‣ ఏఐసీటీఈ పరంగా తెలంగాణలో మార్పుండదు: పాపిరెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్లో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు చదవకపోయినా బీటెక్ చదవొచ్చని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల్లో మార్పుచేసినా ప్రస్తుతం రాష్ట్రంలో అమలు సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టంచేశారు. ఇంటర్లో ఎంపీసీ చదివిన వారే ఇంజినీరింగ్లో చేరాల్సి ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మార్చి 16న తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఇంటర్లో 14 సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే వారు బీటెక్లో చేరొచ్చని ఏఐసీటీఈ చేసిన మార్పును ఈసారి రాష్ట్రంలో అమలు చేయబోమన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.