నూజివీడు పట్టణం, న్యూస్టుడే: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన జులై 4తో ముగిసిందని ట్రిపుల్ ఐటీల ప్రవేశాల సమన్వయకర్త ఎస్.అమరేంద్రకుమార్ తెలిపారు. క్యాంపస్ల వారీగా జనరల్ కౌన్సెలింగ్కు ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా జులై 11న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్సీసీ విభాగంలో 1,141, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో 162, క్యాప్ విభాగంలో 167, దివ్యాంగుల విభాగంలో 249, క్రీడా విభాగంలో 796 మంది విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించినట్లు వివరించారు.
ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన
నూజివీడు: జులై 22, 23 తేదీల్లో..
ఇడుపులపాయ: జులై 22, 23
ఒంగోలు: జులై 24, 25
శ్రీకాకుళం: జులై 26, 27
మరింత సమాచారం... మీ కోసం!
‣ హెచ్సీఎల్లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.