌ పదమైన ‘మానెటా’ నుంచి పుట్టింది. రోమన్‌ దేవత అయిన మానెటా ఆలయంలో మొదటిసారి నాణేలు ముద్రించడం వల్ల ‘మనీ’ ఉద్భవించిందని చరిత్రకారుల అభిప్రాయం. 


ద్రవ్యం రకాలు: విలువ, ఉపయోగిత ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. అవి

1) ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువు ఆధారంగా ద్రవ్యం

2) ఆమోదయోగ్యత ఆధారంగా ద్రవ్యం

3) ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యం

4) ఇతర రకాల ద్రవ్యం


పూర్తి ప్రమాణ ద్రవ్యం: ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత, బహిర్గత విలువలు సమానంగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటారు. ఉదా: 1835-93 మధ్య మనదేశంలో పూర్తి ప్రమాణం కలిగిన వెండి నాణేలు చెలామణిలో ఉండేవి.


తక్కువ ప్రమాణ ద్రవ్యం: నాణేల బహిర్గత విలువ అంతర్గత విలువ కంటే ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటారు. దీనినే టోకెన్‌ మనీ అని కూడా అంటారు. ఉదా: ప్రస్తుతం మన దేశంలో ముద్రించే అన్నిరకాల కరెన్సీ నాణేలు.


ప్రాతినిధ్యపు ద్రవ్యం: తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి వాడితే, అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటారు. ఉదా: ప్రస్తుతం ఆర్‌బీఐ ముద్రించే కరెన్సీ నోట్లు, నాణేలు.


ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం: నూటికి నూరుశాతం లోహాన్ని నిల్వగా ఉంచి ద్రవ్యాన్ని జారీ చేస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటారు. ఉదా: మనదేశంలో జారీ చేసిన బంగారం, బులియన్‌ సర్టిఫికెట్లు.


పరివర్తనీయ కాగితపు ద్రవ్యం: కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వెండిలోకి మార్చుకోవడానికి వీలుంటే అది పరివర్తనీయ కాగితపు ద్రవ్యం.


అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు ద్రవ్యం బంగారం లేదా వెండిలోకి మార్చుకోవడానికి వీలులేకపోతే అలాంటి ద్రవ్యాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.


చట్టబద్ధ ద్రవ్యం: ఆర్‌బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. దీనికి చట్టం సమ్మతి ఉంటుంది. ఇది రెండు రకాలు:


1) అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: వ్యాపార వ్యవహారాల నిర్వహణకు, రుణాల పరిష్కారానికి ఎంత పరిమాణంలో అయినా తప్పనిసరిగా ఆమోదించాల్సిన ద్రవ్యాన్ని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. ఉదా: 50 పైసలకు మించి ఉన్న నాణేలు, రూపాయి నుంచి రూ.2000 వరకు నోట్లు. భారత్‌లో కాగితపు కరెన్సీని ఫియట్‌ మనీ అని, నాణేలను లీగల్‌ టెండర్‌ అని అంటారు.


2) పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: కొంత పరిమితికి లోబడి ఆమోదించే ద్రవ్యమే పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. ఉదా: 5, 10, 20, 25 పైసలు నాణేలు. వీటిని రూ. 25 విలువ వరకే ఆమోదిస్తారు. 2011 జూన్‌ 30 నుంచి 25 పైసల నాణేన్ని ఆర్‌బీఐ రద్దు చేసింది.


చట్టబద్ధం కాని ద్రవ్యం: చట్టప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి కొన్నింటిని ద్రవ్యంగా అంగీకరిస్తే అలాంటి వాటిని చట్టబద్ధం కాని ద్రవ్యం అంటారు. దీనినే ఐచ్ఛిక ద్రవ్యం అని అంటారు. ఉదా: చెక్కులు, డ్రాఫ్టులు, హుండీలు.


సామాన్య ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్‌ డిపాజిట్లను సామాన్య ద్రవ్యం లేదా సంకుచిత ద్రవ్యం అని కూడా అంటారు. దీనికి 100% ద్రవ్యత్వం ఉంటుంది.


