ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ మొదటి విడత పేపర్-1 తుది కీని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసింది. ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత పొందేందుకు ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. వాటి తుది 'కీ'ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 6.20 లక్షల మంది వరకు పేపర్-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది ఉన్నారు. మొత్తం 300 మార్కులకు పేపర్-1 నిర్వహించారు. విద్యార్థుల స్కోర్(మార్కులు)ను మార్చి 08న విడుదల చేస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.