• facebook
  • whatsapp
  • telegram

Education: కొత్తగా 207 హైస్కూల్‌ ప్లస్‌ల్లో ఇంటర్మీడియట్‌ విద్య  

ఈనాడు, అమరావతి: కొత్తగా 207 కో-ఎడ్యుకేషన్‌, బాలికలకు ప్రత్యేకంగా మూడు హైస్కూల్‌ ప్లస్‌ల్లో ఇంటర్మీడియట్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మండలంలో ఒకటి ప్రత్యేకంగా బాలికలకు, మరొకటి కో-ఎడ్యుకేషన్‌ కోసం ఇంటర్మీడియట్‌ కోర్సును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు కళాశాలలు లేని మండలాల్లో ఉన్నత పాఠశాలల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఏదో రెండు గ్రూపులను మాత్రమే ప్రవేశపెట్టనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి గ్రూపునకు 40 మంది విద్యార్థులను అనుమతిస్తారు. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన 292 హైస్కూల్‌ప్లస్‌ బాలికల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ఘోరంగా ఉన్నాయి. చాలా కళాశాలల్లో అసలు అడ్మిషన్లే లేని పరిస్థితి. అధ్యాపకుల నియామకాలు తగిన స్థాయిలో లేకపోవడంతో 12 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.