ఇంటర్నెట్ డెస్క్: రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ఉద్యోగ ప్రకటన నకిలీదని స్పష్టంచేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుందని పేర్కొంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫిబ్రవరి 26న ఖండించింది. అలాంటి నోటీసు ఏదీ రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేయలేదని పేర్కొంటూ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. వ్యక్తిగత, ఆర్థికపరమైన సమాచారాన్ని షేర్ చేయొద్దని ప్రజలకు సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.