* మే 16 నుంచి పరీక్షలు ప్రారంభం
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్) హాల్టికెట్లు మే 7వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో; ఇంజినీరింగ్ పరీక్షలు మే 18 నుంచి 23 వరకు జరుగనున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.