‣ త్వరలో 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధ్రువీకరణ పత్రాల పరిశీలన త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. త్వరలోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1 : 3 నిష్పత్తిలో(దివ్యాంగ కేటగిరీలో 1 : 5) మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ మే 17న పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరిశీలన కోసం అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కులధ్రువీకరణ, బీసీ నాన్ క్రీమీలేయర్, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021-22 ఏడాదికి ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలన్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరి పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుందని.. అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని స్పష్టంచేశారు.
రాష్ట్ర స్థాయిలోనా.. జిల్లా స్థాయిలోనా..
ధ్రువీకరణ పత్రాల పరిశీలన జిల్లా స్థాయిలో చేయాలా? లేదా రాష్ట్ర స్థాయిలో చేయాలా? అనే విషయమై టీఎస్పీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. 1 : 3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో కనీసం 25 వేలకుపైగా అభ్యర్థులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు చాలా సమయం పట్టే అవకాశముంది. అయితే, జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని కమిషన్ ఆలోచిస్తోంది. కొంత ఆలస్యమైనా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తేనే బాగుంటుందని.. అవసరమైన సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని అనుకుంటోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!
‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.