ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: మెడికల్ కౌన్సెలింగ్లో ఎంబీబీఎస్, బీడీఎస్లతో పాటు ఆయుష్ కోర్సులైన హోమియో, ఆయుర్వేదిక్, యునాని, నేచురోపతి కోర్సులకు ఒకేసారి ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ కోరారు. మే 3న కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ కరుణాకర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2024 నీట్ అర్హత పరీక్షలో ఎంబీబీఎస్, బీడీఎస్లతో పాటు ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి కోర్సులకు ఒకేసారి అవకాశం కల్పించినట్లుగానే అడిష్మన్లలోనూ కల్పించాలన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ వారికి మొదటి విడతలో కౌన్సెలింగ్కు అవకాశం కల్పించి, ఆరునెలల తర్వాత ఆయుష్ కోర్సుకు కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆరునెలల కాలాన్ని నష్టపోతున్నారన్నారు. ఉప కులపతిని కలిసిన వారిలో ఏఐఎస్ఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు సంతోష్, శరత్, జిల్లా ఉపాధ్యక్షుడు చరణ్, సహాయ కార్యదర్శి రవితేజ, వినయ్, శివ, అఖిల్, రమేశ్ తదితరులున్నారు.
Some more information
‣ "From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.