సమీప ద్రవ్యం: సామాన్య ద్రవ్యంతో పోల్చినప్పుడు వీటికి  ద్రవ్యత్వం తక్కువ. అవసరమైతే వీటిని తక్కువ ఖర్చుతో ద్రవ్యంగా మార్చుకోవచ్చు. అందుకే వీటిని సమీప ద్రవ్యం అంటారు.ఉదా: పొదుపు డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, ట్రెజరీ బిల్లులు, ప్రామిసరీ నోట్లు.


ఇతర రకాల ద్రవ్యాలు: 


1) ఆవర్జా ద్రవ్యం: జమా ఖర్చుల లెక్కలను ఏ ద్రవ్య యూనిట్‌ రూపంలో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ఆవర్జా ద్రవ్యం అంటారు. ఉదా: రూపాయి, డాలర్‌.


2) వ్యవహారిక ద్రవ్యం: ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చెలామణిలో ఉన్న ద్రవ్యాన్ని వ్యవహారిక ద్రవ్యం అంటారు. అన్ని వ్యవహారాలు దీంతోనే జరుగుతాయి.


3) విశ్వాసాశ్రిత ద్రవ్యం: వ్యవస్థ /ప్రభుత్వం /కేంద్రబ్యాంకుపై విశ్వాసం ఆధారంగా ద్రవ్యాన్ని ముద్రిస్తే అలాంటి ద్రవ్యాన్ని విశ్వాసాశ్రిత ద్రవ్యం అంటారు. మన దేశంలో ద్రవ్యాన్ని కనీస నిల్వల ఆధారంగా చేసుకుని విశ్వాసాశ్రిత పద్ధతిలో ముద్రిస్తారు.


4) పరపతి ద్రవ్యం: దీనినే బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటారు. 

ఉదా: బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డ్రాఫ్టులు, వినిమయ బిల్లులు మొదలైనవి.


5) ఫియట్‌మనీ: ప్రభుత్వం అధికారం వల్ల కాగితపు ద్రవ్యం చెలామణిలో ఉంటే దాన్ని ఫియట్‌ మనీ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది. ఈ ద్రవ్యం వెనుక రిజర్వులు ఉండవు.


6) హాట్‌మనీ: విదేశీ సంస్థాగత పెట్టుబడులను హాట్‌ మనీ అంటారు. ఈ పెట్టుబడులు ఒక దేశం నుంచి మరొక దేశానికి వేగంగా తరలుతాయి.


7) డియర్‌ మనీ: అధిక వడ్డీ రేటుతో రుణాలు సులభంగా లభించని వ్యవస్థను డియర్‌ మనీ అంటారు.


8) నియర్‌ మనీ: బ్యాంకుల డిమాండ్‌ డ్రాఫ్టులు, పేఆర్డర్లను నియర్‌ మనీ అంటారు.


9) కాల్‌ మనీ: ఒక బ్యాంకు అడిగిన వెంటనే వేరొక బ్యాంకు రుణాలు అందించడాన్ని కాల్‌ మనీ అంటారు. ఒక్క రోజుకు బ్యాంకులు ఇచ్చే రుణం కాల్‌ మనీ అని, 2-14 రోజులకు ఇచ్చే రుణాన్ని నోటీస్‌ మనీ అని, 14 రోజులకు మించితే టర్మ్‌ మనీ అని అంటారు.


ద్రవ్యం విధులు: వీటిని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.   


1) ప్రాథమిక విధులు: 


వినిమయ మాధ్యమం: వస్తువుకు, వస్తువుకు మధ్య మధ్యవర్తిగా అమ్మకాలు, కొనుగోలు చేయడంలో ఉపయోగపడుతుంది.

విలువ కొలమానం: అన్నిరకాల వస్తుసేవలను ద్రవ్యంతో కొలవడాన్నే విలువ కొలమానం అంటారు.


