ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థుల హాజరు వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని రాష్ట్ర వైద్య విద్య శాఖ భావిస్తోంది. తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నందున ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు 30 శాతం మంది విద్యార్థులు తరగతులకు రాకుండా డుమ్మా కొడుతున్నారు. వసతిగృహాల్లో ఉంటున్నా..తరగతులకు రావడంలేదని గుర్తించారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు వైద్య విద్య శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. తరగతి గదుల ప్రవేశ మార్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే ‘మిషన్’ ముందు విద్యార్థులు నిల్చుంటే..ఆటోమేటిక్ హాజరు తీసుకునే విధంగా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. విద్యార్థుల హాజరు నమోదు సమాచారం తల్లిదండ్రుల చరవాణులకు వెళ్తుంది. అలాగే..ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సమాచారాన్ని పంపే విధంగానూ చర్యలు తీసుకుంటున్నారు. నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు అధిక సంఖ్యలో తరగతులకు హాజరుకావడం లేదు. ఈ సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా, విద్యార్థుల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.