• facebook
  • whatsapp
  • telegram

AP SET: 28న ఏపీ సెట్‌ 

* 30 సబ్జెక్టుల్లో పరీక్ష

* హాల్‌టికెట్ల విడుదల 19న

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్‌)-2024 రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రధాన కేంద్రాల్లో జరుగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు ఆంధ్ర విశ్వవిద్యాలయం సమాయత్తమవుతోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్‌ 19 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహిస్తోంది. జనరల్‌ స్టడీస్‌, 30 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.



వెబ్‌సైట్‌ 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.