2) గౌణ విధులు: ఇవి ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉంటాయి. వీటినే ఉత్పన్న విధులు అంటారు. 

విలువ నిధి: సంపదను ప్రస్తుత వినియోగానికే కాకుండా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా నిల్వ చేయడానికి ఉపయోగించే ద్రవ్యమే విలువ నిధి. జె.ఎం.కీన్స్‌ దీన్ని ప్రతిపాదించారు.

వాయిదాల చెల్లింపుల ప్రమాణం: వ్యాపారాన్ని అరువు పద్ధతిలో నిర్వర్తించేందుకు ద్రవ్యం ఉపయోగపడటమే వాయిదాల చెల్లింపుల ప్రమాణం అంటారు.

విలువ బదిలీ: ద్రవ్యం విలువను బదిలీ చేయడానికి సాయపడుతుంది.

ఆచార్య కిన్లే ప్రకారం ద్రవ్య విధులు 3 రకాలు. అవి.. 


1) ప్రాథమిక     2) గౌణ    3) అనుషంగిక విధులు. అనుషంగిక విధులు అంటే 


1) జాతీయ ఆదాయాన్ని ముద్రించడం

2) ఆదాయ సంపద పంపిణీ

3)ద్రవ్యత్వాన్ని ఆపాదించడం మొదలైనవి. 


పాల్‌ ఎన్‌ జింగ్‌ ప్రకారం ద్రవ్యం విధులు రెండు రకాలు. అవి..

1) నిశ్చల  

2) చలన విధులు. నిశ్చల విధులు అంటే ప్రాథమిక, ద్వితీయ అనుషంగిక విధులు. చలన విధులు అంటే ధరల స్థాయిని, ఉత్పత్తిని, వినియోగాన్ని, పంపిణీని ప్రభావితం చేసే విధులు.


ద్రవ్య నిర్వచనాలు 

‘‘ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం’’ 

- వాకర్‌

‘‘సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం’’ 

- సెలిగ్‌మన్‌

‘‘వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం’’

- క్రౌధర్‌

 ‘‘ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం’’ 


- మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌

‘‘రుణ ఒప్పందాలు ఉండి వివాదాల పరిష్కార శక్తి కలిగిందే ద్రవ్యం’’ 


- జె.ఎం.కీన్స్‌

 

 

 

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్యాంకులు

అసమాన సేవల ఆర్థిక సంస్థలు!

 


 


ఆధునిక కాలంలో బ్యాంకులు, బ్యాంకింగ్‌ వ్యవస్థ లేని ఆర్థిక రంగాన్ని ఊహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం, ప్రజలు, సంస్థలు జరిపే ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకులతో ముడిపడినవే. వ్యక్తిగత, సంస్థాగత ఆర్థిక పురోగతిలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పటిష్టమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ, నియంత్రణ విధానం ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. నేడు మెరుగైన ఆర్థిక సేవలు అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. మన దేశంలో బ్యాంకింగ్‌ రంగం పుట్టుపూర్వోత్తరాలు, పరిణామక్రమంపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పాటైన బ్యాంకులు, స్వాతంత్య్రానంతరం బ్యాంకుల జాతీయీకరణ పరిణామాలు, బ్యాంకుల వర్గీకరణ, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు విస్తరించిన తీరు, ప్రత్యేక లక్ష్యాలతో ఇటీవల కాలంలో ప్రారంభించిన బ్యాంకులు, వాటి ఉద్దేశాలు, తెచ్చిన మార్పును సమగ్రంగా తెలుసుకోవాలి.


బ్యాంకు అనే పదానికి ఆధారం బ్యాంకో, బాంక్వీ. ఈ పదాలకు అర్థం బల్ల. Banca అనే ప్రాచీన ఇటాలియన్, Banc అనే జర్మన్‌ పదాల నుంచి Banc అనే ఆంగ్ల పదం ఆవిర్భవించింది. క్రీ.పూ.600 లోనే బాబిలోన్‌ దేశంలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని రెవిల్‌హట్‌ అనే ఫ్రెంచి రచయిత పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ అంటే ద్రవ్యాన్ని మారకం చేయడం అని అర్థం. క్రౌధర్‌ ప్రకారం బ్యాంకులకు పూర్వీకులు ముగ్గురు 1) వర్తక వ్యాపారి  2) వడ్డీ వ్యాపారి 3) స్వర్ణకారుడు.


