ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఫిబ్రవరి 11న రాజ్యసభలో భాజపా సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
స్కూల్బ్యాగ్ పాలసీని రాష్ట్రాలన్నీ అమలుచేయాలి
విద్యార్థులపై స్కూల్ బ్యాగ్ల బరువును తగ్గిస్తూ స్కూల్బ్యాగ్ 2020 విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ రాజ్యసభకు తెలిపారు. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించడంపై వివిధ సిఫార్సులు చేసినట్లు చెప్పారు. ఈ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ గత ఏడాది నవంబర్ 24న అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు పోఖ్రియాల్ చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.