ఇప్పటి విద్యార్థులు చదవడం అంటే ఎక్కువగా ఆన్లైన్లోనే! క్లాసులు వినడం, మెటీరియల్ - నోట్సు సేకరించడం... ఇలా చాలా సమయం వారు అంతర్జాలంలోనే గడుపుతుంటారు. ఆ సమాచారాన్ని చదువుకోవడానికి తిరిగి ప్రింట్లు తీసుకునే అవసరం లేకుండా... అందుబాటులోకి వచ్చినవే ఈ-బుక్రీడర్స్. గతంలో కొన్ని కంపెనీల ఉత్పత్తులు వచ్చినా... అమెజాన్ కిండల్, సోనీ రీడర్ వంటివి విడుదలయ్యాక ఈ రీడర్స్ను వాడే వారి సంఖ్య పెరిగింది. కరోనా విజృంభణ తర్వాత వీటి అవసరం విద్యార్థులకూ పెరిగింది. ఎన్ని పుస్తకాలనైనా సులువుగా చదువుకునే వీలు కల్పించే ఈ రీడర్లలో... ఎండ, తక్కువ వెలుతురులో కూడా కంటిపై ఒత్తిడి పడకుండా చదివేలా లైటింగ్ను మార్చుకునే వీలుంటుంది. నాణ్యమైన కంపెనీ రీడర్ అయితే ఒకసారి ఛార్జింగ్ పెడితే కొన్నివారాలపాటు పనిచేస్తుంది! నెట్ సౌకర్యం కూడా ఉండటం వల్ల పుస్తకాలను సులువుగా డౌన్లోడ్, షేర్ చేసుకోవచ్చు. ఈ-ఇంక్ అనే టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తూ ఉండటం వల్ల ముద్రించిన పేజీని చదవడం ఎంత సౌకర్యంగా ఉంటుందో ఈ రీడర్స్లో చదవడం కూడా అంతే సులువుగా ఉంటుందట. పైగా ఇవి నీళ్లలో తడిచినా ఏమీ కావు. ఇంకెందుకు ఆలస్యం... మీకేది నచ్చుతుందో చూడండి మరి!
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.