బ్యాంకు నిర్వచనం: భారత బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం 1949 సెక్షన్‌-5 ప్రకారం ‘‘కోరిన వెంటనే లేదా ఇంకో సమయంలో చెక్కు, డ్రాఫ్టు, ఆర్డర్ల ద్వారా కానీ, ఇంకోవిధంగా కాని తిరిగి చెల్లించే షరతులపై డిపాజిట్లు స్వీకరించి, ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి లేదా పెట్టుబడి కోసం ఉపయోగించడం బ్యాంకు వ్యాపారం’’.


షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూల్‌లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.

అర్హతలు: 1) బ్యాంకింగ్‌ వ్యాపారం చేస్తూ ఉండాలి. 2) వాటా మూలధనం రూ.5 లక్షలు నికర విలువకు తక్కువ కాకుండా ఉండాలి. 3) జాయింట్‌ స్టాక్‌ కంపెనీగా రిజిస్టర్‌ కావాలి. 4) డిపాజిటర్ల క్షేమానికి భంగకరమైన కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.


నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూలులో నమోదుకాని బ్యాంకులను నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.


భారతదేశంలో బ్యాంకింగ్‌ చరిత్ర: 1770లో అలెగ్జాండర్‌ అండ్‌ కో అనే ఆంగ్ల ఏజెన్సీ ‘హౌస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ను స్థాపించింది. ఇది భారతదేశంలో స్థాపించిన మొదటి బ్యాంకు. ఆ తర్వాత ఏజెన్సీలతో సంబంధం లేకుండా ప్రెసిడెన్సీ బ్యాంకులను నెలకొల్పారు. అవి 1806లో బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌; 1840లో బ్యాంక్‌ ఆఫ్‌ బొంబాయి; 1843లో బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌. ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల వాటా మూలధనంలో అధికభాగం ఐరోపా వాటాదారులదే. పూర్తి భారతీయ యాజమాన్యంలో నెలకొల్పిన మొదటి బ్యాంకు జౌధ్‌ వాణిజ్య బ్యాంకు (1881). ఆ తర్వాత 1894లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, 1901లో పీపుల్స్‌ బ్యాంకు ప్రారంభమయ్యాయి.


1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి భారతీయ ఇంపీరియల్‌ బ్యాంకుగా పేరు మార్చారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పడక పూర్వం ఇంపీరియల్‌ బ్యాంకు కేంద్ర బ్యాంకు విధుల్లో కొన్నింటిని నిర్వహించేది. గోర్వాలా కమిటీ సిఫార్సుపై ఇంపీరియల్‌ బ్యాంకును 1955, జులై 1న స్టేట్‌ బ్యాంకుగా పేరు మార్చారు. 1959లో భారతీయ స్టేట్‌ బ్యాంకు చట్టం వచ్చింది. ఈ చట్టం కింద 8 ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేసి, స్టేట్‌ బ్యాంకు అనుబంధ బ్యాంకులుగా తీసుకుంది. అవి 1) బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌  2) బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌  3) బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌  4) బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌  5) బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా  6) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌  7) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర  8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌.

1963లో బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్, బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌ విలీనమై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపుర్‌గా మారింది. 2008లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రను, 2010లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌లను ఎస్‌బీఐ విలీనం చేసుకుంది. 2017, ఏప్రిల్‌లో మిగిలిన అయిదు అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి.


