* ఆన్లైన్ గడువు పొడిగింపు
ఈనాడు, అమరావతి: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి స్పందన కరవైంది. తొలి విడత కౌన్సెలింగ్కు 1.50 లక్షల మంది ప్రాసెసింగ్ రుసుం చెల్లించగా.. కళాశాలలు, కోర్సుల ఎంపికకు లక్ష మందే ఐచ్ఛికాలు ఇచ్చారు. ఏటా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కలిపి మొత్తం 5 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం అతి తక్కువ మందే ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. అక్టోబరు 21 నుంచి ఆన్లైన్ ప్రవేశాలు ప్రారంభించగా... 9 రోజుల్లో లక్ష మందే కళాశాలలను ఎంపిక చేసుకున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 29తో ప్రవేశాల గడువు ముగిసింది. విద్యార్థుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో గడువును నవంబరు 6 వరకు పొడిగిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.