ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు కృత్రిమ మేధ](ఏఐ) యాప్ ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించిన ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్(ఐఎఫ్పీ)లో ఈ యాప్ను అప్లోడ్ చేస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ట్యాబ్లు ఇవ్వగా డిసెంబరు 21న ఎనిమిదో తరగతి వారికి ఇవ్వనున్నారు. అన్ని తరగతుల్లోనూ ఐఎఫ్పీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ యాప్ను కాన్వెజెనియస్ ఏఐ సొల్యూషన్స్ భాగస్వామ్యంతో తీసుకొచ్చింది. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబరు వరకు యాప్ను కాన్వెజెనియస్ కంపెనీ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, ఆంగ్లం, గణితం, టోఫెల్ సన్నద్ధతకు సంబంధించిన వాటిల్లో వచ్చే సందేహాలను యాప్ నివృత్తి చేస్తుందని వెల్లడించింది. విద్యార్థులు తమ సందేహాలను పదాలు, వీడియో రూపంలో ఇస్తే సమాధానాలు అందిస్తుంది. దీని వల్ల టెక్నాలజీ ఆధారిత అభ్యాసం మెరుగుపడుతుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఏపీపీఎస్సీ గ్రూప్-1, 2 గెలుపు వ్యూహం
‣ బ్యాంకులో కోర్సు.. ఆపై కొలువు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.