ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన అయిదు కళాశాలల్లో 158 పోస్టులకు ఒప్పంద విధానంలో నియామకం చేపట్టనున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీనివాసరావు మే 3న ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు https://dme.ap.nic.in వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు.
Some more information
‣ "Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.