• facebook
  • whatsapp
  • telegram

group : గ్రూప్‌ 2, 3 పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి పెద్దఎత్తున అరెస్టులు చేయడాన్ని సీపీఎం ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఎక్కువ శాతం డీఎస్సీ అభ్యర్థులే గ్రూప్‌-2, 3 పరీక్షలు రాయబోతున్నారు. ఆగస్టు 5వ తేదీతో డీఎస్సీ ముగుస్తోంది. 7, 8 తేదీల్లో గ్రూప్స్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీంతో అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం నెల రోజుల సమయం ఇవ్వాలని విద్యార్థులు కోరడంలో న్యాయం ఉంది. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది’’ అని తమ్మినేని మండిపడ్డారు. గ్రూప్స్‌ పరీక్షల తేదీలను మార్చాలని కోరారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి కేవలం 11,062 పోస్టులకే నోటిఫికేషన్‌ ఇవ్వడం సరైంది కాదన్నారు. 
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.