• facebook
  • whatsapp
  • telegram

UPSC Exam: 21న యూపీఎస్సీ- ఎన్‌డీఏ, సీడీఎస్‌ రాత పరీక్షలు

* ఈఎస్‌ఈ మెయిన్స్‌ జూన్‌ 23న

ఈనాడు ప్రతిభ డెస్క్‌: రక్షణ రంగంలో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్‌ (1) 2024, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (1) 2024 ఏప్రిల్‌ 21వ తేదీన దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగనున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌ ద్వారా 400 ఖాళీలు; సీడీఎస్‌ఈ ద్వారా 457 ఖాళీలు భర్తీ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఇంజినీరింగ్‌ సర్వీసుల ప్రధాన పరీక్ష జూన్‌ 23న జరుగనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 167 ఖాళీలు భర్తీ కానున్నాయి.


  యూపీఎస్సీ వెబ్‌సైట్‌  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.