• facebook
  • whatsapp
  • telegram

DSC: డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగుల ధర్నా

* దిల్‌సుఖ్‌నగర్‌ కూడలి వద్ద నిరుద్యోగుల ఆందోళన
 


గాంధీనగర్, దిల్‌సుఖ్‌నగర్, న్యూస్‌టుడే: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ కూడలి వద్ద నిరుద్యోగులు జులై 14 రాత్రి ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులు ధర్నా చేస్తారన్న సమాచారంతో సరూర్‌నగర్‌ పోలీసులు దిల్‌సుఖ్‌నగర్‌ కూడలి వద్ద పహారా కాస్తుండటంతో, వారి కళ్లుగప్పి మెట్రో స్టేషన్‌కు చెందిన మరో మార్గం నుంచి రాజీవ్‌ కూడలికి చేరుకున్నారు. ప్రధాన రహదారిపై నిల్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు గ్రూప్‌-2, 3 పోస్టుల సంఖ్య పెంపుతోపాటు సంబంధిత పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జులై 13 రాత్రి నిరుద్యోగ అభ్యర్థులు అశోక్‌నగర్‌ కూడలిలో చేపట్టిన ధర్నా జులై 14న తెల్లవారుజాము వరకు కొనసాగింది. అనంతరం పోలీసులు పలువురు నిరసనకారులను అరెస్టు చేసి నగరంలోని బొల్లారం తదితర ఠాణాలకు తరలించారు. మరోవైపు, నిరుద్యోగులు ఆదివారం కూడా ధర్నా చేసే అవకాశముందని పోలీసులకు సమాచారం అందడంతో అశోక్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో వారంతా భారీగా మోహరించారు. దీంతో పాటు చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు ప్రాంతాల్లోనూ నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బుక్‌స్టాళ్లు, టీస్టాళ్ల వద్ద అభ్యర్థులు గుమిగూడకుండా త్వరగా మూసివేయించారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.