1. సైబర్ నేరాల్లో రష్యా నంబర్ వన్!
సైబర్ నేరాల విషయంలో దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. ‘ప్రపంచ సైబర్నేర సూచీ’ని రూపొందించి విడుదల చేసింది. ఈ నివేదికలో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. నాసా రాకెట్ల మిషన్కు భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వం
సూర్యగ్రహణం సందర్భంగా ఇటీవల అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితమవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దక్షిణ కొరియా ఎన్నికల్లో ప్రతిపక్షాల ఘన విజయం
దక్షిణ కొరియా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ఉదారవాద పార్టీలు ఘన విజయం సాధించాయి. 300 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్ పార్టీ, దాని మిత్రపక్షం 175 సీట్లను సొంతం చేసుకున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స.హ.చట్టం కింద వెల్లడించలేం : ఎస్బీఐ
ఎన్నికల కమిషన్కు ఇప్పటికే సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద వెల్లడించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తిరస్కరించింది. అది వ్యక్తిగత సమాచారం కావడం, ‘నమ్మకస్తుని హోదా’ పరిధిలోకి రావడమే అందుకు కారణమని తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా లిండీ కామెరాన్
భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా లిండీ కామెరాన్ నియమితులయ్యారు. లిండీ ఇటీవలి వరకూ బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.