![]() |
నిజామాబాద్ విద్యావిభాగం, న్యూస్టుడే: డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దోస్త్ ప్రక్రియలో భాగంగా మూడు దశల్లో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను ఎంచుకొని, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు చేసిన విద్యార్థులు ఈ నెల 8-12 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ధ్రువపత్రాలతో కళాశాలలో హాజరు కావాలని ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దోస్త్ దరఖాస్తు, సీటు కేటాయింపు లెటర్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్, పది, ఇంటర్ మెమోలు, 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోనాఫైడ్, కుల, ఆదాయ పత్రాలతో పాటు ఆధార్కార్డు, 4 పీపీ ఫొటోలు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్తో పాటు రెండు సెట్ల జిరాక్స్లు తీసుకురావాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.