జాతీయం చేసిన బ్యాంకులు: 1967లో హజారే కమిటీ ప్రకారం బ్యాంకులు కుటీర పరిశ్రమలకు, ప్రాథమిక రంగాలకు రుణాలివ్వాలన్న సామాజిక నియంత్రణ విధించారు. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో 1969, జులై 19న రూ.50 కోట్లు కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 14 వాణిజ్య బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. 

ప్రజాసంక్షేమం, ఆర్థిక వ్యవస్థ నియంత్రణలో భాగంగా 1980, ఏప్రిల్‌ 15న రూ.200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 6 వాణిజ్య బ్యాంకులను కేంద్రం జాతీయం చేసింది. 

నష్టాలతో నడుస్తున్న న్యూ బ్యాంక్‌ ఆఫ్‌     ఇండియాను 1993లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. 2019, ఏప్రిల్‌లో దేనా బ్యాంకు, విజయా బ్యాంకులు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. 2020, ఏప్రిల్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనమయ్యాయి. ఇదే సంవత్సరంలో సిండికేట్‌ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్‌ బ్యాంకును ఇండియన్‌ బ్యాంకులో; ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకులు 11 ఉన్నాయి. ఎస్‌బీఐతో కలిపి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం 12.


భారతీయ మహిళా బ్యాంకు: మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2013, నవంబరు 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మొదటి భారతీయ మహిళా బ్యాంకును దిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని తొలి సీఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేసిన మూడో దేశం ఇండియా. మొదటిది పాకిస్థాన్, రెండోది టాంజానియా. మహిళా బ్యాంకు అందరి నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుంది. రుణాలు మాత్రం మహిళలకే అందిస్తుంది. 2017, ఏప్రిల్‌లో ఇది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైంది.


 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పటికీ గ్రామాల్లో రుణగ్రస్థత తగ్గలేదు. వడ్డీ వ్యాపారుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఎం.నరసింహన్‌ కమిటీ సిఫార్సు మేరకు 20 సూత్రాల పథకంలో భాగంగా, 1975, అక్టోబరు 2న 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. తర్వాత వీటిని స్పాన్సర్‌ చేసిన బ్యాంకుల్లో విలీనం చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 43 (2021). 1987 తర్వాత కొత్త ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించలేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 15%, కేంద్ర ప్రభుత్వానికి 50%, స్పాన్సర్‌ చేసిన బ్యాంకుకు 35% చొప్పున వాటా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు నాగార్జున గ్రామీణ బ్యాంకు. 1976న ఖమ్మంలో ఏర్పాటైంది. దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేని రాష్ట్రాలు సిక్కిం, గోవా. 1997 నుంచి ప్రాధాన్య రంగాలకు రుణాలు ఇవ్వాలన్న భావనను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తింపజేశారు. గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణాల్లో 75% ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలని చక్రవర్తి కమిటీ సూచించింది.


ముద్రా బ్యాంకు (ఎమ్‌యూడీఆర్‌ఏ - మైక్రో యూనిట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీ ఫైనాన్స్‌ ఏజెన్సీ): ఇదొక ప్రభుత్వ రంగ విత్త సంస్థ. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద 2015, ఏప్రిల్‌ 8న ప్రారంభమైంది. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు అనుబంధ సంస్థ. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా సంస్థలకు తక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. సూక్ష్మ విత్త సంస్థలకు, బ్యాంకేతర విత్త సంస్థలకు కూడా రుణసహాయం అందిస్తుంది. ఈ సంస్థకు రూ.లక్ష కోట్ల పరపతి హామీ నిధిని ప్రభుత్వం కేటాయించింది.. ఈ సంస్థ రుణగ్రహీతలను 3 రకాలుగా వర్గీకరించి రుణాలిస్తుంది. చిన్న తయారీ సంస్థలు, దుకాణదారులు, పండ్లు, కూరగాయలు అమ్మేవారికి, చేతివృత్తుల వారికి ఈ సంస్థ రుణాలు అందిస్తుంది.


