తుళ్లూరు, న్యూస్టుడే: ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు ఏప్రిల్1న నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో సృజనాత్మక పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య వై.శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపుతోపాటు ఏడాదికి రూ.72 వేల వరకు ఉపకార వేతనం అందిస్తామని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషన్ లెర్నింగ్, వీఎల్ఎస్ఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ధర్మల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లతో పలు కోర్సులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్ పొందాలంటే పది, ఇంటర్, డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.