ఆర్కిటెక్చర్లో రాణించాలనుకునే విద్యార్థుల కోసం నాటా (నేషనల్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్సులో చేరొచ్చు.
ఈ ఏడాది మూడు దశల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక విద్యార్థి మూడుసార్లూ పరీక్ష రాయొచ్చు. రెండుసార్లు కనుక రాస్తే రెండింటిలో ఏది మంచి స్కోరు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మూడుసార్లూ రాస్తే రెండు మంచి స్కోర్ల సగటును ఫైనల్ స్కోర్గా పరిగణిస్తారు.
అర్హత: ప్లస్టూలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ చదివి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా విద్యార్థులైతే మ్యాథమేటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది పరీక్ష రాసేవారూ అర్హులే.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు 125 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. 3 గంటల్లో జవాబులు రాయాలి.
సిలబస్: మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, జామెట్రీ, న్యూమరికల్, వెర్బల్, లాజికల్ రీజనింగ్, కలర్ థియరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్తోపాటూ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటేషన్పై ప్రశ్నలుంటాయి. గ్రాఫిక్స్, బిల్డింగ్, మెటీరియల్పై కూడా అవగాహన ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అబ్బాయిలకు రూ.2000/-, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, అన్ని కేటగిరీల అమ్మాయిలకు రూ.1500/-.
పరీక్ష తేదీలు: జూన్ 12, జులై 3, 24.
వెబ్సైట్: https://www.nata.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కొట్టేద్దాం కానిస్టేబుల్ కొలువు!
‣ ఇండియన్ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.