పేమెంట్‌ బ్యాంకులు: ఇవి కొత్తతరహా బ్యాంకులు. 2014, జనవరిలో నచికేత్‌ మోర్‌ కమిటీ వీటి ఏర్పాటుకు సిఫార్సు చేసింది. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు ఈ పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. 2015, ఆగస్టు 19న రిజర్వు బ్యాంకు 11 పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 6 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులు ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష వరకు డిమాండ్‌ డిపాజిట్లు స్వీకరించవచ్చు. చెల్లింపు సేవలు అందించవచ్చు. మొబైల్‌ ద్వారా చెల్లింపు బదిలీలు చేయవచ్చు. అల్పఆదాయ వర్గాల వారికి, చిన్న వ్యాపారులకు, వలస కార్మికులకు, అసంఘటిత రంగంలో పనిచేసేవారికి విత్త సేవలు అందుబాటులో ఉంచడమే వీటి లక్ష్యం. ఈ బ్యాంకులు డెబిట్‌ కార్డులు జారీ చేయవచ్చు. అయితే రుణాలు ఇచ్చేందుకు, క్రెడిట్‌ కార్డుల జారీకి వీల్లేదు.


చిన్న విత్త బ్యాంకులు: బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని జనాభా సౌకర్యార్థం ఏర్పాటు చేసినవే చిన్న విత్త బ్యాంకులు. రూ.100 కోట్లు కనీస ఈక్విటీ మూలధనంతో వీటిని స్థాపించవచ్చు. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు ఈ తరహా బ్యాంకుల ఏర్పాటును ఆమోదించింది. 2015, సెప్టెంబరు 17న బ్యాంకేతర విత్త సంస్థలకు లైసెన్సు జారీ చేసింది. ఈ బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి.. సన్నకారు, ఉపాంత రైతులకు, చిన్నవ్యాపార సంస్థలకు, అసంఘటిత రంగాల్లో వారికి రుణాలు అందిస్తాయి.


బంధన్‌ బ్యాంకు: 2015లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కోల్‌కతాలో ఈ బ్యాంకును ప్రారంభించారు. ఇది దేశంలో మైక్రోఫైనాన్స్‌ కంపెనీగా ఉండి పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి బ్యాంకు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తూర్పు భారతదేశంలో ప్రారంభించిన మొదటి బ్యాంకు కూడా. ఇది ప్రైవేటు సంస్థ.


ఐడీఎఫ్‌సీ బ్యాంకు: 2015, అక్టోబరు 19న ప్రధాని మోదీ దిల్లీలో ప్రారంభించారు. ఈ బ్యాంకు ప్రధాన కేంద్రం ముంబయి. మొదట ఇది అవస్థాపనా సదుపాయాల కల్పన విత్త సంస్థగా ఉండేది. తర్వాత వాణిజ్య బ్యాంకుగా మార్చారు. ఇది ప్రైవేటు సంస్థ.


ప్రైవేటు బ్యాంకులు: దేశంలో 22 ప్రైవేటు బ్యాంకులు ఏర్పాటయ్యాయి. 2022 నాటికి 21 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి


విదేశీ బ్యాంకులు: మనదేశంలో 2022 నాటికి 46 విదేశీ బ్యాంకులున్నాయి. ఇందులో అధిక శాఖలున్నవి 1) స్టాండర్ట్‌ చార్టర్డ్‌ బ్యాంకు 2) సిటీబ్యాంక్‌-హెచ్‌ఎస్‌బీసీ. విదేశీ బ్యాంకును ఏర్పాటు చేయాలంటే 2013 ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం  రూ.500 కోట్లు మూలధనం ఉండాలి. 


స్టేట్‌ బ్యాంక్‌ ఇన్‌ క్యూబ్‌: ప్రత్యేకంగా అంకుర సంస్థ (స్టార్టప్‌)ల కోసం ఏర్పాటైన వాణిజ్య బ్యాంకు శాఖ ఇది. 2016, జనవరి 14న బెంగళూరులో భారతీయ స్టేట్‌ బ్యాంకు ప్రారంభించింది.


 


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