• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్కిటెక్చర్‌లో... ప్రవేశాలకు నాటా

ఆర్కిటెక్చర్‌లో రాణించాలనుకునే విద్యార్థుల కోసం నాటా (నేషనల్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఐదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీ.ఆర్క్‌) కోర్సులో చేరొచ్చు.

ఈ ఏడాది మూడు దశల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక విద్యార్థి మూడుసార్లూ పరీక్ష రాయొచ్చు. రెండుసార్లు కనుక రాస్తే రెండింటిలో ఏది మంచి స్కోరు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మూడుసార్లూ రాస్తే రెండు మంచి స్కోర్ల సగటును ఫైనల్‌ స్కోర్‌గా పరిగణిస్తారు.

అర్హత: ప్లస్‌టూలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్‌ చదివి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా విద్యార్థులైతే మ్యాథమేటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది పరీక్ష రాసేవారూ అర్హులే.

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు 125 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. 3 గంటల్లో జవాబులు రాయాలి. 

సిలబస్‌: మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, జామెట్రీ, న్యూమరికల్, వెర్బల్, లాజికల్‌ రీజనింగ్, కలర్‌ థియరీ, ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ డిజైన్‌తోపాటూ లాంగ్వేజ్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌పై ప్రశ్నలుంటాయి. గ్రాఫిక్స్, బిల్డింగ్, మెటీరియల్‌పై కూడా అవగాహన ఉండాలి. 

అప్లికేషన్‌ ఫీజు: జనరల్, ఓబీసీ అబ్బాయిలకు రూ.2000/-, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, అన్ని కేటగిరీల అమ్మాయిలకు రూ.1500/-.

పరీక్ష తేదీలు: జూన్‌ 12, జులై 3, 24. 

వెబ్‌సైట్‌: https://www.nata.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొట్టేద్దాం కానిస్టేబుల్‌ కొలువు!

‣ ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!

‣ బాగా చదవాలంటే సరిగా తినాలి!

‣ పరీక్ష కోణంలో.. పకడ్బందీగా!

‣ ఫార్మసీ పీజీకి నైపర్‌ దారి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