• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్ తొలి విడ‌త ప‌రీక్ష‌ 'కీ' విడుద‌ల‌

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ మొదటి విడత పేపర్‌-1 తుది కీని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత పొందేందుకు ఫిబ్ర‌వ‌రి 23 నుంచి 26 వ‌ర‌కు పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు. వాటి తుది 'కీ'ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది ఉన్నారు. మొత్తం 300 మార్కులకు పేపర్‌-1 నిర్వహించారు. విద్యార్థుల స్కోర్‌(మార్కులు)ను మార్చి 08న‌ విడుదల చేస్తారు.

జేఈఈ మెయిన్ పేపర్‌-1 తుది కీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.