‣ 276 ఖాళీల భర్తీకి ప్రకటన
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) 276 గ్రూప్ ఏ, బి, సి కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధాన కేంద్రం దిల్లీతోపాటు దేశమంతటా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలతో ఉన్నత స్థాయి జీతాలను అందుకునే అవకాశం ఉంది!
పోస్టుల వివరాలు..
గ్రూప్ ఏ: డైరెక్టర్ (లీగల్) - 1, అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ) - 1, అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్ అండ్ ఫైనాన్స్) - 1, అసిసెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్) - 1
గ్రూప్ బి: పర్సనల్ అసిస్టెంట్ - 28, అసిస్టెంట్ (కంప్యూటర్ - ఎయిడెడ్ డిజైన్) - 2, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 47, టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ) (47) - మెకానికల్ (19), కెమికల్ (18), మైక్రోబయాలజీ (10)
గ్రూప్ సి: స్టెనోగ్రాఫర్ - 22, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 100, హార్టికల్చర్ సూపర్వైజర్ - 1, సీనియర్ టెక్నీషియన్ (25) - కార్పెంటర్ (6), వెల్డర్ (2), ప్లంబర్ (3), ఫిట్టర్ (3), టర్నర్ (5), ఎలక్ట్రీషియన్ (6).
దరఖాస్తు స్వీకరణ: ఏప్రిల్ 19 నుంచి...
చివరితేదీ: మే 9.
పరీక్ష: జులై, 2022
వయసు: 27 ఏళ్ల నుంచి 56 ఏళ్లు.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి ప్రత్యేక అర్హతలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు - 800/. ఇతర పోస్టులకు రూ.500/. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా...
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ - విశాఖపట్నం, విజయవాడ; తెలంగాణ - హైదరాబాద్.
పరీక్ష విధానం: డిగ్రీ స్థాయిలో ఉండే ప్రశ్నపత్రంలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 మార్కులు), జనరల్ అవేర్నెస్ (25), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (50) విభాగాలుంటాయి. మొత్తం 150 మార్కుల పేపర్ను 2 గంటల్లో పూర్తి చేయాలి. (డైరెక్టర్, అసిస్టెంట్ డైరక్టర్ వంటి గ్రూప్ 1 స్థాయి పోస్టుల ప్రశ్నపత్రం పీజీ స్థాయిలో ఉంటుంది.)
‣ స్కిల్ టెస్ట్కు ఎంపికయ్యేందుకు రాత పరీక్షలో కనీసం 50% మార్కులు సాధించాలి.
ఎలా చదవాలి..
సాధారణంగా ఈ ప్రశ్నపత్రం కఠినత్వం స్థాయి సులభం నుంచి మధ్యస్థంగా ఉంటుంది. నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ను పూర్తిగా అధ్యయనం చేయాలి. పాత ప్రశ్న పత్రాలు స్టడీ చేయడం వల్ల ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది. అంశాలవారీగా బేసిక్స్ను పూర్తిగా చదువుకున్నాకే మోడల్పేపర్లు సాల్వ్ చేయడం మొదలుపెట్టాలి. దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. సొంతనోట్సును సమయానుసారం రివిజన్ చేయడం వల్ల ప్రశ్నలను తొందరగా గుర్తించి జవాబు ఇవ్వగలుగుతారు. సరైన మెటీరియల్ ఒకటే ఎంచుకుని దాన్నే అనుసరించడం మంచిది.
వేతనం: గ్రూప్ ఏ లో డైరక్టర్ పోస్టు వేతనశ్రేణి రూ.78,800-2,09,200 వరకూ, మిగతా వాటికి రూ.56,100-1,77,500 వరకూ ఉంటుంది. అదే గ్రూప్ బి అయితే రూ.35,400-1,12,400గా నిర్ణయించారు. గ్రూప్ సి పోస్టులకు రూ.25,500-81,100గా ఉంటుంది.
ఇతర వివరాలకు వెబ్సైట్: https://www.bis.gov.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఐఐఎఫ్టీలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.