* ఏపీ మంత్రి నిమ్మల వెల్లడి
![]() |
అమరావతి: తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైకాపాది అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకంపై మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. ‘‘ఎంతమంది పిల్లలున్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి వైకాపా నేతలు మోసం చేశారు. రూ.15వేలు ఇస్తామని చెప్పి తగ్గించి ఇచ్చారు. అది కూడా 2020 నుంచి అమలు చేశారు. ఐదేళ్లలో ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. మా ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాకుండానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై బ్లూ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. తల్లికి వందనం పథకానికి మేం మంగళం పాడినట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆ పథకం విధివిధానాలపై ఆలోచిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికీ రూ.15వేలు ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండగలా నిర్వహిస్తాం. మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం మాది.. మాట ఇస్తే మడమతిప్పే ప్రభుత్వం జగన్ది’’ అని నిమ్మల రామానాయుడు విమర్శించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.