విద్యానగర్, న్యూస్టుడే: కాకతీయ విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ సీట్ల ప్రవేశాలపై ఆశలు నెలకొంటున్నాయి. 2022లో చేపట్టిన ప్రవేశ ప్రక్రియలో కేటగిరీ-1 సీట్లను కేటగిరీ-2లోకి మార్పు చేసిన తరవాత వివిధ విభాగాల్లో 80 సీట్లు మిగిలి ఉన్నట్లు వర్సిటీ అధికారులు గుర్తించారు. దీంతో పాటు గత ప్రవేశాల్లో మిగిలిన ఖాళీలతో పాటు ఈ ఏడాది మార్చి 31 వరకు మొత్తం ఎన్ని పీహెచ్డీ సీట్లు ఉన్నాయో గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు కసరత్తు చేసిన కేయూ అధికారులు మొత్తం ఎనిమిది డిపార్ట్మెంట్లలో మొత్తం 240 సీట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ వివరాలను ఇన్ఛార్జి ఉప కులపతి వాకాటి కరుణ ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం రాగానే పీహెచ్డీలో ప్రవేశాలు చేపడతామని వర్సిటీ అధికారులు తెలిపారు.
ఇకపై పరీక్ష లేకుండా ప్రవేశం..: గతంలో పీహెచ్డీ ప్రవేశాలు కేటగిరీ-1 ఖాళీలను జేఆర్ఎఫ్, నెట్, వివిధ జాతీయస్థాయి ఫెలోషిప్ ఉన్న వారికి మాత్రమే కేటాయించేవారు. కేటగిరి-2 సీట్లను అర్హత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పించేవారు. మారిన యూజీసీ నిబంధనల మేరకు ఈసారి జేఆర్ఎఫ్, నెట్, వివిధ జాతీయ స్థాయి ఫెÆలోషిప్ ఉన్న వారికి మాత్రమే మూడు కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వం జులై 3న రాత్రి కేయూ పాలక మండలి క్లాస్-2 సభ్యులను ప్రకటించడంతో ప్రవేశ ప్రక్రియ త్వరలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ హెచ్సీఎల్లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.