అవనిగడ్డ, న్యూస్టుడే: గ్రూప్-2 ప్రధాన పరీక్ష(మెయిన్స్)కు 1:50గా కాకుండా 1:100గా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్కుమార్ డిమాండ్ చేశారు. మార్చి 3న కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏపీ నిరుద్యోగ ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మెయిన్స్కు ఎంపిక చేసే విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, దివ్యాంగుల కోటా అమలు చేయాలి. రుణాత్మక మార్కులను 4 తప్పులకు ఒకటిగా మార్చాలి. జాగ్రఫీ విభాగంలో ఓషినోగ్రఫీకి సంబంధించి ఇచ్చిన రెండు ప్రశ్నలకు రెండు గ్రేస్ మార్కులు ఇవ్వాలి. వీటితో పాటు కానిస్టేబుల్ రాత పరీక్షలో 5 గ్రేస్ మార్కులు కలిపి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి సచివాలయానికి ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ఉద్యోగాల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. డీఎస్సీకి, టెట్కి మధ్య నెల రోజులు సమయం ఇచ్చి, పోస్టుల సంఖ్య పెంచాలి. మార్చి 17న డీఎస్సీ పరీక్ష రోజునే గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష ఉంది. దాన్ని వాయిదా వేయాలి’ అని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.