ఈనాడు, హైదరాబాద్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను వర్సిటీ జనవరి 29న విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు బీస్సీ నర్సింగ్, 7, 8 తేదీల్లో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు ఉస్మానియా క్యాంపస్లోని ప్రొ.జి.రాంరెడ్డి దూరవిద్య కేంద్రంలో ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. జేఎన్టీయూలో ఫిబ్రవరి 1-3 తేదీల్లో బీపీటీ, 4-6 వరకు బీఎస్సీ(ఎంఎల్టీ) కోర్సులకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అన్ని కోర్సుల పీహెచ్ అభ్యర్థులకు ఫిబ్రవరి 6న మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఎవాల్యుయేషన్ జరుగుతుందని వర్సిటీ అధికారులు వెల్లడించారు.వివరాలకు www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.