* స్పష్టం చేసిన విద్యాశాఖ
హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు సోమవారం ఉదయం లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.ఈ నేపథ్యంలోనే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటన వెలువడటం గమనార్హం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.